30 May 2014

16వ లోక్ సభ ఎన్నికైన సబ్యుల వయస్సు, ఆధాయ,విద్యార్హత మరియు క్రిమినల్ రికార్డ్ వివరాలు.



నేషనల్ ఎలెక్షన్ వాచ్ మరియు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫర్మ్స్ వారి నివేదిక ప్రకారం 2014 లోక్ సభ ఎన్నికలలో పోటీచేయు అబ్యర్ధులు ఎన్నికల కమిషన్ ముందు  సమర్పించిన అఫిడవిట్ ప్రకారం కొత్తగా ఎన్నికైన 541 మంది  ఎం‌పి ల వయస్సు, ఆధాయ,విద్యార్హత మరియు క్రిమినల్ రికార్డ్ వివరాలు పరిశీలించగా క్రింది వాస్తవాలు తెలియవచ్చినవి.

వయస్సు:
2014 లోక్ సభ సబ్యులలో మొత్తం 543 మందిలో 25-50 ఏళ్ల మద్య వయస్సు ఉన్న వారు 202 మంది (37%), 51-70 మద్య వయస్సు ఉన్నవారు 298 మంది (55%), 51నుంచి 70 వయస్సు ఉన్నవారు41 మంది  (8%),71 కన్నా ఎక్కువ  వయస్సు కలిగి ఉన్నవారు 41 మంది (8%). 40కన్నా తక్కువ వయస్సు ఉన్నవారు 71మండి ఎం‌పిలు ఉన్నారు. 55 కన్నా తక్కువ ఉన్నవారు 216 మంధి ఉన్నారు. బి‌జే‌పి కి చెందిన ఎల్‌కే అద్వానీ అందరి కన్నా అధికంగా వయస్సు ఉన్న ఎం‌పి 86 సంవత్సరాలు. మహిళా సబ్యులలో బి‌జే‌పి కి చెందిన నజ్మా హెఫ్తుల్ల అందరి కన్నా అధిక వయస్సు 74 సంవత్సరాలు కలిగి ఉన్నారు. మొదటి సారి ఎన్నికైనవారిలో 12మంది 30సంవత్సరాలలోపు,48 మంది 31-40 సంవత్సరాలలోపు వారు.

విద్యార్హతలు:
లోక్ సభ కు కొత్తగా ఎన్నికైన వారిలో ఒకరు నిరక్షరాస్యులు. మేట్రిక్యులేషన్ అర్హత లేనివారు 13% (2009 లో 3%)మెట్రికులేషన్ అర్హతగా ఉన్నవారు10% మంది (2009 లో 17%). 125మండి (23%) ఇంటెర్మీడియట్ (12వ తరగతి) అంతకన్నతక్కువ విద్యార్హత కలిగి ఉన్నారు. లోక్ సభ ఎన్నికలలో ఎన్నికైనవారిలో 75%మండి పట్టబద్రులు(2009 లో 79%) పి‌జి చేసినవారు  28%, డాక్టరేట్ కలిగిన వారు6% మండి.(2009 లో 3%). వ్యవసాయం వృత్తిగా ఉన్న ఎం‌పి లు 27%(2009 లో 27%), సాంఘిక సేవ వృత్తిగా ఉన్న ఎం‌పి లు 24%,(2009 ల0 8%) వ్యాపారం వృత్తిగా ఉన్న వారు 20%(2009 లో 15%)గా  ఉన్నారు.
16వ లోక్ సభ లో 38 మండి లాయర్లు, 24మండి డాక్టర్లు, 18 మండి కళాకారులు ఉన్నారు.

క్రిమినల్ కేసులు

నేషనల్ ఎలెక్షన్ వాచ్ మరియు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫర్మ్స్ వారి నివేదిక ప్రకారం 2014 లోక్ సభ ఎన్నికలలో పోటీచేయు అబ్యర్ధులు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం కొత్తగా ఎన్నికైన 541 మండి ఎం‌పి లలో 34% ఎం‌పి లు అనగా ప్రతి ముగ్గురిలో ఒకరు  క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. 2009 లో 30% అనగా 158 మంది  ఎం‌పి లు,2004 లో 24% మంది ఎం‌పిలు  క్రిమిననల్ కేసులు ఎదుర్కొన్నారు.
క్రిమినల్ కేసులు ఉన్న 186 మండి ఎం‌పి లలో 112 మంది(21%) పై సీరియస్ క్రిమినల్ కేసులు (మర్డర్,అటెంప్ట్ టుమర్డర్, సామాజిక ప్రశాంతతకు అవరోధం,కిడ్నాపింగ్, స్త్రీలపై అత్యాచారాలు వంటి కేసులు) (2009 లో 77 మంది అనగా 15%ఎం‌పి లపై ) కలవు. 9మంది  ఎం‌పి లపై మర్డర్ కేసులు, 17 మంది పై అటెంప్ట్ టు మర్డర్, ఇద్దరిపై స్త్రీలపై అత్యాచారకేసులు కలవు. 16 మంది పై సామాజిక ప్రశాంతతకు భంగం కలిగించారన్న నేరారోపణలు కలవు. 10 మంది పై రాబరీ,డెకాయిటీ,7గురి పై కిడ్నాపింగ్ కేసులు కలవు.

క్రిమినల్ చరిత్రగలవారు, క్రిమినల్ చరిత్ర లేని వారి కన్న రొందింతలు అధికంగా ఎన్నికలలో గెలిచే అవకాశాలు ఉన్నాయి. క్రిమినల్ కేసులు ఉన్న అబ్యర్ధులు గెలిచే అవకాశాలు 2014 ఎన్నికలలో 13% ఉండగా క్లీన్ రెకార్డ్ ఉన్న అబ్యర్ధులు గెలిచే అవకాశాలు 5% మాత్రమే ఉన్నాయి. (ఏ‌డి‌ఆర్,అహ్మదాబాద్  రిపోర్ట్)

బి‌జే‌పి కి చెందిన 281 విజయం సాదించిన వారిలో 98 మంది  లేదా 35% మంది  పై క్రిమినల్ కేసులు కలవు. కాంగ్రెస్ కు చెందిన 44 మందిలో 8గురు (18%) మండి,ఏ‌ఐ‌ఏ‌డి‌ఎం‌కే కు చెందిన 37మందిలో 6గురు(16%) శివసేన కు చెందిన 18మంది లో 15 మంది (83%) టి‌ఎం‌సి కి చెందిన 34 మందిలో 7గురు(21%) పై క్రిమినల్ కేసులు కలవు.దీనికి తోడుబి‌జే‌పి కి చెందిన 63 సబ్యులపై (22%) కాంగ్రెస్ కు చెందిన 3గురు (7%) ఏ‌ఐ‌ఏ‌డి‌ఎం‌కే కు చెందిన 8మండి సబ్యులపై (44%) శివ సేన కు చెందిన 8మండి సబ్యులపై (44%) తృణ మూల్ కాంగ్రెస్ కు చెందిన 4 సబ్యులాపి (12%) సీరియస్ క్రిమినల్ కేసులు కలవు. 
 
ఆర్‌జే‌డి కి చెందిన మొత్తం 4గురు సబ్యులపై క్రిమినల్ రికార్డులు కలవు.ఎన్‌సి‌పి కు చెందిన 5లో 4గురి పై క్రిమినల్ కేసులు కలవు. బి‌జే‌డి కి చెందిన 15% సబ్యులపై, టి‌డి‌పి కి చెందిన 38% సబ్యులపై, టి‌ఆర్‌ఎస్ కు చెందిన 46% సబ్యులపై, సి‌పి‌ఐ‌ఎం కు చెందిన 56% సబ్యులపై వై‌ఎస్‌ఆర్‌సి కు చెందిన 56% మంది సబ్యులపై,  ఎల్‌జే‌పి కి 67%సబ్యులపై, పి‌డి‌పి కి చెందిన 33% సబ్యులపై, జే‌డి‌యూ కు చెందిన 50% సబ్యులపై, క్రీమినల్ రికార్ద్లు కలవు. ఏ‌ఏ‌పి కి చెందిన ఎవరిపై క్రిమినల్ రికార్ద్లు లేవు. మహారాస్త్ర,యూ‌పి,బిహార్ కు చెందిన అబ్యర్ధులు ఎక్కువుగా క్రిమినల్ రెకార్డ్ కలిగి ఉన్నారు.
2014 ఎన్నికలలో కాంగ్రెస్, బి‌జే‌పి నిలబెట్టిన ప్రతి ముగ్గురు లోక్ సభ  అబ్యర్ధులలో ఒకరు క్రిమినల్ రికార్డ్ కలిగి ఉన్నారు. సీమాంద్ర నుండి ఎన్నికైన 82 ఎం‌ఎల్‌ఏ లు,11మండి ఎం‌పిలు, తెలంగాణా నుండి ఎన్నికైన 63 మండి ఎం‌ఎల్‌ఏ లు, 8 ఎం‌పి లకు క్రిమినల్ రెకార్డ్ ఉంది.

ఆస్తి/ఆదాయ వివరాలు
2014 లోక్ సభ ఎన్నికలలో దేశం లో కల్లాఅత్యధికం ధనం కలిగిన కోటీశ్వర్లు 10 మండి పోటీ చేయగా వీరిలో ఇరువురు మాత్రమే ఎన్నికైనారు. 16 వ లోక్ సభకు ఎన్నికైన  వివిధ పార్టీల ఎం‌పి లు సగటున 14.61 కోట్ల ఆస్తిని కలిగి ఉన్నారు. 2009 54%, 2004 30% మండి కోటీశ్వర్లు. దేశం లో కల్ల అత్యంత ధనిక లోక్ సభ సబ్యుడు గల్లా జయదేవ (టి‌డి‌పి) 683 కోట్ల ఆస్తి కలిగి ఉన్నాడు. 442లోక్ సభ సబ్యులకు అనగా 82% మండి కి  ఒక కోటి అంతకన్నా ఎక్కువ ఆస్తులు ఉన్నాయి.(2009 లో 300 మందికి అనగా 58%)
బి‌జే‌పి కి చెందిన వారిలో 237 మండి అనగా 84% కోటీశ్వరులు. బి‌జే‌పి కి చెందిన ఎం‌పి లు సరాసరి 11 కోట్ల ఆస్తిని కలిగి ఉన్నారు.కాంగ్రెస్స్ కు చెందిన వారిలో 35 మండి కోటీశ్వరులు కాంగ్రెస్ కు చెందిన ఎం‌పిలు 16 కోట్ల ఆస్తిని సగటున కలిగి ఉన్నారు. ఏ‌ఐ‌ఏ‌డి‌ఎం‌కే సబ్యులు 6.5కోట్లు,బి‌జే‌డి సబ్యులు 16.5 కోట్లు, శివ సేన సబ్యులు 9.2 కోట్లు, టి‌డి‌పి,టి‌ఆర్‌ఎస్,వై‌ఎస్‌ఆర్‌సి‌పి కి చెందిన పార్టీల అబ్యర్ధులు సగటున 60కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారు. సి‌పి‌ఐ‌ఎం కు చెందిన ఎం‌పి లు సగటున 79 లక్షల ఆస్తిని కలిగి ఉన్నారు.ఎల్‌జే‌పి సబ్యులు 2.5కోట్లు,ఎన్‌సి‌పి సబ్యులు 37కోట్లు, ఆర్‌జే‌డి 4కోట్లు,పి‌డి‌పి 39సబ్యులు 39 కోట్లు జే‌డి (యూ)1.7 కోట్ల ఆస్తులను కలిగిఉన్నారు. ఏ‌ఏ‌పి సబ్యులు 3కోట్లు,తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఎం‌పి దేశం లో కల్లా అత్యంత బీదవాడు –కేవలం 5 లక్షల ఆస్తిని కలిగి ఉన్నాడు. ఒరిస్సా లో అసెంబ్లీ కు ఎన్నికైన మొత్తం 147 శాసన సబ్యులలో 52% మంది అనగా 76 మంది కోటీశ్వరులు.











.







No comments:

Post a Comment