28 September 2017

ఆధునిక విద్యాలయాలు మదరసాలు


పురాతన ఇస్లామిక్ సెమినరీలలో ఒకటైన మదర్సాతుల్ ఇస్లా యొక్క పూర్వ విద్యార్ధి అబు ఒసామా ఒక మదరాసా  నుండి పట్టభద్రుడైన తర్వాత  తాను ఆధునిక ప్రపంచంతో  పోటీ పడలేడని నమ్మాడు, కాని వెంటనే తన భావన తప్పు అని  తెలుసుకున్నాడు.ప్రస్తుతం హైదరాబాద్  మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో సోషల్ వర్క్ విభాగంలో సహాయక ప్రొఫెసర్ గా పని చేస్తున్న ఒసామా, ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ నుండి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. అతని మాటలలో "నేను మదరసా  నుండి సిలబి,  కర్రిక్యులం,ఇస్లామిక్ విలువలు మరియు నైతికత  తో పాటు చాలా నేర్చుకున్నాను” అలాగే మరొక మదరసా విద్యార్ధి అయిన సయ్యద్ ముంతాజ్ ఆలం 1994 లో మదరసా  నుండి పట్టభద్రుడయ్యాడు మరియు ఢిల్లీకి చెందిన ఇంగ్లీష్ న్యూస్ పోర్టల్ ఇండియా టుమారో.నెట్  యొక్క సంపాదకుడిగా పనిచేశారు

ఇటివల కాలం లో మదరసాలు    అనేక తప్పుడు కథనాలతో, వాస్తవ  విరుద్ద అంశాలతో   వార్తల లోనికి  వచ్చాయి. జాతీయ/ ప్రాంతీయ మీడియా మదరసాలపై వ్యతిరేక(negative)/ వాస్తవ  విరుద్ద  కథనాలను ప్రసారం చేసింది మరియు వాటిని "టెర్రర్ నర్సరీ"గా పిలవసాగింది.  కాని వాస్తవాలు వేరే విధంగా ఉన్నాయి. దేశం లోని అనేక మదరసాలు మారే కాలం  తో పాటు  ఆధునిక, ప్రగతిశీలక సిలబిని  ప్రవేశ పెడుతున్నాయి. మదరసా విద్యార్ధులు కంప్యూటర్లు మరియు ఇతర సాంకేతిక ఉపకరణాలను వినియోగిస్తున్నారు.

ఈ మదరసాలు  సైన్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్, ఇంగ్లీష్, హిందీ, పెర్షియన్ లాంగ్వేజెస్, కంప్యూటర్ సైన్స్, ఖురాన్, థియాలజీ, అరబిక్ భాషలతో పాటు విజ్ఞానాన్ని అందిస్తున్నాయి. మదరసాలు నేడు సాంప్రదాయక ఇస్లామిక్ మరియు ఆధునిక విద్యను భోదిస్తున్నాయి.వాటిలో కొన్ని పాలిటెక్నిక్ మరియు మినీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ (ఐటీఐ) కూడా ప్రారంభించాయి. దేశం లోని కొన్ని  మదరసాలు వివిధ ఎలక్ట్రానిక్ బ్రాంచ్లకు సంబంధించిన కోర్సులు, మొబైల్ ఆపరేటింగ్, కంప్యూటర్ మరియు ట్రాన్స్లేషన్ కోర్సులు కూడా అందిస్తున్నావి. ఇస్లామిక్ మదర్సాలలో అనేక  ఆధునిక విషయాలను భోదిస్తున్నారు

వాట్సప్ (WhatsApp) మదరసా విద్యార్థుల కోసం, ఒక ప్రముఖ కమ్యూనికేషన్ మార్గం గా మారింది మరియు వారిలో  చాలా మంది పేస్ బుక్ (Facebook) లో  ఖాతాలు మరియు ఇమెయిల్ ID లు కలిగి  ఉన్నారు. మదరసా విద్యార్ధులు మంచి మరియు అధునాతన పద్ధతి లో ఇస్లాం మరియు సమాజానికి ప్రాతినిధ్యం వహించాలని లక్ష్యంగా పెట్టుకొని నేటి మదరసాలు పనిచేస్తున్నాయి.

ఆధునిక విషయాలను నేర్చుకోవడమే గాక  ఇస్లాం ను బాగా అర్థం చేసుకోవడానికి మరియు ప్రచారం చేయడానికి మదరసా విద్య  ఉపయోగపడుతుంది అని  కొందరి నమ్మకం. మదరసా విద్యార్ధులకు ఆధునిక విషయాల జ్ఞానం  అవసరం ప్రస్తుతం ఉంది. ఇస్లామిక్ చట్టబద్ధమైన వారసత్వం మరియు వ్యాపార వ్యవహారాలకు సంబంధించి సమస్యలను అర్థం చేసుకోవటానికి గణితశాస్త్రం అవసరం ఉంది  మరియు విజ్ఞాన శాస్త్రం అనేక ఖురాన్ యొక్క భావాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది అని కొందరి వాదన.

JNU లో పరిశోధనా పండితుడైన మొహమ్మద్ సౌద్ ఆజ్మి అభిప్రాయం ప్రకారం మదరసా సిలబస్ లో ఆధునిక విషయాల పరిచయం సరైన దిశలో ఒక అడుగుగా చూస్తాము. ఆధునిక విద్యాభోధన పద్దతులతో మదరసా విద్యార్ధులు  సన్నద్ధం అవుతున్నారు మరియు మదరసాలు తమ బోధన శైలిని మెరుగుపరుచుకోని  పర్యావరణ శాస్త్రం మరియు ఆధునిక అర్థశాస్త్రం వంటి అంశాలను కూడా తమ సిలబుస్ లో  జోడించాలి" అని అన్నారు.

ఈ సంస్థల పూర్వ విద్యార్ధులు అనేక మంది పెద్ద సంఖ్యలో భారతదేశంలోని అనేక విశ్వవిద్యాలయాలలో పరిశోధనలో పాల్గొనడం లేదా భారతదేశం లోని అనేక  ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ సంస్థలలో  పని చేస్తున్నారు. మదరసాలు నిర్వహించే ఎక్స్ట్రా-కరిక్యులర్/సాంస్కృతిక కార్యకలాపాలు యువత కెరియర్ అవకాసాలను పెంచుతున్నాయి. అనేకమంది మదరసా పూర్వ విద్యార్ధులు తెలుగు, హిందీ, ఆంగ్లం తో సహా  అనేక ప్రాంతీయ బాషల వార్త పత్రికలోఅనువాదకులుగా,ఎడిటర్లుగా,  జర్నలిస్టు లుగా స్థిరపడినారు మరియు అనేకమంది పత్రిక రంగం లో ఉపాధి పొందుతున్నారు.  

ఆధునిక కాలంలో దేశం లోని అనేక మదరసాలు  యువత ఉపాది అవకాసాలను  మరింత విస్తృతంగా పెంచుతున్నాయి, తత్ఫలితంగా, వేలాది మంది యువకులు మస్జిద్ లలో, ప్రభుత్వ విభాగాల్లో, కార్పొరేట్లు, ఎంఎన్సిలు(MNC) లలో  ఉద్యోగాలు పొందుతున్నారు.

సచార్ కమిటీ నివేదిక ప్రకారం ముస్లిం విద్యార్ధులలో కేవలం  4% మంది మాత్రమే మదరసాలలో విద్య పొందుతున్నారు.








14 September 2017

సోషల్ మీడియా ప్రభావంతో పెరుగుతున్నఆత్మహత్యలు (Social Media Influence Increasing Suicides)





సెప్టెంబర్ 10 ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం

 సోషల్ మీడియా,  స్నేహితుల ఒత్తిడి, ఆల్కహాల్ మరియు మాదక ద్రవ్యాల   వాడక ప్రభావం కారణంగా నేడు  యువ తరoలో ఆత్మహత్యలు    పెరుగుతున్నవి.

"ఆత్మహత్య" అనేది "స్వీయ హత్య" అనే  లాటిన్ పదం నుండి తీసుకోబడింది. మరణించే వ్యక్తి యొక్క అంతిమ చర్యను ఇది సూచిస్తుంది. ఆత్మహత్య గురించి ఆలోచించడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి మధ్య కొంత అంతరం ఉంటుంది. కొందరు వ్యక్తులు ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనను కలిగి ఉంటారు, కానీ వారు ఆత్మహత్య చేసుకోరు. కొంతమంది లో అది కార్యరూపం దాల్చడానికి  రోజులు, వారాలు లేదా కొన్నిసంవత్సరాలు పట్టవచ్చుకొందరు ముందు ఆలోచన, ప్రణాళిక  లేకుండాహటాత్తుగా ఆత్మహత్య చేసుకొంటారు. కొంతమంది నిర్వచించడానికి వీలులేని విధంగా  అనగా  మద్యం మరియు ఇతర మత్తు పదార్థలకు బానిస కావడం, డయాబెటిస్, ఊబకాయం &రక్తపోటు మొదలగు ప్రాణాంతక వ్యాదుల తీవ్రత కారణం గా,జీవితం పై విరక్తి తో  ఆత్మహత్య కు పాల్పడేదరు.

పురుషులు తరచుగా మహిళలు కన్నా  నాలుగు రెట్లు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటారు. అయితే ఆత్మహత్యకు ప్రయత్నించే మహిళలుపురుషుల కన్నా నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటారు. మారణాయుధాలు, ఉరి, ఎత్తు నుంచి ఎగరడం లేదా  దూకడం వంటివి   పూర్తి ఆత్మహత్య చేసుకొనే  పురుషులు అధికంగా  ఉపయోగించే పద్ధతులు. మహిళలు సాధారణంగా మానసిక మందులు ఎక్కువ డోస్ తీసుకోవడం  లేదా విషంను ఎక్కువ మోతాదు లో  తీసుకుంటారు.

ప్రపంచవ్యాప్తంగా, ఆత్మహత్య యొక్క అత్యంత సాధారణ పద్ధతి ఉరి వేసుకోవడం. ఆత్మహత్య రేటు వయస్సుతో పాటు పెరుగుతుంది మరియు మధ్యవయస్సు లో సంక్షోభం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. పురుషులలో, 45 సంవత్సరాల తరువాత ఆత్మహత్యలు మరియు మహిళల్లో 55 సంవత్సరాల తరువాత ఆత్మహత్యలు పెరిగాయి. అయితే మద్య తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగా 15-25 మధ్య వయస్సున్న యువకులలో  మరియు యువతులలోఆత్మహత్య రేటు వేగంగా పెరుగుతోంది

ఒంటరిగా ఉండేవారు, విడాకులు తీసుకున్నవారు, దీర్ఘ కాలం గా వివాహం చేసుకోనివారు , విడాకులు తీసుకొన్న మగవారు మరియు వితంతువులు  ఆత్మహత్యకు పాల్పడే ఎక్కువ అవకాశం ఉంది. "వార్షికోత్సవ ఆత్మహత్యలు" గా  పిలవబడే ఆత్మహత్యలు కొందరు వ్యక్తులు తమ జీవితాన్ని ఒక కుటుంబ సభ్యుడు మరణించిన రోజున తీసుకుంటారు. నిరుద్యోగం మరొక ప్రమాదమైన కారణం. . వైద్యులలో అనస్తిషియన్స్ మరియు మానసిక వైద్యులు అధికంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.   శీతోష్ణస్థితి/వాతావరణం  కూడా ప్రభావాన్ని చూపుతుంది: అందు వల్లే  ఆత్మహత్యలు ఎక్కువగా స్కాండివియన్ దేశాలలో జరుగును.

క్యాన్సర్ మరియు హెచ్ఐవి లాంటి రోగాలు ఆత్మహత్యలను  పెంచుతాయి. ఆత్మహత్య అనేదిమానసిక అనారోగ్యాలలో అనగా  స్కిజోఫ్రేనియా, డిప్రెషన్, మానసిక చిత్తవైకల్యం మరియు మద్యం మరియు ఔషధాలకు అలవాటు పడినవారిలో ఎక్కువగా ఉంటుంది.

వ్యక్తిత్వ క్రమరాహిత్యాలలో(personality disorders) ఆత్మహత్య ప్రయత్నాలు సాధారణం. స్నేహితుల  ఒత్తిడి, నీలి తిమింగలం సవాలు(Blue Whale challenge)మరియు ఒత్తిడి వంటివి సామాజిక కారకాలుగా ఉండును.    . సున్నితమైన మనసత్వం కలిగిన వారు, తమను తాము నియంత్రించలేని వ్యక్తులు మరియు యుక్తవయస్కులలో మద్య నీలం తిమింగలం సవాలు వలన మానసిక వత్తిడి కి లోనైన వారు ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం ఉంది.

ఆత్మహత్య వంశపరంపర్యం గా (జన్యు కారకంకూడా నడుస్తుంది. "పారా-ఆత్మహత్య" అనేది స్వీయ-వినాశనం ద్వారా తమను తామే గాయపరచుకునే  రోగులను వివరించడానికి ఉపయోగించే  ఒక పదం, కానీ సాధారణంగా వీరు  చనిపోవాలని కోరుకోరు.

సమాజంలో ఆత్మహత్యలను నివారించడానికి, అందరూ వారి కుటుంబ సభ్యుల, సహచరులు, సహోద్యోగి యొక్క ప్రవర్తన మార్పులను గమనించాలి. సాధారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి ఎల్లప్పుడూ వారి దగ్గరిఅనగా తమ కుటుంబ సబ్యులుమరియు తనకు ప్రియమైన వారికి ముందు సూచనలు ఇస్తారు. విధంగా గమనించినప్పుడు, మనం వారితో  మాట్లాడటం మరియు ముఖ్యంగా తక్షణం మనోరోగ వైద్యుడిని సంప్రదించడం చేయాలి. తీవ్రంగా డిప్రెషన్ గురి అయిన వ్యక్తులకు  యాంటీ డిప్రెసెంట్స్, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, సైకోథెరపీ అండ్ ఎలక్ట్రో-కన్వల్సివ్ థెరపీ (షాక్ ట్రీట్మెంట్) తో చికిత్స చేయవచ్చు.