30 January 2017

బైతుల్ హిక్మః ఎదుగుదల మరియు పతనం (The rise and fall of the Bayt-al-Hikmah)




ప్రవక్త(స) ముహమ్మద్ మరణం తరువాత మొత్తం  25 సంవత్సరాల లోపు అరబ్బులు, పర్షియా, సిరియా, ఆర్మీనియా మరియు మధ్య ఆసియా జయించారు. తూర్పు లో వారు ఇండస్ నది మరియు సింధ్ నది దాటినారు      పడమరలో ఈజిప్ట్ మరియు ఉత్తర ఆఫ్రికా అంతటా వ్యాపించి సముద్రాలు దాటి జిబ్రాల్టర్ చేరుకొన్నారు ఆ సమయంలో స్పెయిన్ కుడా జయించారు.

751 AD లో అరబ్బులు చైనీయుల నుండి కాగితం తయారి నేర్చుకొన్నారు. దీనితో  గ్రంద రచన మరియు గ్రంధ నిల్వ స్వభావం మారింది. ప్రపంచంలో గ్రంధాలయాలు స్థాపించటం ప్రారంభమైనది  మరియు అరబ్బుల అడుగుజాడలలో నడుస్తూ ప్రతిచోటా గ్రంధాలయాలు స్థాపించబడినవి. ఇతర సంస్కృతుల నుంచి లిఖిత ప్రతులు మరియు తాళపత్ర గ్రంధాలను అనువదించే కార్యక్రమం లో అరబ్బులు ఆసక్తిని ప్రదర్శించారు. ఖలీఫాల   జ్ఞాన సామ్రాజ్యంగా పిలువబడే ఇస్లామిక్ లైబ్రరీ భవనంకు  500 సంవత్సరాల చరిత్ర ఉంది. తొమ్మిదవ శతాబ్దం నాటికి, కార్డోబ మరియు స్పెయిన్ పండితులు కైరో, బోకోహర, సమర్ఖండ్  మరియు బాగ్దాద్ ల్లోని పండితులతో సంభందాలు ఏర్పరచుకొన్నారు. బాగ్దాద్! పెర్షియన్ "దేవుని బహుమతి"గా విలసిల్లినది.

ఖలీఫా మన్సూర్ కాలం లో  బాగ్దాద్ 762 AD లో స్థాపించబడినది. అతని  సామ్రాజ్యం అట్లాంటిక్ నుండి  భారతదేశం వరకు విస్తరించినది మరియు  అతను తన రాజధానిని  డమాస్కస్ నుండి బాగ్దాద్ కు మార్చినాడు. అతను అనేక మంది పరిశోధనకారులను మేదావులను ప్రోగుచేసి  ప్రపంచ ప్రఖ్యాత రచనలు అరబిక్ లోకి అనువదించడానికి శ్రీకారం చుట్టాడు. అనేకమంది నాన్ అరబిక్ పండితులు ఈ అనువాద కార్యక్రమం లో పాల్గొన్నారు.

అబ్బాసీయ వంశ  ఖలీఫాలు  సిరియన్, గ్రీక్, పెర్షియన్, యూదు, హిందూ మరియు అర్మేనియన్ అనువాదకులను ప్రోత్సహించారు.  మేధావులు, పండితులకు అనువాదం ఒక వ్యాపకంగా మారింది.   అనువాదం ఉన్నత జీవిత స్థితి యొక్క చిహ్నంగా మారింది మరియు అనువాదకులకు   బంగారo రూపేణా ప్రతిపలం చెల్లించటం జరిగేది. అరుదైన పత్రాలు మరియు పురాతన గ్రంథాలు ప్రాధాన్యత గల వస్తువులు గా మారినవి. ఉదాహరణకు, టోలెమి యొక్క అల్మగేట్  (Almaget) గ్రంధం  అబ్బాసీయ మరియు బైజాంటైన్ సామ్రాజ్యం మధ్య యుద్ధం తర్వాత శాంతి కోసం ఒక షరతు గా మారింది.  ప్రపంచంలో అత్యంత నాగరిక స్థలంగా శాస్త్రవేత్తలు, కళాకారులు మరియు పండితులు ద్రుష్టి లో  బాగ్దాద్ ఖ్యాతిని ఆర్జించింది.

తాళపత్ర గ్రందాల కొనుగోలు ప్రారంభం అయినది మరియు సంస్కృత బాష లోని ఒక గణిత పరిశోధన  బ్రహ్మసూత్ర (Bramhasphuta) సిధ్ధాంతo 8 వ శతాబ్దంలో అరబిక్ భాషలోనికి అనువదింప బడినది. పండితులు ప్రపంచం అంతట పర్యటించి ఖగోళశాస్త్రం, వైద్యం, తత్వశాస్త్రం మరియు సామాన్య  విజ్ఞాన శాస్త్ర  రాతప్రతులు ధనం ఖర్చు చేసి సేకరించసాగరు.  అరబ్ విజ్ఞాన శక్తీ ప్రపంచం అంతటా విస్తరించి సాగినది మరియు బాగ్దాద్ నగరం ప్రపంచం లోని అన్ని రకాల గ్రంధ సేకరణ కు నెలవయినది.

830 AD లో ఖలీఫా హరున్ అల్ రషీద్ కుమారుడు అల్ మమున్ బైతుల్ హిక్మః ( జ్ఞాన నిలయం) స్థాపించినాడు.జ్ఞానాభిలాషులు అందరికి ఇందులో ప్రవేశం గలదు. అనువాదకులు, శాస్త్రవేత్తలు, లేఖకులు, రచయితలు, నకలు చేసేవారు అందరు ఇక్కడ ప్రతి రోజు అనువాదం, సంభాషణ మరియు చర్చ కోసం కలుసుకునేవారు. అనేక శాస్త్రీయ విషయాలపై వివిధ భాషలలో మాన్యుస్క్రిప్ట్స్ తయారు చేయబడి వాటిని వివిధ భాషల నుండి అరబిక్ లోనికి  అనువదించ బడేవి.

బైతుల్ హిక్మః గ్రంధాలయ గోడలు అరబిక్, పర్షియన్, హీబ్రూ, అరామిక్, సిరియాక్, గ్రీకు మరియు లాటిన్ మరియు అప్పుడప్పుడు సంస్కృతంతో మారుమ్రోగేవి. అరిస్టాటిల్ తర్కం, విశ్వోద్భవo, విశ్వం, వైద్యం మరియు గణిత శాస్త్రాలు అందరు పండితులకు అందుబాటులో వచ్చినది. బైతుల్ హిక్మః లో  రూపొందించబడిన జ్ఞానం ఆ  తరువాత కార్డోబ మరియు టోలెడో ప్రాంతాలలో లాటిన్ లోకి తర్జుమా చేయబడేది. ఈ విధంగా పురాతన విజ్ఞానం సoరక్షించ బడినది.

ఫిబ్రవరి 10, 1258 న మంగోల్ నియంత హులగు ఖాన్ బాగ్దాద్ పై దండయాత్ర చేసి బాగ్దాద్ ను దోపిడీ చేసినాడు. బాగ్దాద్ పై దండయాత్ర మొత్తం ముస్లిం ప్రపంచం పై  దండయాత్ర అను ఖలీఫా యొక్క సందేశం ను  విస్మరిస్తూ, బాగ్దాద్ నగరాన్ని కొల్లగొట్టాడు. దేవుడు బహుమతి మరియు అనువాద రాజధాని అయిన బాగ్దాద్ సంపద కొల్లగోత్తబడినది మరియు బైతుల్ హిక్మః సర్వనాశనం చేయబడింది. వేలకొద్ది విద్యార్థులు, వైద్యులు మరియు పరిశోధకులు ప్రాణాలు కోల్పోయారు. రాజరికానికి గుర్తుగా మిగిలిన ఖలీఫా ఒక తివాచి లో చుట్టి గుర్రలచే త్రోక్కిoచబడి హత్య చేయబడినాడు.

మంగోలు సైన్యం  రాజభవనాలు, గృహాలు మరియు 36 గ్రంధాలయాలను  దోచుకోవడం జరిగింది. బైతుల్ హిక్మః దగ్ధమైంది. టిగ్రిస్ నది తాళపత్ర గ్రంధాల నల్లని సిరా తో మరియు పండితుల, అనువాదకుల  రక్తం తో  నిండి పోయినది. లైబ్రరీతో పాటు ఖగోళ పరిశోధనా కేంద్రాలు మరియు ఇతర ప్రయోగాత్మక కేంద్రాలు అనువాద గ్రంధాలు అన్ని నాశనం అయినవి.

హులగు ఖాన్ వారసులు ఆ తరువాత ఇస్లాం స్వీకరించి విజ్ఞానం, కళల  విలువ గ్రహించినారు.



15 January 2017

మహిళ-ఇస్లాం-21వ శతాబ్దం (Women, Islam, and the Twenty-first Century)





చారిత్రాత్మకంగా ఇస్లాం యొక్క వ్యాఖ్యానం ఎల్లప్పుడూ మగవారికి అనుకూలంగా ఉంది. ఇస్లాం స్వికరించినది మొదట వ్యక్తి మహిళ అయినప్పటికీ (ముహమ్మద్ ప్రవక్త (స) యొక్క మొదటి భార్య ఖదీజా), మరియు మహిళలు హదీసు(సూక్తులు మరియు ప్రవక్త ముహమ్మద్ పనులు) విద్య అభివృద్ధి అందు   మరియు సూఫీవాదం  అభివృద్ధిలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించినప్పటికీ, స్త్రీలు గ్రంధాలు, న్యాయము మరియు నాయకత్వ పాత్రలో మరియు బహిరంగ  ఆరాధన లో  మగవారి కన్నా  వెనుకబడి ఉన్నారు.  కానీ ఇటీవల కాలంలో ఈ పరిస్థితి  మార్చబడింది.

ఇరవయ్యో శతాబ్దంలో అక్షరాస్యత వ్యాప్తి మరియు    బాల బాలికలకు ప్రభుత్వ విద్యా సౌకర్యం లబించుట,  మహిళలకు ఉద్యోగ అవకాశాల విస్తరణ మరియు పెరుగుతున్న మత మార్పిడిలు ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో నుండి ఇస్లాం స్వీకరించే వారి సంఖ్య లో పెరుగుదల,  విశ్వాసం యొక్క సాధన మరియు వ్యాఖ్యానాలలో ఎక్కువ సాధికారత కొరకు  ముస్లిం మహిళలు ముందు ఉన్నారు.  ముస్లిం మహిళలు విడిగా మరియు సమూహంగా జీవితం యొక్క ఇతర రంగాల్లో వారి విశ్వాసం, సృజనాత్మక, మరియు యాజమాన్యం పరంగా  తమ సామార్ధ్యం నిరుపించుకొన్నారు.

సరైన మతపరమైన శిక్షణ సౌకర్యాలు చేరుకోవడం లో తరచూ పురుష ఆధిపత్యంను ఎదుర్కొంటునప్పటికి నేటి  ముస్లిం మహిళలు దివ్య ఖురాన్ స్టడీ సర్కిల్స్, మసీదు-ఆధారిత కార్యకలాపాలు, మత సంస్థలు పోషించే సమాజ సేవలు, మరియు ఇస్లామిక్ విద్యా లో విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల వలె చురుగ్గా ఉన్నారు. ఖురాన్ పారాయణం (Reciters) చేసేవారు, ఇస్లామిక్ న్యాయవాదులు మరియు ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ స్టడీస్ లో ఆచార్యులు గా ముస్లిం మహిళలు  పెరుగుతున్నారు.  కొన్ని మత సంస్థలలో  గణనీయమైన స్థానాలు పొందినప్పటికీ గ్రాండ్ ముఫ్తీ లేదా ఆయతుల్లా  వంటి ఉన్నత మత స్థానాలు  ఇస్లామిక్ మహిళలు సాధించలేదు.  
సమకాలీన ముస్లిం మహిళ మతపరమైన జీవితానికి చెందిన  మూడు కీలక అంశాలపై: దివ్య ఖురాన్ పారాయణం, బోధన లేదా ఖురాన్ వివరణ మరియు నమాజ్ అందు పాల్గొనుట దానికి నాయకత్వం వహించుట మరియు ఇస్లామిక్ చట్టం ను వివరించడం పై ద్రుష్టి పెట్టింది. ఈ చర్చల్లో కొన్ని సాంప్రదాయిక మరియు కొన్ని అబ్యుదయ శక్తులు స్త్రీ-పురుష సమానత్వం మరియు కొందరు స్త్రీ-పురుషుల కొరకు కొన్ని ప్రత్యెక స్థానాల కొరకు తమ వాదన వినిపించ సాగినారు. ఈ చర్చలు  ఇరవై ఒకటో  శతాబ్దంలో ఇస్లాం ను నిర్వచించడంలో అత్యంత ముఖ్యమైనవి గా  ఉన్నాయి.

దివ్య ఖురాన్ పారాయణం, భోదన మరియు అర్థ వివరణ- స్త్రీలు:   (Role of women in Reciting, Teaching, and Interpreting the Holy Qur'an)

సమకాలీన మరియు పడమటి ప్రపంచం లో దివ్య ఖురాన్ వ్యాఖ్యానం లో ముస్లిం మహిళల  ప్రవేశం ఇరవై శతాబ్దం మొదట్లో ప్రారంభమైనది. 1909 ఈజిప్టు ఉద్యమకారిణి మలక్ హిఫ్ని అల్-నసిఫ్ (బహితాట్ అల్-బడియ   లేదా ఎడారి అన్వేషకురాలు) బాలికల కొరకు దివ్య ఖుర్ఆన్, సున్నతుల బోధన, మాధ్యమిక విద్య అందు ప్రవేశం, నిశ్చితార్థం మరియు వివాహం లో షరియత్ అమలు కోసం ఒక 10-అంశాల కార్యక్రమాన్ని ప్రతిపాదించారు. నసిఫ్ తరువాత నమాజ్ కొరకు మహిళలు హాజరు కావడానికి మసీదు స్థలం అభ్యర్థించింది.

 1937/1938 లో జైనాబ్ అల్-ఘజాలి ముస్లిం లేడీస్ అసోసియేషన్ ను సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించడానికి ఏర్పరిచినది. అయితే అది క్రమంగా దావా(మత ప్రబోధం)  మరియు ఇతర మహిళలకు  మత సూత్రాలు  నేర్పే శిక్షణ సంస్థగా విస్తరించింది. ఖురాన్ మరియు హదీసులు లో మహిళల కు శిక్షణ ఇవ్వబడినది. అల్-ఘజాలి ఖురాన్ పై వ్యాఖ్యానాలు మరియు హదీసులు ప్రచురించిన మొట్టమొదటి సమకాలీన గౌరవనీయమైన మహిళా వ్యాఖ్యాతల లో  ఒకరిగా వెలుగొందుతుంది. ఆమె 2005 లో మరణించింది.

అదేవిధంగా ఇండోనేషియా లో  మహిళలు ఇరవయ్యో శతాబ్దం ప్రారంభం నుంచి దివ్య ఖురాన్ అధ్యయనం కొరకు  ప్రోత్సహిoప బడినారు.  ముస్లిం మహిళల అతిపెద్ద జాతీయ సంస్థగా 1917 లో ఇండోనేషియా లో స్థాపించబడిన “ఆసియా” దివ్య ఖురాన్ అధ్యయనం మరియు   మహిళల ఆర్ధిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు మరియు వారికి  కనీస మానవ హక్కులు కల్పించేందుకు కొన్ని ప్రోగ్రాములు రూపొందించినది. ముస్లిమాత్ నడ్లతుల్ ఉలేమా (Muslimat Nahdlatul ulemaa) సంస్థ  చట్టపరమైన సమస్యల పై  దృష్టి సారించడం తో బాటు మహిళల ఆర్ధిక పరిస్థితి మెరుగుపరిచేందుకు  1946 లో స్థాపించబడింది.

నేడు ఇండోనేషియా లో  మహిళల ఇస్లామిక్ స్టడీస్ నైపుణ్యాన్ని పెంచటానికి అనేక పాసెంట్రెన్లో (ఇస్లామిక్ బోర్డింగ్ పాఠశాలలు) కలవు. వీటిలో దివ్య ఖురాన్ పారాయణ నైపుణ్యం అనేక మంది  స్త్రీలకు ఇవ్వబడుతుంది.  మలేషియా కౌలాలంపూర్ లో జరిగిన దివ్య  ఖురాన్ పఠనం లో జరిగిన అంతర్జాతీయ పోటీ(1980)  అందు తొలి మహిళ విజేతగా నిలిచిన మరియా ఉల్ఫః  అలాగే ఇస్లామిక్ ఇమామ్స్, ఇస్లామిక్ స్టడీస్ లో నైపుణ్యం కల ఇస్లామిక్ మేథావులు, మరియు ఇస్లామిక్ చట్టం మరియు వివరణ (షరియత్ మరియు ఫిక్) అందు ప్రముఖులైన మహిళలు  ఈ పాఠశాలల అందు  జ్ఞానము పొందినవారే. ఇస్లామిక్ జ్ఞానము వచ్చేతరం వారికీ అందించడం కోసం పాసెంట్రెన్లో (ఇస్లామిక్ బోర్డింగ్ పాఠశాలలు)అందు వేలాది మహిళలకు శిక్షణ ఇవ్వబడుతుంది. 
ముస్లిం ప్రపంచం అంతటా దివ్య ఖురాన్ పై  వ్యాఖ్యానం ఇవ్వడంలో స్త్రీలకు శిక్షణ ఇవ్వబడుతుంది.  ఆఫ్రికన్-అమెరికన్ విద్వాంసురాలు ఆమినా  వదూద్ సృష్టి మరియు మతపరమైన బాధ్యతల పరంగా పురుషుల తో  మహిళా సమానత్వం ధృవీకరిస్తూ మతపరమైన రచనలు చేసింది.
ఇస్లాం లో పొందుపరచబడిన గౌరవం, సమానత్వం, న్యాయం, స్వేచ్చ సూత్రాల ఆధారంగా పనిచేసే “సిస్టర్స్ ఇన్ ఇస్లాం” అనే గ్రూప్ ను 1993 లో మలేషియా లో స్థాపించినారు మరియు ప్రజాస్వామ్య బద్దంగా ఈ సూత్రాలను మానవ సమానత్వం  మరియు స్త్రీల రక్షణ రంగం లో వినియోగించుచున్నారు. దివ్య కొరాన్ సూత్రాల  ఆధారంగా లింగ రహిత సమానత్వ సమాజంను ఏర్పర్చుటకు ప్రయత్నిస్తున్నారు. స్త్రీల శోషణ, స్త్రీల పట్ల హింస, స్త్రీల గౌరవం తగ్గించే సూత్రాలను ఇస్లామిక్ కాని పద్దతులుగా సిస్టర్స్ ఇన్ ఇస్లాం గ్రూప్ భావిస్తుంది.      దివ్య కొరాన్ కు వ్యతిరేకంగా లింగ విచక్షణ చూపే పద్దతులను విశ్వాసాలను ఇస్లామిక్ సిస్టర్స్ సంస్థ వ్యతిరేకిస్తుంది.
2007 లో ఇరానియన్-అమెరికన్ విద్వాంసురాలు లెలెహ్ బక్తియార్ దివ్య ఖురాన్ ను ఆంగ్లంలో అనువదించినది. పాకిస్తానీ-అమెరికన్ అస్మా బర్లస్ సమానత్వం అనుకూలంగా ఇస్లాం లో పితృస్వామ్య భావన తొలగించడం పై దృష్టి పెట్టినది. సిరియన్-అమెరికన్ నిమాట్ హఫెజ్ బరజంగి ఇస్లాం లో వ్యక్తులు  అలాగే ఒక కమ్యూనిటీ సభ్యులు గా మహిళలు యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసినది మరియు దైవభక్తి (తఖ్వా) ఆధారంగా  మహిళలను గుర్తించాలని పేర్కొన్నది. ఈ వివరణ అల్లాహ్ మానవుల మధ్య తేడా (లింగ, జాతి, లేదా పుట్టినది కాక)  (దివ్య ఖురాన్ 49:13) తఖ్వా స్థాయిలో చూపుతాడు అని స్పష్టం చేసినది. అలాగే మొరాకో సామాజికవేత్త ఫాతిమా మేర్నిసిని వoటి  కొంతమంది స్త్రీల అసమానతను చూపే కొన్ని హదీసులను వ్యతిరేకిoచినారు.
నమాజ్(ప్రార్ధన) లో లింగ సమానత్వం:( Gender Inclusiveness in Public Worship)
కొంతమంది  ముస్లిం మహిళలు మసీదు పై పురుషుల ఆధిక్యతను ప్రశ్నించారు. పురుషుని తో కలసి స్త్రీ నమాజ్ అందు పాల్గొనుట మరియు నమాజ్ కు నాయకత్వం నిర్వహించుటకు  చారిత్రికంగా ఉదాహరణలు చూపారు. దక్షిణాఫ్రికా ముస్లిం మహిళలు1980 లో ముగిసిన అన్నిరకాల  జాతి, లింగ,వర్ణవివక్ష, అణచివేతను ఉదాహరణ గా చూపారు. దక్షిణ ఆఫ్రికన్ ఇస్లామిక్ లిబరేషన్ థియాలజీ ప్రార్ధన, నాయకత్వం పాత్రలు మహిళల కు ఇవ్వడంను గుర్తుచేశారు. మొదట్లో అనగా 1990 లో స్త్రీ-పురుషులు కలగలిసిన ప్రార్థనలను మహిళలు నడిపించారు ఖుత్బా (శుక్రవార ఉపన్యాసంలో) వినిపించారు.  ప్రవక్త(స) ముహమ్మద్ ద్వారా నియమితులైన ఉమ్మె వరకా ఇమామా  ను(imamah -స్త్రీ ప్రార్థన నాయకురాలు) ఉదాహరణగా పేర్కొనారు. మహిళలు మసీదులో పురుషులు కలిసి ప్రార్థన చేయడం లో వారి హక్కు ను ఉద్ఘాటించినారు.
1994 లో దక్షిణ ఆఫ్రికా లో స్త్రీలు ఇమామా (imamah ప్రార్థన నాయకురాలు) మరియు ఖుత్బా khatibah (శుక్రవారం ఉపన్యాసం బోధకురాలు )విధులు నిర్వహించగా  అమెరికన్ ముస్లిం విద్వాంసురాలు ఆమినా  వదూద్ ఆమె న్యూ యార్క్ సిటీ లో2005 లో ఇమామా మరియు ఖుత్బా బాద్యతలు నిర్వహించారు.  2006 లో బోస్టన్లో ఆశ్రా నోమాని, కేసియా అలీ  స్త్రీ కాజి గా వివాహనిర్వాహణ బాద్యత నెరవేర్చారు. 
మొరాకో మరియు టర్కీలో 2006 సంవత్సరంలో స్త్రీలను ఇమాంలుగా నియమించారు.  టర్కీలో మత సంబంధమైన వ్యవహారాల డైరెక్టరేట్ (Diyanet) ఇమాంలుగా 250 మంది మహిళను నియమించి వారిని రాజ్య అధికారులుగా గుర్తించినది మరియు హదీసులు నుండి స్త్రీ అసమానత్వం ను తొలగించినది.
ఇస్లామిక్ లా-(షరియా)  వివరణ (Interpreting Islamic Law(shariyaa)
ముస్లిం మహిళలకు అత్యంత వివాదాస్పదమైన సమస్యలలో ఒకటి ఇస్లామిక్ చట్టం (షరియత్) మరియు దానిలో మార్పులు. ఇవి  మహిళల ఆచరణాత్మక హక్కుల విస్తరణకు అవరోధంగా మారినవి. ఫత్వా జరిచేసే ముఫ్తీ లేదా న్యాయమూర్తి పదవులు పురుషుల కు మాత్రమే ఉన్నది.  కొందరు మహిళలు ఈ స్థానం సాదించాలని  కోరుకుంటారు. ఉదాహరణకు, 2006 లో, ముస్లిం సొసైటీ ఫర్ అడ్వాన్స్మెంట్ మహిళల హక్కుల కోసం ఒక మహిళల షూరా (అడ్వైజరీ) మండలి ఏర్పాటు చేయలంది. మహిళలు పండితులు ఎంపిక చేయబడిన కోర్ గ్రూప్ కొన్ని న్యాయపరమైన అంశాలను పరిశీలింఛి చివరికి  మెజారిటీ అభిప్రాయం కొరకు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయబడుతుంది.ఉదా: మసీదులో దుస్తులు, సమానత్వం, స్త్రీ ఇమాములు, గౌరవ హత్యలు మరియు పాకిస్తాన్, ఇరాన్, సౌదీ అరేబియా, నైజీరియా వంటి దేశాల లో అమలులో ఉన్న హుడుద్( hudud ) శాసనాలు. ఈ శాసనాలలో  జినా మరియు అత్యాచారం (rape) వచ్చును.
మరొక అమెరికన్ ఆధారిత సంస్థ కరమః(Karamah). ఇది  ఈజిప్టు-అమెరికన్ విద్వాంసురాలు అజియా అల్-హిబ్ర  ద్వారా 2004 లో స్థాపించబడింది. ఇది షరియా అములు లో లేని దేశాలలో  షరియా సమతుల్యoగా అమలు చేసే పని లో ఉంది. మహిళలపట్ల  వివక్ష లేదా తేడా చూపే ధోరణి ని మార్చి శాస్త్రీయ మూలాల ఆధారంగా లింగ సమాన ఇస్లామిక్ ధర్మ అభివృద్ధి చేయడం కోసం దేశీయంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ముస్లిం మహిళల హక్కులను మద్దతు తెలపడానికి  ముస్లిం మహిళల న్యాయ నిపుణులతో కూడిన ఒక అంతర్జాతీయ నెట్వర్క్ఏర్పాటు చేసింది. ఇందులో  లింగ-పాక్షిక చట్టాలకు  కొత్త భాష్యం డిమాండ్ చేసే విద్యావేత్తలు, న్యాయవాదులు ఉంటారు.  2004 నుండి కరమః (Karamah) వివాహం మరియు విడాకుల చట్టాలు, పిల్లల కస్టడీ, విద్య, రాజకీయ పాల్గొనడం, గృహ హింస, ఆర్ధిక, మరియు వారసత్వం హక్కులు మొదలగు కీలక అంశాలను చర్చింది.
సౌదీ అరేబియా మరియు ఇరాన్ వంటి సంప్రదాయవాద దేశాలలో సైతం  ఇస్లామిక్ న్యాయ వ్యవస్థలో మహిళల పాత్రను  విస్తరించాయి. సౌదీ అరేబియాలో సాంఘిక వ్యవహారాల మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన  మహిళలు   పురుష న్యాయమూర్తులకు  సలహాదారులు గా  పిల్లలకు సంబంధించిన అన్ని విచారణలు మరియు కోర్టు కేసులకు  హాజరు ఆవుతారు. ఇస్లామిక్ చట్ట ప్రకారం  సాధారణంగా ఏడు సంవత్సరాల వయస్సులో ఉన్న బాలుడు,  తొమ్మిది ఏళ్ల వయసు అమ్మాయి బాద్యత తండ్రికి అప్పచేప్పుతారు. కాని భర్త కు గృహ హింస చరిత్ర ఉన్న లేదా డ్రగ్ లేదా మద్యంకు బానిస అయిన  అభారం స్త్రీకి అప్పజెప్పమని సౌదీ మహిళలు కోరుతున్నారు.  తమ ఆర్థిక హక్కులు దెబ్బతినకుండా వారు విడాకులు కోసం దాఖలు చేసిన సందర్భాలు కూడాఉన్నాయి.
అదేవిధంగా ఇరాన్ లో మహిళలు న్యాయస్థానం లో ఉద్యోగులుగా,సలహాదారులుగా, న్యాయవాదులు గా పనిచేయడానికి అనుమతించబడతారు. మాజీ న్యాయమూర్తి మరియు 2005 నోబెల్ శాంతి బహుమతి విజేత షిరిన్ ఇబాడిఅందుకు ఉదాహరణ.  న్యాయ మీమాంస అధ్యయనం కొరకు ప్రత్యేకంగా  మహిళలకు ఒక వేదాంత కళాశాల ఏర్పాటు చేయబడినది.  జమాత్  అల్-జహ్రా లో ఇరాన్ మహిళలు షియా న్యాయశాస్త్రం అబ్యసించవచ్చు. ఇస్లాం ఆధారిత వివాహం మరియు విడాకుల చట్టాలలో మార్పులు మరియు  మహిళల హక్కుల విస్తరణకు పూనుకొన్నారు.  
ముగింపు:
ఇస్లామిక్ చర్చలలో  స్త్రీలగొంతు వినిపించుటకు ప్రయత్నాలు జరిగినప్పటికీ ముఖ్యంగా ఖురాన్ పాఠాలు మరియు ఆమోదించబడిన సంప్రదాయవాద వివరణల విషయం లో  సవాళ్లు స్పష్టంగా ఉన్నాయి. ముస్లిం మహిళలు విజయవంతంగా నెట్వర్క్ రూపొందించుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ముస్లిం మహిళలతో సంభాషణలు జరుపుతూ, సహాయం పొందుతున్నారు.  అయితే ఇస్లామిక్  స్త్రీలు పురుషులతో పాటు సమానంగా వ్యాఖ్యాతలుగా అంగికరించ బడుట అనేది అవసరం. అనేక ముస్లిం పురుషులు దీనికి మద్దతు తెల్పుతూ 21వ శతాబ్దం లో ఇస్లాం అభివృద్ధి చెందుటకు   ఇస్లాం లోపల దీనిని ప్రోత్సహిస్తున్నారు.


14 January 2017

ఆహార పదార్ధాలు హాలాల్ మరియు హారాం








ఆహారం మానవుల మరియు జంతువుల ప్రాథమిక అవసరాలలో ఒకటి మరియు  ఆహారం లేకుండా  ఏ జీవి జీవించడం  అసాధ్యం. కానీ ఆహార వినియోగం లో మానవులకు  మరియు జంతువులకు  మధ్య భారీ వ్యత్యాసం ఉంది.  జంతువుల వలే కాక   మానవులు ఆహారాన్ని భుజించడం లో కొన్ని నియమాలు, నిబంధనలు మరియు పరిమితులు అనుసరిస్తారు. ఇస్లాం దానిని నమ్మిన విశ్వాసుల  కోరకు ఆహార వినియోగం కొరకు కొన్ని నియమాలు, నిబంధనలు మరియు పరిమితులు ఏర్పరిచింది. నిషిద్ధం కానివి  (హలాల్) మరియు నిషిద్ధమైనవి  (హరం ) మద్య ఒక స్పష్టమైన వ్యత్యాసం ను ఏర్పరిచింది.  కానీ ఆహార పదార్దాలు విక్రయించే దుకాణాలు ప్రస్తుత మార్కెట్లో ఇస్లాం ద్వారా ఏర్పరచిన నియమాలు, నిబంధనలు మరియు పరిమితులు నిర్వహించుట  లేదు. ఇస్లామిక్ బోధనలు యొక్క కాంతి లో మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆహార వస్తువులను  విశ్లేషించుదాము.

మీరు  వినియోగించే పదార్ధాలు ఏమిటి? అవి  ఎలా ఉత్పత్తి అవుతాయి? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం  ప్రయత్నిద్దాము. వినియోగదారులకు కర్మాగారాలు మరియు సంస్థలు అందించిన ఆహార వస్తువుల గురించి ప్రజలకు అవగాహన కల్పించటానికి ఒక మంచి ప్రయత్నం చేద్దాము. ఆహార పదార్ధాలు ఉత్పత్తి మరియు తయారీ లోకి వెళ్ళి పరిశిలించుదాము. ఆహార పదార్ధాలలో మిక్కిలి గా వాడబడే ఆగ్రిగేత్స్ అండ్ అడ్డిటీస్ (aggregates and additives) పరిశీలించుదాము. కొన్ని ఆహార పదార్ధాల ఉత్పత్తిలో  నిషిద్దం మరియు దాగి ఉండి వస్తువుల గురించి  వినియోగదారులకు జ్ఞానం కల్పించుదాము.

వినియోగించే వస్తువుల ఉత్పత్తిలో ఇస్లామిక్ బోధనలు ద్వారా రుపొందించబడిన నియమాలు మరియు నిబంధనలు తెలుసు కొందాము. వినియోగ వస్తువుల తయారీ లో వాడబడే అక్రమాలను  అన్-ఇస్లామిక్ మరియు అనైతిక మార్గాలను తెలుసుకొందాము. ఇస్లాం ఆహార ప్రయోజనం కోసం వినియోగించే  ఒక జంతువు ఖుర్బానీ కోసం కొన్ని నిబంధనలను విధించింది. కానీ కొన్నిసార్లు ఈ నియమాలు పెద్ద హోటళ్లు అనుసరించటలేదు లేదా ఇస్లాం చే నిషేధించబడిన వాటిని ఆహార వస్తువుల ఉత్పత్తి మరియు వినియోగం లో ఉపయోగిస్తారు. ఉడా:చూయింగ్ గమ్, మిఠాయి, జామ్, పండు రసం, ఐస్ క్రీమ్, గుళికలు మరియు ప్రోటీన్ షాంపూ, మొదలైన వాటిని  జెలటిన్ తో తయారవుతాయి. "జెలటిన్ పందులు, ఇతర పశువుల చర్మం మరియు స్నాయువుల నుంచి ఉత్పత్తి చేస్తారు. కాబట్టి అవి ఇస్లాం దృష్ట్యా హరం.

ఇస్లామిక్ బోధనల ప్రకారం వినియోగ వస్తువులు మూడు రకాలు: 1.అనుమతించబడినవి  (హలాల్), 2. నిషేదింపబడినవి (హరం ) మరియు 3.అనుమానాస్పదంగా ఉన్నవి. పవిత్ర ఖురాన్ ఆదేశాల ప్రకారం హలాల్ మరియు హరామ్ అల్లాహ్ ప్రకటించారు. ఎవరికి అందులో  జోక్యం చేసుకొనే  హక్కు లేదు. కొన్ని సందేహాస్పద అంశాలు ఉన్నాయి. అవి హరం లేదా హలాల్ అని స్పష్టం కాదు. ఈ అంశాలను గురించి కొన్ని పరిశోధనలు  మరియు అధ్యయనం అవసరం.

ఇస్లాం హరం అని ప్రకటించిన ఆహార వస్తువుల లో ఆధ్యాత్మిక మరియు హేతుబద్ధ కోణం ఉంది. ఉదాహరణకు పంది ని హరం అని నిర్ణయిoచేందుకు శాస్త్రీయ మరియు ఆరోగ్య కారణాలు ఉన్నవి. అదేవిధంగా ఆరోగ్యానికి మంచివి కానివి మరియు హాని కల్గించి మానవుల మరణానికి కారణం అవుతున్న కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇస్లామిక్ బోధనల ప్రకారం వాటిని హరం గా ప్రకటించి వాటి వినియోగం వలన కలిగే దుష్పరిణామాలను పేర్కొనాలి.

మనం తినే వాటిని గురించి తెలుసుకోవడం  అవసరం.  స్వచ్ఛమైనదా లేదా? హలాల్ లేదా హారామా? అది ఆరోగ్యానికి మంచిదా లేదా? మన ఆరోగ్యాన్ని మన ఆత్మ ప్రభావితం ను ప్రభావితం చేస్తుందా" మనం తినే ఆహార శుభ్రత పై మన  శరీరం మనస్సు మరియు ఆత్మ యొక్క పరిశుభ్రత ఆధారపడి ఉంటుంది." వినియోగించే ఆహార పదార్ధాల గురించి సునిశిత మరింత అధ్యయనం చేయాలి.


హలాల్ గా నిర్ణయిoచబడిన ఆహార పదార్ధలనే తినాలి, హారం వస్తువులను వదిలి పెట్టాలి. 

12 January 2017

ఇండో-మలయా ప్రాంతం లో ఇస్లాం వ్యాప్తి- చారిత్రిక పరిశిలన (Spread of Islam in the Indo-Malay region – A Historic Overview)




చరిత్రకారులు ఇస్లాం వ్యాప్తి లో ఇండో-మలయా  ప్రాంతం ను పూర్తిగా నిర్లక్ష్యం చేసినారు.  ఇండోనేషియా మరియు మలయా ప్రాంతంలో ఇస్లాం వ్యాప్తి లేదా ఇస్లాం ప్రచారం కోసం శక్తి లేదా దండయాత్రల ఉపయోగం జరగ లేదు. ఇండోనేషియా జనాభా పరంగా ప్రపంచంలో నాలుగవ అతి పెద్ద దేశం మరియు మలేషియా గొప్ప ఆర్థిక మరియు రాజకీయ శక్తి కలిగిన జాతిపరమైన వైవిధ్య దేశం.  మధ్యయుగంలో ఒక క్లుప్తమైన చారిత్రక నేపథ్యం రాజకీయ నిర్మాణ వ్యవస్థ కలిగిన  ఇండో-మలయా ప్రాంతంను అద్యయనం చేయడం చాలా  ముఖ్యం.
ఈ ప్రాంతములో ఎనిమిదవ మరియు పదహారవ శతాబ్దం మధ్య ఉనికిలో ఉన్న రాజ్యాలు మరియు సామ్రాజ్యాలకు  సంబంధించిన వివరాలు ఖచ్చితంగా ఉన్నాయి.  అలాగే ఈ ప్రాంతంలో ఉన్న విబిన్న రాజవంశాలు మరియు సామ్రాజ్యాలు మరియు  ఇస్లాం వ్యాప్తి కి సంభందించిన సమాచారo స్పష్టంగా లబిస్తుంది.  
నేడు అందుబాటులో ఉన్న చారిత్రాత్మక ఆధారాల ప్రకారం సుమత్రా, జావా మరియు ఇతర ప్రాంతాలలో వ్యాపించి ఉన్న  13000 ద్వీపాలు లేదా అందమైన ద్వీప సమూహం యొక్క వేర్వేరు భాగాలు మధ్యయుగ కాలంలో అనగా ఏడవ మరియు పద్నాలుగో శతాబ్దం లో  అనేక హిందూ మరియు బౌద్ధ సామ్రాజ్యాల పాలనలో ఉన్నాయి.   పదిహేనవ శతాబ్దం ప్రారంభంలో ముస్లిం సుల్తానుల యొక్క పెరుగుదల ఈ ప్రాంతం చూసినది. ఇండో-మలయా  ప్రాంత మధ్యయుగ చరిత్ర యొక్క మొదటి భాగం ఏడవ శతాబ్దములో స్థాపించబడిన బలీయమైన శ్రీవిజయ రాజవంశం నుండి మొదలై 1511 AD లో పోర్చుగీసు నౌకాదళం చే  ఓటమి పొందిన తొలి పదహారవ శతాబ్దం ప్రారంభంలో ఉన్న  మలేకా సుల్తానేట్ అంతం తో అగుతుంది.  
ఆసక్తికరంగా మలక్కా సల్తనత్ పాలకులు మొత్తం సుమత్రా ప్రాంతాన్ని పాలించిన శ్రీవిజయ రాజవంశం యొక్క ప్రత్యక్ష వారసులు మరియు వారు  జావా ద్వీపాల మీద రాజకీయ మరియు సైనిక ప్రభావాన్నిచూపారు.  1292 AD లో శ్రీవిజయ సామ్రాజ్యం దక్షిణ భారతదేశం పాలించిన చోళ సామ్రాజ్యం దాడులు కారణంగా బలహీనపడింది మరియు జావా ద్వీప పాలకులు సింఘాసరి రాజవంశం యొక్క కీర్తనేగార పాలనలో పతన మైనది.
పరాజయం పొందిన శ్రీవిజయ రాజవంశం యొక్క రాకూమారులలో  ఒకరు 1323 AD లో సింగపూర్ స్థాపిoచాడు మరియు దానిని ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా, నౌకాశ్రయంగా అభివృద్ధి పరిచాడు. ఆ సామ్రాజ్యం పద్నాలుగో శతాబ్దం మూడు వంతులవరకు కొనసాగింది  మరియు 1400 AD లో అది మజాపహిట్ సామ్రాజ్యం చే కూలదోయబడినది.  మజాపహిట్ సామ్రాజ్యం 1293 AD లో మంగోలుల సహాయంతో సింఘసరి రాకూమారుని ద్వారా స్థాపించబడినది.   సింగపూరా సామ్రాజ్యం ఆఖరి రాజు ఇస్కాందర్ షా గా పిలువబడే పరమేశ్వర తరువాత వెస్ట్ మలయా తీరానికి పోయి అక్కడ 1299 AD లో ప్రసిద్ధ మలక్కా సల్తనత్ ను ఏర్పాటు చేసారు. వరుస సుల్తానుల పాలనలో అది సింగపూర్ తరహాలో  ప్రగతిపథంలో విజయవంతంగా నడిచి ఒక వర్తక కేంద్రంగా వర్దిల్లినది. సియమీస్ దాడులను నిరోధించినది.
అంతర్గత పోరాటం మరియు శత్రువుల దాడుల కారణంగా మజాపహిట్ సామ్రాజ్యం యొక్క శక్తి మరియు ప్రభావం తగ్గినది  మరియు పదిహేనవ శతాబ్దం మధ్యలో దాని ఐదవ పాలకుడు ముజాఫ్ఫెర్ షా కాలంలో సామ్రాజ్యo లోని   అనేక భాగాలను మలక్కా సల్తనత్ ఆక్రమించారు. పదహారవ శతాబ్దం ప్రారంభం లో  మజాపహిట్ రాజవంశ పతనం సంభవించి  రాదేన్ పతః చే స్థాపించబడిన డెమాక్ సుల్తాన్ మార్గం నకు సుగమమైంది.
పోర్చుగీసు వారు పదిహేనవ శతాబ్దం ప్రారంభoలో సుగంధద్రవ్యాల వ్యాపారం  ప్రారంభించారు మరియు వ్యాపారం లో విఫలమైన వారు గోవాలో ఉంచ బడ్డ నావికా బలగాలను మలక్కా పంపించారు మరియు 1511 AD లో మలక్కా సల్తనత్ పోర్చుగల్ బలగాలు ఎదుర్కొటంలో  విఫలమై పతనమైనది.  పదహారవ శతాబ్దం ప్రారంభంలో మలేకా సుల్తానేట్ పాలన అంతరించిన తరువాత వివిధ స్థానిక సంస్థానాలు, తెగల  అధిపతులు  పోర్చుగల్ బలగాల మద్దతుతో స్థానిక ప్రాంత ఆదిపత్యం కోసం వేసిన పధకాలు పలించలేడు మరియు ఆ ప్రాంతం అంతర్గత పోరాటాల మద్య  చిక్కుకుంది.
పోర్చుగీసు వారు కూడా ఆ ప్రాంతంలో పూర్తి నియంత్రణ సాధించడంలో విఫలమైనారు మరియు వారు  డచ్ దళాలతో  నిరంతరం వైరంతో వ్యవహరించారు. డచ్ దళాలు వ్యాపార మరియు సైనిక స్థావరాలు అక్కడ స్థాపించారు. 1800 AD లో ద్వీపసమూహం యొక్క ప్రధాన భాగాలు డచ్ కాలనీ వలె మారినవి మరియు 2వ ప్రపంచ యుద్ధం సమయంలో ఆ ప్రాంతం జాపనీస్ దళాల ఆధీనంలోనే వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, ఇండోనేషియా స్వాతంత్ర్య ఉద్యమం ప్రారంభించింది మరియు 1949 లోస్వాతంత్ర్యం పొందినది..
శ్రీవిజయ చక్రవర్తులు బౌద్దులు  కాగా, సింఘసరి రాజులు హిందూమతం మరియు బౌద్ధమతం యొక్క అవలoభీకులు మరియు  మజాపహిట్ రాజులు బౌద్ధులు. శ్రీవిజయ వంశమునకు  చెందిన సింగపూర  సామ్రాజ్యధీశులు బౌద్ధమతం పాటిస్తూ ఉండేవారు వారిలో ఒకరైన మొహమ్మద్ షా మలక్కా సల్తనత్ యొక్క మూడవ రాజు అధికారికంగా 1423 AD లో ఇస్లాం మతం స్వీకరించినాడు. సంక్షిప్తంగా ఇండో-మలయా  ప్రాంటానికి చెందిన రాజులు  పదిహేనవ శతాబ్దం మధ్య వరకు బౌద్ధ మరియు హిందూ  పాలకులు ఉన్నారు. తరువాత ముస్లింలు ఈ ప్రాంత పాలన పై  నియంత్రణ సాధించారు. ముస్లిం సుల్తానులు అందరు   స్థానిక పాలకులు.
పదిహేనవ శతాబ్దం ప్రారంభంలో మలేకా సుల్తానేట్ మరియు పదిహేనవ శతాబ్దం అంతం లో డెమాక్ సుల్తానేట్ స్థాపన జరగక ముందు ఇస్లామిక్ కమ్యూనిటీలు సుమత్రా మరియు జావా ద్వీపాలలో మరియు మొత్తం ఆగ్నేయ ఆసియా ప్రాంతoలో 10వ శతాబ్దం ప్రారంభం నుండి కనిపిస్తున్నాయి    పదవ శతాబ్దం ఆరంభం లో ఈ ప్రాంతం లో ముస్లిం సమాధులు కనిపించుట వాస్తవం.
మధ్యయుగ కాలంలో మరియు ఇస్లాం యొక్క ఆగమనం ముందు అనేక అరబిక్, భారతీయ మరియు చైనీస్ వ్యాపారులు వ్యాపారం మరియు సుగంధ ద్రవ్యాలు మరియు ఇతర ఉత్పత్తులకు ఈ ప్రాంతాన్ని  వాణిజ్య ప్రాంతంగా  వ్యవహరించారు. ఇస్లాం మజాపహిట్ రాజవంశం పతనం తర్వాత వేగంగా వ్యాప్తి చెoదినది. ఎక్కువగా సూఫీలు  మరియు ఇతర ఇస్లాం బోధకుల ద్వారా వ్యాపించినది.
ఇండోనేషియా చరిత్ర మరియు ప్రస్తుత వ్యవహారాల పై ప్రఖ్యాత సమకాలీన విద్వాంసుడు అయిన మెర్లే కాల్విన్ రిక్లెఫ్స్ తన గ్రంధం ," ఎ హిస్టరీ ఆఫ్ మోడరన్ ఇండోనేషియా c.1200 నందు ఒక వైపు ఇండోనేషియా ఇస్లాం తో సంభందాలు ఏర్పడి ఇస్లామీకరణ చెందినది మరోవైపు విదేశీ ఆసియన్లు (అరబ్బులు, భారతీయులు, చైనీస్) అప్పటికే ముస్లింలు అయి శాశ్వతంగా  ఇండోనేషియన్ ప్రాంతంలో స్థిరపడ్డారు మరియు  అంతర్గత వివాహాలు, స్థిర నివాసం మొదలగు  వాటి ప్రభావం వలన  వారు జావనీస్ లేదా మాలే లేదా సుమత్రా వాసులుగా మారారు అని అంటాడు.  
మెర్లే కాల్విన్ రిక్లెఫ్స్ తన గ్రంధంలో వెనిస్ కు చెందిన యాత్రికుడు మార్కోపోలో పెర్లాక్ అనే ముస్లిం పట్టణం సందర్సించాడని పేర్కొన్నాడు. మొరాకో యాత్రికుడు, ఇబ్న్ బటుట 1345 మరియు 1346 లో చైనా నుండి వచ్చేటప్పుడు ఈ ప్రాంతమును దర్సించినాడు  మరియు ఈ ప్రాంత పాలకుడు షాఫీ ఫిర్కా ను అనుసరించేవాడని పేర్కొన్నాడు.  
1512 మరియు 1515 AD మధ్య ఈ ప్రాంతంను దర్శించిన లిస్బన్ కు చెందిన పోలిష్ యాత్రికుడు టోమ్ పీరెస్ ఈ ప్రాంతంలో పోర్చగిస్ వారి స్థావరాలు ఉన్నాయి మరియు బ్రూనై పాలకుడు ముస్లిం అని అన్నాడు. మిగతా కాలిమంతాన్ ప్రాంతం, మదుర, బాలి, లామ్బాక్, సుమ్బావా, ఫ్లోర్స్, సోలోర్,జావా కి తూర్పున ఉన్న  తైమూర్ దీవుల్లో – బుగిస్ మరియు దక్షిణ సులవేసి (సెలెబెస్) ప్రాంతం ఇంకా ఇస్లామికరణ చెందలేదు అని పేర్కొన్నాడు. ఈ నాన్ ఇస్లామిక్ రాష్ట్రాలు  తదుపరి డచ్ వలసవాద సమయంలో తదుపరి శతాబ్దాలలో ఇస్లాం స్వీకరించినవి.

చారిత్రిక ఆధారాలను బట్టి పదిహేడవ శతాబ్దం మధ్యలో అనేక మంది సూఫీ సన్యాసులు అందులో భారతదేశం లోని  సూరత్ నుండి వచ్చిన సూఫీ ప్రముఖుడు నురుద్దిన్ అర్ రానిరి కాలం లో ఇస్లాం ఈ ప్రాoతం మరియు  సుమత్రా, జావా మరియు మలయ ప్రాంతాల్లో గట్టి పునాదిని ఏర్పాటు చేసుకొంది. ఇస్లాం వ్యాప్తిలో  వాలీ సంగ (తొమ్మిది ఋషులు) పాత్ర చారిత్రకoగా కంటే ఎక్కువ ఆధ్యాత్మికoగా  ఉన్నట్టు పేర్కొనవచ్చు.

ఈ ప్రాంతం లో మతసమైక్యత నేటికి కనిపిస్తుంది. ద్వీపసమూహం యొక్క వివిధ ప్రాంతాల్లో మధ్యయుగ కాలంలో బౌద్ధ మరియు హిందూ చక్రవర్తులు  నిర్మించిన అనేక పురాతన దేవాలయాలు నేటికి కనిపిస్తాయి.  అవి అప్పటి సుల్తానులు పాలన కాలంలోను లేదా తరువాత డచ్ మరియు ఆంగ్ల  పాలకుల కాలంలోను ద్వంసం కాబడలేదు.  ప్రజలు పెద్ద సంఖ్య లో ముస్లిమ్స్ అయినప్పటికీ అవి ద్వంసం కాబడలేదు. నేడు హిందూ దేవాలయాలు బాలి, సుమత్రా మరియు జావా దీవులు అంతటా కనిపిస్తున్నవి.


కండి ప్రాంబనాన్ ప్రాంతం 240 దేవాలయాలు కలిగి ఉన్నది మరియు కండి  బోరోబుదుర్ ఎనిమిదవ శతాబ్దపు  భారీ బౌద్ధ స్మారక పునరుద్ధరణ 1973 లో యునెస్కో సహాయంతో జరిగింది. ఇక్కడ బౌద్ధ మరియు హిందూ  మతపరమైన మరియు సాంస్కృతిక చిహ్నాలు రక్షించబడటం జరుగుతుంది.