30 May 2019

భారతీయ ముస్లింలు విద్యాపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు – పరిష్కారాలు.



Image result for indian muslim in school

భారతదేశంలో ముస్లింలు 172 మిలియన్ల మంది ఉన్నారు, ఇది మలేషియా మరియు ఇండోనేషియా తర్వాత ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ముస్లిం జనాభా గలిగిన దేశం.  ముస్లింలు  దేశం లో అతి పెద్ద మైనారిటి  సమాజం గా ఉన్నారు.

స్వాతంత్ర్యం వచ్చిన 71 ఏళ్ళ తర్వాత కూడా ముస్లింల సమస్యలపై మనం ఇప్పటికీ ఆలోచించాల్సి వస్తుంది. లోపం ఎక్కడ ఉంది? దీనికి బాద్యులు ఎవరు? ముస్లిం సమాజమా! లేకా పాలకులా!

భారతదేశ 2011 జనాభా లెక్కల ప్రకారం విద్య స్థాయిలో 42.7% ముస్లింలు నిరక్షరాస్యులుగా ఉన్నారు. దేశంలోని అన్ని మత వర్గాలలో ఇది అత్యధిక నిరక్షరాస్యత రేటు. భారత దేశ మొత్తం జనాభా నిరక్షరాస్యత రేటు 36.9%.
భారతదేశంలో ముస్లిం సమాజం యొక్క విద్యాపరమైన వెనుకబాటుతనం గోపాల్ సింగ్ మైనారిటీ ప్యానెల్ రిపోర్ట్, 43 వ రౌండ్ మరియు 55 వ రౌండ్ జాతీయ శాంపిల్ సర్వే యొక్క రిపోర్ట్  మరియు ప్రోగ్రాం అఫ్ ఆక్షన్ అండర్ ది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ (1986) NEP రివైస్డ్ (1992) మరియు సచార్ కమిటీ (2006)  రిపోర్ట్ తెలియజేసినవి. ముస్లింల ఆర్థిక మరియు విద్యా పరిస్థితిని మెరుగుపర్చడానికి ప్రభుత్వం ప్రారంభించిన పలు పథకాలు కాగితాల పై ఉన్నవి. సమాజంలోని బలహీన వర్గాల సామాజిక-ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడానికి ఉద్దేశించిన  అనేక ప్రభుత్వ పథకాలు  ముస్లింలకు ప్రయోజనం కల్పించలేదు.
ఒక భారతీయ ముస్లిం దృష్టిలో ప్రధానమైన సమస్యలు ఏమిటి? లేదా ముస్లిం సమాజం ఎక్కడ విఫలమైందో మనం తెలుసుకోవాలి.
వివిధ ప్రభుత్వ నివేదికలు ముస్లింలలో 4% మంది మద్రాసాకు వెళుతున్నారని, మిగతా 96% మంది భారతదేశంలో ప్రభుత్వ పాఠశాలలు లేదా ప్రైవేటుగా నడుస్తున్న పాఠశాలల్లో అధ్యయనం చేస్తున్నారని వివరించినవి.
96% ముస్లిం విద్యార్థుల యొక్క విధి మరియు నాణ్యతపై మనము దృష్టి పెట్టాలి. అనేక సంవత్సరాలుగా  భారతదేశంలోని  ప్రతి వర్గానికి చెందిన ఆశించిన విలువలు పెరిగినవి  మరియు ప్రతి ఒక్కరూ తమ పిల్లలను  ఆంగ్ల మాధ్యమిక పాఠశాలలో విద్యావంతులను చేయాలని కోరుకొoటున్నారు.
భారతదేశం అంతటా వివిధ రాష్ట్రాల్లో మరియు చిన్న పట్టణాలు మరియు నగరాల్లో, 5 వ లేదా 8 వ తరగతి వరకు ఇంగ్లీష్-మాధ్యమిక పాఠశాలలను స్థాపించుటలో  స్థానిక విద్యావేత్తలు లేదా పారిశ్రామికవేత్తలు చూపిన  చొరవలను చూశాము. ఈ పాఠశాలలు, స్వల్ప రుసుము తో  పెద్ద సంఖ్యలో ముస్లింలకు ప్రాథమిక విద్యను అందిస్తున్నాయి. కానీ వారు తరగతి 5వ లేదా 7వ  పూర్తి చేసినప్పుడు ప్రశ్న తలఎత్తుతుంది? వారిలో చాలామంది వారి  ప్రైమరీ అనంతర విద్యను కొనసాగిస్తున్నారా? కొనసాగిస్తే ఏ సంస్థలలో కొనసాగిస్తున్నారు.
ఈ విద్యార్థులు వారి ప్రైమరీ విద్యను ముగించిన తర్వాత, వారిలో కొంతమంది ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్నారు  మరియు మెజారిటీ విద్యార్ధులు డ్రాప్-అవుట్లు గా మిగిలి పోతున్నారు. దీనికి తల్లిదండ్రుల యొక్క ఆర్థిక స్థితి ప్రధాన  కారణమని చెప్పబడింది, ఎందుకంటే తమ  పిల్లల యొక్క విద్యా ఖర్చులను వారు భరించే స్థితిలో లేరు మరియు తమ పిల్లలు చదువుకు బదులు ఏదో ఒక పని చేయటానికి లేదా ఒక చిన్న వృత్తి ని నేర్చుకోవటానికి వారు ఇష్టపడతారు .
ఒక సమాజంగా, మనం ముస్లిమ్స్ భారతదేశ వ్యాప్తంగా సాధారణ బోధనా పద్ధతిని అనుసరించే మరియు నాణ్యమైన విద్యను ఉచితంగా లేదా కనీస రేటు వద్ద అందించే  పాఠశాలలను ఏర్పాటు చేయగలిగామా? పై ప్రశ్నకు సమాధానం కాదు అని వస్తుంది.
మరో విచిత్రమైన వాస్తవం ప్రతి పెద్ద భారతీయ నగరం లో కనీసం ఒకటి లేదా రెండు ముస్లిం పాఠశాలలు ఉనికిలో ఉన్నాయని  చెప్పవచ్చు. కానీ ఈ పాఠశాలల్లో చాలా వరకు ఉర్దూ మీడియం లేదా హిందీ మాధ్యమంలో విద్యను అందిస్తాయి, అక్కడ బోధనా నాణ్యత కూడా ప్రశ్నార్థకం గా ఉంటుంది.
ముస్లిం  సమాజం లోని విద్యాపరమైన వేనుకుబాటు కు ఎవరు బాద్యులు? కమ్యూనిటీ నాయకులు లేదా మత నాయకులా? దీనికి పక్కాగా సమాధానం ఉంది..
ముస్లిం కమ్యూనిటీ యొక్క మతపరమైన నాయకులు ముస్లింల ఆర్థిక మరియు సామాజిక విమోచనకు దారి తీసే ఏకైక మార్గం విద్య అని ప్రతి ముస్లింకు సందేశాన్ని ఇవ్వాలి. దీనితో పాటు జాకత్ లేదా ఫిత్రర్ ద్వారా ముస్లిం సమాజం లో  పోగైన డబ్బును విద్యాసంస్థలు  స్థాపించటానికి, మరియు నాణ్యమైన విద్యను అందించటానికి ప్రయత్నించాలి.
రెండవది, కమ్యూనిటీ నాయకులు వారి సాంఘిక ప్రయత్నాల ద్వారా  కొన్ని సంస్థలను స్థాపించాలి.  దానికి మత పండితులు  మద్దతు ఇవ్వాలి. కమ్యూనిటీ లో ఒక విద్యాసంబంధ పునరుజ్జీవనానికి గాను మద్రాస్సా లేదా పాఠశాల నుండి ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు సాంకేతిక విద్యా సంస్థలు స్థాపించాలి. ఈ ఆలోచన ఉత్తర భారతం లో కన్నా దక్షిణ భారతదేశంలో ఎక్కువ జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది.
భారతదేశంలో ముస్లిం సమాజంచే ఏర్పాటు చేయబడిన లేదా నిర్వహించబడుతున్న పాఠశాలల్లో కామన్, మోడరన్ మరియు కరెంటు  సిలబస్ను రూపొందించడం అవసరం. పాఠశాల అనంతరం విద్యార్ధులకు నైపుణ్యాలు లేదా విద్యావేత్తల ద్వారా  ఉత్తమమైన కెరియర్ మార్గానికి సంబంధించిన కౌన్సిలింగ్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే కమ్యూనిటీ  విద్యాపరంగా అభివృద్ధి చెందగలదు.

బెంగాల్ ఇనిషిఎటివ్ ఫర్ మల్టీ-సెక్టార్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్ Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation


\




సెక్రటేరియట్: ఢాకా, బంగ్లాదేశ్
సభ్యత్వ దేశాలు:  బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, మయన్మార్, నేపాల్ శ్రీలంక, మరియు థాయిలాండ్.

నాయకులు

చైర్మన్ షిప్: శ్రీలంక (సెప్టెంబరు 2018 నుంచి), స్థాపన 6 జూన్ 1997; 21 సంవత్సరాల క్రితం
వెబ్సైట్: bimstec.org

బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టార్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (BIMSTEC) అనేది ఏడు దేశాల దక్షిణాసియా మరియు సౌత్ ఈస్ట్ ఆసియా దేశాల యొక్క ఒక అంతర్జాతీయ సంస్థ. ఇది 1.5 బిలియన్ల ప్రజలను కలిగి ఉంది మరియు $ 3.5 ట్రిలియన్ (2018) మొత్తం స్థూల దేశీయ ఉత్పత్తి కలిగి ఉంది. BIMSTEC సభ్య దేశాలు - బంగ్లాదేశ్, భారతదేశం, మయన్మార్, శ్రీలంక, థాయ్లాండ్, నేపాల్ మరియు భూటాన్ - బెంగాల్ బే పై ఆధారపడిన దేశాలు.

సహకార విషయం లో   పద్నాలుగు ప్రాధాన్యతా రంగాలు గుర్తించబడ్డాయి మరియు ఆ రంగాల్లో దృష్టి పెట్టేందుకు అనేక BIMSTEC కేంద్రాలు స్థాపించబడ్డాయి. BIMSTEC స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద సంధి సంప్రదింపులలో ఉంది. (c. 2018).
BIMSTEC నాయకత్వం దేశ పేర్ల అక్షర క్రమంలోమారుతుంది. శాశ్వత సెక్రటేరియట్ ఢాకాలో ఉంది

నేపథ్యo:
6 జూన్ 1997, బ్యాంకాక్ లో ఒక కొత్త ఉప-ప్రాంతీయ సమూహం ఏర్పాటైంది మరియు  BIST-EC (బంగ్లాదేశ్, భారతదేశం, శ్రీలంక మరియు థాయ్లాండ్ ఎకనామిక్ కోఆపరేషన్) అనే పేరుతో ఇది రూపొందించబడింది. బ్యాంకాక్ లో జరిగిన  ఒక ప్రత్యేక మంత్రివర్గ సమావేశం అనంతరం  22 డిసెంబరు 1997 న మయన్మార్ ని చేర్చిన తరువాత, గ్రూపును 'బి.ఎమ్.ఎస్.టి.-ఎసి' (బంగ్లాదేశ్, భారతదేశం, మయన్మార్, శ్రీలంక మరియు థాయ్లాండ్ ఎకనామిక్ కోఆపరేషన్) గా మార్చారు. 1998 లో, నేపాల్  పరిశీలకుడు హోదా పొందినది . ఫిబ్రవరి 2004 లో, నేపాల్ మరియు భూటాన్ పూర్తి సభ్యులు అయ్యారు. 31 జూలై 2004, మొట్టమొదటి శిఖరాగ్ర సమావేశం లో ఈ సమూహాన్ని BIMSTEC లేదా బహుళ-విభాగ సాంకేతిక మరియు ఆర్థిక సహకారం కొరకు బెంగాల్ ఇనిషియేటివ్ గా మార్చారు.

ఆశయం/ఆబ్జెక్టివ్:
బంగాళాఖాతం తీరం వెంట ఉన్న దక్షిణ ఆసియా మరియు ఆగ్నేయ ఆసియా దేశాలలో సాంకేతిక మరియు ఆర్థిక సహకారం కల  BIMSTEC యొక్క 14 ప్రధాన విభాగాలు కలవు.
1. ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్
2. రవాణా & కమ్యూనికేషన్
3. శక్తి
4. టూరిజం
5. టెక్నాలజీ
6. ఫిషరీస్
7. అగ్రికల్చర్
8. ప్రజా ఆరోగ్యం
9. పేదరిక నిర్మూలన
10. కౌంటర్ టెర్రరిజం & ట్రాన్స్నేషనల్ క్రైమ్
11. ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్
12. ప్రజలు నుండి ప్రజలు సంప్రదించండి
13. సాంస్కృతిక సహకారం
14. వాతావరణ మార్పు

2005 లో ఢాకాలో జరిగిన  8 వ మంత్రివర్గ సమావేశంలో 7 నుండి 13 వరకు విభాగాలు చేర్చబడ్డాయి, 2008 లో న్యూఢిల్లీలో జరిగిన  11 వ మంత్రివర్గ సమావేశంలో 14 వ విభాగం జోడించబడింది.

ప్రతి వర్గానికి సభ్య దేశాలు లీడ్ దేశాలుగా సూచించబడ్డాయి.

విద్యా వృత్తి మరియు సాంకేతిక రంగాల్లో శిక్షణ మరియు పరిశోధనా సౌకర్యాల కోసం మరొకరికి సహకారం అందించబడుతుంది.. సాధారణ ఆసక్తి యొక్క ఆర్థిక, సామాజిక, సాంకేతిక మరియు శాస్త్రీయ రంగాలలో చురుకుగా సహకారం మరియు పరస్పర సహకారాన్ని ప్రోత్సహించబడుతుంది. ఇది సభ్య దేశాల సామాజిక-ఆర్ధిక వృద్ధిని పెంచటానికి సహాయం చేస్తుంది.

శాశ్వత సెక్రటేరియట్: BIMSTEC శాశ్వత సెక్రటేరియట్ ఢాకాలో 2014 లో ప్రారంభించబడింది మరియు భారతదేశం దాని ఖర్చులో 33% ( ఈ ప్రాంతం యొక్క జనాభాలో 65%) అందిస్తుంది. BIMSTEC యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్ బంగ్లాదేశ్ నుండి ఎం షాహిద్యుల్ ఇస్లాం మరియు మాజీ సెక్రెటరీ జనరల్ శ్రీలంక నుండి సుమిత్ నకందలా.

అధ్యక్షత: BIMSTEC చైర్మాన్షిప్ కోసం అక్షర క్రమాన్ని ఉపయోగిస్తుంది. BIMSTEC అధ్యక్షుడిగా బంగ్లాదేశ్ (1997-1999) తో మొదలైంది.


సభ్య దేశాలు
దేశాలు
స్థానం
ప్రభుత్వాధినేత
రాజ్యాధినేత.
జనాభా
జీ.డి.పి
ప్రపంచ బ్యాంక్
సార్క్
బంగ్లాదేశ్
ప్రధాన మంత్రి
షేక్ హసీనా
ప్రధాన మంత్రి
అబ్దుల్ హమీద్ అద్యక్షులు
162,951,560
$314 bn
భూటాన్
ప్రధాన మంత్రి
దాహో షేరింగ్ ప్రధాన మంత్రి
జిగ్మే ఖేసార్  నమ్గెల్  వాంగ్ ఛుక్ రాజు  
797,765
$2.5 bn
 ఇండియా
ప్రధాన మంత్రి
శ్రి నరేంద్ర మోడీ , ప్రధాన మంత్రి
రామ్ నాథ్ కోవింద్, రాష్ట్రపతి
1,324,171,354
$2700.0 bn
మయన్మార్
ప్రెసిడెంట్
విన్ మింట్ , ప్రెసిడెంట్
52,885,223
$68.277 bn
   నేపాల్
ప్రధాన మంత్రి
వైద్య దేవి భండారి,  ప్రెసిడెంట్
28,982,771
$25.020 bn
 శ్రి లంక
ప్రెసిడెంట్
రనిల్ విక్రమ సింగే, ప్రధాన మంత్రి  
మైత్రిపాల సిరిసేన , ప్రెసిడెంట్
20,798,492
$80.4 bn

BIMSTEC ప్రాధాన్యతా రంగాలు

ఈ ప్రయత్నానికి దారితీసిన ప్రధాన దేశాలతో 14 ప్రాధాన్యత ప్రాంతాలు గుర్తించబడ్డాయి


ప్రాధాన్యత  రంగం
Priority Area
లీడ్ దేశం Lead Country
సెంటర్ Centre
కామెంట్స్ Comments
రవాణా మరియు కమ్యూనికేషన్
ఇండియా
టూరిజం Tourism
ఇండియా
BIMSTEC సెంటర్  టూరిజం ఇంఫోర్మేషణ్ సెంటర్
కౌంటర్ టెర్రరిజం అండ్ ట్రాన్స్ నేషనల్ క్రైమ్ Counterterrorism and transnational crime
ఇండియా
నాలుగు సబ్ గ్రూప్స్  ఇంటేలిజేన్స్ షేరింగ్ శ్రి లంక (లీడ్),
టెర్రర్ ఫైనాన్సింగ్ – తాయిలాండ్, లీగల్-మైన్మార్,
లా ఎన్ఫోర్సుమెంట్ అండ్ నార్కోటిక్స్ – మైన్మార్
ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మ్యానేజ్మెంట్
Environment and disaster management
ఇండియా
BIMSTEC వెదర్ అండ్ క్లైమేట్  సెంటర్ , నోయిడా ఇండియా.
శక్తీ  
Energy
ఇండియా
BIMSTEC ఎనర్జి సెంటర్ బెంగలూరు
BIMSTEC గ్రిడ్ ఇంటర్-కనెక్షన్ MoU ఆమోదం  2014 లో  
ప్రజా  ఆరోగ్యం
Public Health
తాయి లాండ్ Thailand
BIMSTEC ట్రాడిషినల్ మెడిసిన్ నెట్  వర్క్ – ఇండియా
వ్యవసాయం
Agriculture
మైన్మార్
ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్ మెంట్
Trade & Investment
బంగ్లాదేశ్
తెక్నోలాజి
Technology
శ్రి లంక
ఫిషరీస్
Fisheries
తాయి లాండ్
పీపుల్ తో పీపుల్ కాంటాక్ట్ People-to-People Contact
తాయి లాండ్
పేదరిక నిర్మూలన
Poverty Alleviation
నేపాల్
క్లైమేంట్ చేంజ్
Climate Change
బoగ్లా దేశ్
కల్చరల్ కోపరేషన్
Cultural Cooperation
భూటాన్
ఇండియా ద్వారా 1200 ITEC స్కాలర్షిప్లు

BIMSTEC ఫ్రీ ట్రేడ్ ఏరియా ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్
BIMSTEC ఫ్రీ ట్రేడ్ ఏరియా ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ (BFTAFA) లో అన్ని సభ్యుల దేశాలు సంతకం చేసారు మరియు  ఆని దేశాలలో వాణిజ్యం మరియు పెట్టుబడులను ప్రోత్సహించాయి. BIMSTEC లో పెద్ద ఎత్తు గా పెట్టుబడి పెట్టటానికి మరియు వెలుపల  వ్యాపారం చేయటానికి ఆసక్తిచూపుతున్నాయి. తదనంతరం వస్తువులు, సేవలు, పెట్టుబడుల, ఆర్థిక సహకారం, వాణిజ్య సౌకర్యాలు మరియు LDC ల కొరకు సాంకేతిక సహాయంతో చర్చలు జరిపేందుకు. "ట్రేడ్ నెగోషియేటింగ్ కమిటీ" (TNC) ను థాయ్లాండ్తో శాశ్వత స్థానం గా ఏర్పాటు చేశారు, వస్తువుల వర్తకంపై చర్చలు పూర్తయిన తరువాత, TNC అప్పుడు సేవలు మరియు పెట్టుబడులలో వాణిజ్యంపై చర్చలు కొనసాగిస్తుంది.

BIMSTEC తీర షిప్పింగ్ డ్రాఫ్ట్ ఒప్పందం
డ్రాఫ్ట్ సభ్య దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచడానికి ఈ ప్రాంతంలో 20 నాటికల్ మైళ్ళ లోపల తీరప్రాంత రవాణాను అందించడానికి BIMSTEC తీర షిప్పింగ్ ఒప్పందం డ్రాఫ్ట్  2017 డిసెంబరులో న్యూఢిల్లీలో చర్చించబడింది. లోతైన సముద్రపు ఓడరేవుతో పోలిస్తే, కోస్టల్ ఓడలో తక్కువ చిన్న ఓడలు అవసరమవుతాయి మరియు తక్కువ ఖర్చులు ఉంటాయి. ఒప్పందం ఆమోదించబడిన తర్వాత ఇది అమలులోకి వచ్చిన తర్వాత, సభ్య దేశాల మధ్య చాలా సరుకు రవాణా తక్కువ సమర్థవంతమైన, పర్యావరణ అనుకూలమైన మరియు తీరప్రాంత రవాణా మార్గాల ద్వారా చేయబడుతుంది.

ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (ADB) సహకారం
ADB అనేది "BIMSTEC ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్ స్టడీ" (BTILS) ను చేపట్టడానికి 2005 లో ఒక భాగస్వామిగా మారింది, ఇది 2014 లో పూర్తయింది.

BIMSTEC సమావేశాలు
మయన్మార్లోని నైపిడాలో మూడవ సమ్మిట్

నెంబర్ .
డేట్
ఆతిధ్య దేశం
ఆతిధ్య నగరం
మొదటిది
31 July 2004
 థాయిలాండ్ Thailand
బాంకాక్Bangkok
రెండోవ
13 November 2008
 ఇండియా India
న్యూ ఢిల్లీ New Delhi
మూడోవ
4 March 2014
 మైన్మార్ Myanmar
నైపిడాNaypyidaw
నాలుగోవ
30, 31 August 2018
  నేపాల్ Nepal
ఖాట్మండు  Kathmandu[20]
ఐదోవ
ఇంకా జరుగ లేదు.
*                     శ్రి లంక
*                     కొలంబో
ప్రాజెక్ట్స్
రోడ్డు మరియు రైలు లుక్ ఈస్ట్ కనెక్టివిటీ ప్రాజెక్టులు
కోస్ట్ షిప్పింగ్
పవర్ గ్రిడ్ అంతర్-కనెక్షన్
ప్రాంతీయ విపత్తు పర్యవేక్షణ మరియు హెచ్చరిక వ్యవస్థ.

BIMSTEC ప్రస్తుత నాయకులు

బంగ్లాదేశ్- షేక్ హసీనా- ప్రధాన మంత్రి

 భూటాన్-లాటా షెర్రింగ్- ప్రధాన మంత్రి

 భారతదేశం-నరేంద్రమోడీ-ప్రధాన మంత్రి

మయన్మార్-విన్ మైంట్- అధ్యక్షుడు

శ్రీలంక-మైత్రిపాలా సిరిసేన-అధ్యక్షుడు

థాయిలాండ్-ప్రౌత్ చాన్-ఓచా- ప్రధాన మంత్రి