3 July 2019


ప్రముఖ భారత ముస్లిం స్వతంత్ర సమర యోధులు .

సాంఘిక సంస్కర్త మరియు దేశభక్తి పరుడు అబ్దుల్ ఖయ్యూమ్ అన్సారీ(1905-1973)


Image result for abdul qayum ansari 
అబ్దుల్ ఖయ్యూమ్ అన్సారీ (1905-1973) భారత దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు. వీరు జూలై 1, 1905న  డెహ్రీ-ఆన్-సోన్, బీహార్ లో జన్మించారు.  ఇతను ముస్లింలలోని పాస్మాండా (Pasmanda) వర్గానికి చెందినవాడు.  ఇతను నిజమైన దేశభక్తుడు. జాతీయ సమైక్యత, లౌకికవాదం మరియు మత సామరస్యవాది. ముస్లిం లీగ్ యొక్క రెండు దేశాల సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ దేశ స్వేచ్ఛ కోసం, మరియు అణగారిన ప్రజల హక్కుల కోసం పని చేసారు. భూమి భారతి/ మదర్ ఇండియా యొక్క నిజమైన హీరో.

జననం మరియు విద్య
అబ్దుల్ ఖయ్యూమ్ అన్సారీ 1905 జూలై1 న బీహార్‌లోని డెహ్రీ-ఆన్-సోన్‌లో ధనవంతుడైన మోమిన్/అన్సారీ కుటుంబంలో జన్మించారు. ససారాం మరియు డెహ్రీ-ఆన్-సోన్ హైస్కూళ్ళలో చదివిన తరువాత అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయం మరియు అలహాబాద్ విశ్వవిద్యాలయo లో విద్యనబ్యసించారు.  విద్యార్ధి దశ లోనే భారతదేశ స్వేచ్ఛా పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు.

 భారత స్వాతంత్ర్య ఉద్యమం లో నిర్వహించిన పాత్ర:

అబ్దుల్ ఖయ్యూమ్ అన్సారీ చాలా చిన్న వయస్సులోనే భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు  మరియు ప్రభుత్వ పాఠశాలను విడిచిపెట్టారు. భారత జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు ప్రభుత్వ పాఠశాలలను బహిష్కరించిన విద్యార్థుల కోసం  ఒక జాతీయ పాఠశాలను స్థాపించారు. నాన్-కోఆపరేషన్ మరియు ఖిలాఫత్ ఉద్యమాలలో పాల్గొని  16 సంవత్సరాల వయస్సులోనె  అరెస్టు అయి జైలు పాలయ్యారు.

అబ్దుల్ ఖయ్యూమ్ అన్సారీ యువ నాయకుడిగా భారత జాతీయ కాంగ్రెస్‌తో కలిసి పనిచేశారు మరియు 1928 లో కలకత్తా పర్యటనలో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళనలో పాల్గొన్నారు.

అబ్దుల్ ఖయ్యూమ్ అన్సారీ నిష్ణాతుడైన జర్నలిస్ట్, రచయిత మరియు కవి. అతను ఉర్దూ వారపత్రిక "అల్-ఇస్లా" (సంస్కరణ) మరియు ఉర్దూ నెలవారీ "ముసవత్" (సమానత్వం) సంపాదకుడు.

ముస్లిం లీగ్‌కు వ్యతిరేకత, మోమిన్ ఉద్యమం ఏర్పాటు.

ముస్లిం లీగ్ యొక్క మత విధానాలను ఆయన వ్యతిరేకించారు. భారతదేశాన్ని విభజించడం ద్వారా పాకిస్తాన్‌ను సృష్టించాలని ముస్లిం లీగ్ చేస్తున్న డిమాండ్‌ను  అబ్దుల్ అన్సారీ వ్యతిరేకించారు. ప్రత్యేక ముస్లిం దేశం కోసం ముస్లిం లీగ్ చేస్తున్న డిమాండ్ను ఎదుర్కోవటానికి అతను మోమిన్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. అతను భారతదేశ ముస్లిం జనాభాలో కనీసం సగం మంది ఉన్న వెనుకబడిన మోమిన్ సమాజం యొక్క సామాజిక, రాజకీయ మరియు ఆర్థిక విముక్తి మరియు అభ్యున్నతి కోసం పనిచేశారు. అబ్దుల్ ఖయ్యూమ్ అన్సారీ తన జీవితాంతం ఆల్ ఇండియా మోమిన్ సమావేశానికి అధ్యక్షుడిగా కొనసాగారు.

ఐక్య భారతదేశం కోసం స్వేచ్ఛ కోసం మరియు సామాజిక సమానత్వం, లౌకికవాదం మరియు ప్రజాస్వామ్యం యొక్క స్థాపన మరియు అభివృద్ధి కోసం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి మోమిన్ ఉద్యమం మద్దతు ఇచ్చింది. కళాకారుల  మరియు చేనేత వర్గాల సంక్షేమం కోసం, మరియు దేశంలోని వస్త్ర పరిశ్రమలో చేనేత రంగం అభివృద్ధికి ఆయన పనిచేశారు.

అబ్దుల్ ఖయ్యూమ్ అన్సారీ పార్టీ ప్రత్యేక ఓటర్ల ఆధారంగా జరిగిన 1946 సార్వత్రిక ఎన్నికలలో పోరాడి ముస్లిం లీగ్‌కు వ్యతిరేకంగా బీహార్ ప్రావిన్షియల్ అసెంబ్లీలో ఆరు స్థానాలను గెలుచుకోగలిగింది. ఆ విధంగా ఆయన బీహార్ కేసరి శ్రీ కృష్ణ సింగ్ మంత్రివర్గంలో స్థానం పొందిన మొట్టమొదటి మోమిన్ అయ్యాడు మరియు యువ మంత్రిగా బిహార్ కేసరి శ్రీ బాబు మరియు బీహార్ విభూతి అనుగ్రహ బాబుల ప్రశంసలను పొందారు. తరువాత అతను మోమిన్ సమావేశాన్ని రాజకీయ సంస్థగా రద్దు చేసి, దానిని సామాజిక మరియు ఆర్థిక సంస్థగా మార్చారు. సుమారు పదిహేడేళ్లపాటు బీహార్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఆయన వివిధ ముఖ్యమైన శాఖలను నిర్వహించి, తన బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తించారు, నిస్వార్థ సేవ మరియు సమగ్రతకు ఖ్యాతి గాంచారు.

అబ్దుల్ ఖయ్యూమ్ అన్సారీ  - జాతీయత మరియు మత సామరస్యం యొక్క రాయబారి:

అక్టోబర్ 1947 లో కాశ్మీర్‌పై పాకిస్తాన్ దురాక్రమణ సమయంలో భారతదేశపు మొదటి ముస్లిం నాయకుడిగా ఆయన దానిని ఖండించారు మరియు భారతదేశపు నిజమైన పౌరులుగా  దురాక్రమణలను ఎదుర్కోవటానికి ముస్లిం ప్రజలను ఉత్తేజపరిచేందుకు తీవ్రంగా కృషి చేశారు. దీని తరువాత అతను ఆజాద్ కాశ్మీర్‌ను "విముక్తి" చేయడానికి 1957 లో ఇండియన్ ముస్లిం యూత్ కాశ్మీర్ ఫ్రంట్‌ను స్థాపించాడు. తరువాత, 1948 సెప్టెంబరులో హైదరాబాద్లో రజాకర్ల భారత వ్యతిరేక తిరుగుబాటులో భారత ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ఆయన భారత ముస్లింలను ప్రోత్సహించారు.

ప్రజాస్వామ్య నీడలో జాతీయత, లౌకికవాదం, సమానత్వం మరియు సామాజిక న్యాయం పెంపొందించడానికి ఆయన జీవితాంతం కృషి చేశారు. పేదలు మరియు అణగారిన వర్గాల హృదయ  విజేత అయిన అబ్దుల్ ఖయ్యూమ్ అన్సారీ అణగారిన వర్గాల విద్య మరియు అక్షరాస్యత వ్యాప్తి కోసం పనిచేశారు మరియు మొదటి అఖిల భారత వెనుకబడిన తరగతుల కమిషన్‌ను 1953 లో భారత ప్రభుత్వం తన చొరవతో నియమించింది.

అబ్దుల్ ఖయ్యూమ్ అన్సారీ 18 జనవరి 1973 న బీహార్ గ్రామంలోని అమియవార్ వద్ద డెహ్రీ-అర్రాహ్ కాలువ కూలిపోవటం ద్వారా గ్రామానికి జరిగిన నష్టాలను పరిశీలిస్తు మరణించారు.  జలవరద వలన ఇళ్లు లేని అనేక మంది ప్రజలకు ఉపశమనం కల్పించారు.

అబ్దుల్ ఖయ్యూమ్ అన్సారీ వంటి స్టేట్సమెన్ చాలా అరుదు. వారు జీవించి ఉంటే, ముస్లింలు మరియు పాస్మాండా ముస్లింల పరిస్థితి దుర్భరంగా ఉండేది కాదు. సామాజిక న్యాయం, రాజకీయ మరియు పౌర హక్కుల యొక్క పోరాడినారు.  




No comments:

Post a Comment