25 December 2017

దివ్య ఖుర్ఆన్ పేజీల నుండి క్రీస్తు యొక్క కథ (The Story of Jesus the Christ from the Pages of the Quran ) -.



Image result for The Story of Jesus the Christ from the Pages of the Quran )


మేరీ యొక్క తల్లి విన్నపము తో కథ మొదలవును:
అల్లాహ్ ఆదమ్ కు, నుహ్  కు, ఇబ్రహీం సంతతికి(1), ఇమ్రాన్ సంతతికి(2) సమస్త భూలోక వాసులపై ప్రాధాన్యత  ఇచ్చి(తన సందేశం కొరకు) ఎన్నుకోన్నాడు. ఒకరి వంశము నుండి ఒకరు జన్మించిన వీరందరూ ఒకే పరంపరకు చెందినవారు. అల్లాహ్ అంతా వింటాడు, ఆయనకు అంతా తెలుసు.  ఇమ్రాన్(౩) స్త్రీ అల్లాహ్ ఇలా ప్రార్ధించి నప్పుడు (అల్లాహ్ విన్నాడు) “ప్రభూ! నా గర్భం లో ఉన్న శిశువును నేను నీకు సమర్పిoచు కొంటున్నాను. అది నీ సేవకు అంకితం. నా ఈ కానుకను స్వీకరించు. నీవు అన్ని వినేవాడవు, అన్ని తెలిసినవాడవు” తరువాత  ఆమెకు ఆడ శిశువు జన్మించినప్పుడు, ఆమె ఇలా విన్నవించు కొన్నది “ప్రభూ! నాకు ఆడ శిశువు కలిగినది- ఆమెకు ఏ శిశువు పుట్టిందో అల్లాహ్ కు బాగా తెలుసు – బాలుడు బాలిక వంటివాడు కాడు.   నేను దానికి మర్యం అని పేరు పెట్టాను. శాపగ్రస్తుతుడైన షైతాన్ బారినుండి రక్షణ కొరకు నేను దానిని, దాని సంతానాన్ని నీకు అప్పగిస్తున్నాను. ఆమె ప్రభువు  ఆ బాలికను సంతోషముతో స్వీకరించి ఆమెను ఒక మంచి బాలికగా తీర్చి దిద్దాడు. ఇంకా, జకారియను ఆమెకు సంరక్షకుడిగా నియమించాడు. జకారియా ఆమె గదికి పోయినప్పుడల్లా అమెవద్ద, అయన కొన్ని భోజన పదార్ధాలను చూసే వాడు. ఆమెను ఇలా అడిగే వాడు “ మర్యమ్! ఇవి నీ దగ్గిరకు ఎక్కడనుండి వచ్చాయి.ఆమె ఇలా జవాబు చెప్పేది, “అల్లాహ్ నుండి వచ్చాయి. అల్లాహ్ తాను కోరిన వారికి లెక్కలేనంత ఉపాధిని ప్రసాదిస్తాడు.” [సూరా అల్ 'ఇమ్రాన్, 3: 33-37]

 అల్లాహ్ మర్యమ్ ను  ఆశ్విరదిస్తాడుస:
దేవదూతలు మేరీతో ఇలా అన్నారు: 'మర్యమ్! అల్లాహ్ నిన్ను ఎన్నుకోన్నాడు. నీకు పరిశుద్దతను ప్రసాదించాడు. ప్రపంచ మహిళల అందరిపై నీకు ప్రాధాన్యమిచ్చి నిన్ను తన సేవ కొరకు ఎన్నుకోన్నాడు. మర్యమ్! నీవు నీ ప్రభువునకు విదేయురాలుగా ఉండు. అయన సాన్నిద్యం లో సజ్దా చెయ్యి(సాస్టాoగపడు) రుకూ చేసే దాసులతో నీవు రుకూ చెయ్యి(నమ్రతతో వంగు) ప్రవక్తా! ఇవన్ని అగోచర విషయాలకు సంభందించిన వార్తలు. వాటిని మేము(4) నీకు వహి ద్వారా తెల్పుతున్నాము. లేకపోతే, మర్యమ్ సంరక్షకుడు ఎవరు అవాలి అనే విషయ నిర్ణయం కొరకు, ఆలయ సేవకులు తమ తమ కలములను విసిరినప్పుడు నీవు అక్కడ లేవు కదా! ఇంకా, వారి మద్య వివాదం చెలరేగినప్పుడు కూడా నీవు అక్కడ లేవు. [సూరా అల్ 'ఇమ్రాన్, 3: 42-44]

దేవదూతలు మర్యమ్ కు  సంతోషకరమైన వార్తను అందిస్తున్నారు:
 దేవదూతలు ఇలా అన్నారు  'మర్యమ్! అల్లాహ్ తన ఒక “ఆజ్ఞ” సంభందించిన శుభ వార్తను నీకు పంపుతున్నాడు(5). అతని పేరు ఈసా మసిహా(6). అతను మర్యమ్ కుమారుడు. అతను ఇహపరలోకాలలో గౌరవనీయుడౌతాడు. అల్లాహ్ సామిప్యం పొందిన దాసులలోని వాడుగా పరిగణిoప బడతాడు. ఉయ్యాలలో ఉన్నప్పుడూ, పెరిగి పెద్దవాడై నప్పుడు ప్రజలతో సంభాషిస్తాడు. ఇంకా అతను ఒక సత్పురుషుడు అవుతాడు.” ఇది విన్న మర్యమ్ ఇలా అన్నారు:”ప్రభూ! నాకు శిశువు ఎలా జన్మిస్తుంది? నన్ను ఏ పురుషుడూ చేతితోనైనా తాకలేదే! సమాధానం లబించినది. “అలానే జరుగుతుంది. అల్లాహ్ తానూ కోరినదాన్ని సృష్టిస్తాడు.అయన ఒకపనిని చేయాలని నిర్ణయించినప్పుడు, కేవలం దానిని “అయిపొ” అంటాడు.అంతే, అది అయిపోతుంది”.

(దైవ దూతలు ఇంకా ఇలా అన్నారు) “అల్లాహ్ అతనికి గ్రంధాన్ని, దివ్య జ్ఞానాన్ని భోధిస్తాడు. తౌరాతు, ఇంజిలు గ్రంధాల జ్ఞానాన్ని నేర్పుతాడు.ఇంకా అతనిని ఇస్రాయీలు సంతతి వద్దకు తన ప్రవక్తగా పంపుతాడు. (ప్రవక్త గా ఇస్రాయీల్ సంతతి వద్దకు వచ్చినప్పుడు అతను ఇలా అన్నాడు),”నేను మీ ప్రభువు వద్ద నుండి మీ వద్దకు సూచనను తీసుకువచ్చాను. మీ ముందే నేను మట్టి తో పక్షి ఆకారం గల ఒక బొమ్మను తయారు చేసి దానిలోనికి శ్వాస ఊదుతాను. అది అల్లాహ్ ఆజ్ఞతో పక్షి అవుతుంది.నేను అల్లాహ్ ఆజ్ఞ తో  పుట్టు గుడ్డిని, కుష్టు రోగిని బాగు చేస్తాను. అయన అనుజ్ఞ తో మృతులను బ్రతికిస్తాను. ఇంకా మీరు ఏమేమి తింటారో, మీ గృహాలలో ఏమేమి నిలువ చేసి ఉంచుతారో కూడా మీకు తెలుపుతాను. మీరు విశ్వసించే వారు అయితే, వాస్తవంగా ఇందులో మీకు గొప్ప సూచన ఉంది. ప్రస్తుతం నా కాలం లో ఉన్న తౌరతు గ్రందోపదేశాలను ద్రువపరచడానికి నేను వచ్చాను. ఇంకా, పూర్వం మీకు నిషేదిoపబడిన (హరాం) కొన్ని వస్తులను ధర్మ సమ్మతం (హలాల్) చేయటానికి కూడా వచ్చాను. చూడండి! నేను మీ ప్రభువు నుండి మీ వద్దకు సూచన తీసుకు వచ్చాను. కనుక అల్లాహ్ కు బయపడండి, నన్ను అనుసరించండి. అల్లాహ్ నాకు ప్రభువే మీకు ప్రభువే. కనుక మీరు అయన దాస్యాన్ని చేయండి.ఇదే రుజుమార్గం"[సూరా అల్ 'ఇమ్రాన్, 3: 45-51].

మర్యమ్ గర్భం ధరిస్తుంది:
మర్యమ్ తన వారినుండి(తన కుటుంబం) వేరై పోయి ఏకాంతం గా ఉన్నప్పుడు మేము ఆమె వద్దకు మా “ఆత్మ” ను (అంటే దూతను – దైవ దూత జిబ్రాయిల్) పంపాము. అప్పుడు అతడు ఆమె ముందు పరిపూర్ణమైన మానవాకారం లో ప్రత్యక్షమయ్యాడు. వెంటనే మర్యమ్ ఇలా పలికింది, “ నీవు దైవభీతి గల మనిషివే అయితే, నేను నీ బారినుండి రక్షించవలసినదిగా దయామయుడైన దేవుని శరణ కోరుకొంటున్నాను.” అతను” నేను నీ ప్రభువు దూతను మాత్రమె. నీకు ఒక పరిశుద్ద పుత్రుణ్ణి ఇచ్చేందుకు పంపబడ్డాను.” అని చెప్పాడు. మర్యమ్ “ నాకు పుత్రుడు ఎలా పుడుతాడు, నన్ను పురుషుడు ఎవడూ తాకనైనా లేదు, నేను చెడు నడత గల దానిని కాను” అన్నది. దైవ దూత ఇలా అన్నాడు, అలాగే జరుగుతుంది” నీ ప్రభువు ప్రజల కొరకు ఒక సూచనగా, మా తరుపు నుండి ఒక కారుణ్యంగా చేయాలని మేము ఈ పని చేస్తున్నాను. ఇది జరిగి తీరవలసిన విషయమే” అని సెలవిస్తున్నాడు. "[సూరా మర్యమ్, 19: 17-21]

ఈసా యొక్క జననం
మర్యమ్ ఆ మగ శిశువును గర్భం లో దాల్చినది. గర్భవతి అయిన ఆమె ఒక సుదూర ప్రదేశానికి వెళ్ళిపోయినది. తరువాత ప్రసవవేధన పడుతూ ఆమె ఒక ఖర్జురపు చెట్టు క్రిందకు చేరింది. ఆమె ఇలా వాపోయినది.” అయ్యో! నేను ఇంతకూ ముందే మరణించి ఉంటె, నామ రూపాలు లేకుండా నశించి ఉంటె ఎంత బాగుండేది!” అప్పుడు దైవదూత కాళ్ళవైపు నుండి ఆమెను పిలిచి ఇలా అన్నాడు, “భాధపడకు, నీ ప్రభువు నీకు దిగువ భాగం లో ఒక సెలయేరును సృజించాడు.  నీవు ఈ చెట్టు మొదలు కొంచం ఊపు. నీపై స్వచ్చమైన తాజా ఖర్జురపు పండ్లు రాల్తాయి. నీవు తిను, త్రాగు, నీ కళ్ళను చల్లబరుచుకో. తరువాత ఎవరైనా మనిషి నీకు కనిపిస్తే, అతనికి, నేను కరుణామయుని కోసం ఉపావాసం ఉంటానని మొక్కుకొన్నాను. కనుక ఈ రోజు నేను ఎవరితోనూ మాట్లాడను.” అని చెప్పు. [సూరా మర్యమ్, 19: 22-26]

ఈసామొదటి అద్భుతం:
తరువాత ఆమె ఆ బాలుణ్ణి తీసుకోని తన జాతి వారి వద్దకు వచ్చింది. ప్రజలు ఇలా అన్నారు, మర్యమ్! నీవు పెద్ద పాపమే చేసావు.ఓ హరూన్ సోదరి!(7) నీ తండ్రి కూడా చెడ్డ మనిషి కాడే, నీ తల్లి కూడా నీతి బాహ్యమైన నడత గల స్త్రీ కాదె!మర్యమ్ బాలుని వైపు సైగచేసి చూపింది. దానికి ప్రజలు, “ఉయ్యాలలోని ఈ పసిపిల్లవానితో మేము ఎం మాట్లాడము?” అని అన్నారు.పిల్లవాడు ఇలా పలికాడు, “నేను అల్లాహ్ దాసుణ్ణి. అయన నాకు గ్రంధాన్ని ఇచ్చాడు, నన్ను ప్రవక్తగా నియమించాడు. నేను ఎక్కడున్నా సరే, అయన నన్ను శుభావంతునిగా చేసాడు, నేను జీవించి ఉన్నంతకాలం నమాజును, జకాత్ను పాటించు అని అజ్ఞాపించాడు. నా తల్లి హక్కును నేరవేర్చేవానిగా నన్ను చేసాడు. నన్ను దౌర్జన్యపరునిగాను, పాషాణ హ్రుదయునిగాను చేయలేదు. నేను పుట్టిన రోజునా, నేను మరణించే రోజునా, బ్రతికింపబడి లేవబడే రోజునా నాకు శాంతి కలుగు తుంది.

ఇతనే మర్యమ్ కుమారుడు ఈసా, ఇదే అతనికి సంభందించిన అసలు నిజం. దానిని గురించి ప్రజలు సందేహిస్తున్నారు. ఎవరినైనా తన కుమారుడుగా చేసుకోవడం అనేది అల్లాహ్ కు తగిన పద్దతి కాదు. అయన పరమ పవిత్రుడు.(8) ఏ విషయాన్ని గురించియైనా ఆయన నిర్ణయం తీసుకొంటే, “అయిపో” అని ఆజ్ఞాపిస్తాడు.అంతే  అది అయిపోతుంది.. [సూరా మర్యమ్, 19: 27-35]

ఈసాయొక్క శిష్యులు:
ఇస్రాయిల్ వంశస్తుల అవిశ్వాసాన్ని, తిరస్కరాన్ని పసిగట్టినప్పుడు ఈసా ఇలా అన్నాడు: ”అల్లాహ్ మార్గం లో నాకు సహాయకులుగా ఎవరు ఉంటారు? అప్పుడు హవారిలు ఇలా జవాబు పలికారు: “మేము అల్లాహ్ కు సహాయకులం. మేము అల్లాహ్ ను విశ్వసించాము. మేము ముస్లిములము  (అల్లాహ్ విధేయులము)(9) అనే విషయానికి మీరు సాక్షిగా ఉండండి. ప్రభూ! నీవు అవతరింపజేసిన ఆజ్ఞను మేము విశ్వసించాము. మా పేర్లు సాక్షుల జాబితా లో వ్రాయి.” '[సూరా అల్' ఇమ్రాన్, 3: 52-53]

ప్రతి ఒక్కరూ నమ్మలేదు:
విశ్వసించిన ఓ ప్రజలారా! మర్యమ్ కుమారుడు ఈసా, హవారిలతో అన్నట్టు మీరు అల్లాహ్ కు సహాయకులు కండి. వారితో ఈసా ఇలా అన్నాడు, “అల్లాహ్ వైపునకు (పిలిచే పనిలో) నాకు సహాయపడే వారు ఎవరైనా ఉన్నారా? దానికి హవారిలు, “మేము ఉన్నాము అల్లాహ్ కు సహాయకులం” అని సమాధాన మిచ్చారు.అప్పుడు ఇస్రాయిల్ సంతతి లోని ఒక వర్గం విశ్వసించినది, మరొక వర్గం తిరస్కరించినది. తరువాత మేము విశ్వసించిన వారిని వారి శత్రువులకు వ్యతిరేకం గా బలపర్చాము. వారే ఆధిక్యం వహించినారు. [సూరా అల్-తహ్రిమ్, 61:14]

విందు  యొక్క అద్భుతం
వారు “మర్యమ్ కుమారుడవైన ఈసా! నీ ప్రభువు మా కొరకు ఆహారపదార్ధాలతో నిండిన ఒక పళ్లాన్ని ఆకాశం నుండి దిoప గలడా? అని అడిగినప్పుడు, ఈసా “మీరు విశ్వాసులే అయితే అల్లాహ్ కు బయపడ౦డి” అని అన్నాడు. వారు ఇలా అన్నారు: ఆ పళ్ళెంలో ఉన్న ఆహారాన్ని భుజించాలని, మా హృదయాలకు తృప్తి కలగాలని, నీవు మాకు   చెప్పినదంతా నిజమనే విషయం మాకు తెలియాలని, ఇంకా మేము దానికి సాక్షులుగా ఉండాలని మాత్రమె మేము కోరుతున్నాము”. దానిపై మర్యమ్ కుమారుడైనా ఈసా ఇలా ప్రార్దించాడు: “  అల్లాహ్! మా ప్రభూ! ఆకాశం నుండి మాపై ఆహరం తో నిండిన పళ్ళాన్ని ఒక దానిని అవతరింప జెయ్యి. అది మాకూ, మా పూర్వికులకూ, మా తరువాతి వారికి ఒక పండుగ సమయంగా  నిర్ణయిoపబడాలి. నీ తరుపు నుండి ఒక సూచన కలగాలి. మాకు ఆహరం ప్రసాదించు. నీవు ఉత్తమ ఆహార ప్రదాతవు.” అల్లాహ్ ఇలా జవాబు పలికాడు:”నేను దానిని మీపై అవతరింప జేస్తాను. కాని దాని తరువాత కూడా మీలో ఎవరైనా అవిశ్వాసానికి పాల్పడితే, వారికి నేను ఇంతవరకూ ఎవరికీ విధించని శిక్ష విదిస్తాను” [సూరా అల్ మాయిద, 5: 112-115]

అల్లాహ్ ఈసాను తన శత్రువుల నుండి రక్షించాడు
ఇస్రాయిల్ సంతతి వారు (ఈసాకు వ్యతిరేకంగా) రహస్యపుటేత్తులు పన్న సాగరు. వారి ఎత్తులకు అల్లాహ్ కూడా పన్నాడుడు. ఎత్తులు వెయ్యటం లో అల్లాహ్ మేటి.(అది అల్లాహ్ రహస్యతంత్రమే). అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు: “ఈసా! నేను నిన్ను తిరిగి నా దగ్గిరకు రప్పించుకొంటాను,” నా వైపుకు లేపుకొంటాను. నిన్ను తిరస్కరించిన వారి నుండి (అంటే వారి చెడు సాగాత్యం నుండి, వారి కలుషిత పరిసరాలలో వారితో కలిసి ఉండటం నుండి కాపాడి) నిన్ను పరిశుద్దినిగా చేస్తాను. నిన్ను అనుసరించిన వారికి, నిన్ను తిర్సక్రించిన వారిపై ప్రళయం వరకు ఆధిక్యాన్ని ప్రసాదిస్తాను. మీరంతా చివరకు నా వద్దకే మరలివస్తారు. అప్పుడు మీమధ్య తలెత్తిన విభేదాలను గురించి తీర్పు చెబుతాను. అవిస్వాసవైఖిరిని తిరస్కార ధోరణిని అవలంభించిన వారిని ఇహాపరాలు రెండిటిలోనూ కటినంగా శిక్షిస్తాను. వారు సహాయకులనేవ్వరిని పొందలేరు. ఇక విశ్వసించి మంచిపనులు చేసేవారికి వారి బహుమానాలు పూర్తిగా ఇవ్వబడుతాయి. బాగా తెలుసుకోండి! దుర్మార్ఘులను అల్లాహ్ ఎంతమాత్రం ప్రేమించడు.”[సూరా అల్ 'ఇమ్రాన్, 3: 54-57]

శిలువ వేయబడలేదు:
స్వయంగా, “మేము మసిహ్, మర్యమ్ కుమారుడైన ఈసా అనే దైవ ప్రవక్తను చంపాము” అని అన్నారు-వాస్తవానికి వారు ఆయనను చంపనూ లేదు, శిలువ పైకి ఎక్కించను లేదు. కాని ఆ విషయం లో వారు బ్రమకు గురి చెయ్యబడ్డారు.ఈ విషయం గురించి అభిప్రాయబెధం వ్యక్తం చేసిన వారు కూడా సందేహానికి లోనయ్యారు. దీనిని గురించి వారికి అసలు ఏమి తెలియదు. వారు కేవలం ఉహానే అనుసరిస్తున్నారు. వారు అతనిని నిశ్చయంగా చంప లేదు. కాని అల్లాహ్ ఆయనను తన వైపుకు లేపుకొన్నాడు. అల్లాహ్ అద్భుత శక్తి సంపన్నుడు, అత్యంత వివేకవంతుడు. గ్రంధ ప్రజలలో ఎవ్వరు అతనిని అతని మరణానికి పూర్వం విశ్వసించ కుండా ఉండరు(10). ప్రళయం నాడు అయన వారికి వ్యతిరేకం గా సాక్షమిస్తాడు-[సూరా అల్-నిసా  4: 157-159]

క్రీస్తు ఈసా అనగా, మసిహ్ ఈసాఒక ప్రవక్త మాత్రమే:    
మర్యమ్ పుత్రుడైన మసిహ్ ఒక ప్రవక్త తప్ప మరేమీ కాడు. ఆయనకు పూర్వం కూడా ఎంతోమంది ప్రవక్తలు గతించారు. ఆయన తల్లి సద్గుణ సంపన్నురాలు. వారు ఉభయులు (ప్రతిరోజూ) భోజనం చేసేవారు.-చూడండి! మేము వారిముందు యదార్ధానికి సంభందించిన సూచనలను ఎలా విశిదికరిస్తున్నామో చూడండి! అయినా వారు సన్మార్గం తప్పి ఎటుపోతున్నారో! వారితో ఇలా అను: “ఇదేమిటి, మీరు అల్లాహ్ ను వదిలి, మీకు నష్టం గాని, లాభం గాని కలిగించే అధికారం లేని దానిని పూజిస్తున్నారు? అందరిది వినేవాడు అంతా తెలిసిన వాడూ అల్లాహ్ మాత్రమే.” '[సూరా అల్ మాయిద, 5: 75- 76]

ఈసాఆదాము లాగా మానవుడి గా సృష్టించబడినాడు:
అల్లాహ్ దృష్టిలో ఈసా పుట్టుక ఆద౦ పుట్టుక వంటిదే. అల్లాహ్  ఆదం ను మట్టి తో చేసి “అయిపో” అని అజ్ఞాపించాడు, అతను అయ్యాడు. [సూరా అల్ 'ఇమ్రాన్, 3:59]

అన్ని ప్రవక్తలు మాదిరిగా ఒకే  భగవంతుని ఆరాధన అనేది జీసస్ యొక్క  సందేశ సారం:
(ఈసా ఇలా ప్రకటించాడు) అల్లాహ్ నాకూ, మీకూ ప్రభువే. కనుక మీరు ఆయన దాస్యాన్ని చెయ్యండి. ఇదే రుజుమార్గం. [సూరా అల్ 'ఇమ్రాన్, 3:51 & 19:36]

ఈసాసూచనలు ఇచ్చాడు:
మర్యమ్ కుమారుడు ఈసా అనిన మాటలను జ్ఞాపకం తెచ్చుకో,” ఓ ఇస్రాయిల్ సంతతి వారా! నేను మీ వద్దకు అల్లాహ్ చే పంపబడిన సoదేశహరుణ్ణి. నాకు పూర్వం వచిన్న తౌరాత్ గ్రంధాన్ని ద్రువపరుస్తున్నాను.నా తరువాత అహ్మద్ (11) అనే ప్రవక్త రాబోతున్నాడు అనే శుభ వార్తను అందజేస్తున్నాను. అయితే అయన (ముహమ్మద్ (స) వారివద్దకు స్పష్టమైన సూచనలను తెచ్చినప్పుడు వారు “ఇది పూర్తిగా మోసమే” అని అన్నారు.   [సూరా-సఫ్, 61: 6]


తీర్పు దినమున
అల్లాహ్, “మర్యమ్ కుమారుడవైన ఈసా! నీవు మనుజ జాతితో, అల్లాహ్ ను కాదని నన్నూ, నా తల్లి ని దేవుళ్ళుగా భావించండి అని భోదించావా? అని అడిగినప్పుడు అతను ఇలా మనవి చేసుకొంటాడు : “నీవు అత్యంత పవిత్రుడవు! ఏ మాటను అనే హక్కు నాకు లేదో ఆ మాటను అంటం నాకు యుక్తమైన పని కాదు. ఒకవేళ నేను ఆవిధంగా అని ఉంటె, అది నీకు తప్పకుండా తెలిసిఉoడేది. నా మనసులో ఏముందో నీకు   తెలుసు. నీ మనస్సు లో ఏముందో నాకు తెలియదు. నీవు గుప్తంగా ఉన్న యధార్ధలన్ని తెలిసిన మహ జ్ఞానివి. నీవు ఆదేశించిన దానిని తప్ప దేనిని నేను వారికి చెప్పలేదు. అది ఏమిటంటే అల్లహ్ ను  ఆరాధించండి. అయన నాకూ ప్రభువే, మీకు ప్రభువే. నేను వారి మద్య ఉన్నంత కాలం వరకే నేను వారిని కనిపెట్టి ఉన్నాను.నీవు తిరిగి పిలుచుకోన్న తరువాత నీవే వారిని కనిపెట్టి ఉంటున్నావు. నీవు సర్వ విషయాలను కనిపెట్టి ఉoడే వాడవు. ఇప్పుడు ఒకవేళ నీవు వారిని శిక్షించినట్లయితే నీవు శక్తివంతుడవు. వివేకవంతుడవు.” అప్పుడు అల్లాహ్ ఇలా సెలవిస్తాడు:”ఈ రోజు సత్యవంతులకు వారి సత్యం లాభాన్ని ఇస్తుంది. క్రింద కాలవలు ప్రవహించే ఉద్యానవనాలు (12)వారికి లబిస్తాయి. ఇక్కడ వారు ఎల్లప్పుడూ ఉంటారు. వారు అల్లాహ్  అంటే ఇష్టపడతారు. అల్లాహ్  వారంటే ఇష్టపడతాడు.ఇదే గొప్ప విజయం.”భూమి, ఆకాశాలు, వాటిలో ఉన్న సమస్తం యొక్క సామ్రాజ్యాదిపత్యం అల్లాహ్ కే చెందుతుంది. ఆయనకు ప్రతి వస్తువు పైన అధికారం ఉంది. [సూరా అల్-మయిదా) 5: 116-120]

రీఫెరెన్సులు/గమనికలు:
1. ఇల్లు (హౌస్)/సంతతి  అనే  పదంకు  పూర్వీకులు, వారసులు మరియు బంధువులు అని అర్థం గ్రహించాలి.
[2] ఇమ్రాన్ యొక్క ఇల్లు/సంతతి అతని కుమారులు మోషే అహరోను (Aaron) మరియు వారి సంతతివారు. జెకర్యా, అతని భార్య ఎలిజబెత్ Zachariah, his wife Elizabeth మరియు వారి బంధువు మర్యమ్Mary అహరోను(Aaron) వారసులు. అందువల్ల, జాన్ మరియు యేసు ఇద్దరూ ఇమ్రాన్ యొక్క సంతతికి/ ఇంటికి చెందినవారు.
[3] మరో అనువాదం: ఇమ్రాన్ యొక్క భార్య. ముస్లిం పండితుల ప్రకారం ఇమ్రాన్ అనే ఇద్దరు పురుషులు ఉన్నారు: మోసెస్ మరియు అహరోను తండ్రి మరియు మర్యమ్ యొక్క తండ్రి, (అతని పూర్వీకుల పేరు పెట్టబడినాడు named after his ancestor).
 [4] ఖుర్ఆన్ యొక్క అనేక ఆయతులలో 'మేము' గా పేర్కొన్నది అరబిక్ భాషలో అల్లాహ్ యొక్క సూచన గొప్పతనం మరియు శక్తిని సూచించడానికి వాడారు అని గమనించాలి. ఆంగ్ల భాషలో ఈ వాడుకను రాయల్ WE అని పిలుస్తారు.
[5] ఇక్కడ యేసు ఇచ్చిన ఉపమానము "దేవుడిచ్చిన వాక్యము" ఇవ్వబడినది.
[6] బైబిల్ మరియు ఖుర్ఆన్ యొక్క వాస్తవ భాషలలో ఉపయోగిoచిన పదం మెస్సీయ (అభిషేకం), ఇది ఆంగ్లంలో క్రీస్తుగా అనువదించబడింది.
 [7] బైబిలు ప్రకారం, మేరీ, అరోన్ Aaron ఒకే తెగకు చెందినవారు, ఆమె బంధువు ఎలిజబెత్ ఆరోన్ యొక్క వంశస్థురాలు.
8. అల్లాహ్
 [9] అరబిక్ పదం ఇస్లాం అంటే, సృష్టికర్తకు సమర్పణ అని అర్ధం. ముస్లిం అనగా  దేవునికి లొంగిపోయేవాడు అని అర్థం.
 [10] ఇస్లామీయ మూలాల ప్రకారం [ఖుర్ఆన్ మరియు  ముహమ్మద్(స) యొక్క ఉపదేశాలు(హదీసులు)], క్రీస్తు (అనగా, మెస్సీయ) యేసు శిలువపై చనిపోలేదు, కానీ భూమి పైకి తిరిగి వచ్చిన తరువాత అతను మామూలు మానవుడు గా  మరణించేవాడు, ఈ కాలంలో అతను మిగిలిన తన మిషన్(దైవ కార్యం) పూర్తి చేస్తాడు..
[11] 'అహ్మద్' అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పేరు. దిని  అర్ధo: 'చాలా ఎక్కువ ప్రశంసలు పొందినవాడు.'
12. స్వర్గం
13.ముస్లింలు క్రైస్తవుల్ని, యూదుల్లి  అహల్ అల్-కితాబ్ (దైవగ్రంథం గలిగిన) ప్రజలు గా గౌరవంగా పరిగణిస్తారు.
13దివ్య ఖురాన్ – అనువాదం –షేక్ హమిదుల్లా షరీఫ్


16 December 2017

ఇస్లాం క్రైస్తవ మతాల మధ్య సంబంధాలు


ముస్లింలు క్రైస్తవుల్ని అహల్ అల్-కితాబ్ (దైవగ్రంథం గలిగిన ప్రజలు) గా గౌరవంగా పరిగణిస్తారు.
యేసు (ఈసా) గురించి ఖురాన్ లో ...

మర్యం పుత్రుడైన మసిహ్ (మెసయ్య) ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు. ఆయనకు పూర్వం కూడా ఎంతో మంది ప్రవక్తలు గతించారు.

ఆయన తల్లి సద్గుణ సంపన్నురాలు. వారు ఉభయులూ (ప్రతి రోజు) భోజనం చేసే వారు . (ఖురాన్ :Quran 5 :75 )

తను అల్లాహ్ కు దాసుడుగా ఉండటాన్ని మసిహ్ (మెసయ్య) ఎన్నడూ అగౌరవంగా భావించలేదు. ( ఖుర్ ఆన్ Quran 4: 172)

మసిహ్ మర్యం కుమారుడైన ఈసా (ఏసు ) అల్లాహ్ పంపిన ఒక తరపు నుండి వచ్చి (మర్యం గర్భంలో రూపందాల్చి ) న ఆత్మ తప్ప మరేమీ కాదు . (ఖుర్ఆన్ Quran 4 : 171)

THE BIRHT OF JESUS (యేసు పుట్టాక గురించి )
దైవదూతలు ఇలా అన్నారు : మర్యం ! అల్లాహ్ తన ఒక ఆజ్ఞకు సంబంధించిన నీకు పంపుతున్నడు. అతని పేరు మర్యం కుమారుడైన ఈసా మసిహ్ (యేసు మెసయ్య ) అగును. అతడు ఇహపర లోకాలలో గౌరావనియుడైతాడు. అల్లాహ్ సామిప్యం పొందిన దాసుల లోని వాడుగా పరిగణింపబడతాడు. ఉయ్యాలలో ఉన్నప్పుడు పెరిగి పెద్దవాడైనప్పుడు ప్రజలతో సంభాషిస్తాడు. ఇంకా అతను ఒక సత్పురుషుడు అవుతాడు.

ఇది విన్న మర్యం ఇలా అన్నారు. ప్రభూ! నాకు శిశవు ఎలా జన్మిస్తునింది ? నన్ను ఏ పురుషుడు చేతితోనైనా తాకలేదే!

సమాధానం లభించింది : ” అలానే జరుగు తుంది. అల్లాహ్ తానూ కోరిన దాన్ని సృష్టించాడు. ఆయన ఒక పనిని చెయ్యాలని నిర్ణయించినప్పాడు, కేవలం దానిని అయిపోఆంటాడు. అంతే, అది అయిపోతుంది . అల్లాహ్ అతనికి గ్రంధాన్ని, దివ్య జ్ఞానాన్ని భోదిస్తాడు. తౌరాతు (తోరా), ఇంజిలు (సువార్త) గ్రంథాల జ్ఞానాన్ని నేర్పుతాడు . ఇంకా అతనిని ఇస్రాయీలు సంతతి (ఇస్రాయేలియుల ) వద్దకు తన ప్రవక్తగా పంపుతాడు. (ఖుర్ఆన్ Quran 3 : 45 48) .

అల్లాహ్ దృష్టిలో ఈసా (యేసు) పుట్టుక ఆదం పుట్టుక వంటిదే. అల్లాహ్ అదమును మట్టితో చేసి అయిపో అని అజ్ఞాపించాడు . అతను అయ్యాడు. అసలు వాస్తవం ఇదే. ఇది మీ ప్రభువు తరపు నుండి మీకు తెలుపబడు తుంది. దిన్ని శంకించే వారిలో నీవు  చేరిపోకు . (ఖురాన్ – (Quaran -3:59-60)

ఇతనే మర్యం కుమారుడు ఈసా, ఇదే అతనికి సంబంధించిన అసలు నిజం. దీనిని గురించి ప్రజలు సందేహిస్తున్నారు. ఎవరినైనా తన కుమారుడుగా చేసుకోవటం అనేది అల్లాహ్ కు తగదు. ఆయన పరమ పవిత్రుడు. దేని గురించైనా ఆయన నిర్ణయం తీసుకుంటే అయిపోఅని ఆజ్ఞాపిస్తాడు. అంతే అది అయిపోతుంది. (ఖుర్ఆన్-Quaran-19:34-35)

మహిమలు, అద్భుతాలు:-
(ఇస్రాయీలు సంతతి వద్దకు ప్రవక్తా వచినప్పుడు యేసు ఇలా అన్నాడు) : ‘నేను మీ ప్రభువు నుండి మీ వద్దకు సూచనను తీసుకు వచ్చాను. మీ ముందే నేను మట్టితో పక్షి ఆకారంగల ఒక బొమ్మను తయారు చేసి దానిలోకి శ్వాస ఊదుతాను. అది అల్లాహ్ ఆజ్ఞతో పక్షి అవుతుంది. నేను అల్లాహ్ ఆజ్ఞతో పుట్టుగ్రుడ్డిని, కుష్టరోగిని బాగుచేస్తాను. ఆయన అనుజ్ఞతో మృతులను బ్రతికిస్తాను. ఇంకా మీరు ఏమేమి తింటారో, మీ గృహాలలో ఏమిమి నిలువ చేసి ఉంచు తారో కూడా మీకు తెలుపుతాను. మీరు విశ్వసించేవారే అయితే, వాస్తవంగా ఇందులో మీకు గొప్ప సూచన ఉంది.  ఖుర్ ఆన్ (Quaran 3:49)

మరొక సంఘటనను కూడా జ్ఞాపకం తెచ్చుకో. వారు (శిష్యులు ) మర్యం కుమారుడవైన ఈసా! నీ ప్రభువు మా కొరకు ఆహార పదార్థాలతో నిండిన ఒక పళ్లన్నీ ఆకాశం నుండి దింపగలడా? ‘ అని అడిగినప్పుడు, ఈసా, ‘మీరు విశ్వాసులే అయితే అల్లాహ్ కు భయపడండి అని అన్నాడు. వారు ఇలా అన్నారు, ‘ఆ పళ్ళెంలో ఉన్న ఆహారాన్ని భుజించాలని, మా హృదయాలకు తృప్తి కలగాలని, నీవు మాకు చెప్పినదంతా నిజమనే విషయం మాకు తెలియాలని, ఇంకా మేము దానికి సాక్షులుగా ఉండాలని మాత్రమే మేము కోరుతున్నాము.

దాని పై మర్యమ్ కుమారుడైన ఈసా ఇలా ప్రార్థించాడు: అల్లాహ్ ! మా ప్రభూ! ఆకాశం నుండి మాపై ఆహారంతో నిండిన పళ్ళాన్ని ఒక దానిని అవతరింపజెయ్యి. అది మాకు, మా పూర్వికులకు, మా తరువాతి వారికి ఒక పండుగ సమయంగా నిర్ణయింపబడాలి. నీ తరపు నుండి ఒక సూచన కాగలగాలి. మాకు ఆహారం ప్రసాదించు. నివు ఉత్తమ ఆహార ప్రదాతవు.

అల్లాహ్ ఇలా జవాబు పలికాడు, ‘నేను దానిని మీపై అవతరింప జేస్తాను. కాని దాని తరువాత కూడా మీలో ఎవరైనా అవిశ్వాసానికి పాల్పడితే, వారికి నేను ఇంతవరకూ ఎవరికీ విదించని శిక్ష విదిస్తాను.’ (ఖుర్ఆన్ – Quaran:5:112-115)
ఏసు భోధ :-
(ఇస్రాయీలు సంతతి వద్దకు ప్రవక్తగా వచ్చినప్పుడు అతను ఇలా అన్నాడు) నేను మీ ప్రభువు నుండి మీ వద్దకు సూచనను తీసుకువచ్చానుప్రస్తుతం నా కాలంలో ఉన్న తౌరాతు గ్రంధోపదేశాలను దృవపరచటానికి నేను వచ్చాను. ఇంకా, పూర్వం మీకు నిషేదింపబడిన కొన్ని (హరామ్) వస్తువులను ధర్మసమ్మతం (హలాల్ ) చెయ్యటానికి కూడా వచ్చాను. చూడండి! నేను మీ ప్రభువు నుండి మీ వద్దకు సూచనను తీసుకువచ్చాను. కనుక అల్లాహ్ కు భయపడండి, నన్ను అనుసరించండి. అల్లాహ్ నాకు ప్రభువే మీకు ప్రభువే . కనుక మీరు ఆయన దాస్యాన్ని  చెయ్యండి.  ఇదే రుజుమార్గం.’ (ఖుర్ఆన్ -Quaran: 3:50-51)

మర్యం కుమారుడైన మసిహ్ (మెస్సయ్యా) యే అల్లాహ్  అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే. వాస్తవానికి మసిహ్ (మెస్సయ్యా) ఇలా అన్నాడు:

(ఇస్రాయేలియులార) ఇస్రాయీలు వంశియులారా! అల్లాహ్ కు దాస్యం చెయ్యండి. ఆయన నాకు ప్రభువే. మీకు ప్రభువే. ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసేవారికి అల్లాహ్ స్వర్గాన్ని నిషిద్దం చేశాడు. వారి నివాసం నరకం. అటువంటి దుర్మార్గులకు సహాయం అందించే వాడేవడు లేడు. (ఖుర్ఆన్ – Quaran:5:72)

ఈసా ఇలా ప్రకటించారు: నాకు, మీకు ప్రభువు అల్లాహ్ యే, కనుక మీరు ఆయనకే దాస్యం చేయండి. (ఖురాన్ -Quaran-19:36)

ఇదే బోధ బైబిల్లో ఇలా ఉంది:-
యేసు ఆమెతోమా సహోదరుల ఎడదకు వెళ్ళి- నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వానియేద్దకు పోవుచున్నానని వారితో చెప్పుమనేను! .! (యేహను-yohanu 20:17) (యేసే దేవుడైతే ఈ వచనం ప్రకారం ఆయన ఎవరి వద్దకు వెళ్ళుతూవున్నట్టు? )

త్రిత్వం గురించి ఖురాన్ – Trinity in the Quran:- గ్రంథ ప్రజలారా (యుద +క్రైస్తవులారా) ! మీ ధర్మ విషయాలలో అతిగా ప్రవర్తించకండి. అల్లాహ్ కు సత్యం తప్ప వేరే విషయాన్ని ఆపాదించకండి. మసిహ్, మర్యం కుమారుడైన ఈసా (యేసు మెస్సయ్యా ) అల్లాహ్ పంపిన ఒక ప్రవక్త, అల్లాహ్ మర్యమ్ వైపునకు పంపిన ఒక అజ్ఞ, అల్లాహ్ తరపు నుండి వచ్చిన (మర్యం గర్బంలో రూపం దాలిచిన ) ఒక ఆత్మ తప్ప మరేమీ కాదు. కనుక అల్లాహ్ ను, ఆయన ప్రవక్తలను విశ్వసించంది. ముగ్గురుఅనకండి. ఇలా అనటం మానివేయ్యండి . ఇది మీకే శ్రేయస్కరం. అల్లాహ్ ఒక్కడే దేవుడు. ఆయన పరిశుద్దుడు. ఆయనకు ఒక కొడుకు ఉన్నాడనే  విషయానికి ఆయన అతీతుడు. భూమ్యకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆస్తియే. దాని పోషణకు, దాని రక్షణకు ఆయనే చాలు. (ఖుర్ ఆన్ -Quran:4171)

అల్లాహ్ ముగ్గురిలో ఒకడు, అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పాడినారు. వాస్తవం ఏమిటంటే, దేవుడు ఒక్కడే. ( ఆ ఏకైక దేవుడు అల్లాహ్ ) మరొక దేవుడు లేడు. వారు గనక తమ ఈ మాటలను మానుకోకపోతే, వారిలో అవిశ్వాసాని ఒడిగట్టిన వారికి వ్యదాభారితమైన శిక్ష పడుతుంది. (ఖుర్ఆన్ -Quran-5:73)

Good News – శుభవార్త :- మర్యం కుమారుడైన ఈసా అనీన  మాటలు జ్ఞాపకం తెచ్చుకో: ఓ ఇస్రాయీలు సంతతివారలారా! నేను మీ వద్దకు అల్లాహ్ చే పంపబడిన సందేశాహరున్ని, నాకు పూర్వం వచ్చిన తౌరాతు గ్రంథాన్ని ద్రువపరుస్తున్నాను, నా తరువాత అహ్మద్ (ఆదరణకర్త ) అనే ప్రవక్త రాబోతున్నాడు అనే శుభవార్తను అందజేస్తున్నాను. (ఖుర్ఆన్ – Quran-61:6) .

ఇస్రాయీలు సంతతివారు (ఈసాకు వ్యతిరేకంగా) రహస్యపుటేత్తులు పన్నసాగారు. వారి ఎత్తులకు పైఎత్తులను అల్లాహ్ కూడా పన్నాడు. ఎత్తులు వేయ్యటంలో అల్లాహ్ మేటి. (అది అల్లాహ్ రహస్య తంత్రమే). అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు: ఈసా! నేను నిన్ను తిరిగి నా దగ్గరకు తెచ్చుకుంటాను, నా వైపునకు లేపుకుంటాను. నిన్ను తిరస్కరించిన వారి నుండి నిన్ను పరిశుద్దునిగా చేస్తాను. నిన్ను అనుసరించిన వారికి, నిన్ను తిరస్కరించిన వారిపై ప్రళయం వరకు ఆధిక్యాన్ని ప్రసాదిస్తాను. (ఖుర్ఆన్ -Quran-3:54-55)

అనగా దుర్మార్గులకు, దుష్టులకు విదింపబడే శాపగ్రస్త శిలువ మరణం నుండి యేసును కాపాడి, అపార్థాలు, అపోహలు మరియు వివాదాల నుండి ఆయన్ని పరిశుద్దపరుస్తాను అని అల్లాహ్ వాగ్దానం చేసాడు. ఆ తరువాత ఆరోహణ ద్వారా కాపాడాడు కూడా.

ఆరోపణ :- మేము మసిహ్, మర్యం కుమారుడైన ఈసా అనే దైవ ప్రవక్తను చంపాముఅని అన్నారు. వాస్తవానికి వారు ఆయనను చంపనులేదు, శిలువ పైకి ఎక్కించనూ లేదు.అయితే ఈ విషయం గురించి అభిప్రాయభేదం వ్యక్తం చేసినవారు కూడా సందేహానికి లోనయ్యారు. దీనిని గురించి వారికి అసలు ఏమి తెలియదు. వారు కేవలం ఉహనే అనుసరిస్తున్నారు. వారు అతనిని నిశ్చయంగా చంపలేదు. కాని అల్లాహ్ ఆయనను  తమ వైపునకు లేపుకున్నాడు. అల్లాహ్ అద్భుత శక్తి సంపన్నుడు, అత్యంత వివేకవంతుడు. (ఖుర్ఆన్ -Quran-4:157-158)
అనగా యేసు శిలువపైకి ఎక్కించబడే ముందే లేపుకోబడ్డారు. క్రీస్తు మాకోరకు శిలువపై మరణించాడుఅనే క్రేస్తవుల ఊహ, ‘మేము మేస్సేయ్యను శిలువపై చంపాము, అనే యూదుల అభిప్రాయం కేవలం అపోహలు మాత్రమే. యూదులు ఆయనను శిలువపైకి ఎక్కించక మునుపే అల్లాహ్ తన వాగ్దానం ప్రకారం ఆరోహణ ద్వారా ఆయనను కాపాడాడు.

ముస్లింల దృష్ఠిలో బైబిల్
ముస్లింల అభిప్రాయం ప్రకారం క్రైస్తవులు ఇబ్రాహీం (అబ్రహాం)మూసా (మోషే)ఈసా (యేసు క్రీస్తు) వంటి ప్రవక్తల కథలని వక్రీకరించి తమకి అనుకూలంగా వ్రాసుకున్నారు. ముస్లింలు యేసు క్రీస్తుని ప్రవక్తగా మాత్రమే అంగీకరిస్తారు కానీ దేవునిగా అంగీకరించరు. క్రీస్తు తరువాత వచ్చిన ముహమ్మదును చివరి ప్రవక్త అంటారు. బైబిల్ అనేక మార్పులు చేర్పులకు గురైనది గనుక దేవుడు ఖురాన్ ద్వారా జరిగిన తప్పుల్ని సరిచేశాడని అంటారు.బైబిల్ తరువాత వచ్చిన అంతిమ దైవగ్రంధం ఖురాన్ అంటారు. యేసు తరువాత వచ్చిన ఆదరణకర్త సత్యస్వరూపి చివరి ప్రవక్త ముహమ్మదు అంటారు.

క్రైస్తవుల దృష్ఠిలో ఖురాన్

ముస్లింలు ఖురాన్ లోకి బైబిల్ కథలనే తీసుకున్నారని క్రైస్తవులు అంటారు. బైబిల్ లో చేర్చడానికి నిరాకరించిన కొన్ని కథనాలు కూడా ఖురాన్ లో ఉటంకించబడ్డాయి. అవి యాకోబు సువార్తతోమా సువార్త, మరియు బర్నబా సువార్త.

ఖురాన్ దైవ గ్రంథమని, ఖురాన్ లో చివరికి ప్రవక్త సొంతమాటలు కూడా చేర్చలేదని ముస్లిముల వాదన.

క్రైస్తవులు బైబిలే అంతిమ దైవగ్రంధం అంటారు.యేసు చివరి ప్రవక్త అంటారు.

క్రైస్తవుల దృష్ఠిలో ముహమ్మద్

క్రైస్తవుల ముహమ్మద్ ని ప్రవక్తగా పరిగణించరు. క్రైస్తవుల దృష్ఠిలో యేసు క్రీస్తే చివరి ప్రవక్త అనుకుంటారు కానీ యేసుక్రీస్తు తరువాత పౌలు కాలంలో అంతియొకయ సంఘంలో బర్నబా, సుమెయోను, లూకియ, మనయేను, సౌలు అనే ప్రవక్తలు ఉన్నారు ( అపొస్తలుల కార్యములు 13:1). ఆ దినములలో ప్రవక్తలు యెరూష్లేము నుండి అంతియొకైయకు వచ్చారు. వారిలో అగబు రాబోయే కరువు గురించి ఆత్మ ద్వారా ప్రవచించాడు ( అపొస్తలుల కార్యములు 11:27, 28). ఈ అగబు పౌలును యూదులు బంధించి అప్పగిస్తారని ప్రవచిస్తాడు (అపొస్తలుల కార్యములు 21:10) . క్రీస్తు తరువాత వచ్చిన ఇలాంటి చాలా మంది చిన్న ప్రవక్తలను అంగీకరించే క్రైస్తవులు ముహమ్మదును మాత్రం అంగీకరించటం లేదు. ముస్లిములు మాత్రం యోహాను సువార్త 1:22 లో ప్రస్తావించబడిన "ఆ ప్రవక్త", క్రీస్తు తరువాత వచ్చే "ఆదరణకర్త", (యోహాను16:7) ముహమ్మదేనని వాదిస్తున్నారు.

యహోవా మరియు అల్లాహ్
క్రైస్తవులు దేవున్ని యహోవాహ్ (YHWH) అంటారు. ముస్లింలు దేవున్ని అల్లాహ్ అని అంటారు. క్రైస్తవ మతము, ఇస్లాం మతము రెండూ అబ్రహామిక మతాలు .
యెహోవా మరియు అల్లాహ్
యెహోవా సర్వసృష్టికర్త, సర్వ శక్తిమంతుడు. ఆయన ఒక్కడే దేవుడు. వేరే దేవుడెవరూ లేరు. అల్లాః :- అల్లాహ్ సృష్టికర్త అల్లాహ్ తప్పితే ఇంకెవ్వరు అరాధనకు అర్హులు కారు.
క్రైస్తవులు దేవుని త్రితత్వాన్ని నమ్ముతారు. త్రిత్వం అంటే తండ్రి (యెహోవా) +పరిశుద్ధాత్మ+కుమారుడు (యేసు క్రీస్తు). ముస్లింలు యేసు క్రీస్తుని ప్రవక్తగా మాత్రమే అంగీకరిస్తారు కానీ దేవునిగా గానీ దేవునికుమారునిగా గానీ అంగీకరించరు. కనుక ముస్లింలు దేవుని త్రితత్వాన్ని అంగీకరించరు.

ముస్లింలు అల్లాహ్ (దేవుడు) ని రంగు, రూపం లేనివాడు అంటారు. కాని క్రైస్తవులు యెహోవా (దేవుడు) మనిషి రూపంలో ఉంటాడు అంటారు. అంటే వారు ఇది ఎలా చెబుతున్నారనగా దేవుడు ప్రథమ మనిషిని (ఆదం) ను తన రూపంలో తయారు చేశానని యెహోవా చెప్పాడు అందువల్ల యెహోవా మనిషి రూపంలో ఉంటాడని క్రైస్తవులు అంటారు. కాని వారు ఇలా ఎందుకంటున్నారంటే దేవుడు ఎవరికి కనిపించలేదు. ఎవరూ దేవుణ్ణి చూడలేదు. అందువల్ల ముస్లింలు అల్లాహ్ (దేవునికి) రంగు, రూపం లేనివాడు అంటారు.
అందువల్లా యెహోవా, అల్లాహ్ ఒక్కరే అయ్యే అవకాశం ఉంది.

అల్లా' పదంపై క్రైస్తవులకూ హక్కు
దేవుడిని ఉద్దేశిస్తూ 'అల్లా' పదాన్ని వాడుకోవటానికి క్రైస్తవులకు రాజ్యాంగబద్ధ హక్కుందని మలేషియా కోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ముస్లిమేతరులు అల్లా పదాన్ని వాడుకోవటం వల్ల సామరస్యాలు పెంపొందుతాయనీ కోర్టు అభిప్రాయపడింది. (ఈనాడు2.1.2010)


ఆధారం: వికీ పీడియా