24 October 2016

ఎడ్యు టుబర్స్(EduTubers)


టీచింగ్ అండ్ లెర్నింగ్ ఇప్పుడు మారింది. ప్రతిబావంతులైన అధ్యాపకులు యు ట్యూబ్ (YouTube) ఛానల్ ద్వారా వేల మంది విద్యార్థులకు అందుబాటులోకి వస్తున్నారు.
“ఉచిత విద్య”   యుగం ప్రారంభమైనది మరియు నాణ్యమైన విద్య అందరికి  సులభంగా అందుబాటులోకి వస్తున్నది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం, మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటీ మద్రాస్ తదితర ప్రఖ్యాత సంస్థలు  ప్రతి సంవత్సరం ఉచిత ఆన్లైన్ కోర్సులను అందిస్తున్నవి. అత్యంత ప్రాచుర్యం గల వీడియో షేరింగ్ వెబ్సైట్లలో ఒకటైన యూ ట్యూబ్ (YouTube), ఈ ప్రయోజనం కోసం ఒక అద్భుతమైన మాధ్యమంగా  నిరూపించబడింది. అనేక ప్రతిభావంతులైన వ్యక్తులు విద్యార్థులకు విజ్ఞానం అందిచడానికి యూ ట్యూబ్ వేదికను  వాడుతున్నారు.

ఎడ్యు టుబర్స్ (EduTubers,)గా పిలువబడే  ఈ వ్యక్తులు సృజనాత్మక వీడియోలను YouTube ఛానెల్ లో ఉచితంగా ప్రవేశపెట్టడం ద్వార  విద్యార్థులను ఆకర్షించు చున్నారు.

గౌరవ్ ముంజాల్, రోమన్ సైనీ, హిమేష్  సింగ్, సచిన్ గుప్తా అనే నలుగురు(చతుష్టయం)  స్థాపించిన ఉనకాడేమి ను  (Unacademy) దీనికి ఉదాహరణను గా  తీసుకోoదాo. ఐదు సంవత్సరాల క్రితం విద్యార్థుల వివిధ విద్యా సమస్యలను పరిష్కరించటం లో సహాయపడే  లక్ష్యంతో మొదలైన ఈ నలుగురు  (చతుష్టయం) కంప్యూటర్ సైన్స్ మరియు జావా వీడియోలను యూ ట్యూబ్ లో  అప్లోడ్ ప్రారంభించారు. "రెండు నెలల తరువాత, వేలాది మంది ఈ వీడియోలను చూడటం మాకు మరింత పని చేయటానికి  ప్రేరణ ఇచ్చింది," అని  గౌరవ్ అంటున్నాడు.

ఉనకాడేమి("Unacademy)  ఇతర ఉపాధ్యాయులకు  కూడా ఒక టీచింగ్ వేదికగా మారింది. 15 మంది తో కూడిన మేము మరియు దేశవ్యాప్తంగా 100 పైగా అధ్యాపకులు మాకు కంటెంట్ (లెసన్స్) తయారీలో సహాయం చేస్తున్నారు అని రోమన్ సైని అన్నాడు. నేడు ఉనకాడేమి (Unacademy) యొక్క యూ ట్యూబ్ (YouTube) ఛానల్ మూడు లక్షల మంది ఎక్కువ  చందాదారులను కలిగి ఉంది. 20 మిలియన్ వ్యూస్ (వ్యూస్) మరియు 729 వీడియోలతో    వైద్య, సివిల్ సర్వీస్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మరియు విదేశీ భాష నిపుణుల సహాయంతో విద్యార్ధుల అవసరాలు తీరుస్తుంది.

అలాగే ఆంగ్ల భాష నేర్చుకోవడం పై దృష్టి ని పెట్టిన  మరొక యూ ట్యూబ్ (YouTube) ఛానెల్  లేఅర్నేక్స్ లేట్ అజ్ టాక్   (Learnex Let’s Talk) యొక్క స్థాపకుడు మరియు సృష్టికర్త ఆకాష్ కదం. అతను ముంబై లో వ్యాపార ఇంగ్లీష్(Business English), వ్యక్తిత్వ వికాసం, ఐఇఎల్టిఎస్(IELTS), TOEFL, నైపుణ్య అభివృద్ధి (skill development) లో శిక్షణ ఇచ్చే ఇచ్చే ఒక సంస్థను నడుపుతున్నాడు.  మేము మా సంస్థ ద్వారా  ప్రతి సంవత్సరం 11,000 మంది విద్యార్థులకు  శిక్షణ ఇస్తున్నాము  మరియు వారికి అదనoగా ఏదో ఇవ్వాలని అనుకొన్నాము అలా YouTube తరగతులు ఆలోచన పుట్టింది. ఇప్పుడు మేము దాదాపు ప్రతి ప్రత్యామ్నాయ రోజు వీడియోలను పోస్ట్ చేస్తున్నాము అని ఆకాష్ వివరిoచాడు.

లేఅర్నేక్స్ (Learnex) వీడియోలు ఎక్కువగా కమ్యునికేటివే ఇంగ్లీష్ కు సంభoదించినవి అనగా ఒక ఉద్యోగ ఇంటర్వ్యూ లో తమనుతాము ఎలా పరిచయం చేసుకోవాలి మరియు ఇంటర్వ్యూ లో అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం ఇవ్వాలి మొదలగునవి. వీడియోలను అనేక ఉదాహరణలు, దృష్టాంతాలతో రుపొందించి వాటిని  ఆసక్తికరమైనవిగా చేయడానికి ప్రయత్నిస్తాము అని అతను అన్నాడు.

అయితే, ప్రేక్షకుల ఆసక్తి  ఆధారంగా వీడియోలను రూపొందించడం లో సవాళ్లు లేకపోలేదు.   "కంటెంట్ సృష్టి సులభం కాదు. స్క్రిప్ట్ రాయడం ఎడిటింగ్ మరియు ప్రేక్షకులు వాటిని ఆదరించేటట్లు రూపొందించడం  ఒక కఠినమైన ప్రక్రియ. అందుకు గాను విభిన్నంగా కొత్త వ్యూహాలు రుపొందిoచ వలసి ఉంటుందని ఆకాష్ చెప్పారు. నిజానికి ఒక విజయవంత  ఛానల్ ఏర్పాటుకు   భారీ బడ్జెట్ అవసరం లేదు. నవీన్ తన YouTube ఛానల్ #crazyNK ద్వారా వ్యర్థo నుండి ఉత్తమాన్ని  బాగా చేసాడు.

"నేను చిన్నప్పుటి నుంచి తీగలు, బ్యాటరీలతో కూడిన గాడ్జెట్లతో ఆసక్తి గా ఆడే వాడిని.  నా చిన్నతనం లో  DIY YouTube వీడియోలను చూసేవాడిని వాటిని చూసిన తరువాత స్వంతంగా నేను వాటిని తయారు చేయగలనని అనిపించినది అని నవీన్ చెప్పారు. అతను గత సంవత్సరం మార్చిలో తన YouTube ఛానల్ ప్రారంభించినాడు. అది  5,90,000 మంది కంటే ఎక్కువ చందాదారులు మరియు 8 మిలియన్ వ్యూస్ తో  # crazyNK యొక్క ప్రజాదరణ స్పష్టమైంది. అతని ఛానెల్లో జనాదరణ పొందిన కొన్ని వీడియోలు హోవర్ బోర్డు, ఒక ప్లాస్టిక్ సీసా ఉపయోగించి  వాక్యూమ్ క్లీనర్  మరియు ఒక పాత CD ఉపయోగించి ఒక స్పీకర్ తయారు చేయుటగా   ఉన్నాయి. అతని వీడియోలు  సరళంగా అత్యద్భుతమైనవిగా హాస్యం తో ఉండును.  "వీడియోలు విద్యార్థులు వారి ప్రాజెక్టుల గురించి  ఆలోచనలు పొందుటకు సహాయపడుతుంది. వారు రోజువారీ వివిధ విషయాలను సరిఅయిన సమయంలో అప్లికేషన్ చేయుట తెల్పుతుందిఅని నవీన్ అంటాడు.

మరో విజయవంతమైన EduTuber ఛానల్ ఎక్జం ఫియర్ (Exam fear) రోష్ని ముఖర్జీ నడుపుతున్నది. ఆమె ఒక ఐటి సంస్థలో ఐదేళ్ల క్రితం  పని చేసినప్పుడు ఒక EduTuber గా ఆమె తన  ప్రయాణం ప్రారంభించింది. "నేను ఎప్పుడూ బోధన పట్ల మక్కువ గలిగి  ఆ రంగం లో ప్రవేశించేందుకు మార్గాలను ఆలోచిస్తూ ఉందే దానిని”. అని ఆమె అన్నారు. ఆమె తన పనిమనిషి(maid) దురవస్థ తెలుసుకొని తన సంకల్పమును  పటిష్టపరిచారు. "ఆమె పనిమనిషి  తమిళ నాడులో ఒక చిన్న గ్రామం నుండి వచ్చింది మరియు ఆమె పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు, ఆమె తరుచుగా ఆ స్కూళ్ళ విద్య నాణ్యత గా ఉండదు అని ఫిర్యాదు చేసిది.  కొన్నిసార్లు, మెట్రో నగరాల్లో ఉంటున్న ప్రజలు కూడా అలాoటి  సమస్యలు ఎదుర్కోవాల్సివచ్చేది  వారు తమ పిల్లల కోసం ఖరీదైన పాఠశాలల ఫీజ్లు కట్టలేక పోయేవారు. అందుకోసం  నేను VIII తరగతి నుంచి XII వరకు భౌతిక, గణితం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం పై వీడియో పాఠాలు అప్లోడ్ చేసాను అని ఆమె వివరిస్తుంది
ప్రస్తుత కాలం లో అందరికీ ఇంటర్నెట్ మరియు స్మార్ట్ఫోన్కి  కనెక్ట్ అయినప్పుడు, యూ  ట్యూబ్ విజ్ఞానం పొందటానికి  ఒక వర్ణనాత్మక మీడియం అని  నిరూపించబడింది. "నేను మొదటి కొన్ని వీడియోలను ట్రైల్ కోసం అప్లోడ్ చేసాను. వివిధ అంశాలు మరియు విషయాలపై వీడియోల కోసం ప్రజలు నుండి నిరంతరం ప్రవాహంలా వచ్చిన వ్యాఖ్యానాలు మరియు ఫీడ్బ్యాక్ నన్ను ప్రభావితం చేసినవి అని ఆమె అన్నారు. 
 .

ఆన్లైన్ లెర్నింగ్ వలన దాని స్వంత ప్రయోజనాలు ఉన్నాయి. ఇది విద్యార్థులు అధ్యయనం చేయడానికి వ్యక్తిగత సమయం ఇస్తుంది మరియు వారు భావనలు  సంగ్రహించడంలో సహాయపడుతుంది అని రోష్ని చెప్పారు. ఇది ఉచితం మరియు అందరూ  దీనిని పొందవచ్చు దాని మూలానా దీని  ఆకర్షణా పెరిగింది. యానిమేషన్లు మరియు నిజ జీవితంలో ఉదాహరణల సహాయంతో, విద్యార్థులు గతంలో కంటే మెరుగైన భావనలను అర్థం చేసుకోగలరు.

21 October 2016

ఇస్లాం పై జవహర్ లాల్ నెహ్రూ భావాలు


  

నవ భారత నిర్మాత, మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ స్థాపకుడు జవహర్ లాల్ నెహ్రు భారత దేశం లోని అలహాబాద్ నగరం లో14-11-1889న మోతిలాల్ నెహ్రు,స్వరూప రాణి దంపతులకు   జన్మించాడు. నెహ్రు విదేశాలలో విద్యాబ్యాసం చేసినాడు మరియు భారత జాతీయోద్యమం లో పాల్గొన్నాడు. తన జాతీయ వాద,ఉదారవాద,సామ్యవాద భావాలచే ప్రసిద్దుడు అయినాడు. చరిత్ర, రాజకీయాలు, దేశ పరిస్థితులపై నెహ్రు భావాలు విలువైనవి. నెహ్రు తనకాలం నాటి ప్రపంచ నాయకులలో ఒకరిగా పేరుగాంచినాడు మరియు స్వాతంత్ర్య భారతావని కి ప్రధమ  ప్రధానిగా(1947) పనిచేసినాడు. అప్పటినుండి మరణించేవరకు(27-05-1964) భారత ప్రధానిగా కొనసాగినాడు.

నెహ్రు ఈజిప్ట్ అద్యక్షుడు గమల్ అబ్దెల్-నాజర్, సుకర్ణో (లేదా సుకర్ణో) మరియు జోసిప్ బ్రోజ్ టిటో తో కలసి అలీనోద్యమము స్థాపించినాడు.ఆతని కుమార్తె, ఇందిరా ప్రియదర్శిని  మహాత్మా గాంధీ ఆ తరువాత భారత ప్రధాని పదవి చెప్పట్టినది.

నెహ్రు బహు గ్రంధ కర్త. అతని రచనలలో “గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ, డిస్కవరీ అఫ్ ఇండియా, లెటర్స్ టూ హిస్ డాటర్” ప్రముఖమైనవి. అతను రచించిన “గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ” లో ప్రపంచ చరిత్రను వివరించాడు.

ఈ గ్రంధం లో మనము నెహ్రు ఇస్లాం విస్తరణ, దాని నాగరికత-సంస్కతి, ఇస్లాం మరియు ప్రవక్త(స)  పై వెలుబుచ్చిన భావాలను పరిశిలించవచ్చు.

ముహమ్మద్ ప్రవక్త(స) తన అందు తన దైవదౌత్యం నందు ఉంచిన విశ్వాసమును జవహర్ లాల్ నెహ్రు ప్రశంసిoచేను. నెహ్రు మాటలలో తన అనుచరులను ప్రవక్త(స)  విశ్వాసంతో, నమ్మకంతో ఉత్తేజ పరిచెను. ఎడారి ప్రజలు దైవ ప్రవక్త (స) అందు ఉంచిన నమ్మకము మరియు విశ్వాసంతో  సగము ప్రపంచమును జయించినారు. విశ్వాసం, నమ్మకము, సహోదర భావన, ప్రజాస్వామ్యము మరియు అందరు ప్రజలు సమానులు అని ఇస్లాం చాటెను. ఈ భావనను ప్రవక్త (స) పెంపొందించెను.(1)

కొందరు  ఇతర మతముల స్థాపకుల వలె, ముహమ్మద్ ప్రవక్త(స) ఆనాటి కొన్ని క్రూర సామాజిక ఆచారాలను విరోధించెను.  ఆయన భోధనల సరళత్వం, సూటిదనం,ప్రజాస్వామ్యం మరియు సమానత్వ భావన ఆనాటి అరబ్ ప్రజలను విశేషముగా ఆకర్షించెను. నాటి సమాజం అనాగరిక ఆచారాలు క్రూర పద్దతులతో విసిగి పోయి మార్పు కోసం ఎదురు చూడ సాగేను. ఇస్లాం వారికి ఆ అవకాసం ప్రసాదించెను. అనేక పురాతన వేధింపులకు తెరపడింది. "[2]

అనేక తరాలుగా బాహ్య ప్రపంచం తో సంభంధం లేక ఒకరమైన నిద్రావస్థ లో ఉన్న అరబ్ జాతి ఒక్కసారి నిద్రావస్థ నుండి మేల్కొని ప్రపంచమును కలవర  పరిచినది. అరబ్బుల గాధ- వారు విజవంతముగా ఆఫ్రికా,ఆసియా మరియు యూరప్  లో విస్తరించిన విధానం, వారి ఉన్నత సంస్కృతి,నాగరికత, వారసత్వం ప్రపంచ ప్రజలను అబ్బుర పరిచి  ప్రపంచ అద్భుతాలలో ఒకటిగా నిలిచినది.  ఇస్లాం అరబ్బులను మేల్కొల్పి వారిలో  ఆత్మవిశ్వాసం మరియు శక్తి తో నింపినది. [3]

విశ్వాసం,నమ్మకము, సోదరభావం,అందరు ముస్లిం లందరు సమానులే అన్న భావన  ప్రజాస్వామిక గుణాలు నాటి ప్రపంచమును ఆకర్షించినవి. నాటి క్రైస్తవ సమాజం లోని  సామాన్య ప్రజలకు  ఈ భావనలు కొత్తవి మరియు ఆకర్షనియమైనవి. మానవులు అందరు సహోదరులె అన్న భావన నాటి అరబ్ సమాజాన్ని గాకా మొత్తం ప్రపంచాన్ని ఆకర్షించినది.  -[4]

నాటి పాలకులు ఖలీఫా అబూ బకర్ మరియు ఉమర్ అరబ్ మరియు ఇస్లామిక్ గొప్పతనమునకు  శంకుస్థాపన చేశారు.వారు ఖలిఫాలుగా  మతాధిపతులు మరియు రాజ్యాధిపతులుగా వ్యవహరించారు. -రాజు మరియు పోప్ గా ఉన్నారు. [5]

వారు ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ, వారి సామ్రాజ్యం విశాలమైనది అయినప్పటికీ వారు సరళ మరియు రుజుమార్గం లో జీవించారు.  విలాసవంతమైన జీవనాన్ని  తిరస్కరించారు. ఇస్లాం ప్రజాస్వామ్యబద్దం అనేదానికి ఉదాహరణగా నిలిచారు. [6]

క్రమంగా అరబ్బులు ఒక దేశం తరువాత ఒక దేశాన్ని జయిస్తూ తమ జైత్రయాత్ర కొనసాగించారు. కొన్ని దేశాలు ఎటువతి ప్రతిఘటన చూపక లొంగిపోయాయి. ప్రవక్త (స) మరణం తరువాత 25 సంవత్సరాల లోపు అరబ్బులు పర్షియా, అర్మీనియా, సిరియా, సెంట్రల్ ఆసియా లోని కొన్ని ప్రాతాలలో మరియు ఈజిప్ట్, ఉత్తర ఆఫ్రికా నుంచి పడమరకు విస్తరించారు. వారి విజయాలలో ఈజిప్ట్ ఆక్రమణ ముఖ్యమైనది.
 అప్పటికే ఈజిప్ట్ రోమన్ సామ్రాజ్యo మరియు క్రైస్తవ తెగల చేతిలో దోపిడీకి గురిఅయినది. కొంతమంది వాదన ప్రకారం ఆనాటి అలెక్జాoడ్రియా నగరం లోని ప్రసిద్ద పుస్తక భాoడాగారంను ముస్లిం లు తగల బెట్టినారు. కాని ఇది అబద్దపు వాదన. ముస్లింలు జ్ఞాన ప్రియులు. వారు పుస్తకములను జాగ్రత చేసెదరు. బహుశ  కానిస్టోoటినేపుల్ ను పాలించిన దియోడియుస్  చక్రవర్తి దీనికి కారకుడు. చాలాకాలం క్రితం జూలియస్ సిజర్ దండయాత్రలో సగము పుస్తక  భాండాగారము తగుల బెట్టబడినది. మిగతా భాగం క్రైస్తవ అభిమాని అయిన చక్రవర్తి దియోడియుస్ తగుల బెట్టినాడు   [7]

మరి ఒక ముఖ్య  విషయం ప్రస్తావించి నేను నా లేఖ ను పూర్తిచేస్తాను. అరబ్బులు, ముఖ్యంగా ఇస్లాం ప్రారంభం లో పూర్తి విశ్వాసం మరియు  ఉత్సాహంతో ఉన్నారు. అయినప్పటికి  వారు మత సహనం కలిగి ఉన్నారు  మరియు వారి  మతసహనo కు  అనేక ఉదాహరణలు ఉన్నాయి. దానిని జెరూసలేం లో ఖలీఫా ఉమర్ ప్రదర్శించినాడు.  స్పెయిన్లో మత స్వేచ్ఛ కలిగి భారీస్థాయిలో క్రైస్తవుల జనాభా ఉంది. భారతదేశం లో అరబ్బులు సింధ్ ను  తప్ప మిగతా ప్రాంతమును పాలించలేదు కాని వారికి అనాదిగా  భారత దేశం తో పరిచయాలు  మరియు స్నేహ సంబంధాలను కలిగి ఉన్నారు. నిజానికి మనము ఈ కాలం నాటి  అరబ్ వాసుల మత సహనాన్ని మరియు యూరోపియన్ క్రిస్టియన్ల  అసహన్నాని  గమనించ వచ్చు. [8]

అరబ్బుల జైత్రయాత్ర ముందు ప్రపంచం లోని గొప్ప  గొప్ప  సైనిక దళాలు, రాజులు ఒకరి తరువాత ఒకరు పాదాక్రాంతం అయినారు.  సామాన్య ప్రజలు ఈ రాజులు, సైనిక దళాలలో విశ్వాస ముంచక మానవ సమానత్వం, సోదర భావనను  ప్రసాదించే సామాజిక విప్లవం వైపు ద్రుష్టి నిల్పినారు.  [9]

అబ్బాసీయ ఖలఫాల కింద అభివృద్ధి చేసిన బాగ్దాద్ నగరం అరేబియన్ నైట్స్ యొక్క ప్రతిబింబం గా మారింది. రాజభవనాలు, ప్రజా కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, గొప్ప దుకాణాలు, ఉద్యానవనాలు మరియు తోటలను కలిగి  ఉండేది. వర్తకులు తూర్పు మరియు పశ్చిమ దేశాలతో  విస్తారమైన వాణిజ్యo కొనసాగించారు. ప్రభుత్వ అధికారులు  సామ్రాజ్య సుదూర ప్రాంతాలతో సంభంధం కలిగి  సమర్థవంతమైన తపాలా వ్యవస్థ, ఆస్పత్రులు కలిగి ఉండేది. ప్రభుత్వo అనేక శాఖలను కలిగి సందర్శకులు ప్రపంచవ్యాప్తంగా బాగ్దాద్ కు వచ్చేవారు. ముఖ్యంగా పండితులు, జ్ఞానులు, విద్యార్థులు మరియు కళాకారులను   ఖలీఫా స్వాగతించేవాడు.  [10]

ప్రాచిన కాలం లో గ్రీకు దేశం శాస్త్ర  విజ్ఞానానికి బాండాగారం. మద్య యుగాలలో అరబ్బులు శాస్త్రీయ దృక్పదం కలిగి విజ్ఞాన శాస్త్రాలను అభివ్రుద్దిచేసారు. వారిని ఆధునిక విజ్ఞాన వేత్తలు అనడం సమంజసం. వైద్యం మరియు గణితం వారు భారతదేశం నుండి గ్రహించి అభివృద్ధి చేసారు. అనేక మంది భారతీయ పండితులు,విద్వాంసులు పెద్ద సంఖ్యలో భాగ్దాద్ తరలి వచ్చారు.

అనేకమంది  అరబ్ విద్యార్ధులు ఉత్తర భారతదేశం లోని తక్షశిల మహా విశ్వవిద్యాలయానికి వెళ్లి అద్యయనం చేసి వైద్యo, గణితం  మరియు ఇతర అంశాలపై సంస్కృత పుస్తకాలను  పెద్ద సంఖ్యా లో అరబిక్ లోకి తర్జుమా చేసారు. కాగితం తయారీ - అరబ్బులు చైనా నుండి నేర్చుకున్నారు. ఇతరుల నుండి పొందిన జ్ఞానం ఆధారంగా, వారు సొంత పరిశోధనలు  చేసి అనేక ముఖ్యమైన ఆవిష్కరణలు చేసినారు. వారు మొదటి టెలిస్కోప్ మరియు నావికులకు ఉపయోగపడే  దిక్సూచి తాయారు చేసినారు, అరబ్ వైద్యులు మరియు సర్జన్లు యూరోప్ అంతటా   వైద్యంలో ప్రసిద్ధి చెందినారు. [11]

 "బాగ్దాద్ నగరం ఈ మేధో కార్యకలాపాల గొప్ప కేంద్రంగా ఉండేది. పశ్చిమంలో, కార్డోబా అరబ్ స్పెయిన్ రాజధాని, మరొక కేంద్రంగా ఉంది. కైరో లేదా అల్- ఖాహిరా, బస్రా మరియు కూఫా ప్రపంచ ప్రసిద్ద విద్యాలయాలను కలిగి పండితులకు నెలవుగా ఉండేవి. కాని వీటన్నింటికన్నా బాగ్దాద్ నగరం  "ఇస్లాం సామ్రాజ్య రాజధానిగా, ఇరాక్ యొక్క కన్నుగా, సామ్రాజ్య ప్రధాన నిలయంగా, అందం, సంస్కృతి మరియు కళల కేంద్రంగా ఉండేది.", అని ఒక అరబ్ చరిత్రకారుడు వివరిస్తున్నారు. ఇది 20,00,000 మంది జనాభా ను కలిగి  ఆధునిక కలకత్తా లేదా ముంబై కంటే పెద్దదిగా ఉండేది. "[12]

స్పెయిన్ ప్రాంతాల్లో అరబ్ పాలన దాదాపు 700 సంవత్సరాల పాటు సాగింది. అక్కడ స్పెయిన్ అరబ్బులు లేదా మూర్స్ గొప్ప నాగరికత మరియు సంస్కృతిని  అభివృద్ధి చేసారు.
మూర్స్ కార్డోబా నగరం ను ఆధునికతకు మారుపేరుగా తీర్చిదిద్దినారు. ఆ కాలంలో  ఐరోపా మొరటు అజ్ఞానం మరియు కలహాల తో నిండి ఉండేది. కార్డోబా నగరం మాత్రమే చదువు, విజ్ఞానము, ప్రకాశవంతమైన నాగరికతకు కలిగి పాశ్చాత్య ప్రపంచం ముందు మెరుస్తూ ఉండేది.
కార్డోబ కేవలం 500 సంవత్సరాలపాటు అరబ్ స్పెయిన్ కు  రాజధానిగా ఉంది.  ఆ కాలం లో  అది మిలియనల నివాసులను కలిగిన   ఒక గొప్ప నగరం. ఈ గార్డెన్ సిటీ పొడవు పది మైళ్ళ ఉండి దాని శివార్లు  ఇరవై నాలుగు మైళ్ళను కలిగి ఉండేది. 60,000 రాజభవనాలు మరియు భవంతులను, 2,00,000 చిన్న ఇళ్ళు, 80,000 దుకాణాలు, 3,800 మసీదులు మరియు 700 బహిరంగ స్నానవసతులు  కలిగి ఉండేది. అనేక గ్రంధాలయాలను ముఖ్యం గా చీఫ్ ఎమిర్ ఇంపీరియల్ లైబ్రరీ 400,000 పుస్తకాలు గలిగి ఉండెది. కార్డోబ విశ్వవిద్యాలయం ఐరోపా మరియు కూడా పశ్చిమ ఆసియాలో ప్రసిద్ధి చెందింది. పేదలకు ఉచిత ప్రాథమిక పాఠశాలలు స్థాపించబడినవి.

ఒక చరిత్రకారుడి అభిప్రాయం లో "ముస్లిం స్పెయిన్ లో దాదాపు అందరూ చదువు నేర్చినారు  కాని క్రైస్తవ యూరప్ లో మతాధికారులను  తప్పించి అత్యధిక వ్యక్తులు  నిరక్షరాస్యులు” ఈవిధంగా కార్డోబా నగరం బాగ్దాద్ కు పోటాపోటీగా ఉండేది.  కార్డోబా నగర కీర్తి  యూరోప్ అంతటా వ్యాపించి ఒక జర్మన్ రచయిత దానిని "ప్రపంచంలోని ఆభరణం" అని పలికినాడు. కార్డోబా  విశ్వవిద్యాలయమునకు   సుదూర ప్రాంతాల నుండి విద్యార్థులు వచ్చేవారు మరియు  అరబ్ తత్వశాస్త్రం ఐరోపాలోని ఇతర గొప్ప విశ్వవిద్యాలయాలకు విస్తరించినది.. [13]

రిఫెరేన్సేస్(References):

[1] నెహ్రు: గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ 144.
[2] నెహ్రు: గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ 145.
[3] నెహ్రు: గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ. 143.
[4] నెహ్రు: గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ. 144.
[5]  ఖలీఫా యూరప్ లోని పోప్ అంతా మతాదికారి కాదు )The caliph in Islam was not of such religious authority as known in Europe).
[6] నెహ్రు: గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ 144.
[7] నెహ్రు: గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ 145.
[8] నెహ్రు: గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ. 148.
[9] నెహ్రు: గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ 151.
[10] నెహ్రు: గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ 151.
[11] నెహ్రు: గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ 151.
[12]  నెహ్రు: గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ. 151.
[13] నెహ్రు: గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ 189-190.


  

19 October 2016

భారత దేశము లో అండర్ ట్రయిల్ ఖైదీల సంఖ్య వెస్ట్ ఇండీస్ లోని బార్బోడోస్ జనాభా కు సమానం(Undertrial prisoners in India equals population of Barbados)









1953 లో అరెస్టు అయిన షా 1968 లో విడుదల అయి 30 సంవత్సరాలపాటు బీహార్ లోని ముజఫర్పూర్ జైలులో అండర్ ట్రయిల్ గా గడిపాడు.
ఠాకూర్ 16 సంవత్సర వయస్సు లో  అరెస్టు అయి విచారణ లేకుండా బీహార్ మధుబని జైలులో అండర్ ట్రయిల్ గా 36 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు.
ఈ రెండు ఉదాహరణలు 2014 భారత దేశ జైలు గణాంకాలు  ప్రకారం ఇండియన్ జైళ్లలో ఉన్న 282879 మంది అండర్ ట్రయిల్ ఖైదిల స్థితి ని సూచిస్తున్నాయి. ఇండియన్ జైళ్లలో ఉన్నఅండర్ ట్రయిల్ ఖైదిల సంఖ్య కరేబియన్ దేశం బార్బొడాస్ యొక్క జనాభా కు సమానంగా ఉంది.
జైలు గణాంకాల ప్రకారం 2010 మరియు 2014 మద్య ఉన్న అండర్ ట్రయిల్ ఖైదిలలో 25% మంది ఒక సంవత్సరం కన్నా ఆధికంగా జైలు లో ఉన్నారు. మొత్తం ఖైదీలలో 2010 మరియు 2014 మద్య అండర్ ట్రయిల్ ఖైదీల శాతం 65% ఉంది. 2014 లో ప్రతి 10మంది లో ఏడుగురు ఖైదీలు అండర్ ట్రయిల్స్ గా ఉన్నారు మరియు ప్రతి 10 మంది లో ఇద్దరు ఒక సంవత్సరం కన్నా అధికంగా జైలు లో శిక్ష బడకుండా అదుపులోఉన్నారు.

విచారణ లేదా విచారణ సమయంలో జైళ్లలో నిర్బంధించిన వారిని అండర్ ట్రయిల్ ఖైది అని పిలుస్తారు.  కానీ ఆ నిర్బంధ సమయంలో వారు తరచుగా  మానసిక మరియు శారీరక హింస గురి అవుతారు మరియు జైలు లో హింస మరియు పేద జీవన పరిస్థితుల బారి పడతారు. వారుతరచుగా తమ కుటుంబ సంబంధాలను,  తమ జీవనాధారాన్ని  కోల్పోతారు.

జైలు ఆవరణ లోపల న్యాయవాదులతో  సంభాషించడానికి వీరికి రెండు కారణాల వలన వీలుకాదు. వీరు పరిమిత వనరులు కలిగి  మరియు న్యాయ ప్రతినిధులతో వారు నిరోధిత యాక్సెస్ కలిగి ఉంటారు.ఒక సరసమైన మరియు వేగవంతమైన విచారణ ఖైదీలకు  లభిoచాలని 1980 సుప్రీం కోర్ట్ తీర్పు ఉన్నప్పటికీ రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం జీవితం మరియు స్వేచ్ఛ వారి ప్రాథమిక హక్కులో  భాగంగా అయిన అండర్ ట్రయిల్ ఖైదీలకు ఆ అవకాశం  లబించుట లేదు.
కోర్టుదృష్తి లో ఈ  ఖైదీలు  ఒక "డబుల్ అంగవైకల్యాన్ని" ఎదుర్కొoతున్నారు. వీరు అత్యంత పేద, వెనుకబడిన సామాజిక వర్గాలకు చెంది కొద్దిపాటి విద్య కలిగి ఉంటారు మరియు వారి స్వరo అరుదుగా వినిపిస్తుంది.

"న్యాయవ్యవస్థ మరియు ప్రభుత్వం ప్రకారం అనేక అండర్ ట్రయిల్ ఖైదిలు పేదవారు మరియు చిన్న నేరాలకు పాల్పడినవారు.దీర్ఘ కాలం నిర్భందింప పడి, వారికి వారి హక్కులు  తెలియదు మరియు న్యాయ సహాయo పొందలేరు” అని  న్యాయవాద నిపుణుల భావన.

2005 వచ్చిన సి.పి.సి. 436 సెక్షన్ నిభందనలకు బిన్నంగా వారు సంవత్సరాల తరబడి నిర్భంధం లో మగ్గుతున్నారు. ఈ సెక్షన్ నిభందనల ప్రకారం అండర్ ట్రయిల్ ఖైదీలకు వారి నేరం మీద విచారణ జరిగి  శిక్ష ఖరారు అయితే వారు  అనుభవించే  శిక్ష కాలం లో సగం అండర్ ట్రయిల్ ఖైది గా గడిపిన వారిని వక్తిగత   బ్యాండ్ పై ఎటువంటి స్యురిటి లేకుండా వారిని విడుదల చేయవచ్చు. అయితే ఈ నిభందన మరణ శిక్ష మరియు యావజ్జీవ శిక్ష అనుభవించే ఖైదీలకు వర్తించదు. కాని జైలు రికార్డ్స్ ప్రకారం సి.పి.సి. క్రింద జీవిత శిక్ష లేదా మరణ శిక్ష విధించడానికి అవకాసం ఉన్న కేసులు దాదాపు 39% కొట్టివేయబడుచున్నవి.

2014 అంతానికి 1,22,056  మంది అండర్ ట్రయిల్ ఖైదిలలో 43% మంది 6 నెలలకు మించి మరియు 5 సంవత్సరాలకు మించి  ఉంటున్నారు. వారికీ నేరం రుజువు అయి శిక్ష పడే కాలం కన్నా అధిక కాలం అండర్ ట్రయిల్ గా గడుపుతున్నారు. 3 నెలలనుంచి 5 సంవత్సరాల వరకు  అండర్ ట్రయిల్ గా ఉన్న ఖైది ల సంఖ్య లో పెరుగుదల కన్పిస్తుంది

2014 నాటికీ భారతదేశం లోని 16 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో 25% మంది 1 సంవత్సరం కన్నా అధికంగా ఉన్న అండర్ ట్రయిల్ ఖైదీలు వున్నారు. జమ్మూ-కాశ్మీర్ లో 54% మంది గోవా లో 50% గుజరాత్ లో 42% యు.పి. లో 18.21 మంది ఉన్నారు

2013 లో మాజీ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ప్రబుత్వ, కోర్ట్  ఉత్తర్వులకి బిన్నంగా భారత దేశం లోని 1382 జైల్స్ లో కల అమానవీయ దుర్భర పరిస్థితులను న్యాయస్థానం దృష్టి కి ఒక లేఖ ద్వారా తెచ్చారు.  ఆ లేఖను ఒక పిల్ గా పరిగణించిన న్యాయస్థానం 2014 లో ఇచ్చిన తన తీర్పు లో సి.పి.సి. 436 సెక్షన్ క్రింద అర్హత ఉన్నఅండర్ ట్రయిల్ ఖైదీలను వెంటనే విడుదల చేయమని  మరియు 2013 ఇంటిరియం ఆర్డర్ లో సూచించినట్లు ప్రతి జిల్లా లో అండర్ ట్రయిల్ రివ్యూ కమిటి లను ఏర్పాటు చేయమని ఆదేశాలు జారి చేసింది.

అండర్ ట్రయిల్ రివ్యూ కమిటి లో జిల్లా న్యాయమూర్తి, జిల్లా మ్యాజిస్త్రటే మరియు సూపరింటెండెంట్ అఫ్ పోలిస్ ఉంటారు. వీరు త్వరిత విచారణకు మరియు కేసుల రివ్యు కు బాధ్యత వహిస్తారు. దీని పలితంగా జూలై 1,15 నుంచి జనువరి 31, 16 వరకు సుమారు 36000 మంది అండర్ ట్రయిల్ ఖైదిలు విడుదల చేయ బడ్డారు. ఇది ఒక శుభ పరిణామం అని ఒక న్యాయవాది అభిప్రాయపడ్డారు

అయితే విడుదల అయిన మొత్తం భారత దేశం లోని వివిధ జైల్స్ లో అండర్ ట్రయిల్ ఖైదిలలో 2% మాత్రమే. ఐ.పి.సి. నేరాల క్రింద పెండింగ్ క్రైమ్స్ 2014, 2015లలో వరుసరగా 84%86% ఉన్నాయి.

పెండింగ్ కేసులు పెరుగుటకు ప్రధాన కారణం దిగువ న్యాయస్థానాలలో న్యాయమూర్తుల కొరత. 25 మిలియన్ల పెండింగ్ కేసులను క్లియర్ చేయుటకు భారత న్యాయస్థానములకు కనీసం 10-12 సంవత్సరాలు పట్టును.

సిమినల్ ప్రోసిజర్ కోడ్ గురించి పోలీస్ వారికి, జైల్ లో నిర్భందించిన వారికి అవగాహన లేదు.    
పనిచేయని అండర్ ట్రయిల్ రివ్యూ కమిటి, జైలు రికార్డ్స్ లో తేడాలు, సమాచార వ్యవస్థ సరిగా లేకపోవుట, న్యాయ సహాయం లబించక పోవుట, పోలిస్ ఎస్కార్ట్ లేక విచారణ ఆగిపోవటం, విడియో కాన్ఫరెన్స్ సదుపాయం లేకపోవుట వలన భారత దేశం జైల్స్ లో అండర్ ట్రయిల్ ఖైది లు అధికం గా ఉంటున్నారని  అమ్నేస్టి ఇంటర్నేషనల్ అభిప్రాయం. 
.