31 March 2020

మక్ధూమ్ మొహియుద్దీన్ Makdhoom Mohiuddin (4 ఫిబ్రవరి 1908 - 25 ఆగస్టు 1969)




Makhdoom Mohiuddin: Makhdoom Mohiuddin



మగ్దూం మొహియుద్దీన్ (ఫిబ్రవరి 41908 - ఆగష్టు 251969) స్వాతంత్ర్య సమరయోధుడుమహాకవి, ప్రముఖ కార్మిక నాయకుడుఉర్దూ కవిహైదరాబాదు సంస్థానంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ఒకడు.

మగ్దూం మొహియుద్దీన్‌  పూర్తిపేరు అబూ సయీద్ మహ్మద్ మఖ్దూమ్ మొహియొద్దీన్ ఖాద్రి (మహ్మద్‌ మగ్దూం మొహియుద్దీన్‌ హుజ్రీ). మఖ్దూమ్ మొహియుద్దీన్1908 ఫిబ్రవరి, 4న హైదరాబాద్ జిల్లా మెదక్ జిల్లా లోని ఆండోల్ లో జన్మించాడు. అతను ఉపాధ్యాయులు మరియు మతగురువుల కుటుంబానికి చెందినవాడు.

అతని పూర్వీకులు ఉత్తర ప్రదేశ్ లోని ఆజంగఢ్‌లో ఉండేవారు. ఆయన తాత (తల్లితండ్రి) రషీదుద్దీన్ ఔరంగజేబు సైన్యాలతో పాటు దక్కన్ పీఠభూమికి వచ్చాడు. అలాగే, మరో తాత (తండ్రి  తండ్రి) సయ్యద్ జాఫర్ అలీ కూడా ఉత్తరవూపదేశ్ షాజహానాబాద్ నుండి 1857లోనే దక్షిణానికి వచ్చాడు. ఆ రకంగా ఆ కుంటుంబమంతా హైద్రాబాద్ దక్కన్ పరిసరాలకు చేరింది. ఆయన తండ్రి గౌస్ మొహియొద్దీన్ నిజాము ప్రభుత్వంలో సూపరింటెండెంటుగా పనిచేసేవాడు.
మఖ్దూమ్‌కు కేవలం ఆరు సంవత్సరాల వయసులో అతని తండ్రి మరించాడు. మరణించాడు. మగ్దూం తన బాబాయి బషీరుద్దీన్ వద్ద పెరిగాడు మరియు అతను ఉత్తమ విద్యను పొందాడు. మఖ్దూమ్ పిల్లల పట్ల చాలా దయతో ఉండేవాడు  మరియు వారిని చాలా ప్రేమించాడు.
అతను తన పాఠశాల మరియు మత విద్యను తన గ్రామంలో పొందాడు మరియు ప్రాథమిక విద్య హైదరాబాదు లోని ధర్మవంత హైస్కూల్లోను, మెట్రిక్యులేషను సంగారెడ్డిలోను చదివాడు తరువాత ఉన్నత విద్య (బాచిలర్స్ మరియు మాస్టర్స్ డిగ్రీ) కోసం హైదరాబాద్ నగరానికి వెళ్ళాడు. 1929లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరాడు. పిన తండ్రి కొడుకు నిజాముద్దీన్ మఖ్దూమ్‌ను వెన్నంటి ఉన్నాడు. పినతండ్రి బషీరుద్దీన్ పెంపకంలో మఖ్దూమ్ సూఫీ మత సాంప్రదాయంలో క్రమశిక్షణతో పెరిగాడు.అక్కడ అతను బాచిలర్స్ డిగ్రీ పొందాడు మరియు తరువాత  ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 1936 లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు.అతను ఉన్నత విద్యను పూర్తి చేసిన తరువాత హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు మరియు బ్రిటిష్ ఆక్రమణకు వ్యతిరేకంగా స్వేచ్ఛా భారతదేశం కోసం పోరాటo చేసాడు.

మఖ్దూమ్ బతకడానికి పెయింటింగ్స్, సినిమా తారల ఫొటోలు అమ్మాడు. ట్యూషన్లు చెప్పాడు, పత్రికల్లో పనిచేశాడు. ఆయన రాసిన గోథే ప్రేమ లేఖలు’ ‘మక్తబాఅనే స్థానిక ఉర్దూ పత్రిక అచ్చేసింది. (ఆ పత్రిక సంపాదకుడు అబ్దుల్ ఖాదరీ సర్వరీ తర్వాతి కాలంలో కాశ్మీర్ వెళ్ళిపోయి అక్కడ ఉర్దూ ప్రొఫెసర్‌గా పనిచేశాడు).
ఉస్మానియా యూనివర్సిటీలో మఖ్దూమ్ (1934-37) హాస్టల్‌లో ఉండేవాడు. అక్కడ తన తొలి కవిత టూర్1934లో రచించాడు. మఖ్దూమ్కవి గా, నాటక రచయితగా, నటుడిగా ప్రసిద్ధుడయ్యాడు. 1934లో బెర్నార్డ్ షా నాటకానికి హోష్ కె నా ఖూన్అనే ఉర్దూ అనుసరణ రాసి హైద్రాబాద్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ సమక్షంలో ప్రదర్శించాడు. గురుదేవులు ఆ నాటకం చూసి ఆనందం పట్టలేక, నాటక ప్రదర్శన అయిపోగానే స్టేజిపైకి వెళ్ళి మఖ్దూమ్‌ని అభినందించి, తన శాంతినికేతన్‌కు వచ్చి చదువుకోవాల్సిందిగా ఆహ్వానించాడు. మఖ్దూమ్ మర్షదే కామిల్అనే మరో నాటకం రాశాడు. 1937లో మఖ్దూమ్ తన 29వ యేట ఎం.ఎ. డిగ్రీ తీసుకున్నాడు. ఉర్దూ నాటకంపై ఒక పరిశోధన పత్రం కూడా రాశాడు. హైకోర్టు పక్కన గల సిటీ కాలేజీలో అధ్యాపకుడిగా ఉద్యోగం దొరికింది. కమ్యూనిస్టు రహస్య పత్రిక నేషనల్ ఫ్రంట్సంపాదించి చదివేవాడు.

మఖ్దూమ్ 1934 లో సిటీ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేయడం ప్రారంభించాడు మరియు ఉర్దూ సాహిత్యం భోదించాడు. అతను అద్భుతమైన పాండిత్యము గల ఉర్దూ భాషా కవి. ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టు పార్టీ స్థాపకుడు. మఖ్దూమ్ మార్క్సిస్ట్ రాజకీయ కార్యకర్త.. అతను హైదరాబాద్‌లో ప్రోగ్రెసివ్ రైటర్స్ యూనియన్‌ను స్థాపించాడు మరియు కామ్రేడ్స్ అసోసియేషన్ మరియు భారత కమ్యూనిస్ట్ పార్టీలో  చురుకుగా పనిచేశాడు.

నాగపూర్ కామ్రేడ్ల సహాయంతో 1930-40లలో హైద్రాబాద్‌లో స్టూడెంట్స్ యూనియన్ప్రారంభించాడు. 1940లో తన సహచరులతో కలిసి కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. చండ్ర రాజేశ్వరరావు, గులాం హైదర్, రాజ బహుదూర్ గౌర్, హమీదలీ ఖాద్రీ లాంటి నాయకులతో కలిసి పనిచేస్తుండేవాడు.‘‘రైతుకు రొట్టె నివ్వని పొలమెందుకు, కాల్చేయండి ప్రతి గోధుమ కంకిని!’’ అనే ఇక్బాల్ కవితను నినదించేవాడు. అక్తర్ హుస్సేన్ రాయ్‌పురి, సిబ్తె హసన్‌లతో కలిసి హైద్రాబాద్‌లో అభ్యుదయ రచయితల సంఘంస్థాపించాడు. సరోజినీ నాయుడు నివాసమైన గోల్డెన్ త్రెషోల్డ్లో డాక్టర్ జయసూర్యజె.వి.నరసింగరావులతో కలిసి సాహిత్యసామాజికరాజకీయ అంశాలపై చర్చలు జరుపుతుండేవాడు. 

చార్మినార్ సిగట్ ఫ్యాక్టరీ, బట్టల గిర్నీ, అల్విన్, షాబాద్ సిమెంట్, ఎన్ ఎస్సార్ రైల్వే ఎంప్లాయిస్, ఎలక్ట్రిసిటీ, సి.డబ్ల్యు.డి. మున్సిపాలిటీ, బటన్ ఫ్యాక్టరీ వంటి వందల కంపెనీల్లోని కార్మిక సంఘాలకు మఖ్దూమ్ అధ్యక్షుడయ్యాడు.అహో రాత్రులు వారి సంక్షేమం కోసం కృషి చేశాడు. స్టేట్ అసెంబ్లీలో మాట్లాడినా, బయట కార్మిక సంఘాలలో మాట్లాడినా ఆయన వాగ్ధాటికి ఎదురుండేది కాదు. విషయం సూటిగా, స్పష్టంగా, దృఢంగా, బలంగా చెప్పేవాడు. నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. 1957లో మెదక్ నుండి పార్లమెంట్‌కు పోటీ చేసి ఓడిపోయాడు. శాసనమండలికి ఎన్నికై 1969లో కన్నుమూసే దాకా కమ్యూనిస్టు నేతగా ఆ పదవిలో కొనసాగాడు.
మఖ్దూం మతాన్నీ, మత విశ్వాసాలనూ గౌరవించాడు. మత దురహంకారాన్ని నిరసించాడు. తన చిన్ననాటి కష్టాలను గుర్తుంచుకొని ఆబాధలు మరెవరికీ రాకూడదనీ, శ్రమజీవుల రాజ్యంతోనే అది సఫలమౌతుందనీ భావింఛాడు
అతను భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుడు. కొత్తగా విముక్తి పొందిన ఇండియన్ యూనియన్‌లో విలీనం కావాలని అప్పటి హైదరాబాద్ రాచరికానికి వ్యతిరేకంగా ఆయన ర్యాలీ చేశారు. అతను నిర్భయంగా నిజాం సైన్యంతో పోరాడాడు మరియు హైదరాబాద్ భారతదేశంలో విలీనం కావాలని కోరినాడు. 1946-1947లో పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ తిరుగుబాటులో ముందంజలో ఉన్నాడు,.
అప్పటి హైదర్‌బాద్ పాలకుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్వేచ్ఛ కోసం ప్రజలను మేల్కొల్పినందుకు మరియు నవాబ్ ("రాచరిక") పాలనను రద్దు చేయమని కోరినందుకు చేసినందుకు అతన్ని చంపాలని ఆదేశాలు జారీ చేశారు.
మఖ్దూమ్ కవిత్వం మరియు రాజకీయాలపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నాడు. మఖ్దూమ్ మొహియుద్దీన్ ప్రముఖ విప్లవాత్మక ఉర్దూ కవి. మఖ్దూమ్ ప్రధానంగా నాజ్ కవి అయినప్పటికీ, అతను గజల్ రచయితగా కూడా  తన సామర్థ్యాన్ని కూడా నిరూపించాడు. అతను గద్య రంగంలో కూడా తన ప్రతిభను ప్రదర్శించాడు. అతని కవితా రచనలలో సుర్ఖ్ సవేరా, గుల్-ఎ-తార్, బసాత్-ఎ-రాక్స్ (కంప్లిట్ వర్క్స్ ) Surkh Saveraa, Gul-e-tar, Basaat-e-raqs (complete works). ఉన్నాయి.
బసాట్-ఎ-రాక్స్ మఖ్దూమ్ యొక్క కవితల   పూర్తి సంకలనం  అతని మునుపటి రెండు సంకలనాలు  సుర్ఖ్ సావేరా ("ది రెడ్ డాన్", 1944) మరియు గుల్-ఎ-తార్ ("ది డ్యూడ్రెన్చెడ్ రోజ్ The Dewdrenched Rose ", 1961)

బిసాత్-ఎ-రక్స్ Bisat-e-Raqs ("The Dance Floor"), పేరుతో కవితల సంకలనానికి ఆయన బాగా ప్రసిద్ది చెందారు, దీనికి ఆయనకు 1969 సాహిత్య అకాడమీ అవార్డు ఉర్దూలో లభించింది. అతని ప్రచురించిన రచనలలో ఠాగూర్ మరియు అతని కవితల మీద ఒక వ్యాసం, , ఒక నాటకం, హోష్ కే నఖున్ Hosh ke Nakhun ("Unravelling"),  , బెర్నార్డ్ షా యొక్క వితంతువుల గృహాల అనుసరణ adaptation of Shaw's Widowers' Houses మరియు గద్య వ్యాసాల సమాహారం ఉన్నాయి.
అతన్ని షాయర్-ఎ-ఇంక్విలాబ్ '(' విప్లవ కవి ') అని పిలుస్తారు. అతని గజల్స్ మరియు సాహిత్యం చాలా హిందీ చిత్రాలలో ఉపయోగించబడ్డాయి. అతని ముఖ్యమైన రొమాంటిక్ గజల్స్ ఉన్నాయి: -ఏక్ చమేలి కే మoడ్వే తలే, ఆప్ కి యాద్ ఆతి రాహి రాత్ భర్ మరియు ఫిర్ చిది రాత్, బాత్ ఫూలాన్ కి.
మఖ్దూం కార్మిక నాయకుడుశాసన మండలి సభ్యుడు. ఫాసిజానికి వ్యతిరేకంగా సమసమాజ స్థాపనకోసం క్రియాశీలంగా రాజకీయాల్లో పాల్గొన్నాడు. అందరూ కలిసి భోజనం చేసే దస్తర్‌ఖాన్ల గురించి కల గన్నాడు. ప్రగతిశీల భావాలతో పీడితుల పక్షాన కలమెత్తి నమ్మిన సిద్ధాంతానికి జీవితాన్నంకితం చేసి అమరుడైనాడు. కమ్యూనిస్టు అయిన మఖ్దూం. మతాన్ని దూషించలేదు అనుసరించలేదు. హైద్రాబాద్ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ శాఖకు తొలి కార్యదర్శి. నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన ప్రపంచ ప్రసిద్ధ తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్య పాత్రధారి. సాయుధ పోరాటానికి ముందు కారాగార శిక్షలు, పోరాటం తర్వాత అజ్ఞాత వాసం
హైద్రాబాద్ రాష్ట్ర శాసనసభ్యుడు (1952) శాసనమండలి సభ్యుడు, ప్రతిపక్ష నేత (1956-1969), భారత కార్మిక వర్గ విప్లవ చరివూతలో ముఖ్య పాత్రధారి. ఎఐటియుసికి జాయింట్ సెక్రటరీ.నిజాముకు వ్యతిరేకంగా తెలంగాణా సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించాడు. ఢిల్లీలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ సమాఖ్య (ఎ.ఐ.టి.యు.సి.) జాయింట్ సెక్రటరీగా కొంత కాలం ఢిల్లీలో ఉన్నాడు.1952-55 మధ్య చైనాసోవియట్ యూనియన్, తూర్పు యూరప్ దేశాలు, ఆఫ్రికన్ దేశాలు తిరిగి వచ్చాడు. ప్రపంచ ట్రేడ్ యూనియన్ సమాఖ్య ప్రధాన కార్యాలయం వియాన్నాలో (1953-54) పనిచేశాడు.
మఖ్దూమ్ మొహియుద్దీన్ రాబియా బేగంను వివాహం చేసుకున్నాడు మరియు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతని పిల్లలలో పెద్దది కుమార్తె జాకియా బేగం, ఇద్దరు కుమారులు. మొదటి కుమారుడు నుస్రత్ మొహియుద్దీన్, SBHమాజీ ఉద్యోగి, సుప్రసిద్ధ కవి, సిపిఐ సభ్యుడు, ఇన్సాఫ్ తెహ్రీక్ కార్యదర్శి. రెండవ కుమారుడు జాఫర్ మొహియుద్దీన్, హైదరాబాద్ లోని సింగరేణి బొగ్గు గనుల కంపెనీ  లో పనిచేస్తున్నాడు.  కుమార్తె ఆగస్టు 6, 2010 న మూత్రపిండాల వైఫల్యం మరియు దీర్ఘ అనారోగ్యం కారణంగా మరణించింది. ఆమె సయ్యద్ అబ్దుల్ రహీమ్ క్వాద్రిని వివాహం చేసుకుంది మరియు ఆమెకు ముగ్గురు కుమార్తెలు మరియు ముగ్గురు కుమారులు ఉన్నారు
ఖ్యాతి/లెగసి ;

మఖ్దూమ్ పిలా దుశాలఅనే పాట రాశాడు. హాస్యోక్తులు చిందిస్తూ, లయబద్దంగా సాగే ఆ పాట హైద్రాబాద్ విద్యార్థిలోకంలో ఎంతో ప్రాచుర్యం పొందింది. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ సరదాగా, మంచి స్నేహితుడిలా ఉండే మఖ్దూమ్ విద్యార్థులందరికీ ఆత్మీయుడిగా ఉండేవాడు.
అతను 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు మరియు అత్యంత ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకుడు.
ఈయన చదివే ఉర్దూకవితలను దాశరధి తెలుగులో అనువదిస్తూ గానం చేసేవాడు.
బెర్నార్డ్ షా నాటకానికి ఉర్దూ అనువాదాన్ని టాగోర్ సమక్షం‌లో ప్రదర్శించగా రవీంద్రుడు వేదికపైకివచ్చి మఖ్దూం‌ను అభినందించాడు.
సొంత ఇల్లులేని మఖ్దూం మజీదులోనే జీవించాడు
మఖ్దూం సారా సంసార్ హమారాహై/ పూరబ్, పశ్చిమ్, ఉత్తర్, దక్కన్/ హం అమెరికీం/ హం ఆఫ్రింగీ/ హం చీనీ/ జాం బజాన్ వతన్అంటూ అంతర్జాతీయ వాదాన్ని ప్రకటించాడు.

అతను రష్యా ప్రభావం  ఉన్న దాదాపు అన్ని యూరోపియన్ దేశాలలో పర్యటించాడు మరియు చైనాను కూడా సందర్శించాడు. అతను మాస్కోను సందర్శించినప్పుడు యూరి గగారిన్ను కలుసుకున్నాడు మరియు అతనిపై ఒక కవిత రాశాడు.
అతను ప్రగతిశీల రచయితల ఉద్యమ ప్రముఖుడు  మరియు అతని గౌరవార్ధం  భారత కమ్యూనిస్ట్ పార్టీ(సి.పి.ఐ) హైదరాబాద్‌లో "మఖ్దూమ్ భవన్" నిర్మించింది.
ప్రముఖ అధ్యాపకుడు, ఉర్దూ కవి. 'షాయరే ఇంక్విలాయ్' (ఉద్యమ కవివిప్లవ రచయిత) బిరుదాంకితుడు. కవియేగాక నాటక కర్తగాయకుడునటుడు కూడా. ఇతని గజల్ లు, పాఠ్యoశాలలోను, సినిమాలలోనూ ఉపయోగించాడు.ఆయన రాసిన ఏ జంగ్ హై జంగే ఆజాదీ’ ‘ఎక్ చంబేలీకె మండ్వే తలేఅనే గీతాలు ప్రసిద్ధి పొందాయి.ఉర్దూ మహాకవిగా ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు.
'ఫిర్ ఛిడీ బాత్, బాత్ ఫూలోం కి' అను గజల్ (గేయం) సుప్రసిధ్ధి.
1944లో సుర్ఖ్ సవేరా (అరుణోదయం),
1961లో గుల్ ఎ తర్ (తాబీపూవు),
1966లో బిసాతే రక్స్ (నాట్య వేదిక) పేర మూడు కవితా సంపుటాలను రచించాడు.
1944-51 మధ్యకాలంలో 'తెలంగాణ' అనే కవిత రాశాడు.
ఏ జంగ్ హై జంగే ఆజాదీ
ఆజాదీ కె పర్చమ్ కె తలె
హం హింద్ కె రహ్నే వాలోం కి
మెహకూమోం కి మజ్బూరోం కి
దహెఖానోం కి మజ్దూరోం కి
ఆజాది కే మత్వాలోం కి
యే జంగ్ హై జంగే ఆజాదీ’’
అనే ఆయన గీతం అంతర్జాతీయ గీతంగా రూపుదిద్దుకుంది. (ఇది స్వాతంత్య్ర సమరం. మేం అమెరికన్‌లం, మేం ఆఫ్రికన్‌లం, చైనీయులం, ప్రపంచమంతా మేమే - ప్రపంచమంతా మాదే’)
సారా సంసార్ హమారా హై
పూరబ్, పశ్చిమ్, ఉత్తర్, దక్కన్
హం అమెరీకి, హం ఆఫ్రంగి
హం చీనీ జాం బాజానె వతన్’’
మఖ్దూమ్ కవిత్వాన్ని గజ్జెల మల్లాడ్డి చాలావరకు తెలుగులోకి అనువదించాడు. ఆయన జీవితం గురించి, సాహిత్య కృషి గురించి డా॥ రాజబహుదూర్ గౌర్, దేవులపల్లి మదన్ మోహన్‌రావు ప్రభృతులు రాశాడు. అంజుమనే తరఖి ఉర్దూ, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వంటి సాహిత్య, సాంస్కృతిక సంస్థలలో ముఖ్యుడు మఖ్దూమ్.
ఫిబ్రవరి 4 మరియు 5 తేదీలలో, అతని జన్మ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్‌లో కార్యక్రమాలు నిర్వహించారు.
పురస్కారాలు; ఉర్దూ కవితలకు సాహిత్య అకాడమీ అవార్డు – 1969

1969ఆగష్టు 25 తేదీన గుండెపోటుతో ఢిల్లీలో చనిపోయాడు..


.