30 May 2023

ముస్లిములు అన్ని ఇతర వర్గాల కన్నా విద్యలో వెనుకబడి ఉన్నారు-ఉన్నత విద్య వెనుకబాటులో UP ప్రధమ స్థానం లో ఉంది.

 

నేర్చుకుంటున్నా, బోధించినా, ముస్లిం సమాజం ఉన్నత విద్యలో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలతో సహా అన్ని వర్గాల కంటే వెనుకబడి ఉంది. ఈ విషయాలు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తాజా ఆల్ ఇండియా సర్వే ఆన్ ఎడ్యుకేషన్‌లో వెల్లడైనవి.


AISHE సర్వే 2020-21 రిపోర్ట్ ముస్లిం సమాజ విద్య సంభంద  దుర్భరమైన చిత్రాన్ని అందిస్తుంది.

 

·      2019-20తో పోలిస్తే,ఉన్నత విద్యలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర వెనుకబడిన తరగతుల (OBC) నమోదులు వరుసగా 4.2%, 11.9% మరియు 4% మెరుగుపడిన సమయంలో, ముస్లిం సమాజ నమోదు 8% తగ్గింది అనగా సుమారు 1,79,000 మంది విద్యార్థులు మాత్రమే నమోదు అయ్యారు.

·      ముస్లిం విద్యార్ధుల విషయo లో ఉత్తర ప్రదేశ్ (36%), జమ్మూ మరియు కాశ్మీర్ (26%), మహారాష్ట్ర (8.5%) మరియు తమిళనాడు (8.1%) నుండి అత్యంత తీవ్రమైన క్షీణత నమోదైంది.

·      ఢిల్లీలో, ప్రతి ఐదుగురు ముస్లిం విద్యార్ధులలో ఒకరు  సీనియర్ స్కూల్ సర్టిఫికేట్ పరీక్షను పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్య కోసం నమోదు చేసుకోవడంలో విఫలమయ్యాడు.

·      అదేవిధంగా, ఉత్తరప్రదేశ్‌లో, జనాభాలో దాదాపు 20% ముస్లింలు ఉన్నారు, రాష్ట్రంలో కళాశాలల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, ఉన్నత విద్య కోసం ముస్లిం విద్యార్ధుల నమోదు కేవలం 4.5% మాత్రమే.

·      అయితే కేరళలో మాత్రం  43% ముస్లింలు ఉన్నత విద్య కోసం ఎన్రోల్ అవుతున్నారు.

 

·      దేశంలోని ఉన్నత విద్యలో మొత్తం నమోదులో OBC కమ్యూనిటీ 36% నమోదు,  ఎస్సీలు 14% నమోదు అయ్యారు.

·      OBC మరియు ఎస్సీలు కలసి విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలల్లో దాదాపు 50% సీట్లను కలిగి ఉన్నారు.

·      ముస్లిం సమాజం దేశ జనాభాలో 14% కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ ఉన్నత విద్య నమోదులో కేవలం 4.6% నమోదు కలిగి ఉన్నది.

·      ముస్లింలు మరియు ఇతర మైనారిటీలు మగ విద్యార్థుల కంటే ఎక్కువ మంది విద్యార్థినులను కలిగి ఉన్నారు.


·      ఉన్నత విద్యాసంస్థల్లో ముస్లిం ఉపాధ్యాయులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నారు.  

·      అఖిల భారత స్థాయిలో, మొత్తం ఉపాధ్యాయులలో 56% మంది జనరల్ కేటగిరీకి చెందిన ఉపాధ్యాయులు ఉన్నారు. OBC, SC మరియు ST ఉపాధ్యాయులు వరుసగా మరో 32%, 9% మరియు 2.5% ఉపాధ్యాయులు ఉన్నారు. ఉపాధ్యాయులలో ముస్లింలు కేవలం 5.6% మాత్రమే ఉన్నారు.

 

·      లింగం పరంగా 100 మంది ఉపాధ్యాయులకు 75 మంది మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు.

·      ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన మహిళా ఉపాధ్యాయులు, ముస్లిం మహిళా ఉపాధ్యాయుల కంటే ఎక్కువుగా  ఉన్నారు.

·      71% మహిళా OBC టీచర్లు మరియు 75% మహిళా ST టీచర్లు ఉండగా, ప్రతి 100 మంది ముస్లిం ఉపాధ్యాయులకు 59 మంది మహిళా ముస్లిం ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు.

 

·      అదేవిధంగా, బోధనేతర సిబ్బందిలో 100 మంది పురుషులకు 85 మంది మైనారిటీలు కాని మహిళా బోధనేతర సిబ్బంది కలరు.

·      బోధనేతర సిబ్బందిలో ముస్లింల వాటా 100 మంది పురుషులకు 34 మంది మహిళలతో అత్యల్పంగా ఉంది.

 

·      AISHE సర్వే ప్రకారం, ఉన్నత విద్యలో మహిళా విద్యార్థుల సంఖ్య 48.67% కాగా పురుషుల విద్యార్థుల నమోదు 51.33%.

·      ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ముస్లిం విద్యార్థులకు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మౌలానా ఆజాద్ ఫెలోషిప్‌ను రద్దు చేసిన ఐదు నెలల తర్వాత సర్వే ఫలితాలు వెలువడ్డాయి.

 

-ది హిందూ పత్రిక సౌజన్యం తో 

No comments:

Post a Comment