26 November 2017

అల్లాదీన్ ఖిల్జీ మంగోల్స్ నుండి భారతీయ నాగరికతను రక్షించాడు




Image result for alauddin khilji  

పద్మాతి చిత్రం అనేక వివాదాలకు కారణం అవుతున్నది. దానిలోని ప్రధాన పాత్ర అయిన అల్లాఉద్దిన్ ఖిల్జీ గురించి కొన్ని చారిత్రిక వాస్తవాలు తెలుసు కొందాము.
భారతదేశం యొక్క అత్యుత్తమ రాజులలో ఒకరు మరియు ప్రపంచ గొప్ప సైనిక నిపుణులులో ఒకరుగా అల్లాఉద్దిన్ ఖిల్జీ పేరుగాంచారు. అల్లా ఉద్దిన్  ఖిల్జీ క్రీ. 1266 లో ఢిల్లీలో జన్మించాడు (ఒక భారతీయుడు, ఒక విదేశీ ఆక్రమణదారుడు కాదు) మరియు ఢిల్లీ సుల్తాన్ గా 1296 AD నుండి 1316 వరకు పాలించాడు.అల్లాఉద్దిన్ ఖిల్జీ తన మామ సుల్తాన్ జలాలుద్దీన్ ఖిల్జీ నుండి పొందిన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అతని విజయాల్లో చాలా హిందూ సామ్రాజ్యాలు  చిత్తూరు, దేవగిరి, వరంగల్ రాజ్యాలు, గుజరాత్, రణధంబోర్, మరియు హొయసల మరియు పాండ్య రాజ్యాలు కలవు.
అల్లాఉద్దిన్ ఖిల్జీ కి భారతదేశం ఎంతో   రుణపడి ఉంది.ఎందుకంటే అతని పాలనలో, చాగటై ఖానేట్ యొక్క మంగోలులు (Mongols of the Chagatai Khanate)  భారతదేశo పై దండెత్తారు. అల్లాఉద్దిన్ ఖిల్జీ ఐదు సార్లు మంగోలుల దండయాత్రను నిలువరించారు. 1298 AD లో (అల్లుగ్ ఖాన్ నాయకత్వం లో మంగోలుల దండయాత్ర -  20,000 మంది మంగోలులు  మరణించారు), 1299 AD సింధ్ పై దండయాత్ర (జఫర్ ఖాన్ నాయకత్వం వహించాడు), 1299 లొ డిల్లి లో  స్వయంగా మంగోలుల పై దండయాత్ర, 1305 AD లో (మాలిక్ నాయక్ నేతృత్వంలో మంగోలుపై దండయాత్ర - 8000 మంది మంగోలుల మరణాలు) మరియు 1306 AD (మాలిక్ కఫూర్ నేతృత్వంలో); మరియు 1303 AD లో స్వయం గా మంగోలుల పై  దండయాత్ర (మంగోలులు  ఖిల్జీని ఓడించలేక పోయారు)
ఆ రోజుల్లో మంగోలులు సైనిక శక్తీ  అసాధారణ స్థాయిలో ఉంది. వారు ఎక్కడికి వెళ్ళిన ఆ ప్రాంతం మరుభూమి గా మిగిలేది. ప్రపంచంలోని ఏ సామ్రాజ్యం - రష్యా సామ్రాజ్యం లేదా శక్తివంతమైన పెర్షియన్ సామ్రాజ్యం లేదా బాగ్దాద్ ఖలిఫాత్ - భయంకరమైన మంగోలు దండయాత్రలను నిలువరించ లేక పోయినవి.  ఖిల్జీ వాటిని 5 సార్లు ఓడించినాడు.  ఖిల్జీ ఆధ్వర్యంలో ఢిల్లీ సుల్తానేట్ యొక్క సైన్యాలు ప్రపంచంలోని అత్యంత క్రమశిక్షణా మరియు బాగా శిక్షణ పొందిన సైన్యాలలో ఒకటి. అవి మంగోలులను  మళ్లీ మళ్లీ ఓడిపోయేలా చేసినవి.

ఇప్పుడు, మంగోలుల విద్వంసక  సైనిక  శక్తీ   గురించి తెలియని  వ్యక్తులు: "అయితే ఏమిటి? విదేశీ ఆక్రమణదారులు అయిన ఒక ముస్లిం పాలకుడు మరొక విదేశీ దండయాత్రను ఓడిoచాడు! ". కానీ అది మంగోలుల విద్వంసక  సైనిక శక్తీ  పట్ల భారీ అజ్ఞానాన్నితెల్పుతుంది
మంగోలు యుద్ధాన్ని చేయడానికి  చాలా విచిత్రమైన మార్గం ఎన్నుకొన్నారు. వారు ఒక దేశం పై జయించినప్పుడు, వారు ఆ  రాజ్యం లో  విద్వoసకం సృష్టిస్తారు.  వారు రాజ్యం లో ఏదీ విడిచిపెట్టరు - అక్కడ ఉన్న నాగరికతను సర్వ నాశనం చేస్తారు.   వారు జయించిన ప్రదేశంలో స్థిరపడరు. సర్వం  మంగోలియాకు దోచుకొని తీసుకు వెళ్తారు. వారు స్త్రీలను, పిల్లలను  బానిసలుగా తీసుకొని మగవారిని చంపి, ప్రత్యేక నైపుణ్యాలను కలిగి ఉన్నవారిని సేవకులుగా  తీసుకు వెళ్తారు మరియు ఒక బంజరు భూమిని వెనుక వదిలి వెళ్తారు.  మంగోలు కేవలం దాడి చేసి జయించరు; వారు నాగరికతలను నిర్మూలించారు. మంగోలులను "దేవుని శాపము" గా సూచించటానికి అది కారణంగా  ఉంది.
మంగోలు భారతదేశం ను  జయించినట్లయితే, భారతదేశం దాని అభివృద్ధిలో కనీసం రెండు లేదా మూడు వందల సంవత్సరాలుగా వెనుకకు వెళ్ళేది. భారతదేశం మిల్లినియం సేకరించిన మొత్తం జ్ఞానం మరియు సంస్కృతి నాశనం చేయబడేవి. ప్రతి లైబ్రరీ, ప్రతి పాఠశాల, ప్రతి ఆలయం, ప్రతి ఇల్లు దహనం చేయబడేవి. మంగోల్ ఇల్ఖానేట్ యొక్క హులాగ్ ఖాన్ 1258 లో బాగ్దాద్ను జయిoచినప్పుడు దాన్ని జనసంచార రహిత నగరం గా చేసి వదిలివేసాడు. అతను అబ్బాసిడ్ సామ్రాజ్యం యొక్క గొప్ప గ్రంథాలయాలను నాశనం చేసాడు (మంగోలులు  గ్రంథాలయాలను కొల్లగొట్టి వాటిలోని పుస్తకాలను నదుల పాలు చేసారు ఆ పుస్తకాల ఇంకు కారణంగా నదుల నీరు నల్లగా మారినట్లు చెప్పబడింది) మరియు రక్తం యూఫ్రేట్స్ మరియు టైగ్రిస్ నదుల అందు అతని దాడి తర్వాత వారాల పాటు పారింది. . అతను ఇస్లామిక్ స్వర్ణయుగం ప్రగతిని ముగించాడు. మంగోలు దాడి చేసిన తరువాత ఇదే విధమైన విషయం రష్యాకు జరిగింది. రష్యా మంగోల్ దండయాత్ర తరువాత రష్యా అభివృద్ధిలో 200 ఏళ్ళు వెనుకకు వెళ్లినట్లుగా భావించబడింది. మంగోలు ఇతర ఆక్రమణదారుని వలె లేరు.
ఖిల్జీ మంగోలులతో ఒడి  పోయినట్లయితే, ఖిల్జీకి వ్యతిరేకంగా మంగోల్స్ గెలిచినట్లయితే, వారు ప్రపంచం యొక్క మాప్ నుండి భారత నాగరికతను తుడిచిపెట్టేవారు. కథ చెప్పడానికి ఏమీ ఉండదు.
భారతదేశం  హిందూ సంస్కృతిని కలిగి ఉంటే, దాని వెనుక ఒక పెద్ద క్రెడిట్ అల్లాఉద్దిన్ ఖిల్జీకి వెళ్ళవలసి ఉంది. అతను మంగోల్ నుండి ఇండియాను రక్షించాడు. హిందూ మతాన్ని కాపాడాడు.

  



యువత యొక్క ప్రాముఖ్యత(The Importance of Youth)




ముస్లిం యువత తమ  సమయం, ప్రతిభ, డబ్బు సరియిన మార్గం లో వినియోగించడం  ద్వారా ఇస్లాం వ్యాప్తి కి దోహదం చేయగలరు. వారు సమాజంలో సానుకూల మార్పు తీసుకురావటo లో  ఒక ముఖ్యమైన పాత్ర పోషించాలి మరియు జీవితంలోని అన్ని రంగాలలో ఇస్లాం ధర్మం అనుసరించాలి అనే లక్ష్యంతో పని చేయాలి. యువత ఇస్లాం గురించి జ్ఞానం సంపాదించి మరియు అల్లాహ్ ఇచ్చిన సమయం మరియు ప్రతిభను సమర్థవంతంగా ఉపయోగించుకొని తమ  జీవితాన్నిసార్ధకం చేసుకోవాలి.

యువ్వనం  మన జీవితంలో స్వర్ణ యుగం. యవ్వనం మన జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ ఎందుకంటే వ్యక్తి మార్గం ఎంచుకోవటానికి  ఇది వేదిక. మార్గం సరైనది కావచ్చు లేదా తప్పు కావచ్చు. ఈ వయస్సులో, సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి తమ పిల్లలను మార్గనిర్దేశం చేసేందుకు తల్లిదండ్రులు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తారు.  విజయవంతమైన వారు తప్పు మార్గాన్ని అనుసరించనివ్వకుండా తల్లిదండ్రులు చూసుకోవాలి. ఒక నిర్దిష్ట సమయం తర్వాత పిల్లలను  సరైన మార్గంలో తిరిగి తీసుకురావడం గురించి ఆలోచిoచటం  చాలా కష్టం అవుతుంది.
ప్రతి ప్రయాణం ఒక్క అడుగు తో  ప్రారంభమవుతుంది, కానీ మొదటి అడుగు తప్పు దిశలో పడినట్లయితే, పూర్తి జీవితం తప్పు మార్గంలో ఉంటుంది మరియు సరైన మార్గంలో వచ్చే అవకాసం చాలా కష్టం అవుతుంది. కొందరు యువకులు అనుభవించటానికి ఇది సరియిన సమయం మరియు కళాశాల నుండి బయటకి వచ్చిన తర్వాత సరైన మార్గం లో పయనిoచుదాము అని అనుకుంటారు కానీ సరైన మార్గానికి తిరిగి రావడం అసాధ్యం అని వారికీ  తెలియదు.
 ప్రవక్త ముహమ్మద్( స)తీర్పు దినాన అల్లాహ్ యొక్క నీడలో ఆశ్రయo పొందే  ఏడు రకాల వ్యక్తుల జాబితా ఇచ్చారు.
వారు:
1. పరిపాలకుడు
2. తన యవ్వనాన్ని దేవుని ఆరాధన మరియు సేవలో గడిపిన యువకుడు
3. మస్జిద్ కొరకు తమ హృదయం అంకితం చేసిన వ్యక్తి.
4. దేవుని కొరకు పరస్పరం ప్రేమిoచుకొనే  ఇద్దరు వ్యక్తులు
5. దేవుని భయం తో పాపము చేయని వ్యక్తి.
6. తన దాతృత్వాన్ని రహస్యంగా ప్రదర్శన లేకుండా వ్యవరించే వ్యక్తి మరియు
7. ఒంటరిగా కన్నీరుతో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే వ్యక్తి.
(రియాద్-మాస్-సలీహెన్, హదీసులు 376)

ప్రవక్త ముహమ్మద్ (స) చెప్పిన ఈ హదీసు ద్వారా మనము ప్రవక్త (స) యవ్వనానికి  ఇచ్చిన ప్రాముఖ్యతను సులభంగా అర్థం చేసుకోవచ్చు. సైతాను సులభంగా వ్యక్తిపై నియంత్రణ పొందటానికి   మరియు తప్పు మార్గాన్ని చూపటానికి   ఇది వేదిక. కాబట్టి ఈ దశలో వ్యక్తి మంచి కార్యక్రమాల పై అవగాహన కలిగి ఉండాలి మరియు సైతాను కి దూరంగా ఉండాలి.

ముస్లిం యువత దృష్టి కేంద్రీకరించే మూడు సాధారణ ప్రాంతాలు క్రింది విధంగా ఉన్నాయి
1. తల్లిదండ్రుల పట్ల  విధేయత మరియు గౌరవం చూపాలి.
2.సమయం ను సమర్థవంతoగా వినియోగించాలి.  (సమయం వృధా నివారించడం).
3. ఇస్లాం మతం నిషేధించబడిన వాటిని చూడటం, వినటం చేయరాదు.

యవ్వనంలో చాలామంది తమకు  ప్రతిదీ తెలుసు అని భావిస్తారు; కొంతమంది తమ తల్లిదండ్రుల కంటే తమకు ఎక్కువ తెలుసు అని భావిస్తారు. ఈ రకమైన వైఖరి కారణంగా వారు వారి తల్లిదండ్రుల పట్ల  అవిధేయులయ్యారు. పిల్లలు ఒక నిర్దిష్ట రంగంలో మరింత జ్ఞానాన్ని పొందువచ్చు కాని  అనుభవం లో వారు వారి తల్లిదండ్రుల కంటే తక్కువ. మన తల్లిదoడ్రులు మనకoటే ఎక్కువ జ్ఞానవoతులు, అనుభవశాలురు  అని  ఆలోచిoచి మనo వారి పట్ల  విధేయత, గౌరవo చూపాలి.

ముహమ్మద్ ప్రవక్త (స) ఇలా అన్నారు: "చాలామంది ప్రజలు కోల్పోయే రెండు దీవెనలు ఉన్నాయి: అవి ఆరోగ్యము మరియు  మంచి చేసే  సమయం కి సంభందించినవి. " (బుఖారి)
ఈ హదిసు ద్వారా అల్లాహ్ ఇచ్చిన అనేక బహుమతులలో సమయం మరియు ఆరోగ్యం అమూల్యమైన బహుమానాలు గా భావించాలి  మరియు సరైన ప్రయోజనం కోసం వాటిని వాడాలి. సూరా అల్ అస్ర్ లో అల్లాహ్ కాలపు ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. కానీ ఈ రోజు మనం యువత లో చాలామంది తమ సమయం వృథా  చేస్తున్నారు మరియు ఇస్లాం నిషేదించిన వాటి కొరకు తొందర పడుతున్నారు.

ఇమామ్ అలీ ఇబ్న్ అబి తాలిబ్ (రాయ్) ఇలా అన్నాడు: "రెండు  విషయాలను  ప్రజలు వాటిని కోల్పెయే వరకు వాటి గొప్పతనాన్ని గుర్తించలేరు: అవి  యవ్వనం మరియు మంచి ఆరోగ్యం."మన కోరికల మీద పూర్తి నియంత్రణ లేక  మరియు ఇస్లాం ధర్మంలో నిరాకరించబడిన మరియు నిషేధించబడిన విషయాలకు మనము ఆకర్షించబడుతున్నాము. ఇది కొంత సమయం వరకు మనకు  భౌతిక ఆనందాన్ని ఇవ్వవచ్చు కాని అది హానికారకం.

నేటి యువత ఇస్లాంకు సేవ చేయాలనే లక్ష్యం గా కలిగి ఉండాలి.  ముస్లిం యువత తమ  సమయం, ప్రతిభ, డబ్బు సరియిన మార్గం లో వినియోగించడం  ద్వారా ఇస్లాంవ్యాప్తి కి దోహదం చేయగలరు. వారు సమాజంలో సానుకూల మార్పు తీసుకురావటo లో  ఒక ముఖ్యమైన పాత్ర పోషించాలి మరియు జీవితంలోని అన్ని రంగాలలో ఇస్లాం ధర్మం అనుసరించాలి అనే లక్ష్యంతో పని చేయాలి. యువత ఇస్లాం గురించి మంచి గా జ్ఞానం గ్రహించి మరియు అల్లాహ్ ఇచ్చిన సమయం మరియు ప్రతిభను సమర్థవంతంగా ఉపయోగించుకొని తమ  జీవితాన్నిసార్ధకం చేసుకోవాలి.

అల్ ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: "ఆయన తన ప్రవక్తను మార్గదర్శకత్వం మరియు సత్య ధర్మాన్ని ఇచ్చి పంపించాడు, అది  అన్ని ధర్మాలపై  ఆదిక్యం కలిగి ఉండేలా చేయటానికి, ఈ వాస్తవానికి  అల్లాహ్ సాక్ష్యంగా సరిపోతాడు" (అల్ ఫాతా, 48: 28)

ప్రవక్త ముహమ్మద్ (స)లక్ష్యం  ప్రతి ముస్లిం యొక్క లక్ష్యంగా ఉండాలి. కానీ నేటి యువత ఏ లక్ష్యం లేకుండా జీవిస్తున్నారు. వారు తమ  భౌతిక కోరికలను సంతృప్తిపరిచే ప్రాథమిక లక్ష్యంతో జీవిస్తున్నారు.

అల్లాహ్ ఒక్కడే మరియు ప్రతిదీ అల్లాహ్ మాత్రమే ఇవ్వగలడు అనేది  మనమందరం జ్ఞాపకం చేసుకోవాలి. అందుచేత మనము ప్రతిదీ అల్లాహ్ కోసం ఖర్చు చేయాలి మరియు అల్లాహ్  ను సంతృప్తి పరచటానికి కృషి చేయాలి.

ముస్లిం యువత భవిష్యత్ ఇస్లామిక్ నాయకులు, కాబట్టి దివ్య ఖుర్ఆన్ మరియు ప్రామాణిక సున్నహ్ నుండి ఇస్లాం గురించి సరైన జ్ఞానం పొందాలి. సరైన దృక్పథంలో ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ముస్లిం యువత పూర్తిగా ఇస్లాం ధర్మాన్ని అనుసరించడానికి అల్లాహ్ సహాయం చేస్తాడు
- అమీన్