30 October 2021

పద్మశ్రీ అవార్డు గ్రహీత కర్ణాటకకు చెందిన 'నారింజ కాయలు అమ్మే' మరియు ఒక పాఠశాలను నిర్మించిన హరేకల హజబ్బా కథ The story of Padma Shri Awardee Harekala Hajabba the 'orange-seller' of Karnataka who built a school

 




నవంబర్ 8, 2021న  హరేకల హజబ్బ న్యూఢిల్లీలో భారత రాష్ట్రపతి నుండి ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ బహుమతిని అందుకొంటారు. హరేకల హజబ్బ జనవరి 25, 2020న పౌర పురస్కారo పద్మశ్రీ  గ్రహీతగా ప్రకటించబడ్డాడు.

 

హజబ్బ నారింజ పండ్లను విక్రయించి, వ్యక్తులు ఇచ్చిన కొద్దిపాటి విరాళాల నుండి వచ్చిన డబ్బుతో ప్రభుత్వ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలను నిర్మించి అక్షర శాంత గా ప్రసిద్ధి చెందాడు.

 

పద్మశ్రీతో పాటు అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నప్పటికీ, హజబ్బ ఎప్పుడూ వినయంగా మరియు శాంతంగా ఉంటాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా హాజబ్బ తను నిర్మించిన పాఠశాలకు వెళ్లి ఆవరణ శుభ్రo గా ఉండేలా  చూసుకుoటాడు. ఎందుకంటే మహమ్మారి తర్వాత పిల్లలు సంతోషంగా పాఠశాలకు తిరిగి వస్తారు.

“పద్మశ్రీ అవార్డు నాకు దక్కిన గౌరవం మాత్రమే కాదు. ఇది నా పాఠశాలతో పాటు నా అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరించిన వేలాది మంది వ్యక్తులు, ప్రభుత్వ అధికారులకు గౌరవం. నా పాఠశాల మెరుగైన మౌలిక సదుపాయాలు కలిగి  నాణ్యమైన విద్యను  హరేకల మరియు చుట్టుపక్కల గ్రామాల లోని వేలాది మంది పిల్లలకు విద్యనందిస్తున్నది” అని హజబ్బ వినయంగా అంటాడు.

 

హజబ్బ కు సొంత ఇంటి స్థలం లేదు. తన కథను వివరిస్తూ, హజబ్బ ఇలా అంటాడు, "నేను మంగళూరు మార్కెట్‌లో నారింజ పండ్లను విక్రయిస్తున్నప్పుడు, ఒక జంట నా దగ్గరకు వచ్చి కన్నడలో సంభాషించడానికి ప్రయత్నించారు మరియు చిరునామా కోసం అడిగారు. నేను ఎప్పుడూ పాఠశాలకు వెళ్లలేదు మరియు నాకు కన్నడ భాష మాట్లాడటం రాదు. నేను స్థానిక భాషలైన తుళు మరియు బేరీ (దక్షిణ కన్నడ మరియు కేరళ సరిహద్దు జిల్లాల్లోని ప్రజలు ముఖ్యంగా ముస్లిం సమాజాలు మాట్లాడే భాష)లోనే మాట్లాడగలను. అందుకే, నేను కన్నడo చదవడం, మాట్లాడటం  నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. ఒక కొత్తపాఠశాల ప్రారంభించాలని అనుకొన్నాను., కానీ ఎలా ప్రారంభించాలి అనేది తెలియ లేదు.

హజబ్బ కొత్త పడ్పులోని త్వాహా జుమ్మా మసీదు కోసం పని చేసేవాడు కాబట్టి, పాఠశాలను ప్రారంభించగలమా అని మస్జిద్ కమిటీ సభ్యులను అడిగాడు. దానికి వారు అంగీకరించారు మరియు ముస్లిం సమాజం లోని సంపన్నులు డబ్బు విరాళంగా ఇచ్చారు. 1994 లో కొత్త పడ్పులో రావలతుల్ ఉలేమా మదర్సాను ప్రారంభించాము మరియు దానిలో ముస్లిం సమాజానికి చెందిన అనేక మంది పిల్లలు మదర్సాలో చేరారు. తరగతులు విజయవంతంగా కోనసాగాయి మరియు నా పనికి గుర్తింపు లభించింది. నన్ను త్వాహా జుమ్మా మస్జిద్ కమిటీ కోశాధికారిగా నియమించారు."


కాని  హజబ్బ ఇంతటితో ఆగలేదు. హజబ్బ ఐదో తరగతి దాటి చదవాలనుకునే అమ్మాయిలు మరియు పాఠశాలకు వెళ్లాలనుకునే ఇతర వర్గాల పిల్లల గురించి ఆలోచిస్తున్నాడు. "కన్నడ మీడియం పాఠశాలను ప్రారంభించాలనే ఆలోచన నా మదిలో ఎప్పటినుంచో ఉంది. అనుమతి కోసం ప్రభుత్వ అధికారులను సంప్రదించగా, మదర్సాలలో కేవలం అరబిక్ మాత్రమే బోధనా మాధ్యమం అని అధికారులు నాకు తెలియజేశారు. అందుకే, డబ్బు పొడుపు  చేయాలని నిర్ణయించుకున్నాను మరియు కన్నడ మీడియం పాఠశాలను నిర్మించడానికి కొంత స్థలం కొనడానికి ప్రజల సహాయం కోరాను," అని హజబ్బ చెప్పారు.

అనేక అవమానాలను, ఆర్ధిక ఇబ్బందులను  సహిస్తూ కూడా  హజబ్బ పాఠశాలను నిర్మించాలనే  తన ఉద్దేశ్యం నుండి వెనక్కి తగ్గలేదు. 1999లో, హజబ్బ కొత్త పడ్పులో 40 చదరపు అడుగుల చిన్న స్థలాన్ని కొన్నాడు. ఇంకో దాత సహాయంతో, అదే స్థలంలో మరొక ఎకరం భూమిని హాజబ్బ కొన్నాడు. 2000 సంవత్సరంలో కర్ణాటక ప్రభుత్వ విద్యా శాఖ పాఠశాలను నిర్మించడానికి అనుమతిని మంజూరు చేసింది."

 

హజబ్బ కు పాఠశాల నిర్మాణంలో కొందరు ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా  అప్పటి కొత్త పడ్పు బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కె ఆనంద్ సహాయ చేసారు.  దాతలు కేవలం డబ్బు మాత్రమే కాదు, పాఠశాలను నిర్మించడానికి అవసరమైన భారీ నిర్మాణ యంత్రాలు మరియు సిమెంటు సహాయం చేసారు. ఆరు బుల్డోజర్ల సహాయం తో  పాఠశాల నిర్మాణ స్థలం చదును చేయబడినది. కొన్ని నెలల్లోనే ఎనిమిది తరగతి గదులు మరియు రెండు మరుగుదొడ్లతో పాఠశాలను నిర్మించబడినది. జూన్9,2001, పాఠశాలను భారీ వేడుకల మధ్య ప్రారంభించారు. రోజులు గడిచేకొద్దీ, స్థానిక రాజకీయ నాయకులు మరియు సంపన్న వ్యక్తులు పాఠశాలకు బెంచీలు, డెస్క్‌లు మరియు ఇతర అవసరమైన సామాగ్రిని విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈ రోజు, మా ప్రాథమిక పాఠశాల భవనంలో 91 మంది పిల్లలు చదువుతున్నారు అని తన దాతృత్వ పని ద్వారా అక్షర సంత్ (అక్షర సాధువు) బిరుదు పొందిన హాజబ్బ చెప్పారు.


పాఠశాల అభివృద్ధికి సర్వశిక్షా అభియాన్ నుండి నిధులు పొందటానికి పాఠశాల అభివృద్ధి మరియు పర్యవేక్షణ కమిటీ (SDMC)ని ఏర్పాటు చేయాలని విద్యాశాఖ హాజబ్బను కోరింది. ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పాఠశాలకు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి లేదా పాఠశాలకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేయడానికి నిధులు కేటాయిస్తుంది.

 

ఎస్‌డిఎంసి వైస్‌ చైర్మన్‌ గా ఎన్నికైన హాజబ్బ పేరు మీద బ్యాంకు ఖాతా క్రియేట్‌ చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చిన సొమ్మును పాఠశాల అభివృద్ధికి ఖర్చు చేశాం. పిల్లల కోసం కంప్యూటర్ ల్యాబ్‌ను కూడా ప్రారంభించాము నాలుగు కంప్యూటర్లు ఉన్నాయి మరియు పిల్లలు అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకుంటారు అని హాజబ్బ గర్వంగా చెబుతాడు.

 

పాఠశాల ప్రారంభించాలనే హాజబ్బ కల నెరవేరింది కొన్ని నెలల తర్వాత హైస్కూల్ నిర్మించాలని ప్రభుత్వ అధికారులను కోరాడు. పాఠశాల ఆవరణలో హై స్కూల్ భవనాన్నికూడా  మంజూరు చేయించుకోగలిగారు.

 

2003లో, హజబ్బ తిరిగి నారింజ పండ్లను అమ్మడం మరియు ప్రజల నుండి విరాళాలు సేకరించడం ద్వారా డబ్బు ఆదా చేయడం ప్రారంభించాడు. "హై స్కూల్ నిర్మాణం 2010లో ప్రారంభమైంది మరియు చివరకు 2012లో పూర్తయింది. హై స్కూల్ లో లైబ్రరీ మరియు ఆరు కంటే ఎక్కువ తరగతి గదులు ఉన్నాయి, VIII నుండి X తరగతుల పిల్లలు చదువుతారు. తరగతి గదులకు రాణి అబక్క, కల్పనా చావ్లా, స్వామి వివేకానంద తో సహా ప్రముఖ వ్యక్తుల పేరు పెట్టారు. ఈ పేర్లను చదవడం మరియు వారి కథను గుర్తుంచుకోవడం ద్వారా పిల్లలు మరిన్ని విజయాలు సాధించేలా ప్రేరేపించాలనే ఆలోచన ఉంది" అని హాజబ్బ నవ్వుతూ వివరించారు.

 

హజబ్బను భవిష్యత్తు కోసం ప్రణాళికలు ఏమిటని అడిగినప్పుడు,  "పియుసి I మరియు పియుసి II కోసం కాలేజీని నిర్మించడానికి డబ్బు విరాళం గా ఇవ్వమని నేను కొంతమందిని అడిగాను. కానీ మహమ్మారి వలన దెబ్బతినడం మరియు నిరంతర లాక్డౌన్లు ఉండటంతో ప్రణాళికలు ఆలస్యం అయ్యాయి. "అని వివరించాడు.

 

28 October 2021

సయ్యద్ అబ్దుల్ రహీమ్: ది విజనరీ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ ఫుట్‌బాల్ Syed Abdul Rahim: The Visionary Architect of Indian Football

 

 

 


 భారతదేశం 1947లో స్వాతంత్ర్యం పొందిన తర్వాత 1950లు మరియు 1960లలో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో పవర్ హౌస్‌గా అవతరించింది. ప్రస్తుతం, FIFA యొక్క ర్యాంకింగ్స్‌లో, భారతదేశం 110వ స్థానంలో ఉన్నప్పటికీ, భారతదేశం అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లను తయారు చేసింది. బైచుంగ్ భూటియా, సునీల్ చెత్రి నుండి సందేశ్ జింగాన్ మరియు గురుప్రీత్ సింగ్ సంధు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో చెరగని ముద్ర వేశారు.

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ లో  భారతదేశం ఎదుగుదల వెనుక శక్తిగా  ఔత్సాహిక ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ ను  చెప్పవచ్చు. అబ్దుల్ రహీమ్ భారతదేశంలో ఫుట్‌బాల్ ఆడే విధానాన్ని విప్లవాత్మకంగా మార్చాడు. అబ్దుల్ రహీమ్ ఆధునిక భారతీయ ఫుట్‌బాల్ రూపశిల్పిగా పరిగణించబడ్డాడు. సయ్యద్ ఆధ్వర్యంలో భారత ఫుట్‌బాల్ 1950లు మరియు 60వ దశకంలో ర్యాంక్‌ల పరంగా  ఉన్నత శిఖరాలకు చేరుకుంది.

 సయ్యద్ అబ్దుల్ రహీమ్ 1909లో హైదరాబాద్ నగరంలో జన్మించాడు. అబ్దుల్ రహీమ్ తన యవ్వనం లో ఫుట్ బాల్ ఆడటం నేర్చుకున్నాడు మరియు త్వరలోనే నగరంలో ఫుట్‌బాల్ సర్క్యూట్‌లో ప్రముఖ వ్యక్తి అయ్యాడు. అబ్దుల్ రహీమ్ సిటీ కాలేజీ, హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు మరియు కళాశాల యొక్క ప్రస్తుత మరియు పూర్వ విద్యార్థులతో రూపొందించబడిన "ఎలెవెన్ హంటర్స్" జట్టు కోసం ఆడాడు. టీచర్‌గా కొన్ని సంవత్సరాల తర్వాత, అతను తన ఆర్ట్స్ డిగ్రీని పూర్తి చేయడానికి కళాశాలకు అబ్దుల్ రహీమ్  తిరిగి వచ్చాడు.

 అబ్దుల్ రహీమ్ కాచిగూడ మిడిల్ స్కూల్, ఉర్దూ షరీఫ్ స్కూల్, దారుల్-ఉల్-ఉలూమ్ హైస్కూల్ మరియు చాదర్‌ఘాట్ హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. సయ్యద్ అబ్దుల్ రహీమ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా పొందాడు మరియు చివరి రెండు పాఠశాలల్లో క్రీడా కార్యకలాపాలకు బాధ్యత వహించాడు. తన హార్డ్ వర్క్ మరియు పదునైన బుద్దితో, అబ్దుల్ రహీమ్ త్వరలోనే నగరంలోని ఫుట్‌బాల్ సర్క్యూట్‌లో ప్రముఖ వ్యక్తి అయ్యాడు.

 సయ్యద్ రహీమ్ ప్రతిభ 1940 లలో అతన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ టీమ్‌ కి కోచ్ గా  తీసుకున్నప్పుడు తెరపైకి వచ్చింది. సయ్యద్ అబ్దుల్ రహీమ్ కోచింగ్ ఇచ్చిన జట్టు చాలా కాలం పాటు స్థానిక మరియు జాతీయ టోర్నమెంట్లలో ఆధిపత్యం చెలాయించింది. సయ్యద్ అబ్దుల్ రహీమ్ ప్రతిభ త్వరలో భారత ఫుట్‌బాల్ జట్టు దృష్టిని ఆకర్షించింది మరియు 1950లో సయ్యద్ అబ్దుల్ రహీమ్ భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు మేనేజర్‌గా నియమితుడయ్యాడు.

 నోవీ కపాడియా రాసిన పుస్తకం “బేర్‌ఫుట్ టు బూట్స్‌” లో పేర్కొన్నట్లుగా, లాంగ్ అండ్ ఏరియల్ long and aerial బంతులను ఉపయోగించే బ్రిటీష్-శైలి ఫుట్‌బాల్‌  ను రహీమ్ వ్యతిరేకించాడు. వివిధ యూరోపియన్ జట్ల ఫుట్‌బాల్ ఫిలాసఫీలను, ముఖ్యంగా 1950లలో గొప్ప హంగేరియన్ జట్టును అధ్యయనం చేసిన రహీమ్ గ్రౌండ్ పాసింగ్‌  పద్ధతి కావాలి అనేవాడు..

ప్రపంచం లోని అనేక దేశాలు  తమ గేమ్‌ప్లేలో 2-3-2-3 లేదా 3-3-4 ఫార్మేషన్‌ను ఎక్కువగా ఉపయోగించినప్పుడు, 1958 ప్రపంచ కప్‌లో బ్రెజిల్‌కు ఆదరణ లభించడానికి కొన్ని సంవత్సరాల ముందు, రహీమ్ 4-2-4 ఫార్మేషన్‌ను భారత ఫుట్‌బాల్‌కు పరిచయం చేశాడు.  

1951 నుండి 1962 వరకు సయ్యద్ అబ్దుల్ రహీమ్ నిర్వహణలో, భారత ఫుట్‌బాల్ కొత్త శిఖరాలకు చేరుకుంది. భారత జట్టు 1951 ఆసియా క్రీడల్లో విజయంతో 1950లను ప్రారంభించింది. మరుసటి సంవత్సరం, శ్రీలంకలో జరిగిన కొలంబో క్వాడ్రాంగులర్ Quadrangular Cup కప్‌ను గెలుచుకోవడం ద్వారా జట్టు తమ ఫామ్‌ను కొనసాగించింది. జట్టు ఇక్కడితో ఆగలేదు మరియు 1953, 1954 మరియు 1955లో వరుసగా బర్మా, కలకత్తా మరియు ఢాకాలో జరిగిన చతుర్భుజ కప్ Quadrangular Cup యొక్క మరో మూడు ఎడిషన్‌లను కూడా గెలుచుకుంది. 1954లో మనీలాలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత ఫుట్‌బాల్ జట్టు 8వ స్థానంలో నిలిచింది.

 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్ క్వాటర్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన తర్వాత, భారత జట్టు సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. భారత్ నాలుగో స్థానంలో నిలిచి ఉండటం రెండోసారి. మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో సెమీ-ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా, ఒలింపిక్ సెమీ-ఫైనల్‌కు చేరుకున్న తొలి ఆసియా జట్టుగా భారత్ నిలిచింది.

 మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచినా భారత ఫుట్‌బాల్‌ మరియు సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ల వారసత్వం మసకబారలేదు. 1958లో జపాన్‌లోని టోక్యోలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ పాల్గొని నాలుగో స్థానంలో నిలిచింది, ఆపై మలేషియాలో జరిగిన మెర్డెకా కప్ 1959లో రెండో స్థానంలో నిలిచింది. 1962లో ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో, భారత ఫుట్‌బాల్ జట్టు ఫైనల్లో దక్షిణ కొరియాను 2-1తో ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకుంది.

 సయ్యద్ అబ్దుల్ రహీమ్ క్యాన్సర్‌తో 1963లో మరణించినాడు.  అతని మరణం తర్వాత భారత ఫుట్‌బాల్ ఘోర పతనాన్ని చూసింది. ప్రస్తుతం ఆసియా ఫుట్‌బాల్ లో కొరియన్లు మరియు జపనీయులు అగ్రస్థానం లో ఉన్నారు. సయ్యద్ అబ్దుల్ రహీమ్ ఫుట్‌బాల్‌లో వారి ఎదుగుదల ను ముందే ఊహించాడు.

 అబ్దుల్ రహీమ్ మరణించిన తర్వాత, భారత ప్రధాన కోచ్ ఉద్యోగం 40 సార్లు చేతులు మారింది. 19 మంది భారతీయులు మాత్రమే జాతీయ జట్టుకు కోచ్‌గా ఉన్నారు.మిగతా వాళ్ళు విదేశీయులు భారత కోచ్‌గా పీకే బెనర్జీ, సయ్యద్ నయీముద్దీన్, సుఖ్వీందర్ సింగ్ తలా మూడు స్పెల్‌లు పని  చేశారు.

 ఒకప్పుడు భారతదేశంలో ఫుట్‌బాల్‌ను అత్యంత ఘనంగా పరిగణించే వారు. భారత ఫుట్‌బాల్ ఆటగాళ్ళు ఒకప్పుడు  "బ్రెజిలియన్స్ ఆఫ్ ఆసియా" అని పిలువబడేవారు. కానీ అనేక సమస్యల కారణంగా భారతదేశంలో ఫుట్‌బాల్‌కు ఆదరణ తగ్గింది. జట్టుకు టెక్నికల్ డైరెక్టర్ లేకపోవడంతో పాటు అనేక ఇతర సమస్యలు భారత ఫుట్‌బాల్ ఎదుర్కొంటున్నది.. ఫుట్‌బాల్‌లో భారతదేశాన్ని స్లీపింగ్ జెయింట్‌గా పరిగణిస్తారు.

 సయ్యద్ అబ్దుల్ రహీమ్ అనేక అంతర్జాతీయ టోర్నమెంట్‌లను గెలవడానికి తన జట్టును తీర్చిదిద్దినందున భారత ఫుట్‌బాల్‌కు ఆర్కిటెక్ట్‌గా ఉద్భవించాడు. దూరదృష్టి గల కోచ్ మరియు మాస్టర్ వ్యూహకర్త, సయ్యద్ అబ్దుల్ రహీమ్ యొక్క మేధావితనం కాలం పరీక్షగా నిలిచిందని చెప్పడం చాలా సరైంది. 

 

27 October 2021

ఫిరంగి మోగిన శబ్దం విని ప్రజలు ఇఫ్తార్ చేస్తారు...! तोप की आवाज़ सुन कर लोग करते हैं अफ़्तार…!

 

 




 

ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో రంజాన్ నెలలో  ప్రతిరోజూ మగ్రిబ్ లో ఫిరంగి పేలుస్తారు మరియు ఫిరంగి శబ్దం విన్న తర్వాత మాత్రమే ఉపవాసం ఉన్నవారు తమ ఉపవాసాన్ని విరమించుకుంటారు.

భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ లేదా రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు 40 మైళ్ల దూరంలో ఉన్న రాయ్ సేన్ అయినా, అక్కడ నివసించే ప్రతి ఒక్కరూ రంజాన్ మాసంలో ఫిరంగి శబ్దం వింటారు. రాయ్ సేన్ లో ఈ విశిష్ట సంప్రదాయాన్ని 18వ శతాబ్దపు  భోపాల్ రాచరిక రాజ్యానికి చెందిన సుల్తాన్ బేగం ప్రారంభించారు. అజ్మీర్‌లో ఈ సంప్రదాయం మొఘల్ కాలం నాటిది అయినా ఇది ఇప్పటికీ అమలులో ఉంది. అజ్మీర్‌తో పాటు, రాజస్థాన్‌లోని అనేక ఇతర ప్రాంతాలలో  ఇఫ్తార్ సమయంలో ఫిరంగిని పేల్చే సంప్రదాయం ఉంది.

భారతదేశంలోని కొన్ని ప్రదేశాలలో పేల్చిన ఫిరంగి శబ్దం విన్న తరువాత ఉపవాసం విరమణ చేస్తారు. శతాబ్దాల తర్వాత కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగించడం గర్వించదగ్గ విషయం. కాగా ఈ ఏడాది కరోనా సంక్షోభం కారణంగా రాయ్ సేన్ లో గత 200 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయానికి బ్రేక్‌ పడినట్లు వివిధ మీడియా కథనాల ద్వారా వెల్లడవుతోంది.

రాయ్ సేన్ లో ఏమి జరిగిందంటే ఉదయం సెహ్రీ సమయంలో ఫిరంగి యొక్క ప్రతిధ్వని నగరంతో పాటు 30 కి.మీ పరిధిలోని దాదాపు 30 గ్రామాలకు చేరేది. సాయంత్రం ఇఫ్తార్ సమయం లో సందడి మరియు ట్రాఫిక్ కారణంగా గ్రామాలలో దాని ప్రతిధ్వని తగ్గింది.

రాయ్ సేన్  ముస్లిం ఫెస్టివల్ కమిటీ ఫిరంగిని పేల్చడానికి జిల్లా పరిపాలన నుండి అనుమతి కోరింది, అయితే ఈసారి లాక్డౌన్ కారణంగా , జిల్లా యంత్రాంగం ఫిరంగిని కాల్చడానికి అనుమతించలేదు

భారతదేశంలో, ఈ రకమైన ఆచారం ఎక్కువగా నగరాల్లో ఉంది. మొఘల్ యుగంలో, రంజాన్‌కు 2 రోజుల ముందు గుర్రపు స్వారీ చేసే రౌతులను నాలుగు మూలల పంపేవారు, వారి పని చంద్రుడిని  చూడటమే. చంద్రుడు ఒక వేళ మేఘలలో దాగి ఉంటే, లేదా గుర్రపు స్వారీ చేసేవారు దానిని చూడలేకపోతే, చంద్ర దర్సనం  ఒక గౌరవనీయమైన వ్యక్తి లేదా ఎత్తైన ప్రదేశంలో నివసించే ఖాజీ ద్వారా ధృవీకరించబడుతుంది., ఆపై ఆ విషయం చక్రవర్తి ముందు ప్రవేశపెట్టబడుతుంది. చక్రవర్తి ఉల్మాను సంప్రదించి రంజాన్ మాస ప్రారంబం పేల్చిన ఫిరంగి గుండు శబ్దం ద్వారా ప్రకటిస్తారు. పదకొండు సార్లు ఫిరంగులు కాల్చబడుతాయి. కొన్నిసార్లు బాణసంచా కాలుస్తారు., డప్పులతో వీధులు మరియు సందులలో రంజాన్ మాస ఆరంభ ప్రకటనలు చేస్తారు.

రంజాన్ ముగింపులో ఈద్ చంద్రుని సమయంలో కూడా  అదే జరుగుతుంది. . భారతదేశంలో, ఈ ఆచారం క్రమంగా టోంక్, జునాగఢ్, భోపాల్, హైదరాబాద్, లక్నో ఇలా ప్రతి రాచరిక రాజ్యానికి చేరింది. క్రమంగా, ఈ సంప్రదాయంలో చాలా మార్పు వచ్చింది. భోపాల్‌లో ఫిరంగి స్థానంలో బాణసంచా కాల్చడం మరియు చాలా చోట్ల సైరన్‌లు మోగించడం వంటివి ఉన్నాయ. ప్రపంచంలోని అనేక దేశాలలో ఫిరంగి పేల్చిన శబ్దం విని ఉపవాస విరమణ ఇఫ్తార్ ప్రారంభిస్తారు.

ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో, చంద్రుని దర్శనంతో కోట నుండి లేదా కొండల నుండి ఫిరంగులను పేల్చడం ద్వారా రంజాన్ మాసం ప్రారంభించబడుతుంది, తరువాత 30 రోజుల పాటు రోజు  సాయంత్రం ఇఫ్తార్ సమయంలో ఫిరంగిని పేల్చే  ప్రక్రియ కొనసాగుతుంది.

ఈ ఆచారం ఎప్పుడు ప్రారంభమైంది అనే దాని గురించి చాలా అభిప్రాయాలు ఉన్నాయి, కొందరు దీనిని ఒట్టోమన్ సుల్తానేట్‌తో, కొoదరు  ఈజిప్ట్ పాలించిన మామ్లుక్‌ వంశస్తుల కాలం లో ప్రారంభమైనది అని అంటారు. అనేక రకాల కథలు కూడా దీని గురించి ప్రసిద్ధి చెందాయి. రంజాన్ మాసం లో మగ్రిబ్ సమయంలో కైరోలో ఒక మమ్లుక్ సుల్తాన్ కొత్త ఫిరంగిని పరీక్షించినప్పుడు, ఫిరంగి శబ్దం విన్న ప్రజలు ఉపవాసం విరమించారు. సుల్తాన్ ఈ విషయం తెలుసుకున్నప్పుడు, అతను రంజాన్ నెలలో  మగ్రిబ్ సమయంలో ప్రతిరోజూ తుపాకీలను కాల్చమని ఆదేశించాడు.

19వ శతాబ్దం ప్రారంభంలో ఈజిప్టు పాలకుడు ముహమ్మద్ అలీ రంజాన్ నెలలో మగ్రిబ్ సమయంలో జర్మనీలో  తయారు చేసిన ఫిరంగిని పేల్చాడు, దీనిని ప్రజలు ఉపవాస విరమణ కు  చిహ్నంగా అర్థం చేసుకున్నారు.

19వ శతాబ్దం చివరలో ఈజిప్ట్‌ లో నివసించిన ఖిదైవ్ ఇస్మాయిల్‌ సైనికులు మగ్రిబ్ సమయంలో ఫిరంగులు పేల్చడం, ఇస్మాయిల్ కుమార్తె ఫాతిమా విన్నది. ఫాతిమా  తన తండ్రిని రంజాన్‌లో ప్రతిరోజూ మగ్రిబ్ సమయంలో ఫిరంగి పేల్చమని చేయమని కోరింది. ఫిరంగిని పేల్చడం అంగీకరించబడింది, తరువాతి రోజుల్లో రంజాన్ సమయంలో కాల్చిన ఫిరంగి ఫాతిమా ఫిరంగి గా పిలువబడింది. నేటికీ, మగ్రిబ్ సమయంలో కైరోలోని సలావుద్దీన్ కోట నుండి ఫిరంగి పేల్చిబడుతుంది, దాని తర్వాత ఇఫ్తార్ ఉంటుంది. రంజాన్‌లో కాల్చబడే ఈ తుపాకులను అరబిక్ భాషలో “మిద్ఫా అల్-ఇఫ్తార్” అని కూడా పిలుస్తారు.

19వ శతాబ్దం ప్రారంభంలో, షార్జాకు చెందిన సుల్తాన్ బిన్ సక్ర్ అల్-ఖాస్మీ తన పాలనలో రంజాన్ సమయంలో ఫిరంగులను ఉపయోగించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు. నేటికీ రంజాన్ ఫిరంగులను UAEలోని వివిధ నగరాల్లో దుబాయ్ లేదా అబుదాబి లో పేలుస్తారు. ఒకప్పుడు ఒట్టోమన్ సుల్తానేట్‌లో భాగమైన బాల్కన్‌లోని అల్బేనియా, బోస్నియా మరియు హెర్జెగోవినియన్‌లతో సహా అనేక ప్రాంతాలలో ఇదే పద్ధతిలో ఫిరంగులను పేల్చడం ద్వారా ఉపవాసాన్ని విరమించుకోవాలని చెప్పబడింది. ఈ ప్రాంతాలు కమ్యూనిస్టుల పాలనలోకి వచ్చాక పిరంగి ని పేల్చే ఆచారం పాటించుట లేదు.1997 తర్వాత మళ్లీ సరాజీవోలో ఫిరంగులు పేల్చి ఉపవాసాన్ని విరమించే సంప్రదాయం ప్రవేశ పెట్టబడినది.

ఒట్టోమన్ సుల్తానేట్ యొక్క రాజధాని మరియు ప్రస్తుత టర్కీ యొక్క చారిత్రక నగరమైన ఖుస్తుంటునియాలో కూడా రంజాన్ సందర్భంగా ఫిరంగి మోతలను వినవచ్చు. కాలంతో పాటు ఫిరంగి స్వరూపం కూడా మారిందన్నది నిజం.

ముస్లింల మూడు పవిత్ర నగరాలు, మక్కా, మదీనా మరియు అల్-ఖుద్స్ (జెరూసలేం) విషయానికొస్తే, అక్కడ నేటికీ, ఫిరంగి గుండ్ల శబ్దం విన్న తర్వాత మాత్రమే ఉపవాస దీక్షలు విరమిస్తారు.

పాలస్తీనా-ఇజ్రాయెల్ వివాదం మధ్య కూడా, పవిత్ర నగరమైన అల్-ఖుద్స్ (జెరూసలేం)లో ఇద్దరు ఇజ్రాయెల్ భద్రతా గార్డుల పర్యవేక్షణలో తుపాకీ కాల్పుల ద్వారా ఉపవాసం విరమణ నేడు కూడా ఆచరిస్తారు. మదీనాలోని సాలా కొండ మరియు ఖుబా కోట నుండి ఫిరంగి శబ్దాన్ని ఎప్పటి నుంచో విశ్వాసులు ఉపవాస దీక్ష విరమణ సందర్భంగా వింటున్నారు.

మక్కా నగరంలోని మక్కా పోలీసులు వారి పర్యవేక్షణలో ఎత్తైన పర్వతాల నుండి ఫిరంగి గుళ్ళు ను పేలుస్తారు. 'ది రూలింగ్ ఆఫ్ మక్కా ఇన్ ది ఒట్టోమన్ యుగంThe ruling of Mecca in the era of the Ottomans ' రచయిత మొహమ్మద్ ఔదీ ప్రకారం, ఒట్టోమన్ యుగంలో, ఉపవాసం ఉండేవారు మక్కాలో ఫిరంగి శబ్దం విన్న తర్వాత మాత్రమే ఉపవాసం విరమించే వారని తెలుస్తుంది. కొండ పైన ఫిరంగిని ఎత్తులో ఉంచేవారు పలితంగా  శబ్దం చాలా దూరం వినబడుతుంది. మొహమ్మద్ ఔదీ ప్రకారం, ఫిరంగి గుండు ను మోగించే  ఈ సంప్రదాయం ఒట్టోమన్ యుగంలో ప్రారంభమైంది, ఎందుకంటే అంతకు ముందు ఫిరంగి అలవాటు ప్రపంచంలో లేదు. మరియు ఇది ఆ కాలంలో అత్యంత ఆధునిక ఆవిష్కరణ. ఆ సమయంలో ప్రజల వద్ద ఉపవాసం విరమించే సమయాన్ని తెలుసుకునే గడియారం కానీ, శబ్దాన్ని చాలా దూరం తీసుకువెళ్లే పరికరం కానీ ఏదీ లేదు.

ఒట్టోమన్ సామ్రాజ్యంగా పేరొందిన ఉస్మానియా సుల్తానేట్ మూడు ఖండాలలో విస్తరించి ఉన్నందున, వారు ప్రారంభించిన సంప్రదాయ ప్రభావం నేటికీ కనిపిస్తుంది. ఒట్టోమన్ సుల్తానేట్‌లో భాగమైన ఈజిప్ట్, సౌదీ అరేబియా, యుఎఇ, కువైట్, ట్యునీషియా వంటి దేశాలలో నేటికీ, ఫిరంగి గుండ్లు పేల్చి రంజాన్ ఉపవాసాలను పాటించడం మరియు విరమించడం ఆనవాయితీ.

19వ శతాబ్దం నుండి లెబనీస్ రాజధాని బీరుట్‌లో రంజాన్ నెలలో  ఫిరంగి వాడుకలో ఉంది. అయితే 1979లో సోవియట్ యూనియన్ దాడి తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లోని షేర్ దర్వాజా కొండ నుంచి రంజాన్ మాసం లో వచ్చే ఫిరంగి శబ్దం ఆగిపోయింది.1980లలో లెబనాన్ లో అంతర్యుద్ధం ప్రారంభమైనప్పుడు అది నిలిపివేయబడింది.

ఈ ఆచారం భారత ఉపఖండంలోని పాకిస్తాన్ లోని సుదూర ప్రాంతాలు  మరియు బంగ్లాదేశ్‌లోని ఢాకా వంటి అనేక ప్రదేశాలలో ఇప్పటకి సజీవంగా ఉంచబడింది. భారతదేశంలోని హైదరాబాద్‌లో ఈ సంప్రదాయం ముగిసింది. ఒకప్పుడు  హైదరాబాద్‌లోని నౌబత్ పర్వతం నుండి ఒక ఫిరంగి మోత ప్రతిధ్వనించెది మరియు నగర ప్రజలకు ఇఫ్తార్ మరియు సెహ్రీ సమయాన్ని చెప్పేది.  కానీ చాలా విషయాలు మరుగున పడిపోయాయి