31 July 2019

స్లామిక్ విజేతలు: ఖలీద్ ఇబ్న్ అల్ వాలిద్ - (585 - 642) Khalid ibn al-Walid – (585 – 642)



Related image


ఖలీద్ ఇబ్న్ అల్-వాలిద్ ను సయీఫ్ అల్లాహ్ అల్-మస్లుల్ అని కూడా పిలుస్తారు, ఖలీద్ ఇబ్న్ అల్-వాలిద్ ఇస్లాం యొక్క మొట్టమొదటి గొప్ప సైనిక కమాండర్. అతను సౌదీ అరేబియాలోని మక్కాలో 585 లో జన్మించాడు మరియు ముహమ్మద్ ప్రవక్త(స) యొక్క సహచరుడు.

ఖలీద్ మొదట మక్కన్ తెగ ఖురైష్కు కమాండర్. ఇది ముహమ్మద్(స) వంశానికి వ్యతిరేకంగా ఉంది. వాస్తవానికి, 625 లో ముస్లింలపై ఉహుద్ యుద్ధంలో ఖలీద్ కీలక పాత్ర పోషించాడు. అయినప్పటికీ, అతని తెగ ముస్లింలతో పదేళ్ల శాంతి ఒప్పందం (హుదైబియా ఒప్పందం) పై 628 లో సంతకం చేసింది. ముహమ్మద్ ప్రవక్త (స) ఖలీద్ సోదరుడు వాలిద్‌తో 'ఖలీద్ లాంటి వ్యక్తి ఇస్లాం నుండి ఎక్కువ కాలం తనను తాను దూరంగా ఉండలేడు' అని అన్నారు. వాలిద్ తన సోదరుడికి ఇస్లాం ధర్మాన్ని స్వికరించమని  విజ్ఞప్తి చేస్తూ అనేక లేఖలు రాశాడు. ఖలీద్ చివరికి ఇస్లాం ధర్మం స్వికరించినాడు.

అతను త్వరలోనే ముస్లిం సైన్యానికి విలువైన వ్యక్తి గా  నిరూపించబడ్డాడు మరియు 629 లో ముతా యుద్ధంలో ముగ్గురు ప్రముఖ నాయకులు మరణించిన తరువాత కమాండర్‌గా ఎంపికయ్యాడు. ఘసానిడ్స్ మరియు బైజాంటైన్‌లకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో ఖలీద్ సంఖ్యలో తక్కువగా ఉన్న ముస్లిం దళాలను   సర్వవినాశం నుండి విజయవంతమైన వ్యూహాత్మక తిరోగమనానికి వ్యూహం రచించినాడు. ఈ యుద్ధం తరువాత అతనికి దేవుని కత్తిపేరు ఇవ్వబడింది.

తరువాతి తొమ్మిదేళ్ళలో, ఖలీద్ వందకు పైగా యుద్ధాల్లో పాల్గొన్నాడు మరియు ఎప్పుడూ ఓడిపోలేదు. ముహమ్మద్(స) మరణం తరువాత, బలమైన అరబ్ తెగలు విడిపోయి తిరుగుబాటు చేశాయి. వరుస విజయాల తర్వాత తిరుగుబాటులను అరికట్టే పనిని ఖలీద్‌కు అప్పగించారు. డిసెంబర్ 632 లో జరిగిన యమమా యుద్ధం తో అతడు ఈ పనిని విజయవంతంగా ముగించాడు. ముహమ్మద్ మరణం తరువాత మొట్టమొదటి ముస్లిం ఖలీఫా అయిన  అబూ బకర్(ర) మరియు ముస్లిం సామ్రాజ్యాన్ని విస్తరించడo పై  తన దృష్టిని ఉంచాడు.

పర్షియాలోని సస్సానిడ్ సామ్రాజ్యంపై ముస్లింల దండయాత్ర జరిగింది. పెర్షియా  బైజాంటైన్‌లతో పావు శతాబ్దం యుద్ధం తరువాత తీవ్రంగా బలహీనపడింది. 633 లో ఖలీద్ పెర్షియన్ సామ్రాజ్యాన్ని, ఫిరాజ్ కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తరువాత అబూ బకర్(ర) ఖలీద్‌ను రోమన్ సిరియాపై దాడి చేయాలని ఆదేశించాడు. ఇది ముస్లింలను బైజాంటైన్ సామ్రాజ్యంతో ప్రత్యక్ష వివాదంలో పడేసింది. ఖలీద్ 634 సెప్టెంబరులో డమాస్కస్‌ను జయించాడు,  కొత్త ఖలీఫా  ఉమర్(ర) ఆదేశం మేరకు పదవి నుండి విముక్తి పొందాడు.
కొత్త కమాండర్ నాయకత్వం లో ముస్లిం సైన్యం అబూ-అల్-కుడ్స్ వద్ద చుట్టుముట్టబడినది. వారిని రక్షించడానికి తిరిగి  ఖలీద్ పంపబడ్డాడు మరియు పట్టణానికి సమీపంలో అతను బైజాంటైన్ మరియు క్రిస్టియన్ అరబ్ సైన్యాన్ని ఓడించాడు.

636 లో యార్మౌక్ యుద్ధంలో ఖలీద్ తన గొప్ప విజయాన్ని సాధించినాడు.  అతను బైజాంటైన్ సైన్యాన్ని నాశనం చేశాడు మరియు లెవాంట్‌ (Levant) లో వారి పలుకుబడిని తగ్గించాడు. అర్మేనియా మరియు అనటోలియాలో విజయాల తరువాత, ఖలీద్ ఒక జాతీయ హీరో అయినాడు మరియు తన  సైనికులచే అమితంగా ప్రేమించబడ్డాడు. కాని  నిధుల దుర్వినియోగం ఆరోపణలపై అతన్ని కమాండ్ నుండి తొలగించబడినాడు.

ఖలీద్ 642 లో మరణించాడు, మరియు అతని సమాధి మీద అతను గెలిచిన 50 ప్రధాన యుద్ధాల జాబితా పొందు పరచబడినది. అతను ఎల్లప్పుడూ పోరాటంలో అజేయంగా ఉండేవాడు.! అతను మరియు అతని విశ్వసనీయ అధికారులు యుద్ధానికి ముందు శత్రు సైన్యాల కమాండర్లను ద్వంద్వ పోరాటానికి సవాలు చేసే వారు. అందులో విజయం సాధించి ప్రత్యర్థుల మనోధైర్యాన్ని నాశనం చేసేవారు. రెండు(పెర్షియ, బైజాంటిన్) గొప్ప సామ్రాజ్యాల యొక్క ఉత్తమ సైనిక మనస్సులుకూడా  ఈ మేధావిని ఓడించటానికి కమాండర్ లేదా సైనికుడిని తాయారు చేయలేక పోయినవి.ఇది అతని సైనిక నైపుణ్యంను చాటు చున్నది.





ఇస్లామిక్ విజేతలు: మెహమెద్ II (1432 - 1481) Mehmed II (1432 – 1481)


smppp (1)

గొప్ప బైజాంటైన్ సామ్రాజ్యాన్ని అంతం చేసిన వ్యక్తి మెహమెద్ ది కాంకరర్. ఇతర సుల్తాన్లు విఫలమైన చోట మెహమెద్II విజయం సాధించాడు. అతను కాన్స్టాంటినోపుల్ను(ప్రస్తుత ఇస్తాంబుల్)జయించాడు. మెహ్మెద్ 1432 లో అడ్రియానోపుల్‌ (Adrianople) లో జన్మించాడు. అతని తండ్రి మురాద్ II, మరియు అతని తల్లి బహుశా ఒక బానిస స్త్రీ. అతని తండ్రి 1444 లో ఎడిర్నే వద్ద సింహాసనాన్ని వదులుకున్నాక అంటే 12 ఏళ్ల వయస్సు లో మెహమెద్ ఒట్టోమన్ సామ్రాజ్యం యొక్క కొత్త సుల్తాన్ అయ్యాడు.

సింహసనాన్ని  ఎక్కిన తరువాత అతని వయసు ను దృష్టిలో ఉంచుకొని  వెనిస్, బైజాంటైన్స్, పోప్ మరియు హంగేరియన్లు అందరూ ఒట్టోమన్లు ​​సింహాసనంపై కన్ను వేసారు. కాని అతని తండ్రి 1446 లో సింహాసనాన్ని తిరిగి పొందాడు, దీనితో మెహమెద్ తన అధ్యయనాన్ని మనిసా (Manisa) లో తిరిగి ప్రారంభించాడు. 1451 లో తన తండ్రి చనిపోయినప్పుడు అతను మళ్ళీ సుల్తాన్ అయ్యాడు, మరియు ఇప్పుడు అతను పెద్దవాడు మరియు తెలివైనవాడు కాబట్టి, అతను కాన్స్టాంటినోపుల్ను జయించాలని తీవ్రంగా కోరుకున్నాడు. ఇప్పటి వరకు ఎవరు వాడని/చూడని అతిపెద్ద ఫిరంగిని సృష్టించవలసినదిగా  హంగేరియన్ తుపాకీ తయారీదారు అర్బన్‌ ను మెహమెద్ కోరినాడు.

అతని గ్రాండ్ విజియర్‌తో అనేక వివాదాలు 1453 లో కాన్స్టాంటినోపుల్ ముట్టడిని దెబ్బతీశాయి. కాని మే 29, ఒట్టోమన్లు ​​పురోగతి సాధించి నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహ్మెద్ మరుసటి రోజు తన గ్రాండ్ విజియర్‌ను ఉరితీసాడు. అతను నగరాన్ని గొప్ప రాజధానిగా మార్చాడు.

1520 ల నాటికి, కాన్స్టాంటినోపుల్ ఐరోపాలో అతిపెద్ద నగరం. పాత తూర్పు యూరోపియన్ సామ్రాజ్యాన్ని దాని చారిత్రక పరిమితులకు విస్తరించాలని మెహమెద్ కోరుకొన్నాడు. అతను 1473 లో ఎర్జిన్కాన్ యుద్ధం (Battle of Erzincan) లో విజయం పొందటం ద్వారా అనటోలియా మరియు బాల్కన్లపై ఆధిపత్యాన్ని సాధించాడు.




కాన్స్టాంటినోపుల్ విజయం తరువాత అతను హంగేరి, వాలాచియా, రోడ్స్ మరియు మోల్దవియా  (Hungary, Walachia, Rhodes and Moldavia) మరియు  ఇతర ప్రదేశాలలో తన జైత్రయాత్రలను ప్రారంభించాడు. అతను ఇటలీపై దండయాత్ర చేయలనుకొన్నాడు  కానీ 1481 లో అతను మరణించాడు. బహుశా అతను విష ప్రయోగానికి గురి అయిఉండవచ్చు అని కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు.

మెహమ్మద్ ఒట్టోమన్ ప్రభుత్వాన్ని పునర్వ్యవస్థీకరించాడు మరియు స్వేచ్ఛగా ఆలోచించే వ్యక్తి. అతను గ్రీకు పండితులను మరియు ఇటాలియన్ మానవతావాదులను తన ఆస్థానానికి ఆహ్వానించాడు మరియు తన లైబ్రరీలో విస్తారమైన గ్రీకు మరియు లాటిన్ రచనలను సేకరించాడు. అతని పాలనలో, ఖగోళ శాస్త్రం, గణితం మరియు వేదాంతశాస్త్రం ఒట్టోమన్ సామ్రాజ్యంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి.

28 July 2019

పాశ్చాత్య నాగరికత వికాసం పై ఇస్లామిక్ సంస్కృతి ప్రభావం. Influence of Islamic Culture on Western Civilisation

ఆల్జీబ్రా, ఆల్కెమీ, ఆర్టిచోక్, ఆల్కహాల్ మరియు అప్రికోట్  (Algebra, alchemy, artichoke, alcohol, and apricot) మొదలగు పదాలు అరబిక్ మూలాన్ని కలిగి అవి అన్నీ క్రూసేడ్స్ యుగంలో పశ్చిమ దేశాలకు వ్యాపించినవి. తొమ్మిదవ శతాబ్దపు పెర్షియన్ పండితుడు, గణిత శాస్త్రవేత్త అల్-ఖ్వారిజ్మి గణిత శాస్త్రవేత్త అల్-ఖ్వారిజ్మి ప్రవేశపెట్టిన 0-9 సంఖ్యలు లాటిన్ లో బహుళ ప్రచారం పొందినవి. ఇస్లామిక్ సంస్కృతి పాశ్చాత్య నాగరికత వికాసంనకు కు దోహదపడిన అనేక అంశాలలో ఇది ఒకటి. ఇండో-అరబిక్ అంకెలు (0-9) రోమన్ సంఖ్యలు   సైన్స్ మరియు వాణిజ్యంలో విప్లవాత్మక మార్పులను తెచ్చాయి. అల్-ఖ్వారిజ్మి పేరు మీద అల్గోరిథం అనే పదo ఏర్పడినది.



2004లో చరిత్రకారుడు రిచర్డ్ బులియెట్ నాగరికత అనేది ప్రత్యేకమైన పాశ్చాత్య దృగ్విషయం కాకుండా నిరంతర సంభాషణ మరియు మార్పిడి అని ఆయన వాదించారు. కాని ఆస్ట్రేలియా మరియు పశ్చిమ దేశాలు ఇస్లామిక్ సంస్కృతుల (అరబిక్ మాట్లాడే, పెర్షియన్, ఒట్టోమన్ లేదా ఇతరులు) నాగరికతకు చేసిన కృషిని అంగీకరించడానికి ఇప్పటికీ అయిస్టత చూపుతున్నాయి. ఇస్లామిక్ సంస్కృతి నాగరికతను వికాసంలో అనేక గ్రంథాలను రుపొందించినది.


తాత్విక మరియు కవితా ప్రభావకాలు PHILOSOPHICAL AND LITERARY INFLUENCES

1085 లో స్పానిష్ నగరమైన టోలెడోను దాని మూరిష్ పాలకుల నుండి క్రైస్తవులు శాంతియుతంగా స్వాధీనం చేసుకున్న తరువాత అరబ్ ప్రపంచం నుండి అనేక శాస్త్రీయ ఆలోచనలు మరియు విలాస వస్తువులు పాశ్చాత్య దేశాలకు వచ్చాయి. తరువాతి శతాబ్దంలో పండితులు, అరబిక్ మాట్లాడే యూదుల సహకారంతో, టోలెడో యొక్క గ్రంథాలయాలలో భద్రపరచబడిన ఇస్లామిక్ సంస్కృతి యొక్క మేధో వారసత్వం గురించి తెలుసుకున్నారు.


పాశ్చాత్య దేశాల వారి దృష్టి ప్రధానంగా ఇస్లామిక్ ఆలోచనాపరులు  అభివృద్ధి పరిచిన తత్వశాస్త్రం మరియు విజ్ఞాన శాస్త్రం పై ఉంది. వారిలో ఒకరు ఇబ్న్ సినా. అతనిని అవిసెన్నా అని కూడా పిలుస్తారు. ఇతడు  పెర్షియన్ వైద్యుడు మరియు పాలిమత్ (చాలా పరిజ్ఞానం గల జనరలిస్ట్). ఇతను ప్లేటో మరియు అరిస్టాటిల్ ముఖ్య ఆలోచనల తాత్విక సంశ్లేషణతో ఆచరణాత్మక వైద్య అభ్యాసాన్ని కలిపాడు.


మరొకరు అండలూసియన్ వైద్యుడు మరియు పాలిమత్ అయిన ఇబ్న్ రష్ద్ (లేదా అవెరోస్). ఇతడు ఇబ్న్ సినా అరిస్టాటిల్‌ను ఆలోచలను వివరించిన తీరుపై విమర్శలు చేసినాడు. ఇవి 13 వ శతాబ్దపు  ఇటాలియన్ వేదాంతవేత్త మరియు తత్వవేత్త థామస్ అక్వినాస్‌ యొక్క తాత్విక మరియు వేదాంతపరమైన ఆలోచనలపై ప్రభావాన్ని కలిగించినవి.  ఇబ్న్ రష్ద్ సమకాలీనుడు అయిన యూదుల ఆలోచనాపరుడు మోసెస్ మైమోనిడెస్ “గైడ్ టు ది పెర్ప్లెక్స్డ్ Guide to the Perplexed” రచించినాడు. ఇది  1230లో అరబిక్ నుండి లాటిన్లోకి అనువదించబడింది. వీరు ఇరువురి ప్రభావం థామస్ అక్వినాస్‌ పై అపారంగా  కలదు.


ఇటాలియన్ రచయిత డాంటే ఇస్లామిక్ ప్రభావాలకు ఎంతవరకు గురయ్యాడనే దానిపై చర్చ జరుగుతుండగా, ప్రవక్త(స) స్వర్గానికి అధిరోహించడాన్ని వివరించే “ది బుక్ ఆఫ్ మొహమ్మద్స్ లాడ్దర్ The Book of Mohammed’s Ladder (కాస్టిలియన్, ఫ్రెంచ్ మరియు లాటిన్లోకి అనువదించబడింది) ఆయనకు తెలుసు. ఇన్ఫెర్నో నుండి పారడైజ్ వరకు ప్రయాణం గురించి డాంటే వివిరించిన డివైన్ కామెడీ దీనిని అనుకరిస్తుంది.


బాగ్దాద్‌లో అరబిక్ అధ్యయనం చేసి అక్కడ చాలా సంవత్సరాలు గడిపిన రికోల్డో డా మోంటే డి మోంటే క్రోస్ 1300 లో ఫ్లోరెన్స్  కు తిరిగి వచ్చి ఇస్లాం దేశాలలో తన ప్రయాణాల గురించి రాసినాడు. డాంటే అతని చాలా ఉపన్యాసాలు విన్నాడు. డాంటే కు ముస్లిం బోధనల  విస్తారమైన ప్రభావం గురించి తెలుసు.


స్వీయ-బోధన తత్వవేత్త అయిన జ్ఞానోదయం యొక్క అత్యుత్తమ వర్ణన ఇస్లాం మనకు అందించినది. 12 వ శతాబ్దపు అరబ్ మేధావి ఇబ్న్ తుఫాయిల్ రాసిన “హేయ్ ఇబ్న్ యక్జాన్” అనే అరబిక్ నవలలో ఎడారి ద్వీపంలో ఒంటిరిగా వదిలివేయబడిన ఒక పిల్లవాని  కథను చెబుతుంది.

హేయ్ ఇబ్న్ యక్జాన్ 1671 లో అరబిక్-లాటిన్ ఎడిషన్‌తో ఆక్స్ఫర్డ్ లో  ప్రచురించబడింది మరియు జాన్ లాక్  మరియు రాబర్ట్ బాయిల్‌ (John Locke and Robert Boyle) తో సహా సెమినల్ యూరోపియన్ తత్వవేత్తల రచనలకు ఉత్ప్రేరకంగా మారింది. ఇది 1708 లో “ది ఇంప్రూవ్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ రీజన్‌” గా ఆంగ్లంలోకి అనువదించబడింది మరియు  1719 లో డేనియల్ డెఫో  నవల “రాబిన్సన్ క్రూసో” ను ప్రభావితం చేసింది.

 నాగరికత ఎల్లప్పుడూ మరల మరల ఆవిష్కరించబడుతోంది. నాగరికతను కొందరు  "పాశ్చాత్య" అని పిలుస్తారు కాని ఇప్పటికీ అది  విస్తృతమైన రాజకీయ, సాహిత్య మరియు మేధో ప్రభావాల ద్వారా ప్రభావితం అవుతూనే ఉంది.

మధ్య యుగాలలో ఇస్లామిక్ ప్రపంచం (12 నుండి 15 వ శతాబ్దం) A summary of the Islamic world in the Middle Ages (12th to 15th century)





మధ్య యుగాలలో  'ఇస్లామిక్ ప్రపంచం'

ఇస్లామిక్ ప్రపంచం – విస్తారమైనది  మరియు అధునాతన నాగరికతకు నిలయం.ఇది 7 మరియు 8 వ శతాబ్దాల అరబ్ ఆక్రమణలచే సృష్టించబడింది.11 నుండి 16 వ శతాబ్దాల వరకు అనేక వేల మంది టర్కులు  మరియు మంగోలులు మధ్య ఆసియాలోని విస్తారమైన మైదానాల మీదుగా మధ్యప్రాచ్యంలోకి వలస వచ్చారు. వారు ఇస్లాంను స్వీకరించారు. ఇస్లామిక్ ప్రపంచం  భారతదేశం నుండి స్పెయిన్ వరకు విస్తరించింది.ముస్లిం వ్యాపారులు/యాత్రికులు(travellers) సహారా, దక్షిణాఫ్రికా, చైనా, స్కాండినేవియా మరియు రష్యా వంటి సూదూర ప్రాంతాలకు ప్రయాణించారు.

ముస్లిం వ్యాపారులు పట్టు, తివాచీలు, దంతాలు మరియు సుగంధ ద్రవ్యాలు వంటి అధిక-నాణ్యత గల వస్తువుల వర్తకం చేశారు.పశ్చిమ ఐరోపాలో కంటే ఇస్లామిక్ ప్రపంచంలో సైన్స్ మరియు మెడిసిన్ బాగా అభివృద్ధి చెందినవి. ముస్లిం స్పెయిన్‌లోని కార్డోబా వీధి దీపాలు మరియు మంచి నీటి సరఫరా వ్యవస్థను కలిగి దాదాపు అర మిలియన్లకు పైగా నివాసితుల నగరం గా ఉంది. ముస్లింలు బ్యూటీ పార్లర్లకు వెళుతున్నారు, దుర్గంధనాశని (beauty parlours, using deodorants) వాడటం మరియు గాజు గ్లాసుల నుండి మంచి నీరు తాగడం చేసేవారు.  

ఒట్టోమన్ సామ్రాజ్యం యొక్క వేగవంతమైన విస్తరణ:
ఇస్లాంను ముహమ్మద్ ప్రవక్త స్థాపించారు. AD632 లో ఆయన మరణించిన నాటికి, ఇస్లాం ధర్మం అరేబియా అంతటా వ్యాపించినది. 732 నాటికి, ఇస్లామిక్ సామ్రాజ్యం భారతదేశం యొక్క సరిహద్దుల నుండి, పర్షియా మరియు మధ్యప్రాచ్యం ద్వారా, ఆఫ్రికా యొక్క ఉత్తర తీరం వెంబడి మరియు స్పెయిన్ వరకు విస్తరించింది.
 11 వ శతాబ్దంలో, సెల్జుక్ టర్క్స్ మరింత ముందుకు సాగారు. వారు మన్జికెర్ట్ యుద్ధంలో (1071) బైజాంటైన్ సైన్యాన్ని ఓడించారు మరియు క్రమంగా ఆసియా మైనర్‌ (ఆధునిక టర్కీ) ను జయించారు. 14 వ శతాబ్దంలో ఒస్మాన్ (1326) అనే టర్కిష్ అధిపతి ఒట్టోమన్ టర్కిష్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. 1350లలో టర్కులు ఐరోపాపై దండెత్తి, కొసావో యుద్ధంలో (1389) గెలిచారు మరియు క్రమంగా బాల్కన్లను మరియు హంగేరి సరిహద్దుల వరకు జయించారు. 1453లో వారు బైజాంటైన్ సామ్రాజ్యం యొక్క రాజధాని కాన్స్టాంటినోపుల్ను స్వాధీనం చేసుకున్నారు
ఒట్టోమన్ సామ్రాజ్యం అంత త్వరగా ఎందుకు విస్తరించింది?
తుర్కులు  ఉస్మాన్ కల అని పిలువబడే ఒక ప్రవచనాన్ని విశ్వసించారు, ఒక చెట్టు ప్రపంచమంతా కప్పే వరకు పెరిగింది. ఈ కల  ప్రపంచవ్యాప్త సామ్రాజ్యాన్ని తుర్కి గెలుచుకుంటుందనే విశ్వాసం వారికి ఇచ్చింది.
ఒట్టోమన్ సైన్యoలో  రెండు విభాగాలు ఉన్నాయి:
ఘాజీలు - నైపుణ్యం కలిగిన గుర్రపు సైనికులు, తేలికపాటి ఆయుధాలు, నిర్భయ మరియు ధైర్యవంతులు.
జనిసరీలు - జయించిన దేశాల నుండి బానిసలు, నమ్మకమైన, క్రమశిక్షణ గల మరియు బాగా శిక్షణ పొందినవారు.
ఒట్టోమన్ సామ్రాజ్యం భారీ వనరులను కలిగి ఉంది. ఇది బ్లాక్ డెత్ (1347-1348) చేత బలహీనపడిన చిన్న రాజ్యాలపై దాడి చేసింది.  మొదటి ప్రపంచ యుద్ధం తరువాత వరకు ఒట్టోమన్ సామ్రాజ్యం చాలా కాలం కొనసాగింది

మధ్యయుగ ఇస్లామిక్ ప్రపంచాన్ని ఒకే, స్థిరపడిన సామ్రాజ్యంగా భావించడం పొరపాటు. ఇది పెద్ద సంఖ్యలో వివిధ స్వతంత్ర దేశాలను కలిగి ఉంది, అవి తరచూ తమ మధ్య పోరాడాయి.ముస్లిం దేశాలు తరచూ తిరుగుబాటులతో బలహీనపడ్డాయి. పాలకుడి మరణం తరచుగా అతని కొడుకుల మధ్య అధికారం కోసం యుద్ధం ప్రారంభమైంది. ముస్లిం దేశాలు షియా మరియు సున్నీ దేశాలుగా విభజించబడ్డాయి

ఒట్టోమన్ సామ్రాజ్యంలో ప్రభుత్వ నిర్మాణం :

సుల్తాన్ - ప్రభుత్వ అధిపతి మరియు మంత్రి మండలిని 'దివాన్' అని పిలుస్తారు. ఒట్టోమన్ సుల్తాన్‌కు సంపూర్ణ అధికారం  ఉంది. అన్ని చట్టాలు మరియు నిర్ణయాలు సుల్తాన్ పేరిట జరిగేవి - అతనికి సంపూర్ణ పౌర అధికారాలు ఉన్నాయి.

సుల్తాన్ ను  ఖలీఫా అని అందురు అతను  ముహమ్మద్ ప్రవక్త(స) వారసుడు మరియు ముస్లింలందరికీ మత నాయకుడు. ఒట్టోమన్ సుల్తాన్ ముస్లింలందరికీ అధిపతి. సమర్థవంతమైన సివిల్ సర్వీస్ కలిగి  గ్రాండ్ విజియర్ అని పిలువబడే ప్రధాన మంత్రి నేతృత్వంలో పరిపాలన సమర్ధవంతంగా నడిచినది.  ఉలామా మత పండితులు, వారు షరియా చట్టంలో నిపుణులు. ఒట్టోమన్ ప్రభుత్వంలో మతం చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది - న్యాయవాదులు మత ఉపాధ్యాయులు, మరియు షరియా చట్టం అమలులో ఉంది.

ఒట్టోమన్ సామ్రాజ్యం లోపల వివిధ ముస్లిమేతర మత సంఘాలను 'మిల్లెట్లు' అని పిలిచేవారు. వారి స్వంత మతం మరియు నాయకులను కలిగి ఉండటానికి మరియు వారి స్వంత పన్నులను వసూలు చేసే హక్కుతో సహా వారికి గొప్ప స్వాతంత్ర్యం ఇవ్వబడింది. ఒట్టోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవ మరియు యూదు ప్రజలు హింసించబడలేదు. ఒట్టోమన్ సామ్రాజ్యం వివిధ మతాలను సహించింది.

స్లామిక్ ప్రపంచంలో ప్రజల కదలికలు మరియు వలసలు
ఇస్లామిక్ ప్రపంచం ప్రజల భారీ వలసలను అనుభవించింది:
11 మరియు 12 వ శతాబ్దాలలో మధ్య ఆసియా నుండి సెల్జుక్ దండయాత్రలు ప్రారంభం అయినవి. 13 వ శతాబ్దంలో మధ్య ఆసియా నుండి మంగోల్ దండయాత్రలు జరిగినవి. అలాగే, మధ్యయుగ ముస్లిం వ్యాపారులు మరియు యోధులు ప్రపంచంలోని విస్తారమైన ప్రాంతంలో స్థిరపడ్డారు, వారి మతాన్ని వారితో తీసుకువెళ్లారు.ముస్లిం అరబ్ వ్యాపారులు మరియు యోధులు సహారా అంతటా, ఆఫ్రికా యొక్క తూర్పు తీరంలో, భారతదేశంలోకి మరియు ఆగ్నేయ ఆసియాలో కూడా వాణిజ్య పోస్టులు మరియు స్థావరాలను ఏర్పాటు చేశారు.

మంగోలు ఇస్లాం మతంలోకి మారిన తరువాత, వారు ఇరాన్, మధ్య ఆసియా మరియు రష్యాలో అనేక ముస్లిం దేశాలను స్థాపించారు. రష్యాలోని మంగోల్ రాష్ట్రాన్ని గోల్డెన్ హోర్డ్ అని పిలిచేవారు. 1350 తరువాత తూర్పు ఐరోపాను జయించిన ఘాజీ మిలటరీ కమాండర్లకు బహుమతిగా అక్కడ భూమి ఇవ్వబడింది.

ఇస్లామిక్ ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ మరియు వాణిజ్యం


ముస్లిం ఆర్థిక వ్యవస్థ చాలా దూరం విస్తరించింది మరియు పశ్చిమ ఐరోపా వాణిజ్యం కంటే అధునాతనమైనది:ముస్లిం వ్యాపారులు దక్షిణాఫ్రికా, చైనా మరియు రష్యా వరకు ప్రయాణించారు.వారు పట్టు, పత్తి, తివాచీలు, కాగితం, దంతాలు మరియు సుగంధ ద్రవ్యాలు వంటి నాణ్యమైన వస్తువులలో వర్తకం చేశారు.

మధ్యయుగ అరబిక్ రచనలతో కూడిన ముస్లిం నాణేలను  స్వీడన్‌లో పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు స్వీడన్ ఆ సమయంలో ఇస్లామిక్ ప్రపంచం యొక్క సమీప ప్రాంతాల నుండి వేల మైళ్ళ దూరంలో ఉంది.

ఇస్లామిక్ ప్రపంచంలో సైన్స్, మెడిసిన్ మరియు రోజువారీ జీవితం
ఇస్లామిక్ ప్రపంచం మధ్య యుగాలలోని  పాశ్చాత్య ప్రపంచం కంటే చాలా ముందుంది
సైన్స్
ముస్లిం పండితులకు పురాతన గ్రీకు మరియు రోమన్ రచయితలు గురంచి మాత్రమే కాకుండా, పెర్షియన్, భారతీయ మరియు చైనీస్ రచయితలు రాసిన అనేక పుస్తకాల గురించి తెలుసు. ప్రసిద్ధ ఖలీఫా ,అల్-మామున్, బాగ్దాద్‌లో ఒక అనువాద గృహాన్ని ఏర్పాటు చేశాడు, ఈ దేశాల గ్రంధాలు అన్ని  అరబిక్‌లోకి అనువదించాడు. తరువాత, 11 వ శతాబ్దంలో, స్పెయిన్లోని టోలెడోలో; ఈ అరబిక్ సంచికలు లాటిన్లోకి అనువదించబడ్డాయి మరియు క్రిస్టియన్ యూరప్ అంతటా ప్రసారం చేయబడ్డాయి.
అల్-ఖ్వరాజ్మి సున్నా కనుగొన్నాడు. అరబ్ ప్రపంచంలో ఉపయోగించిన సంఖ్యలు (1, 2, 3, 4) రోమన్ అంకెల (I, II, III, IV) కంటే ఉపయోగించడం చాలా సులభం.
ముస్లింలు ఖగోళ శాస్త్ర పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. ఆకాశంలో వందకు పైగా నక్షత్రాలకు అరబిక్ పేర్లు ఉన్నాయి. అవి నావిగేషన్ యొక్క మెరుగైన సాధనాలుగా మారినవి ముఖ్యంగా ఆస్ట్రోలాబ్ ప్రార్ధించచటానికి మక్కాలోని కాబా  యొక్క దిశను కనుగోనటం లో తోడ్పడినది.

మెడిసిన్:
ఇస్లామిక్ ప్రపంచం 8 వ శతాబ్దం నుండి మొట్టమొదటి మరియు అధునాతన ఆసుపత్రులను ముఖ్యంగా బాగ్దాద్ మరియు కైరోలలో కలిగి ఉంది. 805 లో నిర్మించిన బాగ్దాద్ ఆసుపత్రిలో మెడికల్ స్కూల్ మరియు లైబ్రరీ ఉన్నాయి. రోగులకు చికిత్స మరియు రోగుల సంరక్షణ అందించబడేది. ముస్లిం వైద్యులు నైపుణ్యం మరియు పరిజ్ఞానం కలిగి ఉన్నారు; వారు పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి వచ్చింది. మహిళా వైద్యులు మరియు నర్సులు ఉన్నారు. గాయపడిన క్రూసేడర్లు క్రైస్తవుని కంటే ముస్లిం వైద్యుడి వద్దకు వెళ్లడానికి ఇష్టపడతారు ఎందుకంటే వారు ఎక్కువ పరిజ్ఞానం కలిగి ఉన్నారు.
ముస్లిం వైద్యులు గ్రీకు మరియు రోమన్ వైద్యుల గ్రంథాలను అనువదించారు. ఇబ్న్ సినా (అవిసెన్నా అని కూడా పిలుస్తారు) "కానన్ ఆఫ్ మెడిసిన్" అని పిలువబడే వైద్య ఎన్సైక్లోపీడియాను రాశారు. ఇది ప్రాచీన గ్రీకు మరియు ఇస్లామిక్ ప్రపంచం యొక్క జ్ఞానాన్ని సేకరించింది మరియు పదిహేడవ శతాబ్దం వరకు యూరోపియన్ వైద్యులకు ప్రామాణిక వైద్య పాఠ్యపుస్తకంగా ఉపయోగించబడింది.
ఇస్లామిక్ వైద్యులు కూడా ముఖ్యమైన కొత్త ఆలోచనలను చేర్చారు. ఉదాహరణకు, 800 ల చివరలో మరియు 900 ల ప్రారంభంలో బాగ్దాద్ ఆసుపత్రిని నడిపిన అల్-రాజి (రేజెస్), పిల్లల వ్యాధుల గురించి ఒక పుస్తకం రాసిన మొదటి రచయిత. మశూచి మరియు తట్టు మధ్య వ్యత్యాసాన్ని కూడా ఆయన వివరించారు: ఇది వ్యాధులను నిర్ధారించడానికి వైద్యులకు సహాయపడింది. పశ్చిమ దేశాల వారికి  శరీరం లో రక్తం ప్రసరణ గురించి తెలియడానికి 300 సంవత్సరాల ముందు ఇబ్న్ నాఫిస్ పదమూడవ శతాబ్దంలో శరీరం లో రక్తం ప్రసరణ గురించి వ్రాసాడు
ముస్లింలు శస్త్రచికిత్సలో ముఖ్యమైన పురోగతి సాధించారు. వారు గంజాయి మరియు నల్లమందు  రోగులకు మత్తుమందు గా  ఇచ్చారు, పాదరసం మరియు ఆల్కహాల్‌ను క్రిమినాశక(antiseptics) మందులుగా ఉపయోగించారు మరియు పరిశుభ్రత (hygiene) గురించి నియమాలను కలిగి ఉన్నారు. అల్-జహార్వి (అల్బుకాసిస్) అల్-తసిరిఫ్అనే ఎన్సైక్లోపీడియాను రచించినాడు అందులో ఆన్ సర్జరీఅనే చాప్టర్ కలదు. ఇది శస్త్రచికిత్సా సాధనాల చిత్రాలను కలిగి ఉన్న మొదటి వైద్య పుస్తకం, మరియు అవి ఎలా ఉపయోగించాలో స్పష్టమైన సమాచారాన్ని అందిస్తాయి. ఆయన పుస్తకం ఆచరణాత్మక మార్గదర్శకత్వం కూడా ఇచ్చింది. ఇది ఆధునిక కాలం వరకు ఐరోపా అంతటా విస్తృతంగా అనువదించబడింది మరియు ఉపయోగించబడింది.

రోజువారీ జీవితంలో:

ప్రపంచంలోని పురాతన విశ్వవిద్యాలయాలలో రెండు 9 వ శతాబ్దంలో మొరాకోలోని ఫెజ్ మరియు 970 లో ఈజిప్టులో నిర్మించబడ్డాయి.
ముస్లిం ప్రపంచంలో పరిశుబ్రత చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ముస్లింలు వారి ఐదు రోజువారీ ప్రార్థనలకు ముందు వజు (వాషింగ్) చేయవలసి ఉంటుంది. హదీసు (ముహమ్మద్ ప్రవక్త యొక్క సూక్తులు) పరిశుభ్రత విశ్వాసంలో సగం అని పేర్కొంది. ముస్లింలు బహిరంగ స్నానాల రోమన్ సంప్రదాయాన్ని అనుసరించారు. ఉదాహరణకు, దాని అర మిలియన్ నివాసులకు మంచినీటి సరఫరా అందించడం తో బాటు  స్పెయిన్‌లోని కార్డోబాలో 300 బహిరంగ స్నానశాలలు ఉన్నాయి. ఇప్పుడు యూరప్ అంతటా ప్రాచుర్యం పొందిన టర్కిష్ స్నానాలు ఈ సంప్రదాయాన్ని అనుసరించాయి.
ముస్లిం స్పానిష్ కార్డోబా నగరం  వెలుపల మదీనాట్ అల్ జహ్రా ప్యాలెస్ వంటి అద్భుతమైన రాజభవనాలు ఉన్నాయి.ముస్లింలు చాలా ధార్మికులు. ప్రతి ముస్లిం పట్టణంలో ముయెజిన్‌తో కనీసం ఒక మసీదు ఉండేది, అతను రోజుకు ఐదుసార్లు ప్రజలను ప్రార్థనకు పిలిచేవాడు.
ముస్లిం వ్యవసాయం, విజ్ఞానం మరియు మతం స్పెయిన్ నుండి ఐరోపాకు తీసుకురాబడ్డాయి. ముస్లింలు నీటిపారుదలని స్పెయిన్కు తీసుకువచ్చారు: నారింజ, ఆప్రికాట్లు మరియు వరి వంటి పంటలకు చాలా నీరు అవసరం.
800 ల చివరలో కార్డోబాలోని గాజు తయారీదారులు క్రిస్టల్‌ను ఎలా తయారు చేయాలో కనుగొన్నారు. అందమైన ఆభరణాలు స్పెయిన్ సంపదను మరియు దాని హస్తకళాకారుల నైపుణ్యాన్ని చూపించాయి. ముస్లిం కళాకారులు మసీదులలో మరియు ఖురాన్ కాపీలలో అందమైన నమూనాలను మరియు కాలిగ్రఫీని ఉపయోగించారు. చాలా మంది ముస్లింలు బాగా చదువుకున్నారు. బాగ్దాద్‌లోని హౌస్ ఆఫ్ విజ్డమ్ 800 ల ప్రారంభంమయిన  ప్రపంచంలోని  అతిపెద్ద లైబ్రరీ మరియు పండితుల అధ్యయన కేంద్రం.
బాగ్దాద్ నుండి జిరియాబ్ అనే ముస్లిం గాయకుడు కార్డోబాకు తూర్పు నుండి అన్ని రకాల అధునాతన ఫ్యాషన్లను తీసుకువచ్చాడు. అతను బ్యూటీ పార్లర్‌లను మరియు జనాదరణ పొందిన కేశాలంకరణ, దుర్గంధనాశని, టూత్‌పేస్ట్, మూడు-కోర్సు భోజనం, అద్దాలు మరియు టేబుల్ మర్యాదలను  తెచ్చాడు.

పశ్చిమ ఐరోపాపై ఇస్లామిక్ ప్రభావం
ఇస్లామిక్ సామ్రాజ్యం మధ్యయుగ పశ్చిమ ఐరోపా అభివృద్ధిపై విశేష  ప్రభావాన్ని చూపింది. ఇస్లామిక్ ప్రపంచం పాశ్చాత్య నాగరికత కు పునాదులు ఇచ్చిందని చెప్పవచ్చు,

నాలెడ్జ్
పాశ్చాత్య యూరోపియన్లు గణితం, విజ్ఞానం, షధం మరియు ఖగోళశాస్త్రంపై ముస్లిం ఆలోచనలను వారి స్వంత ఆలోచన మరియు అభ్యాసాలలో చేర్చారు. పారిస్‌లోని మొట్టమొదటి ఆసుపత్రిని లూయిస్ IX 1260 లో క్రూసేడ్ నుండి తిరిగి వచ్చిన తరువాత స్థాపించాడు.

సంస్కృతి
ముస్లిం వాయిద్యాల నుండి వీణ, గిటార్ మరియు వయోలిన్ సహా అనేక పాశ్చాత్య సంగీత వాయిద్యాలు కాపీ చేయబడ్డాయి. అరబ్ సంగీతం యొక్క లయల ద్వారా స్పానిష్ ఫ్లేమెన్కో డ్యాన్స్ ప్రభావితమైందని చెబుతారు.



ట్రేడ్
యూరోపియన్ ప్రభువులు ముస్లింలు వర్తకం చేసిన వస్తువులను - పట్టు, సుగంధ ద్రవ్యాలు మొదలైనవి - కొనుగోలు చేశారు. పాశ్చాత్య నావికులు అరబ్బులు తయారు చేసిన పరికరాలను స్వీకరించారు, ఉదా. నావిగేషన్‌కు సహాయపడే ఆస్ట్రోలాబ్ మరియు త్రిభుజాకార నౌక, ఇది నావికా కదలికలను పెంచింది. వీటి సహాయం తో కొలంబస్ అమెరికాకు చేరుకొన్నాడు.

ఆర్కిటెక్చర్
ముస్లిం మసీదుల వంపు నిర్మాణం  పశ్చిమ గోతిక్ నిర్మాణంలో కాపీ చేయబడినది. పాశ్చాత్య కోట-డిజైనర్లు క్రూసేడ్‌లో చూసిన ముస్లిం కోటల నుండి గోడల పొరలతో కూడిన కేంద్రీకృత కోటల నిర్మాణం ను  స్వీకరించారు

యూరప్‌లోని పెద్ద ప్రాంతాలను ముస్లింలు స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ స్పెయిన్ వంటి ప్రాంతాలను క్రైస్తవులు తిరిగి స్వాధీనప్పుడు ముస్లిం ఆచారాలు మరియు వాస్తుశిల్పం అలాగే ఉన్నాయి.

ముస్లింల నుండి జెరూసలేంను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి క్రైస్తవులు క్రూసేడ్‌కు వెళ్ళమని ప్రోత్సహించారు. క్రైస్తవులు తమ ప్రయాణాల తరువాత జ్ఞానం మరియు సంస్కృతి  ఐరోపాకు తిరిగి తీసుకువచ్చారు.1453 లో కాన్స్టాంటినోపుల్ పతనం మరియు బైజాంటైన్ సామ్రాజ్యం ముగింపు ను  కొంతమంది చరిత్రకారులు 1453 సంవత్సరం  మధ్య యుగాల ముగింపును సూచిస్తుందని నమ్ముతారు.