26 June 2016

భారత దేశం లోని మస్జిద్లు తమ పాత్రను నిర్వహిస్తున్నవా!


సాధారణంగా మసీదు అనేది ముస్లిం సమాజములో ప్రార్థన చేసే ఒక ప్రార్థనా స్థలం గా పరిగణిoచ బడుతున్నది. సంవత్సరాలతరబడి  మసీదులు అనేవి ముస్లిం  సమాజాలలో ఒక ముఖ్యమైన పాత్ర ను పోషిస్తున్నవి  కానీ నేటి ఆధునిక కాలం  లో మసీదులు నిర్వహించే పాత్ర మారుతుoది. ప్రారంభం లో మసీదు కేవలం ప్రార్థనా ప్రాంతంగానే  కాక, ముస్లిం సమాజంలో అన్ని కార్యకలాపాలకు కేంద్రంగా ఉపయోగపడేది. ప్రార్థనలు, ప్రబోధాలు, విద్య మరియు సంక్షేమ చర్యలు ప్రతిదీ మసీదు చుట్టూ జరిగేవి.

చారిత్రకంగా ప్రవక్త ముహమ్మద్ (స)  మదీనా  వలస వెళ్ళిన  తరువాత చేపట్టిన మొదటి పని ముస్లింల కొరకు మసీదు నిర్మించడoగా  ఉంది. మదీనా  లో మొదటి మస్జిద్ ప్రవక్త(స) యొక్క గృహం పక్కన ఉంది అది ఒక ఓపెన్ ఎయిర్ భవనం అందులో అందరు ముస్లిమ్స్ ఆహ్వానించబడినారు. చివరకు ముస్లిములు మసీదు కొరకు  ఒక సరైన నిర్మాణo చేపట్టారు.  దానికి 'మసీదు-ఇ-నభవి ' అనే పేరు పెట్టారు.

ప్రవక్త (స) హదీసుల అత్యంత ప్రామాణిక పుస్తకం సహీహ్ బుఖారీ ప్రకారం మసీదు ప్రవక్త(స) మరియు ప్రవక్త(స) అనంతర ఖలీఫా ల  కాలంలో అన్ని కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేది. ప్రజలు ప్రార్థన కోసం, చర్చలు జరపటానికి, విద్యా కేంద్రంగా,న్యాయవ్యవస్థ కేంద్రంగా మరియు ముఖ్యంగా ముస్లింల పరిపాలన మరియు సంక్షేమ కేంద్రo గా  మస్జిద్ ఉండేది.

ప్రవక్త (స) ముస్లింల నాయకుడిగా మస్జిద్  నుంచి ఇస్లామిక్ ప్రపంచంలోని అన్ని పరిపాలనా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఇతర ప్రదేశాల నుండి వచ్చే రాయబారులను  కలిసేవారు, ఒప్పందాలు కుదుర్చుకొనే వారు   మరియు ఒప్పందాలపై సంతకాలు చేసేవారు. యుద్ధ నియమాలు మొదలగు అన్ని కార్యక్రమాల రూపకల్పన చేసేవారు. యుద్ధంలో కొల్లగొట్టిన సంపద పంపిణీ మరియు యుద్ధాల్లో గాయపడిన ప్రజలకు  ప్రధమ చికిత్స మరియు వారికి వైద్య  ఉపచారాలు మస్జిద్ లో చేయబడేవి.

ప్రజల తమ వివాదాలను  మస్జిద్ లో  పరిష్కరించుకోవటానికి వీలుగా మస్జిద్లు   న్యాయ కేoద్రలుగా  ఉండేవి. ప్రజలనుంచి సేకరించిన జకాత్ మరియు సదాకత్ మరియు పేదలకు వాటిని  పంపిణీ చేసే  స్వచ్ఛంద కేంద్రాలుగా మస్జిద్లు ఉండేవి. ఇంకా కొన్ని మతం, ఫికా  మరియు ఇతర సంబంధిత విషయాల గురించి వివరించే పాఠశాలలుగా, విద్యకు కేంద్రంగా ఉండేవి. ప్రయాణికులకు మస్జిద్ లో  ప్రజలు  ఆహారo పంపిణీ చేసేవారు మరియు ఆశ్రయం,విశ్రాంతి కల్పించేవారు. ప్రజలందరికి  జాతి, స్థితి,లింగ బేధం  లేకుండా మస్జిద్  లో  ఎల్లప్పుడూ ప్రవేశం, ఆశ్రయం కల్పించబడేది.

ప్రవక్త (స) మరణం తరువాత  ఖలీఫా కాలం లో కూడా ఈ సంప్రదాయం కొనసాగింది మరియు ముస్లింల సంక్షేమం కోసం అత్యంత ముఖ్యమైన కేంద్రాలుగా మసీదులు  ఉండేవి. మసీదులు గ్రంధాలయాలను  కలిగి సాహిత్య కార్యకలాపాలు ప్రోత్సహించెవి  మరియు అవి పేదలకు  ఉపాధి పొందేందుకు సహాయంగా వారికి మత జ్ఞానమును మరియు లౌకిక జ్ఞానమును  భోదించేవి.
భారతదేశం లో మొఘల్ పరిపాలనా కాలంలో మసీదులు రాజ కుటుంబీకుల ఆర్ధిక సహాయం తో నిర్వహించబడ్డాయి. మసీదులు కొరకు ఉదారంగా భూమి మరియు  డబ్బు విరాళంగా  ఇవ్వబడేది మరియు గ్రంధాలయ భవనాలు,విశ్రాంతి గృహాలు మరియు మసీదు పరిసరాలలో  పాఠశాలలు నిర్మించబడినవి.

అయితే నేడు మసీదులు కేవలం పరిమిత సౌలభ్యo గల ప్రార్థన ప్రాంతాలు గా మిగిలిపోయినవి. భారతదేశం లో చాలా మసీదులు  మహిళలను  అనుమతించడం లేదు  లేదా కొన్ని మస్జిద్లు  ఆంక్షలతో ఎటువంటి సౌకర్యాలు లేకుండా అనుమతిoచు చున్నవి. నేడు ఏ మస్జిద్ సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించడం లేదు మరియు వాటికి అనుభందంగా ఆస్పత్రులు కలిగి లేవు. మసీదులకు  జతగా మదరసాలు ఉన్నప్పటికీ అవి యువత కోసం వృత్తి విద్యా కోర్సులు నడపటం లేదు. అతితక్కువ మసీదులకు  గ్రంధాలయాలు లేదా ప్రయాణికుల విశ్రాంతి  కేంద్రాలు కలిగివున్నవి.

ఈనాటి మసీదులు అత్యంత పెద్దవిగా సువిశాలమైన ఆవరణలతో, అధునాతనం గా  నిర్మించబడ్డాయి కాని వాటిని ముస్లిం సమాజ కార్యకలాపాలకు కేంద్రంగా పిలువలేము. దీనికి విరుద్ధంగా చర్చిలు మరియు గురుద్వారాలు ఇస్లాం సూచించిన నమూనాను/మార్గమును  అనుసరిస్తున్నట్లు  కనిపించుతున్నవి. ఇవి ఆరాధన మందిరాలే కాక   పేదలకు సహాయం పడే సంక్షేమ కేంద్రాలు గా మరియు  ప్రయాణికులకు వసతి కేంద్రాలుగా ఉపయోగ పడుతున్నవి.

గురుద్వారా లో లoగర్ ద్వారా అందరు పేదలకు మరియు సంపన్నులకు సమానం గా  ఆహారo అందించ బడుతుంది మరియు ప్రజలు గురుద్వారాలో  సమాజ సేవ కొరకు స్వచ్చంద భావన తో పనిచేస్తారు. కాని  సంక్షేమ కేంద్రాలుగా పని చేస్తున్న మసీదులు  అతి తక్కువగా ఉన్నాయి. తిరిగి మస్జిదులను సంక్షేమ చర్యలు మరియు మత కార్యక్రమాలకు పాల్పడే విధంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా  ఉంది. మసీదులు కమ్యూనిటీ యొక్క కార్యకలాపాలకు మద్దతు ఇస్తుందనే భావన ముస్లిం లకు  కలిగినప్పుడు దానికి కోల్పోయిన ఆదరణ, ప్రోత్సాహం తిరిగి లబిస్తుంది.   


22 June 2016

నాదర్ షా 1698-1747

నాదర్ సః అఫ్సర్ (Nāder Šāh Afšār) లేదా నాదిర్ షా (ఫార్సీ లో    نادر شاه افشار‎‎; ) లేదా నాదర్ కొలి బేగ్( نادر قلی بیگ )లేదా తఃమాస్ప్ కొలి ఖాన్(   تهماسپ قلی خان)ఇరాన్ ను పరిపాలిoచిన షా(చక్రవర్తి)  మరియు ఇరాన్ చరిత్రలో అతి శక్తివంతమైన చక్రవర్తులలో (షా)ఒకడు. అతడు చేసిన యుద్దాల వలన అతనిని నెపోలియన్ అఫ్ పర్షియా లేదా 2వ అలేక్జాండర్ అని అందురు.
నాదర్ షా ఈశాన్య ఇరాన్ కు చెందిన ఖొరాసాన్ ప్రాంత తుర్కమేన్ అఫ్శార్ తెగ కు చెందినవాడు. ఈ తెగ సఫవిద్ రాష్ట్రానికి చెందిన షా ఇస్మాయిల్ కు ఆయుధాలను సరఫరా చేసేది.
ఇరాన్ ను పరిపాలిస్తున్న షా సుల్తాన్ హుసైన్ కాలం లో హోతకి ఆఫ్ఘన్ తెగ, సఫవిడ్స్,ఒట్టోమన్ మరియు రష్యన్స్ పెర్షియ(ఇరాన్) భూభాగం ను ఆక్రమించారు. నాదర్ షా వారినందరినీ వెళ్ళగొట్టి పెర్షియా భూభాగం ను తిరిగి స్వాధీన పరచుకొన్నాడు. పెర్షియా భూభాగాలను  ఏకీకృతం చేసి పెర్షియా భూభాగ ఆక్రమితదారులను వెళ్ళగోట్టినాడు. 200 సంవత్సరాలు ఇరాన్ ను పరిపాలించిన బలహీనులైన సఫవిద్ వంశస్తులను తొలగించి  1736 లో తనే స్వయంగా షా(చక్రవర్తి) గా ప్రకటించుకొన్నాడు.
అతని కాలం లో ఇరాన్ సామ్రాజ్యం ఇరాన్,అర్మీనియా,అజెర్బైజాన్, జార్జియా, ఉత్తర కకాసుస్, ఇరాక్, టర్కీ, తుర్క్మినిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, పాకిస్తాన్, ఉత్తర భారతం, పాకిస్తాన్, ఒమాన్, మరియు పెర్షియన్ గల్ఫ్ వరకు విస్తరించినది. కాని అతని యుద్దాలతో ఇరాన్ ఆర్ధిక వ్యవస్థ క్షిణించినది.
నాదర్ షా చరిత్ర లో మద్య ఆసియా కు చెందిన క్రూరమైన సైనిక పరిపాలకులు  చెంగిజ్ ఖాన్, తైమూర్ లను ముఖ్యంగా వారి క్రూరత్వం ను ఆదర్శంగా తీసుకొన్నాడు. ఇతను ఇరాన్ చరిత్రలో ముఖ్యమైన యుద్దాలు హేరాత్, మిహ్మన్డుస్ట్, ముర్చే-ఖోర్ట్, కిర్కుక్, ఎఘేవార్డ్, ఖేబర్ కనుమ, కర్నాల్ మరియు కార్స్ అన్నింటిలోను పాల్గొన్నాడు. ఆ యుద్దాలు అతనిని చరిత్ర లో గొప్ప సైనిక పాలకునిగా, అఫ్శారిడ్ వంశ ప్రముఖునిగా  నిలబెట్టినవి. అతని సైనిక చరిత్రలో ముఖ్యమైనవి దేగేస్తాన్ పై  జరిపిన దండయాత్రలు. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం లో నాదర్ షా ఆసియా  సైనిక విజేతలలో  గొప్ప అంతిమ నాయకుడు.
ఆఫ్ఘన్ తిరుగుబాటుదారులను అణిచివేయటానికి ఆఫ్ఘానిస్తాన్ తో భారత సరిహద్దులను మూయమని నాదిర్ షా కోరగా మొఘల్ చక్రవర్తి మొహమ్మద్ షా పట్టించుకోలేదు మరియు తన ప్రత్యర్ధి ఒట్టోమన్  చక్రవర్తి 1వ ముహమ్మద్ కు సహాకారం అందించిన మొఘల్ చక్రవర్తి పై ప్రతీకారం తీర్చుకోవటానికి    నాదిర్ షా ఉత్తర భారతదేశo పై  55 వేల సైన్యంతో దండయాత్ర చేశాడు. అప్పటికే మరాఠా దాడులు, ఇతర సర్దార్ల స్వాతంత్రం, అంతర్గత కుమ్ములాటల్లో ఘోరంగా బలహీనపడ్డ మొఘలులు కర్నల్ యుద్ధంలో అత్యంత తేలికగా ఓడిపోయారు. ఢిల్లీని పూర్తిగా నాశనం చేసి, దోపిడి చేయమన్న ఆజ్ఞను తన సైన్యానికి నాదిర్షా ఇవ్వగా ఘోరమైన జనహననం జరిగింది. ఒకే ఒక్కరోజులో 20వేల నుంచి 30వేలమంది భారతీయులను పర్షియన్ దళాలు ఊచకోత కోశాయి.
యుద్ధానంతరం జరిగిన ఘోరమైన నరమేధంలో పర్షియా సేనలు ఢిల్లీలో అన్నివైపుల నుంచి ప్రజలను ముట్టడించి తుపాకులతో కాలుస్తూ, కత్తులతో నరుకుతూ వికృత క్రీడ సలిపాయి. వేలాదిమంది స్త్రీలను అత్యంత దారుణంగా అత్యాచారం చేశారు. పిల్లలను తల్లుల చేతిలో ఉండగానే నరికిన ఘటనలు కూడా నమోదయ్యాయి. ఇళ్ళను తగలబెట్టగా వచ్చిన పొగ మేఘాల్లా ఆకాశాన్ని ఆవరించింది. ఈ ఊచకోత చివరకు మొఘల్ చక్రవర్తి మొహమ్మద్ షా తన రాజ్యఖజానా తాళాలు నాదిర్ షా చేతికివ్వడంతో ముగిసింది.
చివరకు మొఘల్  చక్రవర్తి మొహమ్మద్ షా తన నెమలి సింహాసనాన్ని కూడా పర్షియా సామ్రాట్టుకు కోల్పోయాడు. అప్పటి నుంచి నెమలి సింహాసనం పర్షియన్ సామ్రాజ్య ఆధిక్యానికి చిహ్నంగా నిలిచింది. యుద్దంతరం పొందిన అపార రత్నరాశుల నిధిలో, నాదిర్ కోహినూర్, దర్యా-ఇ-నూర్ వంటి వజ్రాలు పొందాడు. కోహ్-ఇ-నూర్(కోహినూర్) అంటే పర్షియన్ భాషలో కాంతి పర్వతం అనీ, దర్యా-ఇ-నూర్ అంటే కాంతి సాగరం అనీ అర్థాలు.
నాదిర్షా దోచుకుని పోయిన సంపద విలువ గురించి చరిత్రకారులు ఎన్నోరకాలుగా అంచనాలు వేశారు.
·        ప్రేజర్ అనే చరిత్రకారుడు 70 కోట్ల నవరసులు ఉంటుందని వ్రాశారు. దీనిలోని 25కోట్ల నవరసుల విలువగల సాధారణమైన నగలు ఉన్నాయి.ఇవికాక  అపురూపమైన నెమలి సింహాసనం, కోహినూర్ వజ్రం (క్రమక్రమంగా అది బ్రిటీష్ వారి వద్దకు చేరింది), దర్యా-ఇ-నూర్(ఇది ఇప్పటికీ పర్షియాలోనే ఉంది). అంత్యంత విలువైన మణిమాణిక్యాలున్న ఆభరణాలు ఉన్నవి.
·        నాదిర్షా కొలువులో వజీరుగా చేరిన భారతీయుని కింది ఉద్యోగి ఆనందరాం అంచనా ప్రకారం  60 లక్షల వెండినాణాలు, వేలాదిగా బంగారునాణాలు, కోటి విలువగల బంగారు సామాన్లు, 50కోట్లు విలువైన విశిష్టమైన నగలు, ఇవికాక కొన్ని విలువకట్టేందుకు వీలుకాని వస్తువులు నాదర్ షా పట్టుకుపోయినట్టు వ్రాశారు.
·        నాదిర్షా సొంత చరిత్రకారుడు కోటి తొంభైలక్షల నవరసుల ఖరీదు కలిగిన నాణాలను తరలించుకువెళ్ళినట్టుగా వ్రాశారు.
·        స్కాంట్లాండుకు చెందిన మరో చరిత్రకారుడు నాదిర్షా తరలించిన డబ్బు, వస్తువుల విలువ 11 కోట్ల 90 నవరసులుగా అంచనావేశారు.
నాదిర్షా దండయాత్రలో సంపాదించిన దోపిడీ సొమ్ము ఆసరాతో అతను పర్షియా తిరిగివెళ్ళాక అక్కడ ప్రజలపై పన్ను మూడేళ్ళపాటు తొలగించాడు. 
నాదిర్ షా షియా అయినప్పటికీ సున్నీల పట్ల అభిమానం ప్రదర్శించాడు. అతని సైన్యం క్రైస్తవులు, సున్నీలు, షియాలతో కూడి ఉంది.అతడు షియా 6వ ఇమాం జాఫర్ అల్ సాదిక్ చూన జాఫరి మర్గంను అనుసరించాడు. కొంతమంది రచయితల  అబిప్రాయం ప్రకారం అతను ఒక నిర్దిష్ట మత సాంప్రదాయలును అనుసరించినాడు అని చెప్పుట కష్తం.
మొఘలుల పై విజయం తరువాత అతని ఆరోగ్యం క్షిణించినది. పెద్ద కుమారునికి పరిపాలన భారం అప్పగించినాడు.  కాని అతని విధానాలతో నచ్చక అతనిని కళ్ళులేని కబోధిని చేసాడు. నాదిర్ షా పెర్షియా నావికా దళం ను అభివృద్ధి చేసాడు. బహారిన్ ను క్రమించాడు. ఆ తరువాత ఒమాన్ ను స్వాధీన పరచుకొన్నాడు. ఒట్టోమన్ రాజ్యం తో యుద్ధం చేసి సంధి షరతులలో భాగంగా నజఫ్ పొందినాడు.
ఇరానియన్ నాణ్యలను ముద్రించినాడు. సైనికులకు జీతాలు ఇచ్చాడు. అతని కాలం లో ఇరాన్ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింది చివరకు నాదిర్ షా 1747 లో సొంత అంగరక్షకులచేత హత్య కావిoచబదినాడు. అతని తరువాత ఇరాన్ సామ్రాజ్యం చిన్న బిన్నం అయినది
 ఆధారాలు:
వికిపెడియా.
భారత దేశ చరిత్ర – తెలుగు అకాడమి.





21 June 2016

మంగోలియన్ సైనిక, పరిపాలక యోధుడు చెంఘీజ్ ఖాన్

మంగోలియన్ సైనిక యోధుడు మరియు పరిపాలకుడు చెంఘీజ్ ఖాన్ ఈశాన్య ఆసియాలోని ఒంటరి సంచార అనాగరిక మంగోల్ తెగలను సమైక్య పరిచి  తద్వారా ప్రపంచంలో అతి పెద్ద సామ్రాజ్యం “మంగోల్ సామ్రాజ్యం” ను స్థాపించినాడు మరియు యురేషియా భూభాగం మొత్తం ను  ఆక్రమించాడు. అతను ఆసియాలో చూసిన అత్యంత అధునాతన వ్యవసాయిక(ప్రొఫెషినల్)  సైనిక వ్యవస్థ  ను అభివృద్ధి చేసినాడు కనుక అతనిని అందరు గ్రేట్ ఖాన్  అని పిలిచేవారు.

చెంఘీజ్ ఖాన్ అసలు పేరు "తెముజిన్” ( ఒక ప్రసిద్ద తాతర్  సేనాపతి పేరు). అతను 1162 లో ఉత్తర కేంద్ర మంగోలియా లో జన్మించాడు. అతని తండ్రి పేరు ఏసుఖే(Yesukhei). తెముజిన్ బోరిజిజీన్ తెగ వాసి  మరియు 1100 సంవత్సరంలో మంగోల్ ను సమైఖ్యపరిచిన ఉత్తర చైనా కు చెందిన జిన్ (చిన్) వంశానికి చెందిన ఖబుల్ ఖాన్ వంశస్థుడు.

 మంగోలియా జానపద గాధల ప్రకారం తెముజిన్ చేతిలో రక్తపు గడ్డతో జన్మించినాడు. మంగోల్ తెగల విశ్వాసం  ప్రకారం అలా వుండటం గొప్ప నాయకుని లక్షణం. అతని తల్లి హేలున్ మంగోల్ తెగల అనైక్యతను అతనికి వివరించి మంగోల్  తెగలు అన్నింటిని సమైఖ్య పరచమని చిన్నప్పుడు నుండి భోదించేది. 
తెముజిన్ 9 సంవత్సరాల వయసులో అతని తండ్రి అతనిని భవిష్యత్ వధువు బోర్తే కుటుంబం తో నివసిoచడానికి  తీసుకుని వెళ్లాడు. ఎసుకి ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు గతం లో అతని అతిక్రమణలకు బలి అయిన తతార్ తెగ నాయకులు శాంతి విందుకు ఆహ్వానించి విందులో విష ప్రయోగం తో అతనిని సంహరించి నారు. తన తండ్రి మరణాంతరం తెముజిన్ ఇంటికి తిరిగి వచ్చి తెగ నాయక్వతం స్వికరించినాడు. తెగ లో ముఖ్యులు అతని నాయకత్వంను తిరస్కరించి సమీప తమ్ముళ్లు మరియు సగం సోదరులు కల అతని కుటుంభం ను తెగ నుండి  బహిష్కరించారు. కుటుంబం నాయకత్వం కోసం తెముజిన్ తన సవతి సోదరుడు బెక్తేర్ ను చంపి కుటుంబ నాయకుని  గా తన స్థానం సుస్థిర పరుచుకొన్నారు.

అతనికి 16 ఏళ్ల వయస్సులో కొంకిరాట్ తెగకు చెందిన బోర్తే తో వివాహం జరిగినది మరియు రెండు తెగ ల మద్య సంభంద భాంధవ్యాలు ఏర్పడినవి. అయితే ప్రత్యర్ధి మేర్కిట్ తెగ వారు బోర్తే ను అపహరించి వారి తెగ పెద్ద తో ఆమె వివాహం జరిపినారు. వారితో యుద్ధం జరిపి తెముజిన్ తన బార్యను రక్షించుకోనినాడు. వారికి మొదటి సంతానం జాచి పుట్టినాడు. అతనికి మొత్తం జీవిత కాలం లో 20 వివాహాలు జరిగినవి. ఇతర భార్యలతో అతనికి అనేక మంది సంతానం జన్మించారు. కాని బోర్తే కు మాత్రమే కలిగిన మగ సంతానం అతనికి వారసులు అయ్యారు. 
 20 ఏళ్ల వయస్సు లో    అతను ఈశాన్య ఆసియాలో అనేక మంగోల్ ఒంటరి  తెగలను  సమైక్య పరిచి ఒక పెద్ద సైన్యం నిర్మించడం మొదలుపెట్టాడు. అతను స్థాపించిన  మంగోల్ సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యానికి ముందు ప్రపంచంలో అతిపెద్ద సామ్రాజ్యం.  

సార్వత్రక పరిపాలకుడు.
20 సంవత్సరాల వయసులో తెముజిన్ తన మాజీ కుటుంబం మిత్రులు టైచిట్స్ (Taichi'uts)  ద్వారా అపహరింపబడి తాత్కాలికంగా బానిసగా  మార్చబడినాడు.ఒక మిత్రుని సహాయంతో   చెర నుండి తప్పించుకున్నాడు మరియు తన సోదరులు మరియు అనేక ఇతర తెగ సబ్యుల సహాయం తో ఒక సైనిక దళం ను ఏర్పాటుచేసినాడు.  తెముజిన్ నెమ్మదిగా 20,000 మంది  పురుషులతో  ఒక పెద్ద సైన్యంను  నిర్మించడం ద్వారా అధికారంలోకి రావడం ప్రారంబించినాడు. వివిధ తెగల మధ్య సంప్రదాయ విభేదాలను నాశనం చేసి తన పాలనలో మంగోలియా  ను  ఏకం చేసినాడు.

అసాధారణ సైనిక వ్యూహాలు  మరియు దయలేని క్రూరత్వం ప్రదర్శించి తాతర్స్ ను సమూలంగా నాశనం చేయటం ద్వారా  తన తండ్రి హత్య కు ప్రతీకారం తీర్చుకున్నాడు. మూడు అడుగుల పొడవుఉన్న   ప్రతి తతార్ మగ వాడిని హత్య చేసినాడు.  ఆ తరువాత శక్తివంతమైన టైచుట్, నైమాన్ తెగ లను ఓడించి 1206 నాటికి కేంద్ర, తూర్పు మంగోలియా తన ఆధీనం లోనికి తెచ్చుకొన్నాడు.

మంగోల్ సైన్యం యొక్క ప్రారంభ విజయాలకు   చెంఘీజ్ ఖాన్ తెలివైన సైనిక వ్యూహాలు, విస్తృతమైన గూఢచారి వ్యవస్థ, నూతన  సైనిక విధానాలు, సమర సుశిక్షితులైన 80,000 మంది మంగోల్ సైన్యం మరియు ఒక అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థ తోడ్పడినవి.  ప్రతి సైనికుడు  విల్లు, బాణాలు, ఒక డాలు, ఒక డేగర్ మరియు ఒక బల్లెం  కలిగి ఉండేటట్లు  చేశాడు. ఆశ్వికులు ఒక కొక్కెం తో కూడిన ఒక కత్తి, శరీరం కవచం, ఒక గొడ్డలి లేదా జాపత్రి, మరియు బల్లెం కలిగి ఉండేవారు.  అశ్వికులు వారి కాళ్లను ఉపయోగిస్తు  వేగంగా తమ చేతులతో  బాణాలను వేస్తుండేవారు. మొత్తం సైన్యాన్ని కోసం ఒక వ్యవస్థీకృత సరఫరా వ్యవస్థ పాటించేవారు.

ప్రత్యర్థి మంగోల్ తెగలు పైన విజయాలు తర్వాత, ఇతర తెగల నాయకులు అతనితో  శాంతి కి అంగీకరించారు మరియు తెముజిన్ కు "చెంఘీజ్ ఖాన్" అనగా "సార్వత్రిక పాలకుడు." అనే బిరుదు ప్రధానం చేసారు. ఇది రాజకీయ ప్రాముఖ్యత మరియు  ఆధ్యాత్మిక ప్రాముఖ్యత  కల బిరుదు. ప్రముఖ మతాధిపతి షమన్ చెంఘీజ్ ఖాన్ ను  మొంగే కోకో టేంగ్రీ ( "ఎటర్నల్ బ్లూ స్కై") యొక్క ప్రతినిధి, మంగోలుల సుప్రీం దేవుడు అని  ప్రకటించినాడు. దైవ స్థాయిని కలిగిన ఈ ప్రకటన ప్రపంచాన్ని పరిపాలించటం  చెంఘీజ్ ఖాన్ విధి అని అంగీకరించబడింది. చెంఘీజ్ ఖాన్ "నేను దేవుని శిక్షను. మీరు గనుక పాపాలు చెయకపొయి ఉంటే, దేవుడు మీ  మీద నా లాంటి వ్యక్తిని శిక్ష గా పంపడు.”  అని ప్రకటించినాడు.
  
ఘనమైన  విజయాలు :
చెంఘీజ్ ఖాన్ తన దైవిక తనాన్ని వృధా చేయక  ఆధ్యాత్మిక స్ఫూర్తి తో తన సైన్యాన్ని ప్రేరణ కల్పించినాడు. జనాభా పెరగడంతో ఆహార మరియు వనరుల కొరత మంగోలులకు ఎదురుయ్యింది. 1207 లో, అతను గిగ్జియా రాజ్యంకు వ్యతిరేకంగా తన సైన్యాన్నిపంపి, రెండు సంవత్సరాల తర్వాత దానిని స్వాదిన పరుచు కొన్నాడు. 1211 లో, చెంఘీజ్ ఖాన్ సైన్యాలు, ఉత్తర చైనా లోని జిన్ రాజరికం కు చెందిన అంతులేని వరి పొలాలు మరియు సంపద సులభంగా స్వాదిన పరుచుకొన్నాడు.

జిన్ రాజరికo కు వ్యతిరేకంగా అతని దురాక్రమణ దాదాపు 20 సంవత్సరాల పాటు సాగిప్పటికీ, చెంఘీజ్ ఖాన్ సైన్యాలు సరిహద్దు సామ్రాజ్యాలకు  వ్యతిరేకంగా పశ్చిమ మరియు ముస్లిం ప్రపంచం ను  ఆక్రమించ దాల్చినాడు. చెంఘీజ్ ఖాన్  తుర్కిస్తాన్, పర్షియా, మరియు ఆఫ్గనిస్తాన్ కలసిన టర్కిష్ సామ్రాజ్యం లో చేరిన ఖ్వరిజం (Khwarizm) రాజ్యం తో దౌత్యం ఉపయోగిoఛి  వాణిజ్య సంబంధాలు ఏర్పాటు చేసుకొన్నాడు. . కానీ ఒక మంగోల్ కార్యవర్గం బిడారు పై ఒత్రార్ (Otrar) గవర్నర్ దాడి చేశాడు. చెంఘీజ్ ఖాన్ ఈ అమర్యాద విని ఆ గవర్నర్ ను తీసుకొనిరావడానికి ఒక దౌత్యవేత్త ను  పంపాడు.ఖ్వరిజం పాలకుడు అయిన  షా మహమ్మద్  చెంఘీజ్ ఖాన్ ఉత్తర్వు ను ధిక్కరిస్తూ మంగోల్ రాయబారి తల నరకి పంపాడు.

దీనితో ఆగ్రహం చెందిన చెంఘీజ్ ఖాన్ 1219 లో ఖ్వరిజం రాజవంశం కు వ్యతిరేకంగా 200,000 మంగోల్ సైనికులను దాడికి పంపినాడు.  మంగోల్ సైనికులు అతి కిరాతకంగా,కర్కశంగా  ప్రవర్తించి  షా మహమ్మద్ పై విజయం సాదించారు. చివరికి షా మహమ్మద్, ఆయన కుమారుడు బందిపబడి హత్య చేయబడినారు. 1221 లో ఖ్వరిజిం రాజరికం అంతరించినది.

చరిత్రకారులు ఖ్వరిజం పతనం అనంతర కాలాన్ని  అనంతర మంగోలియా కాలం అని  వివరిస్తారు. ఈ సమయం లో  చెంఘీజ్ ఖాన్ చైనా మరియు యూరోప్ యొక్క ప్రధాన వాణిజ్య కేంద్రాలలతో సంభందాలు అభివృద్ధి చేసుకొన్నారు.  మంగోల్ సామ్రాజ్యం యస్సా(Yassa) అని పేరుగల శాసన నియమావళి చే పాలించబడింది . చెంఘీజ్ ఖాన్ దానిని  మంగోల్ సాధారణ చట్టం ఆధారంగా అభివృద్ధి పరచినాడు అందు రక్తపాతం,, వ్యభిచారం, దొంగతనం మరియు అబద్ధసాక్ష్యము నిషేధించే  ఆజ్ఞలు  చేర్చాడు. ఈ చట్టాలను  అతిక్రమించే వారికి మరణ దండన విధించాడు. సైనిక వ్యవస్థలో ప్రమోషన్ కు మెరిట్ ఆధారం చేసినాడు చిరకాల మంగోల్ సంప్రదాయం ప్రతిబింబించే మత సహనం పాటించినాడు అలాగే సామ్రాజ్యం లోని  పలు మతపరమైన బృందాలకు  పన్ను రాయితీలను ఇచ్చినాడు.

ఖ్వరిజం రాజరికం పతనం తరువాత  చెంఘీజ్ ఖాన్ మరోసారి చైనా తూర్పువైపు  తన దృష్టి ని సారించినాడు.గ్జిగ్జియా యొక్క తంగుత్స్ చెంఘీజ్ ఖాన్  ఖ్వరిజం యుద్ద యాత్రకు సహకరించక అతని  ఆదేశాలను ఉల్లంఘించి బహిరంగంగా తిరుగుబాటు చేసారు.  తాంగుత్  నగరాల ను చెంఘీజ్ ఖాన్ ఓడించి దాని రాజధాని నింగ్హియా  నగరం  కొల్లగొట్టాడు. ప్రజలను చిత్రవధలకు గురిచేసినాడు. చెంఘీజ్ ఖాన్ తాంగుత్  రాచరికo దాని పాలనను  అంతం చేసినాడు.  

 చెంఘీజ్ ఖాన్ మరణం
చెంఘీజ్ ఖాన్ గ్జిగ్జియా యొక్క విజయం  తర్వాత, 1227 లో మరణించారు. అతని మరణం యొక్క ఖచ్చితమైన కారణం తెలియదు. కొందరు చరిత్రకారులు అతను వేటలో గుర్రం  నుండి క్రిందకు పడి చనిపోయాడు మరికొందరు  అలసట మరియు గాయాలవలన  మరణించాడు అని వాదిస్తున్నారు. ఇతరులు అతను శ్వాస వ్యాధి చే మరణించారు అని వాపోయారు. చెంఘీజ్ ఖాన్ సమాధి చిహ్నాలు లేకుండా తెగ ఆచారాల ప్రకారం అతనిని  ఖననం చేశారు.

తన మరణానికి ముందు, చెంఘీజ్ ఖాన్ చైనా తో  సహా తూర్పు ఆసియా ప్రాంతం  తన కుమారుడు ఒగేడి(Ogedei)కి , సామ్రాజ్యం యొక్క మిగిలిన భాగం  తన ఇతర కుమారులు మధ్య విభజించనాడు.  చాగటై మధ్య ఆసియా మరియు ఉత్తర ఇరాన్ కు రాజు అయినాడు. తోలు(Tolui) కి మంగోల్ మాతృభూమి సమీపంలో ఒక చిన్న భూభాగం అందుకున్నాడు; మరియు జోచి(Jochi) (చెంఘీజ్ ఖాన్ మరణం ముందు మరణించాడు). మరియు అతని కుమారుడు, బటు, ఆధునిక రష్యా నియంత్రణలోనికి తీసుకొని గోల్డెన్ గుంపు (Golden Horde) ఏర్పాటు చేసాడు.మంగోల్  సామ్రాజ్యం  విస్తరణ కొనసాగింది మరియు ఒగేడి  (Ogedei)ఖాన్ నాయకత్వంలో తారాస్థాయికి చేరుకుంది.

మంగోల్ సైన్యాలు పర్షియా, దక్షిణ చైనా మరియు బాల్కన్ జయించారు. మంగోల్ సైన్యాలు వియన్నా, ఆస్ట్రియా జయించిన తరువాత గ్రేట్ ఖాన్ ఒగేడి మరణ వార్త విని  ప్రముఖ కమాండర్ బటు, మంగోలియా తిరిగి వచ్చాడు. అ తరువాత మంగోల్ దండయాత్ర ఊపు  కోల్పోయింది మరియు  యూరప్ యొక్క ఈశాన్య ప్రాంతం జయించలేక పోయింది.

చెంఘీజ్ ఖాన్ వంశస్థులలో అతని చిన్న కుమారుడు తోలు యొక్క కుమారుడు కుబ్లై ఖాన్ ముఖ్యుడు. . యుక్తవయసులో, కుబ్లై చైనీస్ నాగరికత అందు  అత్యంత ఆసక్తిని చూపేవాడు మరియు  తన జీవితాంతం మంగోల్ పాలన లోకి చైనీస్ సంప్రదాయాలు మరియు సంస్కృతి చొప్పించే కృషి చేసాడు. కుబ్లీఖాన్  పెద్ద సోదరుడు మొంగ్కే ఖాన్  మంగోల్ సామ్రాజ్య ఖాన్ గా నియమింప బడి దక్షిణ భూభాగాలకు కుబ్లీఖాన్ ను  గవర్నర్ గా నియమించాడు.  

 కుబ్లీఖాన్  వ్యవసాయ ఉత్పత్తి పెoఛి మరియు మంగోల్ భూభాగంను  విస్తరించినాడు.  మొంగ్కే మరణానంతరం, కుబ్లై ఖాన్  మరియు అతని మరో తమ్ముడు అరిక్ బోకే సామ్రాజ్యంలో నియంత్రణ కొరకు పోరాడారు. ఆ వారసత్వ  యుద్ధం లో కుబ్లైఖాన్  విజేతగా నిలిచి  గొప్ప ఖాన్ మరియు చైనా యువాన్ రాజవంశం యొక్క స్థాపక చక్రవర్తిగా అయ్యాడు.

సంగ్రహ జీవిత చరిత్ర
·        పేరు:చెంఘీజ్ ఖాన్
·        వృతి:సైనిక నాయకుడు
·        పుట్టిన తేదీ: 1162
·        మరణ తేదీ:1227
·        పుట్టిన స్థలం:మంగోలియా
·        మరణం స్థానం:మంగోలియా
·        ఇతర పేర్లు: చిన్గ్గిస్ ఖాన్, జిన్గిస్, చెంఘీజ్ ఖాన్
·        అసలు పేరు:తెముజిన్.

"నేను దేవుని శిక్షను. మీరు గనుక పాపాలు చెయకపొయి ఉంటే, దేవుడు మీ  మీద నా లాంటి వ్యక్తిని శిక్ష గా పంపడు.” చెంఘీజ్ ఖాన్ .



16 June 2016

ఇస్లామిక్ చరిత్ర లో ఖ్యాతిగడించిన మహిళామణులు.



ఇస్లాం   తల్లి  పాదాల కింద స్వర్గం ఉంచింది మరియు భార్యను గౌరవించని భర్త  విశ్వాసం  అసంపూర్తిగా మిగులుతుంది.  ఈ విధమైన విశ్వాసం తో  మహిళలు గౌరవనీయ స్థితి మరియు స్థానం  పొంది ఇస్లామిక్ చరిత్రలో ఉన్నత స్థానం పొందినారు. 

ఒక నవజాత శిశువు యొక్క ఏడుపు తో,  ఒక కూతురు పుట్టిన గురించి సమాచారం తో ఒక మక్కా గృహస్తుని హ్రుదయo విలవిల లాడుతుంది. ఈ వార్తను అతను అవమానకరం గా భావిస్తాడు. చీకట్లో ఎవరు చూడకుండా అతను తన నవజాత శిశువును సజీవంగా పాతిపెట్టడానికి బయలుదేరతాడు. – ఇది అజ్ఞాన కాలం (621CE) నాటిఅరబ్ సమాజ స్థితి.
సరిగ్గా అదేపరిస్థితులలో ఏనుగు సంవత్సరం లో ప్రవక్త మొహమ్మద్(స) జననం జరిగింది మరియు మానవాళి కి ఒక ఆశా ఉదయ రేఖ కన్పించినది. పాతిపెట్టబడే ప్రతి ఆడ శిశువు తనుచేసిన తప్పు ఏమిటి అని తన జనకుడిని అడుగుతుంది దానికి లెక్కల దినమున తను చేసిన దుశ్చర్యకు ప్రతి తండ్రి  సమాధానం ఇవ్వవలసి వస్తుందని ప్రవక్త(స)తెలిపినాడు.  

ఇస్లాం సమస్త మానవజాతి కోసం మరియు మహిళల జీవితాలలో ఒక ఉత్ప్రేరకంగా మార్గదర్శకత్వం గా ఆవిర్భవించినది. గతంలో వినని ఒక భావన  లేదా ఆలోచన -మహిళల హక్కులు అనేవి ఆదరించబడినవి  మరియు రక్షిoచడటం  జరిగింది. గృహాల్లో కేవలం కేవలం వస్తువు గా ఉన్న భార్య  పరువుకు చిహ్నం  అయ్యింది. ప్రవక్త (స)సహచరులు, ప్రవక్త(స)  తన కుమార్తెల పట్ల చూపిన ఉత్తమ ప్రవర్తన, ప్రేమ ను చూసి ఆశ్చర్యపోయారు.
ప్రవక్త (స) స్త్రీ-పురుష తేడా ఆధారంగా విశ్వాసులలో  ఎలాంటి తేడా లేదు అని బోధించారు. ఇద్దరు సమానoగా  హక్కులు - విధులు మరియు  జ్ఞానము పొందవచ్చును అని అన్నారు. మహిళలు  చెడు నుండి రక్షణ పొందటానికి మరియు ఇతరులను  మంచి వైపు ప్రోత్సహించడానికి పురుషుల తో పాటు సమాన అధికారం కలిగి ఉన్నారు.  అదే విధంగా తల్లి పాదాల చెంత స్వర్గం ఉందని అందువలన తల్లి తో పాటు తండ్రులు కూడా  స్వర్గం పొందుతారని  భార్యను  గౌరవించలేని భర్త  విశ్వాసం అసంపూర్తిగా మిగులుతుందని అన్నారు. ఈ విధమైన విశ్వాసం తో  మహిళలు గౌరవనీయ స్థితి మరియు స్థానం  పొంది ఇస్లామిక్ చరిత్రలో ఉన్నత స్థానం పొందినారు.

ముస్లిం  మహిళలు ఇస్లామిక్ చరిత్రలో  పండితులు, న్యాయ వేత్తలు , పాలకులు,  యోధులు, వ్యాపార, మరియు న్యాయ నిపుణులు గా రాణించారు. ప్రవక్త (స) యొక్క గృహo అతని అనుచరులకు మార్గదర్శకత్వం చూపినది.  అతని భార్య ఖదీజా (ర) అతని అంతరంగికురాలుగా, సహచరిగా,  ఒక సంపన్న వ్యాపారవేత్తగా మరియు  వర్తకురాలుగా  అతను ప్రవక్త పదవిని పొందినప్పుడు నైతికంగా మరియు ఆర్థికంగా మద్దతు ఇచ్చినది.  ఆయేషా బిన్తె అబూ బకర్ (ర) అతని నుండి అపార ధార్మిక జ్ఞానం పొంది  ఒక గొప్ప న్యాయవేత్త మరియు విద్వాంసురాలుగా  మారింది. ఉమ్మె సలమా (ర) హుడైబియా  ఒప్పందం సమయంలో  ప్రవక్త(స) కు  న్యాయ సలహా ఇచ్చినది.  హఫ్సా (ర) ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ కుమార్తె, ఆమె తండ్రి మరణం తరువాత దివ్య ఖురాన్ వ్రాసిన మొదటి వ్యక్తి అయినది.
హదీసు లో నిపుణులు  మరియు పండితులు,కవయిత్రులు,భోదకులు మరియు న్యాయవేత్తలు :
హదీసుల సంగ్రహం లో స్త్రీల ఘనత గొప్పది. ఇస్లాం తోలి కాలం లో హదీసు సంగ్రహకురాళ్ళుగా  స్త్రీలు ఉండేవారు. ఇబ్నె హజర్ 53 మహిళల వద్ద, అస్-సఖ్వి  68 మహిళలవద్ద  మరియు అస్-సుయూతి 33 మహిళల వద్ద హదీసులు అధ్యయనం చేసారు.
నాల్గవ శతాబ్దంలో యాజ్-సుఫ్ఫియా  గా పిలవబడే ఫాతిమా బిన్తె అబ్దుర్ రెహ్మాన్,  ఫాతిమా అబూ దావుద్ సునన్ యొక్క మనవ రాలు, అమత్ అల్- వహీద్, ప్రముఖు న్యాయవేత్త అల్-ముహామిమిలి యొక్క  మనుమరాలు,  న్యాయమూర్తి అబూ బకర్ అహ్మద్ యొక్క కుమార్తె ఉమ్ అల్-ఫత్ అమత్ అస్-సలామ్ మొదలగు హదీసు విదుషిమణులు కలరు.
జుముఃబిన్తె అహ్మద్ యొక్క ధార్మిక తరగతులకు  ఎల్లప్పుడూ పెద్దసంఖ్య లో విశ్వాసులు హాజరుయ్యేవారు.

ఫాతిమా బిన్తె అల్-హసన్ ఇబ్న్ ఆలీ అద్-దక్క్యక్ అల్- కుశైరి ఐదవ మరియు ఆరవ శతాబ్దాల, ఒక హదీసులు పండితురాలు. ఆమె దైవభక్తి మరియు చేతివ్రాత నగీషీ కుశలత, హదీసు మరియు ఇస్నాడ్స్(isnads -chains of narrators) కు ప్రసిద్దురాలు.
అల్- సహీహ్ బుఖారి హదిసు గ్రంధం పై  కరిమా అల్ మర్వాజియా కు మంచి పట్టు ఉంది. అబూ దార్ హెరాట్  ఆ కాలానికి చెందిన ప్రముఖ పండితుడు. ఆమె దగ్గిరే  సహీహ్ బుకారి అధ్యయనం చేయమని తన విద్యార్థులకు సలహా ఇచ్చేవాడు. ఆమె విద్యార్థులలో  అల్-ఖాతిబ్ అల్-బాగ్దాదీ మరియు అల్-హుమయ్ది ఉన్నారు.
షాహ్దః గా పిలబడే ఫాతిమా-బిన్తె-ముహమ్మద్, ముస్నిడ అస్ఫహన్ (అస్ఫహన్ అనగా  గొప్ప హదీసుల పై అధికారo కలవారు)గౌరవం  అందుకున్నారు. ఆమె సూఫీ గృహం స్థాపించారు దానికి ఆమె  భర్త చాలా దాతృత్వము ఇచ్చారు. సహీహ్ అల్ బుఖారీ పై ఆమె ఇచ్చే ఉపన్యాసాలకు  విద్యార్థులు పెద్ద సంఖ్య లో హాజరుయ్యేవారు.

సిట్ట అల్- వుజ్ర ఇస్లాం చట్టం పై తన  పాండిత్యం పాటు సహీహ్ అల్-బుకారి  పై  డమాస్కస్ మరియు ఈజిప్ట్ లో ఉపన్యాసాలు ఇచ్చేవారు అదే విధంగా ఉమ్ అల్-ఖీర్ అమత్ అల్- ఖాలిక్,  హిజాజ్ లో చివరి గొప్ప హదీసుల విద్వాంసురాలు గా  భావించబడుతుంది.
ఏడవ శతాబ్దంలో డమాస్కస్ లో ఉమ్ అల్-దర్దా అనే ఒక ప్రముఖ న్యాయవేత్త కలరు ఆమె విద్యార్ధులలో అబ్దుల్ మాలిక్ ఇబ్న్ మర్వన్ మరియు అప్పటి ఖలీఫా  ప్రముఖులు. ఆమె మసీదులో హదీసులు మరియు ఫికా  బోధించెది. ఆ సమయంలోని ఒక ముఖ్యమైన పండితుడు మరియు తిరుగులేని ప్రజ్ఞగల  ఒక న్యాయమూర్తి ఇలియాస్-ఇబ్నె-మువియా ఆమెను  ఇతర హదీసు పండితులలో  ఉన్నతరాలుగా  భావిస్తారు.

ఆయేషా బిన్తె సాద్  బిన్ అబి వాక్వాస్ ఒక న్యాయవేత్త,  పండితురాలు  మరియు ప్రఖ్యాత మాలిక్ ఫికా గురువు ఇమామ్ మాలిక్ యొక్క ఉపాద్యాయురాలు.
సయ్యిదా నఫీసా ప్రవక్త ముహమ్మద్ (స) యొక్క ముది మనుమరాలు మరియు హస్సన్ బిన్ ఆలీ బిన్ అబూ తాలిబ్ కుమార్తె. ఆమె  గొప్ప ఇస్లామిక్ న్యాయ శాస్త్రవేత్త. ఆమె  వద్దకు విద్యనబ్యసించడానికి విద్యార్థులు సుదూర ప్రాంతాలనుండి వచ్చే వారు. వారిలో ఇమాం షఫీ ఒకరు. ఇమాం షఫీ షాఫి  ఫికా స్థాపకుడు. అతని విద్యకు ఆమె ఆర్థికంగా సహాయం చేసింది.
అషిఫా బిన్తె అబ్దుల్లా మార్కెట్ ఇన్స్పెక్టర్ మరియు మేనేజర్ గా ఖలీఫా ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ నియమించిన తొలి ముస్లిం స్త్రీ.

అమ్ర బిన్తె అబ్డుర్రెహామన్ ఎనిమిదవ శతాబ్దపు ఒక న్యాయవేత్త,  ముఫ్తీ మరియు హదీసులలో గొప్ప  పండితురాలు. ఖలీఫా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ సమయంలో ఆమె ప్రవక్త (ర) గారి భార్య అయేషా (ర) సంబంధిత హదిసులపై గొప్ప అధికారిణిగా  భావించేవారు. ఆమె విద్యార్థులలో  అబూ బకర్ బిన్ హజిం మదీనా యొక్క  ప్రముఖ న్యాయమూర్తి గా ఉండేవారు.

డమాస్కస్ లో ఆయేషా బిన్తె ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ హది అనేక ప్రముఖ ముస్లిం పురుష పండితులకు  బోధించారు మరియ ప్రవక్త ముహమ్మద్ (స) కు చెందిన ఇస్నాడ్స్ తెలిసిననవారు.  ఆమె ఇబ్న్ హజర్ అల్-అస్కలని కి భోదించారు
ఫాతిమా అల్-బతయహియ్యః ఎనిమిదవ శతాబ్దపు  ఒక ప్రముఖు వృద్ధ మహిళ. ఆమె  ప్రవక్త యొక్క మస్జిద్ లో సహీహ్ అల్ బుఖారీ హదీసులు  విద్యార్థులకు  బోధించేవారు
తొమ్మిదవ శతాబ్దంలో అల్-కరవ్వియ్యిన్ మస్జిద్ స్థాపకురాలు ఫెస్, మొరాకో కు చెందిన ఫాతిమా అల్-ఫిహ్రియ్య. 859వ  సంవత్సరం లో స్థాపించబడిన కరవ్వియ్యిన్ మస్జిద్ ద్వార అరబిక్ సంఖ్యలు ప్రచారం పొందినవి. ఇది యూరప్ లోనే గాక  ప్రపంచంలోని పురాతన మరియు  మొదటి విశ్వవిద్యాలయం  మరియు ఇప్పటికీ పనిచేస్తున్న విశ్వవిద్యాలయంగా ప్రసిద్ది పొందినది. ఇస్లామిక్ స్టడీస్, భాషలు మరియు శాస్త్రాలు అధ్యయనం చేయడానికి ఇక్కడికి  ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల నుండి ఇక్కడకి విద్యార్ధులు వచ్చేవారు. ప్రయాణించారు
కార్డోబ ఫాతిమా పదవ శతాబ్దం గొప్ప లైబ్రేరియన్ ఆమె 4,00,000 పుస్తకాలు గల 70 ప్రజా గ్రంథాలయాలు పర్యవేక్షించినది.
పదకొండవ శతాబ్దంలో బనఫ్శా ఆర్-రుమయ్య పాఠశాలలు, వంతెనలు మరియు బాగ్దాద్ నగరం లో గృహం లేని స్త్రీల కోసం  ప్రజాగృహం ను నిర్మించినది.
వారి  తర్వాత అబిదః అల్ మదన్నియ్యా, అబ్దః బిన్తె బిషర్, ఉమ్మె ఉమర్ అధ్-థకఫియ్య , ఆలీ ఇబ్న్ అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ ముది మనుమరాలు జైనాబ్, నఫిస్సా  బిన్తె అల్-హసన్ ఇబ్న్ జియాద్, ఖదీజా ఉమ్మె ముహమ్మద్, అబ్దః  బిన్తె అబ్దుర్  రెహమాన్ మరియు అనేక మంది ఇతర మహిళలు హదీసు ప్రసంగాలలో నిపుణులు ఉన్నారు.
అబిదా ముహమ్మద్ ఇబ్న్ -యాజిద్ యొక్క బానిస. ఆమె  పెద్ద సంఖ్యలో హదీసులు  నేర్చుకొని తన మదని ఉపాద్యాయురాలు యొక్క 10,000 హదీసుల పై పట్టు కలిగి ఉన్నారు.  ఆమెను పవిత్ర నగరం జెరూసలేం  పర్యటన కు వచ్చిన స్పెయిన్ గొప్ప హదీసు పండితుడు హబీబ్ దాహ్హన్ కు బహుమతి గా ఇచ్చినప్పుడు అతను ఆమెను బానిసత్వం నుంచి  విముక్తి చేసి ఆమెను వివాహం చేసుకొని అందలుషియా(స్పెయిన్) కు తీసుకు వెళ్ళెను.
జైనాబ్  బిన్తె సులేమాన్, దీనికి విరుద్ధంగా, జన్మతః ఒక యువరాణి.  ఆమె తండ్రి-సఫ్ఫః అబ్బాస్సిడ్ రాజవంశ స్థాపకుడి బందువు  మరియు అల్-మన్సూర్ కాలిఫెట్ సమయంలో బస్రా, ఒమన్, మరియు బహారిన్   గవర్నర్ గా ఉండేవాడు. విద్యావంతురాలు అయిన జైనాబ్ హదీసు విద్వాంసురాలు మరియు ఆమె శిష్యులుగా అనేక పురుషులు ఉండేవారు.  
పన్నెండవ శతాబ్దంలో బాగ్దాద్ లో అద్యయనం చేసి  మహిళా మణిగా ప్రసిద్ది చెందిన షుహదః బింతె అహ్మద్  హదీసులలో గొప్ప విద్వాంసురాలు మరియు న్యాయవేత్త.
'జైనబ్ బిన్తె కమల్ 400 కంటే పుస్తకాలు ఎక్కువ పుస్తకాలు డమాస్కస్ లోని అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో భోదించారు మరియు విద్యార్ధుల పట్ల అసాధారణ సహనం ప్రదర్శించారు.
ఫాతిమా బిన్తె ముహమ్మద్ అల్-సమర్కండి న్యాయ శాస్త్రవేత్త అయిన తన భర్తకు ఫత్వాలు జారి చేయడం లో సలహా ఇచ్చేవారు.
ఇటీవల, పంతొమ్మిదవ శతాబ్దంలో నైజీరియా కు చెందిన నానా ఆస్మా ఒక కవయిత్రి, గురువు, మరియు తన  తండ్రికి సలహాదారునిగా పనిచేసారు.

పరిపాలనా వేత్తలు:
పదకొండవ శతాబ్దం లో యెమెన్ ను 71 సంవత్సరాలు పాలించిన అరవ-అల్-సులయ్హీ  పవిత్ర స్త్రీగా పేరుగాంచినది మరియు పదమూడవ శతాబ్దంలో తన భర్త మరణం తర్వాత ఈజిప్ట్ యొక్క పాలనా భారం తీసుకొన్నది సుల్తానా షాజరాట్ అల్-డర్.
సలాఉద్దిన్ అయ్యబి మేనకోడలు మరియు కోడలు ధయ్ఫా ఖాతూన్ ఆమె కుమారుడు కింగ్ అబ్దుల్ అజీజ్ మరణం తరువాత అలెప్పో రాణి అయ్యారు మరియు ఆరు సంవత్సరాలు పరిపాలించారు. ఆమె పాలన సమయంలో ఆమె క్రూసేడర్స్, ఖుర్జ్మేయిన్, మంగోల్ మరియు సెల్జుక్ లనుండి బెదిరింపులను ఎదుర్కొన్నారు. ఆమె అలెప్పో లో రెండు పాఠశాలలు స్థాపించారు.
సిట్టఅల్-ముల్క్ ఈజిప్ట్ కు చెందిన ఒక ఫాతిమిడ్ యువరాణి ఆమె పరిపాలన ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగా ఉంది.
తొమ్మిదవ శతాబ్దపు ఖలీఫా హరున్ అర్-రషీద్ భార్య జుబేదా  మక్కా ప్రముఖ ప్రధాన మార్గాల్లో యాత్రికులకు   నీటి వసతి  మరియు అతిథి గృహాల నిర్మాణానికి ప్రసిద్ధి చెందింది. ఆమె కవులు మరియు రచయితలను ఆదరించినది.  మక్కా శివారులో ప్రసిద్ధ జుబేదా నీటి ఊట ఇప్పటికీ ఆమె పేరు అజరామరం చేసింది.
ప్రముఖ చరిత్ర కారుల  ఉద్దేశంలో 13వ శతాబ్దం లో భారత దేశమును పరిపాలించిన రజియా సుల్తాన నూరుగురు కుమారుల కన్న మిన్న.
యజుజ్ సుల్తాన్ సలీం కాలం లో రోక్సిలేనా గా పిలువబడే హుర్రేం సుల్తాన్,  ఉక్రేన్ మీద  క్రిమియన్ టర్క్స్   దాడిలో పట్టుబడి  ఒట్టోమన్ సుల్తాన్ కింగ్ సులేమాన్ కు  బానిసగా బహుకరింపబడి ఆ తరువాత అతనిని వివాహామాడినది. ఆమె ఒక మదరాసా  మరియు ఒక పబ్లిక్ వంటగది, పురుషులు మరియు మహిళలకు వేరు-వేరు స్నాన శాలలు, రెండు పాఠశాలలు మరియు మహిళల యొక్క ఆసుపత్రితో కూడిన మసీదు కాంప్లెక్స్ ను    ఇస్తాంబుల్ లో నిర్మించినది. ఆమె మక్కా లో నాలుగు స్కూల్స్ మరియు యెరూషలేములో ఒక మసీదును నిర్మించినది.
ఆమినా పదహారవ శతాబ్దంలో నైజీరియా లోని ఒక రాష్ట్రం రాణి. పదహారేళ్ళ వయసులో ఆమె రాజమాత అయ్యింది.  ఆమినా సైనిక నైపుణ్యాలను నేర్చుకోని ఆ రాష్ట్ర  అశ్విక దళం ప్రముఖ యోధురాలుగా  ఉద్భవించింది. 34 సంవత్సరాల తన పాలనలో, ఆమె అతిపెద్ద పరిమాణం లో భూభాగాన్ని విస్తరింపజేసినది. ఆమె హౌసా వ్యాపారులకు  సురక్షిత ప్రయాణాన్ని అనుమతించడానికి స్థానిక పాలకులను  బలవంతం చేసింది.  ఆమె నిర్మించిన మట్టి గోడ దుర్గాలు  ప్రజాదరణ పొందినవి.  ఆమె ప్రతి సైనిక శిబిరంలో చుట్టూ రక్షక గోడల నిర్మాణానికి ఆదేశించింది.ఇప్పటికీ వాటిని ఆమినా గోడలు అని  పిలుస్తారు.
1819 నుండి 1924 వరకు భూపాల్ ను పాలించిన బేగం కైఖుర్సు  జహాన్ కుటుంబం రైల్వే, వాటర్ వర్క్స్,  తపాలా వ్యవస్థ మరియు రవాణా మార్గాలు మెరుగుపరిచినది.
మేధోతనం  మరియు విద్యలో:
ముస్లిం మహిళలు మేధోతనం  మరియు విద్యలో విజయాలు సాదించారు.  సుతయ్త అల్ మహామిల్లి పదవ శతాబ్దపు  రెండవ సగంలో నివసించిన గణిత శాస్త్రవేత్త, మరియు బాగ్దాద్ లోని ఒక సంపన్న  చదువుకున్న కుటుంబం నుంచి వచ్చారు. ఆమె అరబిక్ సాహిత్యం, హదీసులు, న్యాయ మీమాంస మొదలగు అనేక రంగాలలో రాణించారు. ఆమె బీజగణితంలో అనేక సమీకరణాలకు పరిష్కారం కనుగొన్నారు. ఆమె ఇబ్న్ అల్ జౌజీ ఇబ్న్ అల్-ఖాతిబ్ బాగ్దాదీ మరియు ఇబ్నె కతిర్ వంటి చరిత్రకారులచే  కొనియాడబడింది.
కార్డోబ కు చెందిన లబన (పదవ శతాబ్దం, స్పెయిన్) గణితం లో మంచి  ప్రావీణ్యత గలది  మరియు అత్యంత క్లిష్టమైన జ్యామితీయ మరియు బీజగణిత సమస్యలు పరిష్కరించెది. ఆమె ఇస్లామిక్ స్పెయిన్, రెండోవ ఉమయ్యద్ ఖలీఫా అల్ హకం కు వ్యక్తిగత కార్యదర్శి గా నియమితురాలు అయ్యింది.

పదకొండవ శతాబ్దంలో నివసించిన అయేషా, అండాలస్ ప్రిన్స్ అహ్మద్ కుమార్తె, కవిత్వం  మరియు ప్రసంగo లో ఆమె   రాణించేను. ఆమె కవితలు కార్డోబ రాజ్యంలో అత్యుత్తమమైనవి  మరియు ఆమె వ్యక్తిగత  గ్రంధాలయం అత్యంత దుర్లభ గ్రంధాలతో నిండి ఉండెను.
పదకొండో శతాబ్దంలో అల్మోహడ్స్ యొక్క యువరాణి వాల్లదా కవితలు మరియు వాక్చాతుర్యo లో పేరు గాంచినది. ఆమె సంభాషణలు కడులోతుగా  మరియు ప్రకాశ వంతం గా ఉండేవి. 11వ శతాబ్దం లో వాల్లదా కార్డోబా ఐబీరియన్ ద్వీపకల్పం యొక్క ప్రతి మూల నుండి గద్య లేదా కావ్య కూర్పు లో పోటీదారులను ఓడించేది.  
పదకొండవ శతాబ్దం సెవిల్లె కు చెందిన అల్ ఘజానియా మరియు సఫియా ఇద్దరు వారి కావ్య మరియు ప్రసంగ కళ లో నిష్ణాతులు. సఫియా అందమైన  చేతివ్రాత మరియు ఆమె మాన్యుస్క్రిప్ట్ యొక్క అద్భుతమైన దీపాలంకరణలు ప్రసిద్ది చెందినవి.
అల్ –ఫైసులి కుమార్తె మిరియం అల్- ఫైసులి సాహిత్య విజయాలు  అండాలస్ అంతటా ప్రసిద్ధి చెందినవి. పదకొండవ శతాబ్దం చివరినాటికి ఆమె సూక్తుల వ్యంగ్య ప్రమాద తెలివి ఊహించనంతగా ఉంది.
అందమైన  చేతివ్రాత -  కలిగ్రాఫి మరియు ఇతర శాస్త్రాలు :
చేతివ్రాత కళ లో ప్రసిద్ది పొందిన ఒక పేరు లో తానా. ఆమె  ఇబ్న్-ఖయూమా గృహంలో ఒక బానిస గా ఉండేది.  ఇబ్న్ ఖయుమా ఎనిమిదవ శతాబ్దం ఖలీఫా మన్సూర్ కుమారులలో ఒకరికి శిక్షకుడు గా పనిచేస్తుండేవారు. అతను ఆనాటి ప్రముఖ కాలిగ్రాఫేర్ ఇషాక్-బిన్తె-హమ్మాద్ వద్ద శిక్షణ కొరకు తానా ను పంపుతాడు. తానా చేతిరాత అందంగా నగిషీలు చేక్కినట్లు ఉండెడిది.
పదకొండవ శతాబ్దపు ఉమ్మె-అల్-సాద్ ముస్లిం సంప్రదాయాలలో  ప్రసిద్ధి గాంచింది. అల్ ఫిహ్రిస్ట్-ఇబ్నె అల్ నడిమ్ అనే 18వ శతాబ్దపు చరిత్రకారుడు ఆమె  వివిధ నైపుణ్యాలు కల మహిళల్లో ఒకరిగా గుర్తించాడు.  
పదకొండవ శతాబ్దపు అరబ్ తెగల మహిళ ఒకరు అరబ్ మాండలికాలలో పండితురాలు. ఆమె  కు 'గిరిజన పురాణములు మరియు పదాల తో పరిచయం' ఉంది మరియు అరవ అనే ఆమె “ప్రబోధాలు, నీతులు, మరియు జ్ఞానం” పై ఒక పుస్తకం రాసింది.

రాస అనే పేరు గల ఒక భారతీయ  మహిళా వైద్య సంరక్షణ మరియు మహిళల రోగాల  రచయిత. ఆమె పుస్తకం అరబిక్ లో అందుబాటులో వైద్య పుస్తకల జాబితా లో  ఉంది. మరియః అల్-కిబ్తియ్యహ్ అనే ఈజిప్షియన్ మహిళా  ఏడవ శతాబ్దంలో రసవాదం లో పుస్తకాలు రచించినది.
10వ శతాబ్దం లో ఉత్తర సిరియా ను పాలించిన సయఫ్-అద్-దవల ఆస్థానం లో పనిచేసిన అల్-లిజిలియ్యః బిన్తె అల్-లిజ్జి అల్-అస్తుర్లబి అస్త్రోలబెస్ అనే విజ్ఞాన  శాస్త్రం లో ప్రముఖురాలు.
మహిళలు-వైద్య రంగం:
ఇస్లాం లో మహిళలు వైద్యులుగా పనిచేసినారు. వారు యుద్దరంగం లో గాయపడిన స్త్రీ-పురుషులకు వైద్యం చేసే వారు.
మొదటి నర్సు గా ఖ్యాతి ప్రవక్త (saws) సమయంలో జీవించిన రుఫయ్డ బిన్తె సాద్ అల్- అస్లమియ్య కు దక్కుతుంది.  ఆమె 624 CE లో బద్ర్ యుద్ధంలో గాయపడినవారికి వైద్యం చేసేది. ఆమె వైద్యుడు అయిన తన  తండ్రి, సాద్ అల్- అస్లామి వద్ద వైద్యం నేర్చుకొన్నారు.
అల్ షిఫా  బిన్తె అబ్దుల్లా అల్-కురైశియ అల్-అడవియః నాటి తెలివి గల మహిళా. ఆమె ప్రభుత్వ పరిపాలన మరియు వైద్యంలో నైపుణ్యం గలిగినది. ఆమె అసలు పేరు లయల కాని,అల్-షిఫా గా పేరుగాంచారు. షిఫా అనగా నయం చేసేది అని అర్ధం..
నుసైబా  బిన్తె కాబ్  అల్- మజ్నేవ ఉహుద్ యుద్ధం సమయంలో వైద్య సేవలు అందించింది. ఉమ్మె-ఇ-సినాన్ అల్-ఇస్లామి యుద్ధభూమిలో లోకి వెళ్ళడానికి మరియు గాయపడిన సైనికుల సహాయం మరియు నీటిని అందించడానికి ప్రవక్త(స) అనుమతి కొరకు విజ్ఞప్తి చేసింది. ఉమ్మెవర్క  బిన్తె హరిత్ ఖురాన్ క్రోడీకరణ లో పాల్గొంది మరియు బద్ర్ యుద్ధంలో గాయపడిన వారికి సేవలు అందించినది.
నుసైబా  బిన్తె అల్- హరిత్ ఆమెను ఉమ్ అల్-అతియా అని కూడా పిలుస్తారు, ఆమె యుద్ధభూమిలో గాయపడిన వారిని  సంరక్షించారు మరియు ఆహారo మరియు నీరు మరియు ప్రథమ చికిత్స అందించారు మరియు సున్తీ కుడా చేసేవారు.
ఇస్లాం లో మహిళల మీద 40 వాల్యూమ్ రచయిత డాక్టర్ అక్రమ్ నద్వి తన పరిశోధనలో అనేక చారిత్రిక రికార్డులు తవ్వితీసారు. ఇస్లాం సంబంధిత సంప్రదాయాల అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించిన ముస్లిం మహిళల 8,000 బయోగ్రాఫికల్ ఖాతాలు ఉన్నట్టు  గ్రహించారు. ముస్లిం మహిళలు సమకాలీన పురుష ప్రపంచాన్ని  మించి రాణిoచారు.మహత్తర మేథో సంపత్తి సాధనగా గౌరవం మరియు గుర్తింపు అందుకునే ప్రతిబ వారిలో  ఉంది. అవకాశాలు మరియు ప్రేరణ లబిస్తే ఈ మహిళలు ఇస్లామిక్ నాగరికత చరిత్ర లో ప్రముఖ పాత్ర వహించేదరు.