4 July 2023

తల్లి కోసం తమిళ్ నాడులో తాజ్ మహల్ నిర్మించిన తనయుడు అమ్రుదీన్ షేక్‌ Amrudeen Sheik built Taj Mahal in TN village for his mother

 


చెన్నై:

 

తన తల్లిపై ఉన్న ప్రత్యేకమైన ప్రేమతో, చెన్నైకి చెందిన వ్యాపారవేత్త అమ్రుదీన్ షేక్‌ తన తల్లి జ్ఞాపకార్థం మినీ తాజ్ మహల్‌ను నిర్మించాడు.

అమ్రుదీన్ షేక్‌ స్వస్థలమైన తమిళనాడులోని తిరువారూర్‌లో 5కోట్ల రూపాయలతో నిర్మించిన మినీ తాజ్ మహల్ తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తోంది 

అమ్రుదీన్ షేక్ దావూద్ సాహిబ్ చెన్నైలో హార్డ్‌వేర్ వ్యాపారవేత్త మరియు అమ్రుదీన్ షేక్ కి నలుగురు సోదరిమణులు కలరు. అమ్రుదీన్ షేక్ దావూద్ తండ్రి అబ్దుల్ ఖాదర్ షేక్ దావూద్ చెన్నైలో వ్యాపారవేత్త మరియు తోలు వస్తువుల వ్యాపారం చేసేవాడు.

అబ్దుల్ ఖాదర్ షేక్ తన పిల్లలు చాలా చిన్న వయస్సులో ఉన్నప్పుడు మరణించాడు. అబ్దుల్ ఖాదర్ షేక్ భార్య, జైలానీ బీవీ పట్టుదలతో కష్టపడి వ్యాపారాన్ని నడిపి తన  నలుగురు ఆడపిల్లలతో సహా ఐదుగురు పిల్లలను పోషించినది. పిల్లలంతా పెరిగి పెద్దవారైన తరువాత   నలుగురు అక్కాచెల్లెళ్లకు పెళ్లిళ్లు చేసి అమ్రుదీన్ షేక్ కూడా పెళ్లి చేసుకున్నారు.

2020లో జైలానీ బీవీ కన్నుమూశారు, ఇది అమరుద్దీన్‌కు పెద్ద షాక్‌గా ఉంది, ఎందుకంటే అమరుద్దీన్‌ చాలా చిన్న వయస్సు నుండి తన తల్లికి వ్యాపారం లో  సహాయం చేసేవాడు మరియు అమరుద్దీన్‌ తన తల్లిని ఎప్పుడు కనిపెట్టుకోని ఉండేవాడు.. అమరుద్దీన్‌ తల్లి జైలానీ బీవీ అమావాస్య రోజున మరణించింది మరియు ప్రతి అమావాస్య రోజున 1,000 మందికి బిర్యానీతో విందు చేయాలని అమరుదీన్ నిర్ణయించుకున్నాడు.

కొంతకాలం తరువాత అమరుద్దీన్‌కు తన తల్లి కోసం మినీ తాజ్‌మహల్‌ నిర్మించాలనే ఆలోచన వచ్చింది. దీనికోసం అమరుద్దీన్‌ తన పూర్వీకుల గ్రామం అమ్మయ్యప్పన్ వద్ద ఒక ఎకరం భూమిని కొనుగోలు చేశాడు మరియు బిల్డర్ అయిన ఒక స్నేహితుని సహాయం తో స్మారక కట్టడాన్ని నిర్మించడం ప్రారంభించాడు.

అమరుద్దీన్‌ రాజస్థాన్ నుండి పాలరాయిని కొనుగోలు చేశాడు మరియు ఆగ్రాలోని తాజ్ మహల్‌లో వలె తల్లి కోసం నిర్మించదలచిన స్మారక చిహ్నం చుట్టూ మార్గాలు మరియు నడక మార్గాలను తయారు చేశాడు మరియు జూన్ 2న స్మారక చిహ్నాన్ని ప్రజల కోసం ఓపెన్ చేసాడు..

స్మారక చిహ్నాo(మినీ టాజ్ మహల్)  అన్ని మతాల ప్రజలు ధ్యానం చేయగల ధ్యాన కేంద్రాలు మరియు 10 మంది విద్యార్థులు ఉంటున్న మదర్సాను కలిగి ఉంది.

దక్షిణాదికి చెందిన ఈ తాజ్‌మహల్‌కు అమరుద్దీన్ పబ్లిసిటీ ఇవ్వకపోవడంతో ప్రజలకు ఈ విషయం ఆనోటా ఈ నోట విని తెలిసింది.

 

మూలం: ఉమ్మిద్.కాం, IANS,  జూన్ 11, 2023

No comments:

Post a Comment