30 November 2023

'ర్యాట్ హోల్స్' సిల్క్యారా హీరోలు ‘Rat holes’ Heroes of Silkyara

 

భారతదేశంలో ఎలుకల రంధ్రం తవ్వడం Rat-hole mining ఒక ప్రమాదకరమైన పద్ధతిగా నిషేధించబడింది.  కానీ కూలిపోయిన సిల్క్యారా సొరంగంలో 400 గంటలకు పైగా చిక్కుకుపోయిన 41 మంది తక్కువ వేతనాల కాంట్రాక్టు కార్మికులను దిగుమతి చేసుకున్న ఆధునిక యంత్రాలు ద్వారా కాకుండా 12 మంది నిపుణులు అయిన  ర్యాట్ హోల్ మైనర్ల rat-hole miners బృందం రక్షించి  ప్రశంసలను పొందినది.  

రేస్క్యు కార్యక్రమం లో పాల్గొని చిక్కుకుపోయిన 41 మంది కాంట్రాక్టు కార్మికులను విజయవంత౦గా రక్షించినందుకు ప్రతిఫలంగా లో ర్యాట్ హోల్ మైనర్ల సభ్యుల బృందంమానవ గౌరవం, ఇల్లు, రహదారి, న్యాయమైన వేతనాలు మరియు అలాంటి సంఘటన ఎప్పటికీ పునరావృతం కాదనే హామీhuman dignity, a house, a road, fair wages, and an assurance that such a collapse will never be repeatedని అడుగుతుంది

35 ఏళ్ల మహ్మద్ రషీద్ 7 తరగతి వరకు మాత్రమే చదివి ఉండవచ్చు, కానీ నిషేధిత ర్యాట్ -హోల్ మైనింగ్ అభ్యాసంలో నిపుణుడు. కూలిపోయిన సిల్క్యారా సొరంగంలో 400 గంటలకు పైగా చిక్కుకుపోయిన 41 మంది తక్కువ వేతనాల కాంట్రాక్టు కార్మికులను రక్షించడం తెలుసు..

"ఇస్మే మజ్దూర్ భాయియోం కో ఉంకే మజ్దూరో భాయియోం నే నికాలా (కార్మికులను వారి సోదర కార్మికులు రక్షించారు)" అని పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ నివాసి, మహ్మద్ రషీద్ అన్నాడు. రషీద్ సొరంగం శిధిలాలలోకి 60 మీటర్ల లోతులో వేసిన ఇరుకైన పైపు లోపల ఆరు గంటల పాటు పనిచేశాడు. రషీద్ తన జీవితంలో ఇంతకు ముందెన్నడూ తను చేసిన  పనికి ఇంత ప్రశంసలు పొందలేదని అన్నాడు.

26 గంటల వ్యవధిలో, U.P.లోని దళిత మరియు ముస్లిం వర్గాలకు చెందిన 12 మంది ర్యాట్-హోల్ మైనర్ల బృందం దిగుమతి చేసుకున్న డ్రిల్లింగ్ యంత్రాలు తోలగించలేని  చివరి 18 మీటర్ల శిధిలాలను  ఉలి, పారలు, గ్యాస్ కట్టర్లు. చిన్న ట్రాలీని ఉపయోగించి సొరంగం నుండి వెలికితీసిన మట్టిని మ్యాన్యువల్ గా బయటకు నెట్టారు. ఇరుకైన పైపు లోపల దుమ్ము మేఘాల నుండి ఊపిరి పీల్చుకోవడానికి తడి తువ్వాళ్లను ముక్కుపై కట్టారు.

సిల్క్యారా సైట్లో తమ పనికి ఒక్క పైసా కూడా తీసుకోవడానికి ర్యాట్-హోల్ మైనర్ల బృందం ఇష్టపడలేదు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రతి ర్యాట్ హోల్ మైనర్కు ₹50,000 చెల్లిస్తామని ప్రకటించారు. ర్యాట్-హోల్ మైనర్ల బృంద హీరోలను మీకు ఏమి కావాలని అడిగినప్పుడు, వారి కోరికలు సరళమైనవి మరియు లోతైనవి: వృద్ధ తల్లికి పక్కా ఇల్లు, గ్రామ రహదారులు, మత మరియు కుల సరిహద్దులను దాటి ప్రేమ మరియు మానవ గౌరవం, జీవిత బీమా మరియు కార్మికులందరికీ న్యాయమైన వేతనాలు, మరియు అటువంటి పతనం మళ్లీ జరగడానికి అనుమతించబడదని హామీ .

విజయవంతమైన రెస్క్యూను నిర్వహించి దేశ ప్రజల ప్రసంశలు, అభినందనలు పొందిన మహమ్మద్ ఇర్షాద్ ను నీ కోరిక ఏమిటని అడిగినప్పుడు "ఇన్సాన్ కో ఇన్సాన్ సంజే ఔర్ దేశ్ మే మొహబ్బత్ బనీ రహే, బస్ ఇత్నీ సి ఖ్వైష్ హై (ప్రతి మనిషిని మనిషిగా చూడాలని మరియు ప్రేమ దేశంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను)" అని 45 ఏళ్ల మహమ్మద్ ఇర్షాద్ చెప్పారు..

సిల్క్యారా వెళ్తున్నానని చెప్పినప్పుడు మహమ్మద్ ఇర్షాద్ భార్య షబానా ఏడ్చింది. మహమ్మద్ ఇర్షాద్ మీరట్ వాసి,  2001 నుండి ర్యాట్ హోల్ మైనర్, ప్రైవేట్ టన్నెలింగ్ సంస్థలతో కలిసి పనిచేయడానికి కొన్ని సంవత్సరాల క్రితం మహమ్మద్ ఇర్షాద్ ఢిల్లీకి వెళ్లాడు; మహమ్మద్ ఇర్షాద్ ఇంకా తన స్వంత ఇంటిని నిర్మించుకోలేకపోయాడు, తన పిల్లలు చదువుకోవాలని మరియు మంచి ఉద్యోగాలు పొందాలని కోరుకుంటున్నాడు.

ర్యాట్ హోల్ మైనింగ్  భారత దేశం లో అశాస్త్రీయమైన మరియు ప్రమాదకరమైన వృత్తిగా నిషేధించబడింది, కానీ దేశం లోని కొని ఉన్న ప్రాంతాలలో, ప్రధానంగా మేఘాలయలో జీవనోపాధి ఎంపికగా కొందరు  పాటిస్తున్నారు; మూడు నుండి నాలుగు అడుగుల వెడల్పు గల చిన్న గుంటలను త్రవ్వడం ద్వారా బొగ్గును కార్మికులు తరచుగా పిల్లలు వెలికితీస్తారు. ర్యాట్ హోల్ మైనింగ్  నైపుణ్యాలు సిల్క్యారాలో అమూల్య౦గా ఉపయోగపడినవి.

శిధిలాల చివరి పొరను దాటి, 41 మంది కార్మికులు ఎదురుగా నిలబడిన  మైనర్లలో మొదటి వ్యక్తి 33ఏళ్ళ మున్నా ఖురేషి

"నేను అలసిపోయినట్లు అనిపించినప్పుడల్లా, నా 10 ఏళ్ల కొడుకు ఫైజ్ మాటలను గుర్తుచేసుకున్నాను, వాటిని బయటకు తీసిన తర్వాత మాత్రమే నేను తిరిగి రావాలని ఫైజ్ నాకు చెప్పాడు," అని ముగ్గురు పిల్లల తండ్రి మున్నా ఖురేషి చెప్పారు. 26 గంటల సుదీర్ఘ ఆపరేషన్ కు ఆటంకం అని మున్నా ఖురేషి తన కుటుంబం నుండి ఎటువంటి కాల్స్ తీసుకోలేదు. మున్నా ఖురేషి కి గల చిన్న పొలంలో కుటుంబ పోషణకు సరిపడా గోధుమలు మాత్రమే పండుతాయి మరియు మున్నా ఖురేషి ఎప్పుడూ పాఠశాలకు వెళ్ళలేదు, మున్నా ఖురేషి గత 15 సంవత్సరాలుగా ప్రమాదకర ర్యాట్ హోల్ మైనింగ్  వృత్తిలో ఉన్నాడు.

కాస్గంజ్కు చెందిన ఫిరోజ్ ఖురేషి, తన భార్య, ముగ్గురు పిల్లలు మరియు తల్లిదండ్రులతో సహా తన కుటుంబాన్ని పోషించడానికి రోజుకు కేవలం ₹500 నుండి ₹800 వరకు సంపాదిస్తున్నాడు, రక్షించడంలో పాల్గొనే అవకాశం తనకు లభించడం  "ఆశీర్వాదం" అని చెప్పాడు.

సిల్క్యారా వద్ద సొరంగం కుప్పకూలడం ఎక్కడా పునరావృతం కాకుండా చూడాలని ఫిరోజ్ ఖురేషి ప్రభుత్వానికి చేసే  ఏకైక అభ్యర్థన. నా సోదరులకు నాకు అవసరమైనప్పుడు నేను మళ్లీ వస్తాను, కానీ మనం ఇలాంటి సంఘటనలను నివారించవచ్చు. అందుకు మనం చేయాలి, ”అని ఫిరోజ్ ఖురేషి అన్నారు..

12 మంది సభ్యుల బృందానికి నాయకుడిగా, 45 ఏళ్ల వకీల్ హసన్ తన మనుష్యులు నిరాశకు గురైనప్పుడల్లా వారిని ప్రేరేపించే బాధ్యతను కలిగి ఉన్నాడు, కార్మికులు రక్షించబడే వరకు వారు వెనక్కి వెళ్లరని నిశ్చయించుకున్నారు. "ఇత్నీ ఖుషీ టు ఈద్ మే నహీ హుయ్ జిత్నీ ఇంకో నికల్ కర్ హుయ్ (ఈద్లో కూడా, నా సోదరులను రక్షించిన తర్వాత నేను ఇంత సంతోషంగా లేను)" అని ఇనుము తో నిండిన చివరి రెండు మీటర్ల చెత్తాచెదారం తొలగించిన వకీల్ హసన్ గుర్తుచేసుకున్నాడు.

జతిన్ కశ్యప్, 24, మరియు అతని సోదరుడు సౌరభ్, 21, జట్టులో అతి పిన్న వయస్కులు. వారు కేవలం 13 లేదా 14 సంవత్సరాల వయస్సులో ర్యాట్ హోల్ మైనింగ్  వృత్తి ప్రారంభించారు. సోదరులు జతిన్ కశ్యప్ మరియు సౌరభ్ బులంద్షహర్ గ్రామం నుండి వస్తున్నటీం తో కలసి  రెస్క్యూ ఆపరేషన్లో చేరారు, జతిన్ కశ్యప్ మరియు సౌరభ్ కచ్చా ఇంట్లో నివసించే తల్లి పూనమ్తో కలిసి దీపావళి జరుపుకోవడానికి వెళ్లారు. ప్రభుత్వం నుండి సహాయం గా "ప్రధాని ఆవాస్ యోజన (సెంట్రల్ హౌసింగ్ స్కీమ్) కింద పక్కా ఇల్లు పొందగలమా" అని సౌరభ్ అడిగాడు

చిక్కుకున్న కార్మికులు బయటకు వచ్చితనను  కౌగిలించుకొని  బహుమతిగా ఇచ్చిన చాక్లెట్లు మరియు డ్రైఫ్రూట్స్ ను సావనీర్ గా బులంద్షహర్కి చెందిన దళితుడైన 25 ఏళ్ళ అంకుర్ తన ఇంటికి తీసుకు వెళ్తున్నాడు.  భారతదేశంలోని కార్మికులందరికీ తగిన వేతనాలు మరియు జీవిత బీమా లభించేలా చూడాలని అంకుర్ ప్రభుత్వానికి చేసిన అభ్యర్థన.

బులంద్షహర్లోని అఖ్తియార్పూర్ గ్రామానికి చెందిన 29 ఏళ్ళ దళిత ర్యాట్-హోల్ మైనర్ మోను కుమార్, U.P ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ఒక కోరిక కోరాడు. . "గావ్ బేకర్ పదా హై హుమారా, సర్కార్ రోడ్ బనా దే తో అచ్చా హోగా (నా గ్రామం అధ్వాన్నంగా ఉంది, ప్రభుత్వం అక్కడ రహదారిని నిర్మిస్తే బాగుంటుంది)" అని అన్నాడు..

బులంద్షహర్లోని దళిత వర్గానికి చెందిన 40 ఏళ్ళ దేవేంద్రతన భార్య లలిత తనను సిల్క్యారాకు రాకుండా ఆపాలని కోరుకుందని, అయితే సోషల్ మీడియాలో వైరల్గా చిక్కుకున్న కార్మికులు పైపు ద్వారా మాట్లాడుతున్న చిత్రం చూసి ప్రేరేపించబడ్డాడు"వారు నన్ను పిలుస్తున్నట్లు అనిపించింది," అని 40 ఏళ్ళ దేవేంద్ర అన్నాడు.. రేస్క్యు పూర్తి తర్వాత ఇంటికి వెళ్ళే ముందు, దేవేంద్ర ఉత్తరకాశీ నుండి తన పిల్లలకు కొన్ని ఉన్ని బట్టలు కొనాలని ప్లాన్ చేస్తున్నాడు..

32 ఏళ్ళ నాసిర్ అహ్మద్, తన సాటి మజ్దూర్ భాయ్ (కూలీ సోదరులు) కోసం రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నానని చెప్పాడు. నాసిర్ అహ్మద్ తండ్రి, ఒక రైతు, నాసిర్ అహ్మద్ మరొక ఆపరేషన్కు వెళ్లే ముందు కాస్గంజ్ ఇంటికి రావాలని కోరుకుంటున్నాడు. నాసిర్ అహ్మద్ కోరుకునేది ఏమిటంటే, ప్రజలు తనను హీరోలా కాకపోయినా మనిషిగా చూడాలని.

35 ఏళ్ళ ముజఫర్నగర్కు చెందిన మహ్మద్ నసీమ్ వ్యవసాయంలో నిమగ్నమైన తన సోదరులు, రెస్క్యూ పూర్తయిందన్న వార్త వినగానే పండగ చేసుకునేందుకు ఖీర్ (పుడ్డింగ్) చేశామని చెప్పడానికి ఫోన్ చేశారని చెప్పాడు.

నేను బాగా మాట్లాడే రాజకీయ నాయకుడిని కాదు. నేను నా పని చేసాను, ”అని మహ్మద్ నసీమ్ అన్నాడు.