10 June 2024

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ IUML, 3గురు ప్రముఖులను లోక్‌సభకు పంపింది

 

చారిత్రాత్మక విజయం: 

కేరళ / తమిళనాడు:

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్/IUML 1952 లోక్‌సభ ఎన్నికల నుండి అద్భుతమైన ఎన్నికల విజయాలను  కొనసాగిస్తోంది.ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తన కంచుకోటలైన మలాపురం మరియు పొన్నానిని నిలబెట్టుకుంది, దానితో పాటు రామనాథపురంలో విజయం సాధించినది.

మలాపురం నుంచి ఇ.టి మహమ్మద్ బషీర్ గెలుపొందగా, కేరళ నుండి డా.M.P అబ్దుస్సమద్ సమదానీ పొన్నాని, తమిళనాడులోని రామనాథపురం నుండి నవస్కని K ఎన్నికయ్యారు.

IUML మద్దతుతో, కాంగ్రెస్ నేతృత్వంలోని UDF కూడా కేరళలోని 20 స్థానాలకు 18 స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే DMK-IUML- కాంగ్రెస్ కూటమి తమిళనాడు రాష్ట్రంలోని మొత్తం లోక్‌సభ 39 స్థానాలను కైవసం చేసుకుంది.

IUML అద్భుతమైన ఎన్నికల పనితీరుకు అభినందనలు. ఎన్నికైన పార్లమెంటేరియన్లు మైనారిటీ ఉల్లంఘనలకు మరియు మానవ హక్కుల పరిరక్షణకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో దృఢంగా నిలబడాలి.

 

మూలం: ముస్లిం మిర్రర్, జూన్ 05, 2024

No comments:

Post a Comment