22 December 2013

భారత దేశం లో పరిశుబ్రత-వ్యక్తిగతశుబ్రత (sanitation and Hygiene) పరిస్థితి- నిరాశాజనకము


“53% మంధి భారతీయులు తమ కాలకృత్యాలు ఆరుబయట తీర్చుకొందురు-ఒక సర్వే నివేదిక”
         53% భారతీయులు లేదా దేశ జనాభాలో  60 కోట్ల మంది  ఆరుబయట మలవిసర్జన చేస్తారని ఇటీవల ప్రకటించిన ఒక సర్వే లో నిర్ధారణ అయినది. కేంద్ర మంత్రి జైరాం రమేశ్ అబిప్రాయం ప్రకారం దేశ జనాభాలో 64% మంది ఆరుబయట తమ కాలకృత్యాలు తీర్చుకొంటున్నారు. ఇది ఒక అంతర్జాతీయ రికార్డు. దీని వల్ల అనగా ముందేమరణించుట,రోగుల చికిస్థ,సమయ దురుపయోగం, ఉత్పత్తి లో నష్టము ,పర్యాటక ఆదాయం కోల్పోవటము మొదలగు కారణాలవల్ల  దేశానికి ప్రతి సం: 3,24, 000 కోట్ల నష్టము జరుగుచున్నది.
         సంతోషం కలిగించే విషయము విజ్ఞాన పరముగా భారతీయులు, చంద్ర యానము, మంగళ యానముల  ద్వారా ముందంజలో ఉన్నారు. కానీ పరిశుబ్రత,ఆరోగ్య రంగాలలో చాలా వెనుకబడి ఉన్నాము.
క్రిందివాస్తవాలు గమనించండి.    
పరిశుబ్రత(Sanitation):
§  64% భారతీయులు తమ  కాలకృత్యాలు ఆరుబయటతీర్చుకొంటారు. కానీ బంగ్లాదేశ్, బ్రజిల్ లాంటి దేశాలలో కేవలను 7% జనాభా తమ కాలకృత్యాలు ఆరుబయట తీర్చుకొందురు.
§  ప్రపంచవ్యాప్తం గా ఆరుబయట కాలకృత్యాలు తీర్చుకొనేవారిలో 60% మన దేశంలోనే ఉన్నారు.
§  ఆరోగ్యం పై ఖర్చు వలన దేశ స్తూల జాతీయ ఆదాయం(GDP) తగ్గుచున్నది.
§  ఉత్పత్తి,పర్యాటక రంగాలలో  ఆదాయము  తగ్గుటవలన దేశ స్తూల జాతీయ ఆదాయం(GDP) తగ్గుచున్నది.
§  దేశ స్తూల జాతీయ ఆదాయం(GDP)లో 0,02% పరిశుబ్రత (sanitation) పై ఖర్చు పెట్టవలసి వస్తుంది.
§  సంపూర్ణ పరిశుబ్రత పధకం (TSC)క్రింద  గత పది సం.లలో 8.71 కోట్ల మరుగు దొడ్లు నిర్మించబడినవని తెలుస్తుంది. కానీ కుటుంబ లెక్కల సేకరణ ప్రకారం వీటి సంఖ్య 5.16 కోట్లు మాత్రమే.
§  గత 5 సం.లలో 45,000 కోట్ల రూపాయలను గ్రామీణ పరిశుబ్రత కొరకు ఖర్చు పెట్టటాము జరిగింది. 2017 వరకు అదనముగా ఇంకో 1.08 లక్షల కోట్ల ఖర్చు పెట్టదరు.   
వ్యక్తి గతశుబ్రత (Hygiene)
§  పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ లెక్కల ప్రకారం 53% మంది  కాలకృత్యాలు తీర్చు కొన్నతరువాత తమ చేతులను సబ్బు తో కడుగుకొనేదారు. 38% మండి భోజనము చేయుటకు ముందు, 30% మంది  ఆహారం తయారు చేయుటకు ముందు చేతులు కడుగుకొనేదరు.
§  గ్రామీణ భారతము లో 11% మంది పిల్లల మలమును రక్షితముగా పారవేయుడురు .
§  80% మందిపిల్లల మలమును అరక్షితముగా అనగా ఆరుబయట లేదా చెత్త లో పారవేయుడురు. 
§  కేవలం 6% గ్రామీణ పిల్లలు మరుగు దొడ్లను వాడుదురు.
§  చేతులు కడుగుకొనుట వలన డయోరియ (విరోచనములు) మరణాలు తగ్గును.
§  సబ్బు తో చేతులు కడుగుట వలన 44% మరణాలు,
§  మరగకాచిన నీరుత్రావుట వలన44%,
§  పరిశుబ్రత వలన 36%,
§  మంచి నీరు  త్రాగటం  వలన 23%,
§  నీటి  ఆధారాలను శుబ్రము చేయుట వలన 11%  డయోరియ (వీరోచనాల) ద్వారా సంభవించే మరణాలు తగ్గును.
కంపించకుండాపోయిన 3.5 కోట్ల మురుగు దొడ్లు
          భారతీయులలో ఆదిక శాతం ప్రజలకు ఆధునిక పరిశుబ్రత సౌకార్యాలు అందుబాటులో లేవు.UNICEF/WHO లెక్కల ప్రకారం  2008 నాటికి భారత దేశ  గ్రామీణ ప్రజలలో 21% మంధికి మాత్రమే పరిశుబ్రత (sanitation)సౌకర్యాలు లబించినవి. ఇది గ్రహించిన భారత ప్రభుత్వం(GOI) 1999నుంచి సంపూర్ణ గ్రామీణ పరిశుబ్రత పధకం (TSC)మరియు 2008 నుంచి జాతీయ సంపూర్ణ పట్టణ పరి శుబ్రత పాలసీ   (NUSP) ప్రారంభించినది. కానీ ప్రభుత్వం చెప్పుతున్న లెక్కలకు ,వాస్తవ గణాంకాలకు పొత్తన కుదురుట లేదు. ఉదా: సంపూర్ణ గ్రామీణ పరిశుబ్రతా పధకం క్రింద 2009 చివరి నాటికి గ్రామీణ జనాభాలో 80%మందికి 8.7 కోట్ల మరుగు దొడ్లు నిర్మించబడినవి. కానీ 2011 కుటుంబ గణాంకాల ప్రకారం కేవలం 5.16 కోట్ల మరుగు దొడ్లు వాస్తవముగా కలిగి ఉన్నారు. మిగతా 3.5 కోట్ల మరుగు దొడ్లు ఎమైనాయీ?
          పై సర్వే నివేధిక పరిశీలించిన పెద్ద మొత్తాలను కేటాయించటమే కాదు, వాటిని ప్రభావవంతముగా ఖర్చుపెట్టిన ఆశించిన ఫలితాలను అనగా మరణాల శాతమును మరియు పరిశుబ్రతతో సంభధము కలిగిన పైన వివరించిన  ఇతర ఫలితాలను అనగా రక్షిత త్రాగునీటి సమస్య,ప్రజాక్షేమం,తగ్గుతున్న పర్యటన ఆధాయము మొదలగు వాటిని నివారించ వచ్చును . 
పరిశుబ్రతా సౌకర్యాలు లేకపోవటం  అన్నీ సమస్యలకు కారణము:  
          సర్వే నివేదికను పరిశీలించిన అబివృద్ధి చెందుతున్న దేశాలలో ఆరుబయట మలవిసర్జన దేశ మానవశక్తి అభివృద్ధి  కి ప్రమాదకరము అని తెలియుచున్నది. పరిశుబ్రతా అబివృద్ధి ఫధకం అమలులో ఉన్న దేశాలలో ఆ పధక అమలు వలన చిన్న పిల్లలలో గ్రహణ శక్తి పెరుగును . ఉదా: భారత దేశం లో పరిశుబ్రతా  పధకం అమలులో ఉన్న ప్రాంతాలలోని 6స.లోపు పిల్లలు అక్షరాలు, అంకెలను ఇతరులకన్నా అనగా పధకం అమలు లోని ప్రాంతాల పిల్లల కన్నా త్వరితంగా నేర్చుకొన్నారు.
          స్కూళ్లలోనూ,పబ్లిక్ స్థలలలోను పరిశుబ్రత సౌకర్యాలు లేకపోవడం వలన అనేక అసౌకర్యాలు  సంభవించును. మగవారు ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేయగలరు, కానీ ఆడ వారికి అది
సాద్యపడదు.వారికి మరుగు కావలే, బజార్లు,షాపింగ్ స్థలాలు, ఇతర పబ్లిక్ స్థలలలో మరుగు దొడ్లు లేనియెడల అది స్త్రీలకు అసౌకర్యము కల్పించుటయే గాక వారి మూత్రాశయములపై ప్రభావము కల్పించును.
          స్కూళ్ళలో టాయలేట్ సౌకర్యము లేక పోవుట వలన  స్కూళ్ళలో బాలికల డ్రావ్ప్ఔట్ (dropout) పెరుగుచున్నది. యువతులకు తమ సానిటరీ నాప్కిన్స్ మార్చుకొనుటకు లేదా పారవేయుటకు , చేతులు కడుగుకొనుటకు ప్రత్యేకముగా వారికోసమే కేటాయించబడిన టాయాలేట్లు కావలెను. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో దళిత,బలహీనవర్గాల మహిళల కోసం ప్రత్యేకం గా కేటాయించబడిన టాయలెట్లు కావలెను .      
         మురికి వాడలలో నివసించే మహిళల పరిస్తీతి మరింత బాదాకారముగా ఉంది. వారు పగటిపూట కాలకృత్యాలు తీర్చుకొనుటకు అవకాశము లేక భాధపడుచున్నారు. తెల్లవారిగట్ల,లేదా చీకటి పడిన తరువాత కాలకృత్యాలు తీర్చుకొనుటలో అనేక ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు. టాయలేట్ కు తరచూ   వెళ్లవలసిన పరిస్తితి వస్తుందని స్త్రీలు,బాలికలు శరీరానికి కావలసీన కనీస  నీటిని కూడా పగటి పూట త్రాగుట లేదు.
          టాయలేట్ సౌకర్యం లేక పోవటం వలన స్త్రీలు, బాలికలు పడుతున్న ఇబ్బందులను
మన మంతా గ్రహించి పబ్లిక్ స్థలాలలో పబ్లిక్ టాయలేట్లను ఏర్పాటుచేయాలి.  దీనిని కనీస ప్రజా అవసరముగా గుర్తించి   తీర్చవలసిన ఒక కనీస సహజ శారిరకవసముగా భావించి    ఒక దేశ వ్యాప్త అంధోళన రూపొందించ వలసి ఉంది.     

(యూనిసెఫ్ ఇండియా నివేదిక సహాయం తో వ్యాసము రూపొందింపబడినది).


“స్త్రీ విముక్తి ప్రదాత లేదా స్త్రీ గౌరవ రక్షకులు మహమ్మద్ ప్రవక్త (స)”

 పవిత్ర కొరాన్ ప్రకారం అల్లాహ్ స్త్రీ,పురుషులు ఇరువురిని ఒకే ప్రాణి నుండి సృష్టించినాడు. మానవపరంగా వారిరువురి మద్య ఎటువంటి భేదము లేదు. నిజానికి అల్లాహ్ పట్ల అత్యంత భయబక్తులు, విశ్వాసము కలవరే అతనికి ఆప్తులు.
 “ మానవులారా! మేము మిమ్మల్లి ఒకే పురుషుడు, ఒకే స్త్రీ ద్వారా సృష్టించాము. యదార్ధానికి మీలో అందరికన్నా ఎకువగా బయబక్తులు గలవాడే అల్లాహ్ సమక్షంలో అందరికన్నా ఎక్కువగా ఆదరణీయుడు” దివ్య కొరాన్ 49:13.
          అల్లాహ్ పురుషులు కన్నా స్త్రీలు తక్కువ అన్నవారిని నిందించినాడు -దివ్య కొరాన్ 16:57-59,
           స్త్రీ పురుషులను సమానంగా చూడమని ఆదేశించినాడు దివ్య కొరాన్ - 2:228,231, 4:19.

          అల్లాహ్ పవిత్ర కొరాన్ తో పాటు అంతిమ ప్రవక్త ఐనా మహమ్మద్ ప్రవక్త(స) ను ప్రజలకు మార్గదర్శకం చూపమని పంపినాడు. ఉన్నతమైన నైతిక సుగుణాలు, సత్యసంధులు,ఐనా మహమ్మద్ ప్రవక్త (స)గారి  ఆదర్శ జీవితము, దివ్య కొరాన్ లోని భోదనలను అనుసరించుటకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చును.అంతిమ ప్రవక్త ఐనా మహమ్మద్ ప్రవక్త (స) ప్రవచనాలు సర్వాకాలాలకు, సర్వ దేశాల మానవాళి కి సదా అనుసరనీయాలు.

          శతాబ్దాల తరబడి అణిచివేతకు,దోపిడీకి,బానిసత్వానికి, పురుష ఆహంకారానికి,గురిఐన స్త్రీ జాతి సముద్దరణకు మహాప్రవక్త(స) ఉదయించినారు.స్త్రీ స్వతంత్రవాది,సంస్కరణవాది,రక్షకుడు,విముక్తి ప్రధాతగా మహమ్మద్ ప్రవక్త (స) అవతరించేను. వారి ప్రవచనాల వెలుగు లో ఆనాటి అరబ్బులు పాటించే అనేక క్రూరపద్దతులు,ముదాచారాలు,సమూలంగా నిర్మూలించబడినవి. వీరి ప్రవచనాల పలితముగా స్త్రీ-పురుష సమానత,స్త్రీలకు గల హక్కులు, స్త్రీ స్థానం మొదలగునవి ఆ నాటి సమాజం చే గుర్తించబడి గౌరవింపబడినవి.

స్త్రీ-రక్షణ:
          ఇస్లాం అబివృద్ధి చెందుటకు పూర్వము అరబియా లో స్త్రీ లకు రక్షణ,విలువ లేదు. వారు కేవలం వ్యాపార వస్తువులుగా,జంతువులకన్నా హీనముగా పరిగణిపబడే వారు. ఆ స్థితి నుంచి స్త్రీలను కాపాడి,వారికి సమున్నత గౌరవం, స్థానము కల్పించిన ఘనత మహమ్మద్ ప్రవక్తకు (స) దక్కుతుంది. సర్వత్ర అణిచివేత,నిరంతరము దూషణలకు గురిఐన స్త్రీలకు ప్రవక్త రక్షణ కల్పించేను. ఆ రోజులలో ఆడ శిశువులను పాతివేయటం సర్వసాదారణము. ఆడశిశువు తండ్రిగా పిలువబడటం అవమానకరం గా నాటి అరబ్ సమాజం భావించేడిది. ప్రవక్త తన బోధనలచే ఆడశిశువుల హత్యలను,ఆడపిల్లలను కలిగిఉండటం అవమానకరం గా భావించడాన్ని వ్యతిరేకించేను. తాను స్వయంగా నలుగురు కుమార్తెలను కలిగి, వారికి అమిత ప్రేమానురాగాలు పంచి, కుమార్తెలను కలిగి ఉండటం  గౌరవానికి చిహ్నంగా ప్రజలు భావించేటట్లు చేసెను.

          ప్రయాణం చేసి వచ్చినతరువాత ప్రవక్త(స) తన  ఇంటికి వీళ్ళక, స్వయంగా కుమార్తె ఫాతిమా(ర)ఇంటికి వెళ్ళి ఆమెను ప్రేమతో పలకరించే వారు. ప్రవక్త ఆగమనము తరువాత  అరేబియా లో బాలికల  సంఖ్య పెరిగినది.ఇస్లాం ఆగమనమునకు ముందు అరేబియా లో విదవలకు పునర్వివాహ హక్కు లేదు, వారు తమ మారుటి కుమారుల లేదా తమ భర్త సోదరుల  ఆస్తులుగా భావించబడే వారు. ప్రవక్త (స) విధవలకు పునర్వివాహ హక్కు ను, గౌరవప్రదమైన జీవితం గడిపే హక్కు ను, కల్పించిరి. తాను స్వయంగా అనేక మంది  విధవలను,విడాకులు పొందిన స్త్రీలను వివాహమాడి సమాజంలో  వారికి గౌరవ ప్రదమైన స్థానం కల్పించిరి.

స్త్రీల హక్కులు :
          స్త్రీ పై అదిక్యత కాక స్త్రీ పై భాద్యత  పురుషునికి ఇవ్వబడినది.స్త్రీని పరిపూర్ణముగా పోషించవలసిన బాద్యత పురుషునిది. భార్య గా భర్త నుండి, తల్లి గా కుమారుడినుంచి, కుమార్తె గా తండ్రినుంచి,సోదరిగా సోదరుడినుంచి, పోషణ పొందుటకు స్త్రీకి పూర్తి హక్కు కలదు. ప్రవక్త (స) కాలములో  ఒక వ్యక్తి తన ఆర్థిక స్థాయికి తగినట్లు తన భార్య-పిల్లలను పోషించక పోయిన, ఆమె ఆర్థిక అవసరములను తీర్చుటకు గాను ఆమెకు  రాజ్య ఖజానా(state treasury) నుంచి తగిన ధనము ఇవ్వబదేది. ఆదే సంధర్భం లో తన స్థాయికి మించి ఖర్చు చేయమని భర్తను బలవంత పెట్టరాడు, అదేవిదంగా స్థాయికి మించిన కోర్కెలు కోరే హక్కు భార్యకు లేదు. ఒక హదీసు ప్రకారం “పిసినారి ఐనా తన భర్త తన ఆర్థిక స్థాయికి తగినట్లు తమ ( భార్య పిల్లల)  కనీసావసరాలు తీర్చుటలేదని, అబుసుఫియన్ భార్య అబుసుఫియన్ పై ఫిర్యాదు చేసినది మరియు  అతనికి తెలియకుండా అతని ధనము లోంచి  కొంత తీసుకోవచ్చునా” అని ప్రవక్త ను ప్రశ్నించేను. ఆమె అవసరాలకు తగినంత తీసుకొమ్మన్ని ప్రవక్త (స) అనుమతి ఇచ్చిరి.

          కుటుంబ ఆర్ధికావసారాలను తీర్చవలసిన భాద్యత ముస్లిం స్త్రీ కు లేదు,అది పురుషుని భాద్యత . ఆస్తిని సంపాదించుటకు,తన పేర ఉంచుటకు, వారసత్వంగా పొందుటకు, న్యాయపరమైన  లావాదేవిలు చేయుటకు, తన ఆస్తులను తానే స్వయంగా సంరక్షించుకొనే అధికారం ముస్లిం స్త్రీ కు కలదు. ఆమె సంపాదన పై స్వయంగా భర్త కు కూడా హక్కు లేదు. సామాజిక,రాజకీయ, సైనిక రంగాలలో పాల్గొనే హక్కు స్త్రీలకు కలదు.

          ఇస్లాం కు పూర్వం స్త్రీలకు ఆస్తిని వారసత్వంగా  పొందుటకు, అనుభవించుటకు, చివరికి వ్యాపారం చేసే హక్కు కూడా లేదు. కానీ ఖదిజా(ర) ఒక వ్యాపార వేత్త మరియు ఆమె వ్యాపార నిర్వహణ లో ప్రవక్త(స)ఆమెకు  సహకరించేవారు . ప్రవక్త కాలములో స్త్రీలు యుద్ద రంగములో గాయపడిన వారికి కట్లు కట్టుట, నీరు త్రాగించుట, మొదలగు పనులలో సైనికులకు సహాయం చేస్తుండేవారు.సైదా జనాబ్(syeda janab) ఆ కాలపు ప్రముఖ ఉపన్యాసకురాలు మరియు సైనికురాలు.నుసైబా(Nusayba) ఆకాలపు ప్రముఖ సైనికురాలు. ఖలీఫా ఎన్నికలో స్త్రీ,పురుషులు ఇరువురు పాల్గొనేవారు. ఉస్మాన్ బిన్ ఆఫ్ఫాన్ ఖలీఫా గా ఎనికైనా సందర్భంలో అబ్దుర్ రహ్మాన్ బిన్ ఔఫ్ అనేక మంధి స్త్రీలను సంప్రదించిరి. విడాకులు ఇచ్చే హక్కు పురుషులతోపాటు స్త్రీలకు కూడా ఖులా రూపం లో కలదు.

సమానత్వం:
          ఇస్లాం లో స్త్రీ కి సముచిత స్థానం కల్పించబడినది. స్త్రీ-పురుషులు ఇరువురు సమవర్తులే కాని పోటీదారులు కారు. కొన్ని పనులు స్త్రీలు మరికొన్ని పనులు పురుషులు చేయగలరు. పోషించుట,సమర్ధించుట,రక్షణ మరియు భార్య-పిల్లలకు  విద్యను ప్రసాదించుట పురుషుల పని. కుటుంబమును నడుపుట మరియు  భర్తకు సహాయపడుట స్త్రీ విది. పిల్లలను కనుట, పెంచుట,భోధించుట శిక్షణ ఇచ్చుట స్త్రీ ప్రధాన విది. కుటుంబ విధులు నిర్వహించిన తదుపరి తగిన నైపుణ్యమున్న ఆమె బయట పనిచేయవచ్చును. ఒప్పంద మరియు వ్యాపార స్వేచ్చ ముస్లిం స్త్రీ కి కలదు. వివాహమైనతరువాత కూడా ఆమె తన సంపాదన పై పూర్తి హక్కు కలిగి ఉంది.ఇవి అన్నియు మహా ప్రవక్త (స) భోదనల పలితముగా స్త్రీలకు లబించినవి
.
          ఇస్లాం లో జ్ఞానవంతులకు ఆదిక్యత లబించును మరియు స్త్రీపురుషులు ఇరువురికీ జ్ఞానమును పొందు హక్కు కలదు. జ్ఞానమును ఆర్జించుట ప్రతి ముస్లిం స్త్రీ-పురుషుల తప్పక నెరవేర్చవలసిన  విది.
మీలో కొరాన్ ను అబ్యసించి ఇతరులకు భోదించేవారే ఉత్తములు”
ఓ ప్రభూ! నాకు మరింత జ్ఞానము ప్రసాదించు.”20:114

          ప్రవక్త (స) తన కుమార్తెలను, భార్యలను ,ఇతర ముస్లిం స్త్రీలను విద్యావంతులను చేసెను. స్త్రీలు ప్రవక్త ప్రవచనములను శ్రద్దగా అలకించే వారు, అర్థం కాక పోయిన మరొక మారు ప్రవక్త వారికి భోదించేవారు. ఈ విదముగా స్త్రీవిద్యను,స్త్రీ జ్ఞానము పొందుటను ప్రవక్త సమర్ధించిరి. ప్రవక్త (స) మరణాంతరము ఆయెషా(ర) హదీసుల ముఖ్యఆధారముగా పరిగణింపబడిరి. ఆమె 2210 హదీసులను గుర్తు ఉంచుకొని వాటిని ప్రముఖ హదీసు విద్యావేత్తలకు  భోదించేవారు. ఆమె జ్ఞానులకు,జ్ఞానిగా పేరొందినది.

భావ ప్రకటనా స్వేచ్చా:
          స్త్రీపట్ల దయ,అనురాగములను ప్రవక్త (స) ప్రదర్శించేవారు. ముస్లిం సమాజములో స్త్రీలకు,పురుషునితో సమానమైన గౌరవము,స్థానము కల్పించబడినది. సమాజములో స్త్రీల హక్కులను తన ప్రవచనములు,కార్యముల(సున్నత్)  ద్వారా స్థాపించిరి. తన భార్యలతో జరిపే  చర్చలలో ప్రవక్త (స)  స్త్రీ స్థానం ద్వితీయమైనది కాదు,అంతటిలో ఒక భాగము అని పేర్కొనేవారు. ప్రవక్త (స) తన భార్యలతో సలహా సంప్రదింపులు జరిపేవారు. ఖదీజా(ర) ప్రవక్త మత  వ్యవహారములలో ప్రముఖ పాత్ర వహించిరి.మొదటిసారి “వహి” అవతరించినపుడు ప్రవక్తను స్వాంతన  పరిచిరి మరియు ఇస్లాం లోకి మారిన మొదటి వ్యక్తి ఖదీజా(ర).         
          ప్రవక్త(స) తన భార్యలకు భావప్రకటనా స్వాతంత్రమును ప్రసాదించిరి. హుదైబియా ఒప్పంద సమయంలో బలి జంతువులను వధించమనే ప్రవక్త ఆదేశాలను వారి అనుచరులు పాటించని సమయంలో భార్య ఉమ్మసల్మా సలహామేరకు ప్రవక్త  స్వయంగా తన బలిజంతువును వధించగా, ఆపై  అనుచరులందరు ప్రవక్త (స) ఆదేశాలను పాటించి తమ బలిజంతువులను వదించిరి. ప్రవక్త (స) సమక్షం లో స్త్రీలు,ఇతర ప్రముఖ ముస్లిం నాయకులతో పాటు  తమ భావాలను స్వేచ్చగా వెల్లడించటమే గాక, ముఖ్య మైన చర్చలలో పాల్గొనేవారు.

          వివాహము,కట్నము మొదలగు విషయాలలో స్వయానా తండ్రితో సహా ఎవరు స్త్రీని బలవంత పెట్టలేరు.పెళ్లి విషయంలో తల్లి-తండ్రులు సలహా మరియు సహాయము మాత్రమే చేయగలరు అంతియేకాని ఆమెను బలవంత పెట్టలేరు. మేనల్లుడు అలీ తన కుమార్తెను వివాహాము చేసుకోదలచినప్పుడు,కుమార్తె  ఫాతిమా అబిప్రాయంను తెలుసుకొన్న తరవాత మాత్రమే ప్రవక్త (స)ఆ వివాహమునకు  అంగీకరించిరి. ఇబ్న్ అబ్బాస్ ప్రకారం “తన అంగీకారము లేనిదే తన తండ్రి తన వివాహము చేయు చున్నాడని ఒక స్త్రీ ప్రవక్త (స) తో ఫిర్యాదు చేయగా వివాహమును అంగీకరించు లేదా తిరస్కరించు అధికారము ఆమెకు కలదని ప్రవక్త (స) బదులు ఇచ్చిరి. ఇంకొందరి ప్రకారం” ఆ స్త్రీ తనకు వివాహము అంగీకారమే కానీ తమ అబిప్రాయాన్ని నాపై రుద్దే హక్కు నా తల్లి తండ్రులకు లేదని స్పష్టం చేయాలి” అని అనెను.

          ప్రవక్త తన భోదనలతో స్త్రీల హక్కులను అబివృద్ధి చేయుటయేకాక , స్త్రీలు తమ హక్కుల కోసం పోరాడేటట్లు చేసినారు. స్త్రీ కి లబించే కట్నం (మెహ్ర్ ) పై పరిమితి లేదు. కట్నం(మెహ్ర్) ను పరిమితం చేయుటకు ఖలీఫా ఉమర్ ప్రయత్నించగా ఒక వృద్ధ స్త్రీ తన అబ్యoతరమును   తెలియచేయగా, ఆమె అబ్యoతరమును దివ్యకురాన్ వెలుగులో పరిశీలించిన ఖలీఫా ఉమర్ తన అబిప్రాయమును మార్చుకొని ఆమె అబిప్రాయం సరిఐనదని మెచ్చుకొనిరీ.

గౌరవము,హౌదా కల్పించుట  మరియు స్త్రీల పట్ల  దయగల ప్రవర్తన:
          స్త్రీల హక్కులు ముఖ్యమైనవి   మరియు వారి పట్ల దయతో ప్రవర్తించ వలసి ఉంటుంది. “తమ స్త్రీల పట్ల ఆదరణీయ మైన ప్రవర్తన కలవారే నిజమైన ముస్లింలు” అని ప్రవక్త మహమ్మద్ (స) అబిప్రాయ పడిరి.ప్రవక్త స్వయం గా దయకల, ప్రేమపాత్రులైన భర్త గా వ్యవరించిరి. ఇంటి పనులను భార్యలతో కుడి చేసేడివారు,ప్రయానములలో తనతోపాటు భార్యలను తీసుకువెళ్ళేవారు ,వ్యాపారము  మరియు అన్నివిషయములలో సంప్రదించేవారు.కొన్ని సందర్భాలలో వారు ప్రవక్తతో (స) బిగ్గరగా మాట్లాడేవారు మరియు వాగ్వివాదమునకు దిగేవారు. ప్రవక్త (స) ఎల్లపుడూ వారిపై ఆదిక్యత ప్రదర్శించేవారు కారు. ప్రతి మానవజీవి గౌరవము, హూదాకు తగిన వారని ప్రవక్త తన భోదనలద్వారా తెలిపినారు.
          తల్లి పాదాల చెంత స్వర్గం ఉన్నదని ప్రవక్త(స) తెలిపినారు. అల్లాహ్ దృష్ఠి లో తల్లి స్థానము ఉన్నతమైనది.
          వస్త్రాలను దరించుటలో హిజబ్ ను పాటించుట స్త్రీ గౌరవాన్ని,రక్షణను పెంచును. స్త్రీ లతో పాటు పురుషులను కూడా తమ చూపులను మరల్చుకోమని, క్రిందకు దించమని అల్లాహ్ దివ్య కొరాన్ లో ఆదేశించినారు. పోకిరిలు, స్త్రీలను వేదించకుండా స్త్రీలు తమ బాహ్య దుస్తులను శరీరం పై నిండుగా కప్పుకొనమని అల్లాహ్ ఆదేశించినాడు.శరీరము కన్పించే వస్త్రధారణ పట్ల ప్రవక్త(స) అసంతృప్తి వెలిబుచ్చిరి.

          ప్రవక్త పదవిని పొందినతరువత గడిపిన తన 23 ఏళ్ల జీవితం లో ప్రవక్త(స)తన భోధనల ద్వారా  స్త్రీలపై ఆనాటి ముస్లిం సమాజ భావాలను పూర్తిగా మార్చుటలో సఫలము చెందినారు. హితునిగా,సమర్ధకుని గా, తమ ప్రగతి ప్రోత్సాహకునిగా మరియు తమ సంక్షేమ కర్తగా ప్రవక్త మహమ్మద్ ను (స) స్త్రీ జాతి పొగడును. స్త్రీల సామాజిక,రాజకీయ, ఆర్థిక, నైతిక జీవితము మరియు దినసరి జీవితము  పై ప్రవక్త(స) భోదనల ప్రభావము విశేషముగా కలదు. తమ జీవితమును తీర్చిదిద్దిన ప్రవక్త (స) జీవితము లోని విబ్బిన్న సంఘటనలు ఆదర్శమైనవిగా,అనుసరించదగినవిగా  సమకాలీన స్త్రీ సమాజము భావించినది. ఆమీన్.
   
  
   



“ప్రవక్త ప్రవచనాల వెలుగులో నేటి సమస్యల పరిష్కారం


          మానవ జీవితం ఎల్లప్పుడు సమస్యలు, ప్రశ్నలతో నిండిఉంటుంధి. మానవులు తమ కాలపు సమస్యలను ప్రత్యేకమైనవిగా,గత కాలపు సమస్యలకన్నా బిన్నమైనవిగా, భావిస్తుంటారు. వారిదృష్టిలో వర్తమానం గతం, కన్నా సంక్లిష్టమైనది. ఈ భావన సహజమైనదిగా అనిపించిన అది నిజం కాదు,అది  బ్రమ మాత్రమే. దైవ ప్రవక్తలలో చివరివారైనా మహమ్మద్ ప్రవక్త(స) సమస్త మానవాళికి భోదకులు,మార్గదర్శకులు.వారి మార్గ దర్శకత్వం లో,వారి ప్రవచనాల సహాయంతో ప్రస్తుత ప్రపంచంలోని సమస్యల పరిష్కారానికి మనమందరము  ప్రయత్నించవలసి ఉంటుంది.

          ప్రస్తుత మానవ సమాజం అనేక సమస్యలతో నిండి ఉంది, వాటి పరిష్కార మార్గాలను కోరుకొంటున్నది. ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను 1.అనిశ్చిత(uncertainty) 2.విశ్వ సమాజ ఆవశ్యకత(need for a global society) 3.అందని శాంతి(elusive peace) 4.ప్రకృతితో విరోధం(conflict with nature) 5.వనరుల పున: పంపిణీ (distribution of resources) గా వర్గీకరించ వచ్చును. ప్రవక్త(స) ప్రవచనాల(ఇస్లాం) వెలుగులో ఈ సమస్యల పరిష్కారానికి ఎదురుచూస్తున్నాము.

అనిశ్చిత యుగము:
          పునర్జీవనోద్యమము పలితంగా పాశ్చాత్య సంస్కృతి, శాస్త్రీయ పద్దతిలో సత్యాన్ని (truth) కనుగొన్నానని తలంచుచున్నది. ప్రకృతి,విశ్వం యొక్క రహస్యాలను, శాస్త్రీయ పద్దతిలో ఆద్యయనము చేయడం జరిగినది.అన్నీ సామాజిక సమస్యలకు మానవ మేధస్సుతో పరిష్కారాలు సాదించుటకు  ప్రయత్నాలు ప్రారంభమైనవి.ఇది చాలా గోప్ప విజయము. కానీ 400 స. లు గడిచినా మానవుని సామాజిక ప్రవర్తనను శాస్త్రీయంగా అర్థం చేసుకొనుటలో విఫలం చెందాము.ఉత్తర ఆధునికతత్వం (post modernism) లో ఈ భావనను వ్యక్తం చేయడం జరిగింధి, అనగా వస్తువులలో అనిశ్చితత,పూర్తిగా నిజాలు లేకపోవడం అని అర్థం.

          అనిశ్చితత నిరాశ,నిస్పృహలకు,అశాంతికి దారితీయును.నిరాశ, నిస్పృహలు అధికంగా ఉన్న సమాజాలలో ప్రవక్త(స) ఉపదేశాలు కొత్త ద్వారాలను తెరుచుచున్నవి.ప్రవక్త ప్రకారం దైవ సందేశం (కొరాన్) మానవులకు సంపూర్ణ జ్ఞానాన్ని,విశ్వాసాన్ని కలుగ చేయును. మానవ జీవితం లోని అనిశ్చితతను తొలగించుటయే ప్రవక్త (స) ప్రదాన ఆశయము. ప్రవక్త (స) నోటి ద్వారా అవతరించిన దివ్య కొరాన్ ప్రారంభం లో “ఇది అల్లాహ్ గ్రంథము, అల్లాహ్ భీతి కలవారికి ఈ గ్రంధము మార్గదర్శకం”  2:2 అని స్పష్టం చేయడం జరిగింది. అదేవిదంగా మహమ్మద్ ప్రవక్త(స) “తాను అల్లాహ్ చే పంపబడిన చిట్టచివరి ప్రవక్తనని, ఈ విషయం లో ఎటువంటి అసత్యం లేదని” స్పష్టపరిచిరి.

ప్రవక్త స్వయంగా దైవ గ్రంధం (కొరాన్) అన్నీ విషయాలను విశిదపరచును అన్నప్పుడు, మనం ప్రవక్తను (స) ఎందుకు అనుసరించవలే?అనే ప్రశ్న తలెత్తును? ఈ ప్రశ్నకు జవాబు గా ఐదు సమాధానములను ఇవ్వవచ్చును.

§  ప్రవక్త విశిష్ట నడవడిక కలవారు, సత్య సంధులు. అసమాన తెలివితేటలు,సునిశితమైన సుబుద్ధి కలవారు. కాబట్టి మనం వారి మాటలను విశ్వసించవచ్చును.
§  ప్రవక్త తన కోసం ఏది కోరుకో లేదు. స్వలాభం కోసం పనిచేయలేదు. నిస్వార్ధంగా,సాదారణమైన, నిరాడంబరమైన జీవితాన్ని గడిపినారు.
§  అందరూ ప్రవక్తలు ఒకే సందేశం తెచ్చారు.సందేశం లో తేడాలు ఉన్న అందరూ ఒకే సందేశం ఏవిధంగా తెగలరు?
§  ప్రవక్త సందేశం సరిఐనదని, ప్రజలు తమ జ్ఞానము, హేతువును ఉపయోగించి రుజువు చేసుకొన్నారు.
§  ప్రవక్త సందేశం పాటించిన మానవ జీవితం పునీతమై, శాంతి వెలుగులతో కూడి, మనలను దైవ మార్గములోనికి మరల్చును. అందుకే దివ్య కొరాన్ “మానవులను అల్లాహ్ వైపుకు మరలండి” అని కోరింది.

విశ్వ సమాజము (Global society)
          సాంకేతికత,వేగవంతమైన ప్రయాణం, కమ్యూనికేషన్ సౌకర్యాలు ప్రస్తుత సమాజాన్ని విశ్వ సమాజంగా (global society) మార్చినవి. విశ్వ సమాజం లో మానవులందరికి సమానంగా వర్తించే విశ్వ న్యాయ సూత్రాలు కావాలి. ఒకే ప్రాంతానికి వర్తించే సూత్రాలు,విలువలు వెంకబడినాయి. ఈ సంధర్భం గా ప్రవక్త (స)సూత్రాలను లేదా ఉపదేశాలను పరిశీలించిన అవి ఒక ప్రాంతానికి కాక విశ్వ సమాజానికి వర్తించేటట్లు ఉన్నాయి. కాబట్టి ఇవి మానవులందరిని ఏకం చేసే, అందరిచే ఆచరింపదగిన సూత్రాలుగా భావించవచ్చును.

ప్రవక్త దృష్టి లో సార్వత్రిక ప్రపంచం క్రింది విధంగా ఉండ వలయును.
§  సృష్టికర్త ఒకరే అనే భావనను కలిగి ఉండుట.
§  విశ్వంలో ఐక్యత మరియు సంతులిత ఉండవలయును.
§  ఆదామ్-హవ్వ నుంచి జనించిన మానవ జాతి అంతా ఒకటి గానే ఉండవలయును

ఈ సంధర్భం గా ప్రవక్త ప్రవచనలను క్రింది విధం గా ప్రవచించ వచ్చును.
§  న్యాయ మరియు నైతిక విశిష్టత                                 (adl  and ihsan)
§  తల్లితండ్రులను ఆదరించుట                                     (sidq and amanah)
§  సామాజిక,రాజకీయ విషయములలో సంప్రదింపులు        (shura)
§  వ్యక్తి మరియు సమాజ సమగ్ర అబివృద్ధి                       (tazkiyah)
§  నైతికంగా సమర్ధనియమైనదానిని పాటించుట (maroof) మరియు పునీత మానవ స్వభావమును కలుషితం చేయూదానిని వదిలివేయుట (munkar)

          పైన వివరించిన భావనలు విశ్వ వ్యాప్తమైనవి. అవి అందరూ మానవులకు సమానం గా అనగా రంగు,వర్గ,ప్రాంత,జాతి భేదాలు లేకుండా వర్తించును. మానవ ప్రవర్తన విశ్వవ్యాప్తం గా ఒకే విధం గా ఉండవలెనని ఆశింపవచ్చును.

ప్రవక్త (స)భోదించిన ఉన్నత నైతిక ప్రవర్తనలోని ముఖ్యాంశాలు :
1.    అల్లాహ్ తప్పితే వేరే దైవం లేడు. (నిరాకార,ఏకేశ్వరోపాసన)
2.   తల్లి-తండ్రులను ఆదరించుట.
3.   పొరుగు వారి పట్ల ఆదరణ చూపుట.
4.   వ్యక్తి ప్రవర్తన, చేతలలో విధేయత,పరిశుద్దత  కలిగిఉండుట  (Haya)
5.   వ్యక్తిగత,పరిసరాల పరిశుబ్రత పాటించుట
6.   జూదం, లాటరీ వంటి వాటిపై నిషేదం
7.   వ్యక్తిగత, సమూహా లావాదేవీలలో వడ్డీ (రిబా )నిషేదించుట
8.   ఆదాయాన్ని నిల్వ చేయక దానిని పున: పంపిణీ చేయుట (జకాత్)
9.   సరియైన, పూర్తి సమాచారము తో ప్రజోపకరమైన పద్దతులను రూపొందించుట (formulation of public policies)
10. చేసుకొన్న అన్నీ ఒప్పందాలను,ఒడంబడికలను, వాగ్ధానాలను నెరవేర్చుట.
11.  అసహాయులు,బలహీనులకు పూర్తి రక్షణ,విలువ,ఆధారం కల్పించుట.

విశ్వ శాంతి :
          మానవ స్వభావము ఎల్లప్పుడు శాంతిని కోరును. యుద్దములను వ్యతిరేకించును. అణ్వాస్త్రాలు,జీవ రసాయినిక ఆయుధాలు ఉన్న ప్రస్తుత ప్రపంచంలో ప్రపంచ శాంతి భావన ఆదికమైనది. యుద్ధాన్ని,నివారించుటకు మూడు సూత్రాలు అవసరము.

1.    ప్రపంచం లోని అన్నీ ప్రభుత్వాలు ఆదరించే అంతర్జాతీయ న్యాయ సూత్రాల అమలు.
2.   వివిధ దేశాల మద్య సంబంధాలను క్రమబద్దం చేయుట.
3.   అంతర్జాతీయ రాజకీయ,ఆర్ధిక సమానత్వ సాధన. – అసమానత్వం ఉన్నపుడు ఘర్షణ,అంధోళన, వ్యతిరేకత ఉండును.
        
  పై మూడు రంగాలలో అబివృద్ధికి ప్రవక్త (స) సందేశాలు  ఉపకరించును. వాస్తవంగా అందరికన్నా ముందు ప్రవక్త ప్రవచనాల వెలుగులో ముస్లిం మేధావులు, విద్యా వేత్తలు,న్యాయవేత్తలు,అంతర్జాతీయ న్యాయ సూత్రాలను క్రోడీకరించిరి. ఆ తరువాతే పశ్చిమ దేశాల వారు ఈ రంగం లో ప్రవేశించినారు. ఒప్పందాలు, ప్రకటనలు వెలుగులోనికి వచ్చినాయి. ప్రస్తుత ప్రపంచానికి ప్రవక్త(స) భోదనల మీద ఆధారపడిన న్యాయసూత్రాలు ఎంతైనా అవసరము  ఉన్నాయి. అందరినీ ఒప్పించి,అందరినీ క్రమబద్ధం చేసే అంతర్జాతీయ న్యాయ సూత్రాలు ఈనాడు ఎంతో ఆవశ్యకం.

          ప్రపంచ శాంతిని కాపాడే ఐక్య రాజ్య సమితి తన నిర్మాణ లోపాలతో అన్నీ సబ్య దేశాల విశ్వాసంను పొందటంలో విఫలమైనది. అది తన న్యాయమైన,సరియైన తీర్మానాలను ఆమోదింపచేసుకోలేని, లేదా అమలు పరచలేని స్థితి లో ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఒక ప్రభావాత్మక,నిర్ణయాత్మక అంతర్జాతీయ సంస్థ అవశ్యకత ఈనాడు  ఎంతైనా ఉంది. ఈ విషయం లో అన్నీ ముస్లిం దేశాలు స్పందించవలసిన అవసరం ఉంది. రాజకీయ, ఆర్థిక, న్యాయాలను, జాతీయ-అంతర్జాతీయ దృష్టి కోణం నుంచి పరిశీలించవలయును.

           “ఇతరులమీద అధికారం చలాయించే వారు ముందు తమ  భాద్యతలను తెలుసుకోవాలి. పాలకుడు తన చేతలకు బాద్యత వహించవలయును. న్యాయాన్ని ప్రసాదించటం, న్యాయాన్ని సంరక్షించటం పాలకుని ప్రధాన విధి” అని ప్రవక్త (స)  పేర్కొన్నారు.

ప్రకృతి తో పోరాటం :
          ప్రకృతి-మానవుల మద్య సరియైన సమతౌల్యము ఉండవలయును. ప్రకృతిపై మానవుడు తాను  విజయం సాదించాను అని అనుకొంటాడు కానీ అది సరిఐనాది కాదు. దివ్య సందేశం ప్రకారం ప్రకృతి-మానవుల మద్య సరియైన సమతౌల్యం ఉండవలయును. రెండు దేవునిచే సృష్టించబడినవి. ప్రకృతి మానవుని అవసరాలను తీర్చుటకు రూపొందించబడినవి. మానవుడు దానిని అర్థం చేసుకొని సరియైన మార్గం లో ప్రకృతి ని ఉపయోగించుకోనవలయును. ప్రకృతి-మానవుని మద్య సరియైన సమతౌల్య సంబంధాన్ని(taskheer) ప్రవక్త(స)మానవాళికి సరియైన రూపం లో ఉపదేశించేను.

వనరుల పున: పంపిణీ
          దివ్య కొరాన్, హదీసుల వెలుగులో ప్రపంచంలోని వనరులను, ప్రపంచ మానవులందరి  మద్య సరిగా పంపిణీ చేయవలెనని ప్రవక్త(స) ఆదేశించేను. సమాజం లోని పేద,బలహీన వర్గాలకు ఉన్నత వర్గాల వారి సహకారం(జకాత్) లబించవలయును.అంతిమంగా ప్రపంచ సంపదను పున:పంపిణి చేసి, అందరికీ సమానంగా పంపిణీ జరిగే ఒక నూతన వ్యవస్థను స్థాపించి, మానవ శక్తి ని సంపూర్ణంగా అబివృద్ధి చేయవలే. ప్రవక్త (స) మక్కా నుండి మదీనా కు తరలినప్పుడు అనేక ముస్లింలు వారితో పాటు మదీనాకు విచ్చేసిరి. వారు మదీనాకు కొత్తవారు. ప్రవక్త సౌబ్రాతృత్వం (mawakhat)ను వారి మద్య పెంచేను. ఒక మదీనా వాసునికి , ఒక మక్కా వాసునితో సంభందం కలిపి ఇరువురిని సోదరులుగా కలిపిరి. ఇది ఆధాయ పున: పంపిణీకి ఒక చక్కని నిదర్శనము.

          ప్రస్తుత ప్రపంచం లోని సమస్యలను ప్రవక్త (స) ప్రవచనాల వెలుగు లో సమీక్షించిన,అన్నీ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు లబించును. మానవ మహోపకారి, మహా ప్రవక్త (స) ఆధునిక సమాజానికి అసమాన మార్గదర్శకులుగా నిలిచిరి. అమీన్.



    

12 December 2013

దివ్య కొరాన్, హదీసుల వెలుగులో మిమ్మలి మీరు తెలుసుకోండి!


“తమలోని స్వార్ధాన్ని విడనాడినవారే నిజమైన  విజయులు”


         సజీవుడైన ప్రతి వ్యక్తి కి మనస్తత్వ శాస్త్ర అవశ్యత ఉంది. సాదరణంగా మనం మనస్తత్వశాస్త్రం ఏమంత  ఆవశ్యక మైనది కాదు, అది కేవలం కామన్సెన్స్(commonsense) మాత్రమే అని అనుకొంటాము.కానీ మనస్తత్వ శాస్త్ర పరిచయం మీ జీవితాన్నివిప్లవాత్మకంగా  మార్చును లేదా మంచి ఆరోగ్యకరమైన జీవితం గడపటానికి తోడ్పడును.  ఆత్మహత్య చేసుకోవాలని అనుకొన్న అనేక మంది, కొరాన్, హదీసుల వెలుగులలో ఆ భావనను వదిలి పూర్ణ జీవితాన్ని జీవించటానికి నిర్ణయించు చుకొన్నారు, అంతే కాదు ఆరోగ్యకరమైన మానసిక ప్రశాంతత కల్గిన అర్థవంతమైన జీవితాన్నిఅనుభవిస్తున్నారు.ఇస్లాం ఆత్మ హత్య ను వ్యతిరేకించును.  సమాజ వ్యతిరేకులుగా, విచ్చలవిడిగాతిరుగుతూ ,మత్తు పదార్దాలను సేవిస్తూ అనైతిక తిరుగుళ్ళు తిరిగిన అనేక మంది ఇస్లాం ప్రభావంచే తమ గత పాప చీకటి జీవితానికి స్వస్తి చెప్పి మంచి మనుషులుగా , నమాజీలుగా, దైవ ఆరాదకులుగా మారిన వైనం మనం ప్రత్యక్షం గా చూసాము అందుకు ముందు మనం  ఆ “అల్లహౌతాలా” కు కృతజ్నతలు తెలుపవలసి ఉంది.  అలహామ్దులిల్లా. ముందు నిన్ను నీవు తెలుసుకోవటం ద్వారా నీ జీవితం లోని అన్నీ రంగాలలో మార్పు తేవచ్చు. ఇతరులకు మరింత దగ్గిర అవవచ్చును. భార్యపిల్లలతో సంతోషం గా గడప వచ్చును,పిల్లలను మరింత బాగుగా పెంచవచ్చును, స్నేహేతుతలతో, ఇంటా-బయట అందరితో హాయిగా, ఆహ్లాదకరమైన జీవితం గడప వచ్చును.

         మనస్తత్వ శాస్త్రాన్ని తెలుసుకోవడము ద్వారా మనం మన జీవితపు   నూతన అంచులకు చేర వచ్చును. నీకు ఏది ప్రేరణ కల్పించును,ఏది భయాలను, ఫోబియాలను దూరంచేయును, ఏది నీకు భరోసా నిచ్చునో తెలుసు కొవడము ఎంత అందంగా ఉంటుంది? ఒక సారి ఆలోచించండి1 ఉదా: బాల్యం లో మనం నిద్రలోనో, చీకటిగా ఉన్నప్పుడో, లేదా ఒంటరిగా ఉన్నప్పుడో భయం గా ఉందంటే, మన తల్లి అల్లాహ్ ని తలచుకో భయం పోతుంది అంటుంది. అల్లాగే ఒక్కసారి మనం మన మనసు ఎవిదంగా పనిచేయునో తెలుసుకొన్న తరువాత  విజయానికి కావలసిన ప్రణాళికలను మనకు మనమే రూపొందించుకోవచ్చును. అల్లాహ్ యందు నమ్మక ముంచిన విజయము లబించును కాబట్టి నిర్ణయము తీసుకొని అల్లాహ్ అందు పరి పూర్ణ విశ్వాసము ఉంచిన తప్పని సరిగా విజయము లబించును.
 తన అందు విశ్వసముంచిన వారిని అల్లాహ్ ప్రేమించును”- దివ్య కొరాన్ 3:160

         ముందు నిన్ను నీవు తెలుసుకోవటం ద్వారా తరువాత   ఇతరులను తెలుసుకోవచ్చును. ఉదా: స్వయంగా  ప్రేరణ పొందటము , శరీర బరువును తగ్గిచుకోవడము, చెడు అలవాట్లను వదిలివేయడము, ఇతరులను క్షమించదము, కోపాన్ని జయించడము, ప్రణాళికా బద్దం గా జీవించడం లాంటి వాటిని సాదించడము ద్వారా ఇతరులకు నీ పట్ల గల ఆలోచన  మారును.
“తమ పరిస్థితులను తాము మార్చుకొని ప్రజలను అల్లాహ్ కూడా మార్చలేదు” దివ్య కొరాన్ 8:35 

        
మనస్తత్వ శాస్త్ర సహాయం తో స్వయం ప్రేరణతో పాటు, జీవిత సవాళ్లను కూడా ఎదుర్కోవడం నేర్చుకోవాలీ లేనియడల అనేక సార్లు వత్తిడితో గుండెపోటులను ఎదుర్కొన వలసి ఉంటుంది. నీలో ఉండే అంతరగిక పలుకులను(inner talk) ఆలకిస్తూ, నకారాత్మక ఆలోచనలను దూరం చేసుకొనవలి ఉంటుంది. సంతోషం ఇతరులనుంచి రాదు, మనలోనించే పుట్టాలి. నిన్ను నేవు ప్రేమించక పోతే ఇతరులు నిన్ను ఎందుకు ప్రేమిస్తారు? ముందు మనకు మనమే నాయకులం, ఆ తరువాతే ఇతరులకు నాయకులము. నిన్ను నీవు ప్రేమిస్తే, ఇతరులను కూడా ప్రేమించగలవు,వారితో సంతోషం గా కలిసి జీవించగలవు.
"అల్లాహ్ తను కోరిన వారికి దివ్యా జ్ఞానం ప్రసాదిస్తాడు. ఎవరికి దివ్యా జ్ఞానం లబించునో, వాస్తవంగా వారికి మహాభాగ్యం లబించినట్లే " దివ్యా కొరాన్ 2:269

         మనము సంతోషం గా ఉంటే దాన్ని మొదట గమనించేది మన కుటుంబము, మన స్నేహితులు. అప్పుడు వారితో నీ సంబంధ బాంధవ్యాలు మెరుగవును. మనలోని తప్పులను మనం గమనించి సరిదిద్దుకొన్న ఇతరులకు ఫిర్యాదు చేసే అవకాశమే లేదు. ఇతరుల దృష్టిలో మంచివానిగా, సహనశీలిగా,గౌరవనీయుడుగా పరిగణించబడతాము.ఇతరుల తప్పులను సహించటం అలవాటైన, మన ఆలోచనల లో సకారాత్మకమైన  మార్పు (positive thinking) వచ్చును. ఈ రకమైన మన ప్రవర్తన, మన స్నేహితులతో  , మన కుటుంబంతో  అత్యంత అవసరం. ఇతరులను మనస్ఫూర్తిగా ప్రేమించటం,ఇతరుల పట్ల  కరుణ చూపుటం , ఇతరుల తప్పులను క్షమించుటం  మంచితనమునకు, మంచి మాటలకు, తగాదాలను  దూరముచేయుటకు తోడ్పడును . నీ  కుటుంబ జీవితమును ఆహ్లాద పరుచును.
"దయతో కూడిన మాటలు, ఇతరుల తప్పులను క్షమించుట సదాకా (దానం) కన్నా మిన్న" -దివ్యా కొరాన్ 2:263
                   
          మనస్తత్వ శాస్త్ర సహాయం తో మన కుటుంబ  జీవితాన్ని మెరుగు పరచుకొన్నమనకు శాంతి, ప్రశాంతత, సంతోషం లబించి మన జీవితం సుఖంగా సాగును . అది  మన  కుటుంబ జీవితాన్ని కాపాడును. భార్యతో సత్సంభందాలు లేక పోవటం పిల్లలపై ప్రభావం కలుగ చేయును. వారి పెంపకం సరిగా సాగదూ. కాబట్టి మనము మనస్తత్వ శాస్త్ర సహాయాన్ని పొందుతూ, ప్రవక్త (స) జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని  మంచి తల్లి తండ్రులుగా మన బాద్యతలను నెరవేర్చవచ్చును. తన భార్యలతో, తన బిడ్డలతో, తన మనుమండ్ల లతో ప్రవక్త ఆదర్శ ప్రవర్తన మనకు సదా అనుసరణీయము.
"మీకు తెలియకపోతే జ్ఞాపిక కలవారిని అడగండి" -దివ్య కొరాన్ 16:43

         ఇస్లాం వెలుగులో, దివ్య కొరాన్ ప్రవచనాలతో,  ప్రవక్త భోదనలతో, మనస్తత్వ శాస్త్ర సహాయంతో మనం మంచి తల్లితండ్రులుగా మార వచ్చును. స్నేహితులతో, కుటుంబ వ్యక్తులతో సంబంధాలను మెరుగు పరచుకోవచ్చును.  ఇతరులకు చేరువ కావచ్చును, ఇతరులచే ప్రేమించబడ వచ్చును. చిన్న,చిన్న మెళుకువల ద్వారా, అల్లాహ్ యందు  సంపూర్ణ నమ్మకముంచుట ద్వారా పెద్ద విజయాలు సాదించ వచ్చును.  అమీన్.