1 July 2023

ప్రవక్త(స)భోధనలను అనుసరించడానికి, ప్రజా సంక్షేమం కోసం సామాజిక సేవాకేంద్రాలుగా మస్జిద్ To follow the Prophet, use mosques for public welfare

 

కోవిడ్-19 మహమ్మారి తర్వాత ముస్లింలు మసీదుల నుండి సహాయ కార్యక్రమాలను ప్రారంభించిన తర్వాత ఇతర భారతీయులకు ముస్లింలు మరియు వారి జీవనశైలి గురించి తెలుసుకొన్నారు. అలాగే, ముస్లింలు తమ మసీదులను సమాజ ఉమ్మడి సంక్షేమ కార్యక్రమాల కోసం ఎలా బాగా ఉపయోగించుకోవచ్చో గ్రహించారు.

ఇస్లాం ధర్మం లో రెండవ పవిత్ర ప్రార్థనా స్థలమైన మస్జిద్ నబవిలో మహమ్మద్ ప్రవక్త కాలంలో అనేక సామాజిక, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించబడినవి.  భారతీయ ముస్లింలు ఇప్పుడు మసీదులను ప్రార్ధనలు మరియు లెక్కలేనన్ని సేవల కోసం ఉపయోగించడం ప్రారంభించారు.

పశ్చిమాన USA నుండి యూరప్ వరకు అనేక మసీదులు ఉన్నాయి. అక్కడ కమ్యూనిటీ సంక్షేమం అనేది ఇస్లామిక్ సెంటర్‌ల(మస్జిద్)  బ్యానర్‌లో ఉంది.

కోవిడ్ మహమ్మారి సమయంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మసీదులు స్వచ్ఛంద సంస్థలను ప్రారంభించాయి మరియు మసీదుల  భారీ ప్రాంగణాలను ముస్లిములు ప్రజాసంక్షేమం కోసం ఉపయోగించసాగారు.

ఒకసారి GK మూపనార్ (తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు) ఒక మసీదుకు ఆహ్వానించబడ్డాడు, మరియు ముస్లింలు ప్రార్ధన లో ఏ విగ్రహాన్ని లేదా మరే ఇతర వస్తువులను ఉపయోగించకపోవడాన్ని చూసి మూపనార్ ఆశ్చర్యపోయాడు. ఇది మూపనార్ కు  ఆశ్చర్యం కలిగించింది, ఎందుకంటే మూపనార్ ఎప్పుడూ మసీదుని సందర్శించలేదు. మసీదులు అన్ని మతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలి. దీంతో అనుమానాలు తొలగిపోయి ముస్లిములకు సమాజం లోని ఇతరవర్గాల ప్రజల మద్య  సాన్నిహిత్యం పెరుగుతుంది.

అనేక ముస్లిం దేశాలలో విజిట్ ది మస్జిద్ కార్యక్రమాన్నినిర్వహించి ముస్లిమేతరులకు మస్జిద్ గురించి అవగాహన కల్పిస్తున్నారు. బారత దేశం లో కుడా కొన్ని నగరాలలో విజిట్  ది మస్జిద్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

క్రైస్తవులు  వారి విద్యా సంస్థలు మరియు ఆసుపత్రుల ద్వారా సమాజ సేవ చేస్తారు. సిక్కులు  లంగర్ ద్వారా సామాన్యుల ఆకలిని తీర్చి సోదరభావం పెంచుతున్నారు. 

ఇస్లామిక్ చరిత్రలో మసీదులలో ప్రారంభించబడిన అనేక రకాల సేవల ప్రస్తావన కలదు.

మనం మసీదును అల్లా గృహంగా మాత్రమే భావిస్తాము. ఇస్లామిక్ చరిత్ర గురించి తెలియని వ్యక్తి మాత్రమే అలా ఆలోచించగలడు.

మసీదు ఇస్లాంలో ఒక విప్లవాత్మక సంస్థ మరియు మస్జిద్ మానవ శరీరంలోని హృదయాన్ని పోలి ఉంటుంది. గుండె చురుగ్గా ఉన్నంత కాలం శరీరంలో ప్రాణం ఉంటుంది మరియు గుండె బలహీనమైనప్పుడు శరీరం కూడా బలహీనమవుతుంది.

మస్జిద్ తప్పనిసరి ప్రార్థనలు, సున్నత్, నవాఫల్, ఇతికాఫ్, ఖియామ్ మరియు సజ్జుద్ మాత్రమే కాకుండా, ఆరాధన, శిక్షణ, ఆహ్వానం మరియు ప్రజలకు సేవ చేసే కేంద్రం మరియు మస్జిద్ ప్రత్యేకమైనది.

మసీదు యొక్క ప్రాముఖ్యతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్ని వ్యక్తిగత మరియు సామూహిక వ్యవహారాలకు కేంద్రంగా పేర్కొన్నారనే వాస్తవం నుండి గ్రహించవచ్చు.

ఒక హదీసు ప్రకారం ఒకరోజు హజ్రత్ సాద్ బిన్ ఉబాదా సఫాలోని చాలా మందిని భోజనానికి ఆహ్వానించాడు (హలియాత్ అల్-అవులియా అల్-ఇస్ఫహానీ). ఒకరోజు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన పవిత్ర గది నుండి బయటకు వచ్చి మసీదులోకి ప్రవేశించి రెండు గుంపులుగా ఆరాధకులు ఉండడం చూశారు. ఒక సమూహం తస్బీహ్ మరియు జిక్ర్ మరియు అజ్కార్ azkar పఠించడంలో నిమగ్నమై ఉంది మరియు మరొక సమూహం జ్ఞానాన్ని(విద్య) పొందుతున్నారు.

ఇద్దరూ మంచి పని చేస్తున్నప్పటికీ, విద్యలో నిమగ్నమైన సమూహం మంచిదని ప్రవక్త (స)చెప్పారు. ప్రవక్త(స) కూడా విద్యలో నిమగ్నమైన సమూహం లో చేరారు.

మసీదుల వినియోగ పరిధిని పెంచుకోవచ్చని, దీని కోసం వివిధ మార్గాలు మరియు పద్ధతులు ఉన్నాయి దాని కోసం మనం కూర్చుని ఆలోచించి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.

ఇప్పుడు దేశంలోని చాలా మసీదుల్లో శారీరక దృఢత్వం కోసం వ్యాయామశాలలు కలవు. ఇదొక పెద్ద మార్పు. ఇది జీవితంలో ఒక భాగం మరియు ఆరోగ్యానికి హామీ. చదువుతో పాటు దైవ ప్రవక్త తన సహచరులకు శారీరక శిక్షణ కూడా ఏర్పాటు చేశారన్న విషయం మనం మరవరాదు.

ఇస్లాం ప్రవక్త(స) ఎల్లప్పుడూ వ్యాయామం చేయమని ప్రజలను ప్రోత్సహించేవారు, వ్యాయామమే లక్ష్యం అయినప్పటికీ, ప్రవక్త(స) గుర్రపు పందాలు, ఒంటెల పందాలు మరియు పురుషుల రేసులను ఏర్పాటు చేసి పాల్గొనేవారిని ప్రోత్సహిoచారు..

నేటికీ, మస్జిద్ నబ్వీ ఉత్తర ద్వారం దగ్గర 'మస్జిద్ సబ్బాక్' అనే మసీదు దీనికి సాక్ష్యంగా నిలుస్తుంది. అరబిక్‌లో సబ్బాక్ అంటే పోటీలో పాల్గొనడం. ప్రవక్త ఒక వేదిక వద్ద నిలబడి, ఏ గుర్రపుస్వారీ చేసే వాడు మొదటి స్థానంలో నిలిచాడో నిర్ణయించడానికి పరుగెత్తే గుర్రాలను గమనిస్తారు.

ప్రవక్త మొదటి ఐదుగురు రైడర్‌లకు బహుమతులు ఇచ్చేవారు, అవి ఎక్కువగా ఖర్జూర రూపంలో ఉండేవని  ప్రవక్త(స)జీవిత చరిత్రకారులు రాశారు. (అల్-మక్రిజీ: అల్-షార్జా మరియు అల్-అథర్, వాల్యూం. 1)

శుక్రవారం ప్రవక్త(స) మసీదు నుండి ఉపన్యాసాలు ఇవ్వడం సర్వసాధారణమని, అదే వేదికపై, సాహిత్యం మరియు కవిత్వ సమావేశాలు కూడా జరిగిన సందర్భాలు కలవు.

హజ్రత్ హసన్ బిన్ సాబిత్ మరియు ప్రవక్త(స) యొక్క ఇతర సహచరులు దేవుణ్ణి, ప్రవక్తను స్తుతించారు మరియు ఇస్లాం మరియు జాహిలీ (చీకటి) కాలం నాటి సంఘటనలు మరియు సాహిత్య ప్రయోజనాలను వివరించారు. దీని వివరాలు సహీహ్ బుఖారీలో ఉన్నాయి.

మదీనాలో చాలా మంది అబిస్సినియన్లు కూడా ఉన్నారు, వీరు ప్రత్యేక సందర్భాలలో జావెలిన్ మరియు ఇతర శారీరక వ్యాయామాలు మరియు ఆటలను నిర్వహించేవారు. 

ఒకసారి ఈద్ రోజున, ప్రవక్త(స) మరియు  ఆయేషా సిద్ధిఖా(ర) ముందు మస్జిద్ నబవిలో అబిస్సినియన్ గారడిని ప్రదర్శించారు. ప్రవక్త(స) వెంక నిలబడి అబిస్సినియన్ గారడిని చూసి అలసిపోయిన తర్వాతే విశ్వాసుల మాత ఆయేషా సిద్ధిఖా(ర) అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఒకప్పుడు మసీదుల ద్వారా ప్రతి సమస్యకు పరిష్కారం చూపేవారు. అల్లాహ్ ఆరాధనతో పాటు, మసీదు టైమ్‌టేబుల్‌లో సామాజిక మరియు సంక్షేమ పనులు మరియు సంప్రదింపుల కోసం కూడా సమయం/స్లాట్ కలదు. ఎప్పుడైతే ఒక ముఖ్యమైన ఆర్థిక విషయం చర్చించబడాలి మరియు అది ప్రార్థనతో సమాంతరంగా ఉన్నప్పుడు ప్రార్థనలు ముగిసిన వెంటనే అందరూ దాని గురించి చర్చించేవారు.

ముజాహిదీన్‌ల కోసం మస్జిద్ నబవిలో సైనిక ఆసుపత్రిని స్థాపించారని, అక్కడ గాయపడిన వారికి చికిత్స అందించి వారి గాయాలకు వైద్యం అందించారు మరియు  హజ్రత్ రఫీదా ఈ పనికి బాధ్యత వహించారు. 

ఖండక్ యుద్ధంలో, హజ్రత్ సాద్ బిన్ ముఆద్ తీవ్రంగా గాయపడ్డారు మరియు చికిత్స కోసం మసీదు వద్ద హజ్రత్ సాద్ బిన్ ముఆద్ కోసం ఒక టెంట్ ఏర్పాటు చేయబడింది.-(బుఖారీ)

మహమ్మారి తర్వాత, భారతదేశంలోని కొన్ని మసీదులలో కూడా వైద్య కేంద్రాలు మరియు ఇతర సేవలు ప్రారంభించడం జరిగింది.  మసీదులను ఆరాధనకు కాకుండా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చనే వాస్తవాన్ని మరియు చరిత్రను ముస్లింలు గుర్తించారు.

నేడు మసీదుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది కానీ వాటి బాధ్యతలు మరియు పాత్రలు పరిమితంగా ఉన్నాయి. ఇస్లాం ప్రవక్త కాలంలో ఉన్నట్లుగా మనం (ముస్లింలు) మన పరిధిని  విస్తృతం చేసుకోవచ్చు. ఇస్లాం ప్రవక్త సేవకు నజ్రాన్ నుండి ఒక ప్రతినిధి బృందం వచ్చిందని ఇస్లాం ప్రవక్త(స) వారిని మసీదులో సత్కరించడమే కాకుండా 60 మంది సభ్యుల క్రైస్తవ ప్రతినిధి బృందాన్ని లోపల ఆరాధించడానికి అనుమతించారు.

మౌలానా అబుల్ కలాం ఆజాద్ ప్రకారం ప్రవక్త(స) కాలం లో మసీదులో దృఢమైన మనస్సు గల వ్యక్తులు  ఉండేవారు. ఫలితంగా 40 రోజుల పాటు రాళ్లు రువ్వడం ద్వారా కూడా ముస్లింలు జయించలేని తైఫ్ తెగను ప్రవక్త(స) కొన్ని గంటలలో  మాటలతో గెలిచారు.

“ఇనుప కత్తి తల పగలకొట్టగలదు, కానీ ప్రేమ కత్తి కంటే ఎవరూ గొప్పవారు కాదు”- (జామీ అల్-వాహిద్: పేజీ 19)

ప్రవక్త(స) కాలంలో మహిళలు విధిగా నమాజు కోసం ప్రవక్త మసీదుకు వచ్చేవారు. నేటికీ, ప్రవక్త మసీదులో బాబ్ అల్-నిసా ఉంది, అక్కడకి  ప్రవక్త(స) వచ్చేవారు.  కొన్నిసార్లు, పురుషులను ఉద్దేశించి ప్రసంగించిన తరువాత, ప్రవక్త(స)ప్రత్యేకంగా మహిళల వద్దకు వచ్చి, వారికి సలహాలు ఇచ్చేవారు. ఆ కాలంలో మహిళలు మసీదులో సమిష్టిగా ఫజ్ర్, మగ్రిబ్, ఇషా ప్రార్థనలు చేసేవారు అని ప్రవక్త(స) జీవిత చరిత్రలలో పేర్కొనబడింది.

ఇస్లాం ప్రవక్త(స) న్యాయం కోసం అల్లా ఇంటిని(మస్జిద్) ఉపయోగించారు. మసీదులో ప్రవక్త(స) తీర్పు చెప్పారు. న్యాయవిచారణ చేయవలసిన కేసులో వారి వాంగ్మూలాలను గమనించడం కోసం న్యాయవాదులు, ప్రతివాదులు, సాక్షులు మరియు ఇతర వ్యక్తులు మసీదులో ఉన్నారు మరియు తీర్పు వెలువడింది. ఒక రకంగా చెప్పాలంటే, మస్జిద్ కోర్టు కార్యకలాపాలను చూసేందుకు ఎవరైనా వచ్చే బహిరంగ కోర్టు.

మస్జిద్ నబవి యొక్క ప్రధాన కార్యకలాపాలను పరిశీలిస్తే, నేటి మసీదుల నుండి ఇది ఎంత భిన్నంగా ఉందో మనంగ్రహించవచ్చు.

ప్రవక్త కాలంలో ఉన్న క్రియాశీల మసీదు భావనను పునరుద్ధరించడానికి, మసీదులను ప్రజల జీవితాలకు మరియు మానవ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చడం అవసరం. ఉదాహరణకు, మసీదులలో మంచి లైబ్రరీని ఏర్పాటు చేయండి. నేటి యుగంలో, ఆడియో, వీడియో, HD మరియు కంప్యూటర్ ద్వారా శాస్త్రాల జ్ఞానాన్ని పొందడం సులభం మరియు చౌకైనది. ఉదాహరణకు, బెంగుళూరులోని సిటీ జామా మసీదులో సాధారణ, సాంకేతిక, మరియు వయోజన విద్య మొదలైనవాటిని అందించడానికి సరైన ఏర్పాట్లు ఉన్నాయి, ఇది అభినందనీయం. మసీదులలో సదఖా మరియు జకాత్ స్వీకరించడానికి మరియు పంపిణీ చేయడానికి కూడా ఏర్పాట్లు ఉండాలి.

అయితే మసీదుల ఆదాయం తక్కువగా ఉండటం అనేది పరిష్కరించాల్సిన సమస్య. మసీదు చుట్టూ దుకాణాలను నిర్మించడం మరియు అద్దె ఆదాయం కోసం వాటిని ఉపయోగించడం మంచి మార్గం. అలా కాకుండా పెద్ద పెద్ద సెంటర్లకు చదువుల కోసం వచ్చే యువతీ యువకుల కోసం కొన్ని గదులను సిద్ధంగా ఉంచితే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉంటుంది.

జస్టిస్ సచార్ కమిటీ నివేదిక ముస్లింల పేదరికాన్ని ఎత్తిచూపింది మరియు ముస్లిం జనాభాలో ఎక్కువ మంది మురికివాడల్లో నివసిస్తున్నారని పేర్కొంది.

ముస్లిం సమాజ సంపదకు సంబంధించిన హజ్ మరియు ఉమ్రా యొక్క అర్హతలు మరియు సమస్యలపై మసీదులలో ఉపన్యాసాలు మరియు సమావేశాలు ఉన్నాయి, కానీ పేదలు మరియు పీడితులకు సహాయం చేయడానికి జకాత్ మరియు సదాకత్‌లపై తక్కువ చర్చలు జరుగుతాయి. ప్రతి మసీదులో స్థానిక నిరుపేదల జాబితాను తయారు చేయవచ్చు మరియు వారు పేదలు మరియు పీడితులకు సహాయం చేయవచ్చు

మన మసీదులు  భగవంతుని సృష్టి సేవకు, ముఖ్యంగా నిస్సహాయులు, వికలాంగులు మరియు అట్టడుగు ప్రజల సేవకు కేంద్రంగా మారాలి.

కొన్ని మసీదులు ప్రవక్త మసీదు యొక్క కార్యకలాపాలను అనుకరిస్తే, ప్రపంచం, ఇస్లామిక్ పద్ధతుల యొక్క గొప్పతనాన్ని చూడగలుగుతుంది మరియు వాటిని మెచ్చుకుంటుంది

No comments:

Post a Comment