21 April 2024

ఇంగ్లిష్ క్రికెట్ రూపురేఖలే మార్చిన ఆంధ్రా వ్యక్తి కొడుకు రామన్ సుబ్బ రో Raman Subba Row, son of an Andhra man, changed the face of English cricket

 



ఇటీవ‌లే 92 ఏళ్ల వ‌య‌స్సులో క‌న్నుమూసిన రామ‌న్ సుబ్బ రో, ఇంగ్లండ్‌ టెస్ట్ క్రికెట‌ర్. రామ‌న్ సుబ్బ రో తన విశిష్ట కెరీర్‌లో ఆటగాడిగా మాత్రమే కాకుండా నిర్వాహకుడు మరియు మేనేజర్‌గా కూడా ముఖ్యమైన పాత్ర పోషించాడు. రామ‌న్ సుబ్బ రో చొరవ కారణంగా, ఇంగ్లీష్ క్రికెట్ ఆధునిక దృక్పథాన్ని పొందింది.

రామ‌న్ సుబ్బ రో తండ్రి పంగులూరి వెంకట సుబ్బారావు ఆంధ్ర ప్రదేశ్‌లోని బాపట్లకు చెందినవారు. పంగులూరి వెంకట సుబ్బారావు యుకె వెళ్లి అక్కడ స్థిరపడి డోరిస్ మిల్డ్రెడ్ పిన్నర్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి పుట్టిన రామ‌న్ సుబ్బ రో సర్రే కౌంటీలోని స్ట్రీథమ్ పట్టణంలో పుట్టి అక్కడే పెరిగాడు. UKలో పాఠశాలలో పేరు యొక్క స్పెల్లింగ్ రావ్ నుండి రోగా మారింది మరియు అది అధికారిక౦గా నిల్చినది.  

రామ‌న్ సుబ్బ రో మంచి ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా మరియు పార్ట్-టైం బౌలర్‌గా మారాడు. తన సామర్థ్యం మరియు ప్రతిభతో కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ జట్టు కి రామ‌న్ సుబ్బ రో ఎంపిక కావడం జరిగింది

1953లో రామ‌న్ సుబ్బ రో నార్తాంప్టన్‌షైర్‌కు మారడానికి ముందు సర్రే కౌంటీ తరపున రెండు సీజన్లు ఆడాడు. 1958లో రామ‌న్ సుబ్బ రో నార్తాంప్టన్‌షైర్‌ కౌంటీకి కెప్టెన్‌గా నియమితుడయ్యాడు మరియు సర్రేపై ప్రశంసనీయమైన ట్రిపుల్ సెంచరీని చేశాడు.

రామ‌న్ సుబ్బ రో నార్తాంప్టన్‌షైర్‌ తరువాత టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్‌కు ప్రాతినిద్యం వహించాడు.  రామ‌న్ సుబ్బ రో సహచరులలో ఫ్రెడ్ ట్రూమాన్, కోలిన్ కౌడ్రే, పీటర్ మే, కెన్ బారింగ్టన్, బ్రియాన్ స్టాథమ్ మరియు టోనీ లాక్ ఉన్నారు. రామ‌న్ సుబ్బ రో ఇంగ్లండ్ తరపున ఆడిన 13 మ్యాచ్‌లలో మూడు సెంచరీలు సాధించాడు మరియు 1961లో విజ్డెన్ యొక్క క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. కానీ ఆ తర్వాత క్రికెట్ నుండి రిటైర్ అయాడు

కానీ రామ‌న్ సుబ్బ రో ఇతర మార్గాల్లో క్రికెట్‌తో సంబంధం కొనసాగించాడు. తరువాత సంవత్సరాల్లో, సర్రే ఛైర్మన్‌గా పనిచేశాడు మరియు టెస్ట్ మరియు కౌంటీ క్రికెట్ బోర్డు (TCCB) ఛైర్మన్‌గా కూడా పనిచేశాడు మరియు ICC చేత మ్యాచ్ రిఫరీగా నియమించబడ్డాడు. మ్యాచ్ రిఫరీగా రామ‌న్ సుబ్బ రో 160 మ్యాచ్‌లకు పనిచేసాడు. పర్యవేక్షించాడు.

1981-82లో ఇంగ్లండ్ జట్టు భారతదేశంలో పర్యటించినప్పుడు, రామ‌న్ సుబ్బ రో ఇంగ్లండ్ జట్టు కు మేనేజర్‌గా వచ్చారు. బాపట్ల పర్యటించాడు. బాపట్ల లో ఘనంగా సన్మానించబడ్డాడు. ఇంగ్లిష్ క్రికెట్‌ను మార్చింది

రామన్ సుబ్బ రో ఇంగ్లిష్ క్రికెట్‌ను చాలా రకాలుగా మార్చేశాడు. ప్రస్తుత ECBకి ముందున్న TCCBని ఏర్పాటు చేసిన వ్యక్తులలో రామన్ సుబ్బ రో ఒకడు. ఇంగ్లీషు క్రికెట్‌పై పాత మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC)కి ఉన్న పట్టును సడలించడానికి రామన్ సుబ్బ రో సహాయం చేశాడు.

ప్రసిద్ధ ఓవల్ మైదానానికి (1971లో ఇంగ్లండ్‌పై భారత్ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది) కొత్త జీవితాన్ని అందించడంలో రామన్ సుబ్బ రో ప్రముఖ పాత్ర పోషించాడు. రామన్ సుబ్బ రో 1988లో సేవ్ ది ఓవల్ అనే పేరుతో ఒక ఉద్యమాన్ని ప్రారంభించాడు మరియు కొత్త స్పాన్సర్‌లను కనుగొని ఓవల్ మైదానానికి ఆర్థిక పరిపుష్టి సంపాదించగలిగాడు.

రామన్ సుబ్బ రో చాలా మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలిచాడు. రామన్ సుబ్బ రో కి భార్య అన్నే, కుమార్తె మిచెల్, కుమారుడు అలిస్టర్, ఎనిమిది మంది మనవరాళ్లు మరియు ఒక మనవడు ఉన్నారు.

No comments:

Post a Comment