28 February 2023

రంజాన్ యొక్క ఆశీర్వాదాలను పొందటం : ఆధ్యాత్మిక పెరుగుదల మరియు పరివర్తన కోసం మార్గాలు Maximizing the Blessings of Ramadan: Means for Spiritual Growth and Transformation

 


అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు,


రంజాన్ అపారమైన ఆశీర్వాదాల నెల మరియు ఈ నెలలో ఆధ్యాత్మిక వృద్ధికి మరియు పరివర్తనకు అవకాశం ఉంది. స్వర్గ ద్వారాలు తెరిచి, నరక ద్వారాలు మూసుకుపోయిన కాలంగా  ముస్లింలు ఈ దీవించబడిన మాసాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆరాధనను పెంచుకోవాలని మరియు అల్లాహ్ (SWT)కి దగ్గరవ్వాలని కోరుకొందాము.

రంజాన్‌ను చక్కగా ఎలా వినియోగించుకోవాలో తెలిపే కొన్ని మార్గాలు:

1. స్పష్టమైన లక్ష్యాలను ఎంచుకోండి:

రంజాన్ ప్రారంభానికి ముందు, స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. రంజాన్ నెలలో ఏమి సాధించాలనుకుంటున్నారు? దివ్య ఖురాన్ పఠనాన్ని పెంచాలనుకుంటున్నారా, మరిన్ని సూరాలను కంఠస్థం చేయాలనుకుంటున్నారా, ఎక్కువ దానం ఇవ్వాలనుకుంటున్నారా లేదా ఎక్కువ దువా చేయాలనుకుంటున్నారా? లక్ష్యాలు ఏమైనప్పటికీ, అవి నిర్దిష్టమైనవి మరియు సాధించగలవని నిర్ధారించుకోండి. వాటిని వ్రాసి, ప్రతిరోజూ వాటిని గుర్తు పెట్టుకోండి.

2. సున్నత్‌ను అనుసరించండి:

రంజాన్ దివ్య ఖురాన్ అవతరించిన నెల మరియు దివ్య ఖురాన్ పట్ల ప్రవక్త ముహమ్మద్ (స) యొక్క ఉదాహరణను అనుసరించడానికి మనం కృషి చేయాలి. ప్రతిరోజూ దివ్య ఖురాన్ పఠించండి,  ప్రతిబింబించండి మరియు దాని అర్థాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదనంగా, ప్రార్థన, ఉపవాసం, దాతృత్వం ఇవ్వడం మరియు ఇతరుల పట్ల దయ మరియు కరుణతో వ్యవహరించడం వరకు జీవితంలోని అన్ని అంశాలలో ప్రవక్త ముహమ్మద్ (స) యొక్క సున్నత్‌ను అనుసరించండి.

3. ఆరాధనను పెంచుకోండి:

రంజాన్ అనేది ఆరాధనను పెంచే సమయం. మనం ఎక్కువగా ప్రార్థన చేయడానికి, ఎక్కువగా దివ్య ఖురాన్ చదవడానికి మరియు మరింత దువా చేయడానికి ప్రయత్నించాలి. మసీదులో లేదా ఇంటిలో రాత్రిపూట నమాజు (తరావీహ్) ప్రయోజనాన్ని పొందండి మరియు తహజ్జుద్ ప్రార్థనకు కృషి చేయండి. అలాగే, దాతృత్వాన్ని పెంచడానికి ప్రయత్నించండి మరియు అవసరమైన వారికి సహాయం అందించండి. ఏకాంతంలో మరియు దివ్య ఖురాన్ భోదనలను నెరవేర్చుటలో ఎక్కువ సమయం గడపండి.

4. మీ చర్యలను గుర్తుంచుకోండి:

రంజాన్ ఆధ్యాత్మిక శుద్ధి నెల. మనం మన చర్యలు మరియు ఉద్దేశాలను గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాలి. గాసిప్, వెక్కిరించడం మరియు ఇతర ప్రతికూల ప్రవర్తనలను నివారించండి మరియు కోపం, ప్రేరణలను నియంత్రించడానికి ప్రయత్నించండి. తినేవాటిని మరియు త్రాగేవాటిని గుర్తుంచుకోండి మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి ప్రయత్నించండి.

5. ఇతరులతో కనెక్ట్ అవ్వండి:

రంజాన్ అనేది కమ్యూనిటీ మరియు కనెక్షన్ కోసం ఒక సమయం మరియు కుటుంబం, స్నేహితులు మరియు పొరుగువారితో మన సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇతరులను ఇఫ్తార్ (ఉపవాసం విరమించడానికి తినే భోజనం) కోసం ఆహ్వానించండి మరియు రంజాన్ ఆశీర్వాదాలను ఇతరులతో పంచుకోండి. అలాగే, తక్కువ అదృష్టవంతులు మరియు మన సహాయం అవసరమైన వారితో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి.

రంజాన్ అపారమైన ఆశీర్వాదాల నెల మరియు ఆధ్యాత్మిక పెరుగుదల మరియు పరివర్తనకు అవకాశం ఉన్న నెల. స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోవడం ద్వారా, సున్నత్‌ను అనుసరించడం ద్వారా, మన ఆరాధనను పెంచుకోవడం ద్వారా, మన చర్యలను గుర్తుంచుకోవడం మరియు ఇతరులతో కనెక్ట్ అవ్వడం ద్వారా ఆశ్వీరాదమాసం రమదాన్  నుండి ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. అల్లాహ్ (SWT) మన ఆరాధనను అంగీకరించి, రంజాన్‌ను అత్యంత సద్వినియోగం చేసుకోవడానికి మనకు శక్తిని మరియు మార్గదర్శకత్వాన్ని ప్రసాదిస్తాడు.

వ అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

 

26 February 2023

భారతీయ ముస్లిములు మరియు బహుళ సమాజం “Indian Muslims and Plural Society”

 



భారతీయ సమాజం అనాదిగా బహుళత్వాన్ని కలిగి ఉంది. భారతీయ సమాజం బిన్నత్వం లో ఏకత్వాన్ని ప్రదర్శిస్తుంది. కలిసి జీవించడం, ఇతరుల ఆలోచనలను సహించడం మరియు వైవిధ్యంతో  జీవించడo అనేవి బహుళత్వం యొక్క లక్షణాలు. అన్ని మతాలు వివిధ విభాగాలను, బిన్నపద్ధతులను  కలిగి ఉంటాయి. భారత దేశం లో  ఒక ఇమామ్ మరియు ఒక పండిట్ సోదరభావం మరియు ఏకత్వాన్ని అర్థం చేసుకునేలా ప్రజలను తీర్చి దిద్దుతారు.

 

భారతదేశానికి అపారమైన వైవిధ్యం ఉంది.అరబ్బులు దక్షిణ-పశ్చిమ తీర ప్రాంతం ద్వారా భారతదేశానికి చేరుకున్నారు. అరబ్బులు కేరళ తీరానికి వచ్చి భారతదేశంలో భాగమైన అనేక సంప్రదాయాలను తీసుకువచ్చారు.ముస్లింలు వ్యాపారులు మరియు ఆక్రమణదారులుగా భారతదేశానికి వచ్చారు. కానీ వారు ఇక్కడికి వచ్చిన తర్వాత, వారు భారతదేశ సంస్కృతి మరియు సంప్రదాయాలను గౌరవించారు మరియు బహుళత్వాన్ని ప్రోత్సహించడానికి దేశాన్ని సుసంపన్నం చేశారు. భారతదేశ శ్రేయస్సుకు ముస్లింలు సహకరించారు.

 

బిన్న నాగరికతల కూటమి బహుళత్వాన్ని నిర్వచిస్తుంది. మతాలకు జాతీయత లేదు. అవి సార్వత్రికమైనవి. భారతదేశంలోని రాజులు-ముస్లింలు లేదా హిందువులు, భిన్నమైన విశ్వాసాలు కలిగిన ప్రజలను శతాబ్దాల పాటు పాలించారు.

 

జవహర్‌లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి నాయకులు దేశంలోకి సెక్యులర్ స్ఫూర్తిని తీసుకొచ్చారు. భారతదేశంలో మతాలు మరియు మానవత్వం యొక్క నైతికతను వివరించే సూఫీ మరియు భక్తి సంప్రదాయాలు కలవు.

 

ప్రధానంగా బహుళత్వం అనేది వైవిధ్యాన్ని అంగీకరించడం. ఇది భేదాలను సహించడం కంటే ఎక్కువ. బహుళత్వం అభివృద్ధి చెందుటకు    'మేము' అనే భావన చాలా అవసరం. మీ పొరుగువారిని బాధ్యతగా కాకుండా ఆస్తిగా పరిగణించాలని బహుళత్వం కోరుతుంది. బహుళత్వం తో కూడిన వైవిధ్యం స్థితిస్థాపకతను సృష్టిస్తుంది, కానీ బహుళత్వం లేని వైవిధ్యం విపత్తును తెస్తుంది.

 

బహుళత్వం యొక్క ఉదాహరణలను సిక్కు మతం యొక్క గురు గ్రంథ్ నుండి అర్థం చేసుకోవచ్చు.

 

నేటి సందర్భంలో భాషాపరమైన బహుళత్వం ఆవశ్యకమైంది. కమ్యూనిటీలు ఒక నిర్దిష్ట జాతి లేదా సంస్కృతి ద్వారా నిర్వచించబడవు. భారతదేశంలో 15-20% జనాభా ఉన్న ముస్లింలను కలుపుకోకుండా దేశ నిర్మాణం మరియు అభివృద్ధి జరగదు

 

వన్ నేషన్, వన్ కల్చర్ కాన్సెప్ట్ కొన్ని దేశాల్లో మాత్రమే పని చేస్తుంది. బహుళ సమాజంలో ఎదగడానికి గత మరియు వర్తమాన అనుభవాల దృష్ట్యా భవిష్యత్తుపై దృష్టి పెట్టడానికి ఇది సరైన సమయం. గతంలో పొరపాట్లు జరిగి ఉండవచ్చు, కానీ వాటిని గుర్తుంచుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. ఇది పురోగతికి ఆటంకం కలిగిస్తుంది.

 

సూఫీలు ఎప్పుడూ వైవిధ్యాన్ని ప్రచారం చేసారు. సూఫీ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ భారతీయ సాధువుల వంటి దుస్తులు ధరించి ఇక్కడి ప్రజలతో మమేఖ్యం అయినాడు. ప్రజలు తమ మత విశ్వాసాలతో సంబంధం లేకుండా, చిస్తీ భోదనలను విశ్వసించారు.

 

స్వామి దయానంద్ మరియు రాజా రామ్ మోహన్ రాయ్ సామాజిక సంస్కరణలను ప్రోత్సహించారు. భారతదేశం యొక్క గొప్పతనం/అందం మతపరమైన ఆలోచనల వైవిధ్యంలో ఉంది.

 

పొరుగువారి, బంధువులు మరియు హక్కులను ఇస్లాం ప్రచారం చేస్తుంది. ఇస్లాం వైవిధ్యాన్ని అంగీకరిస్తుంది. భారతదేశంలో బహుళత్వాన్ని బలోపేతం చేయడంలో ఇస్లాం పాత్ర ముఖ్యమైనది. బహుళత్వం అనేది అన్ని మతాల ప్రజలు నివసించే మరియు ఒకరినొకరు గౌరవించే సమాజం. బహుళత్వం శతాబ్దాలుగా నిలిచిపోయిన అత్యుత్తమ ఉదాహరణలలో భారతదేశం ఒకటి. ఆచరణలో బహుళత్వాన్ని ప్రదర్శించినప్పుడే భారతదేశం మరింత అభివృద్ధి చెందుతుoది.


బనారస్‌కు చెందిన ఇర్షాద్ అలీ తన చేతితో రాసిన శ్రీమద్ భగవద్గీత ను పార్లమెంటులో ప్రదర్శించాలని కోరుతున్నారు

 





బెనారస్‌కు చెందిన 53 ఏళ్ల వ్యాపారవేత్త హాజీ ఇర్షాద్ అలీ బనార్సీ, తెల్లటి కాటన్ గుడ్డ పెద్ద షీట్‌లపై గంగా మట్టి మరియు నీటిని ఉపయోగించి శ్రీమద్ భగవద్గీతను కాలిగ్రఫీలో రాశారు మరియు దీనిని పార్లమెంటులో ప్రదర్శించాలని కోరుకుంటున్నాడు.

ఇర్షాద్ అలీ, ఇంతకుముందు ఇదే విధంగా తెల్లటి కాటన్ గుడ్డ పై దివ్య ఖురాన్‌ను కాలిగ్రఫీలో రాశారు.  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ మరియు UP ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సహా ప్రముఖులకు తన కళాఖండాలను బహుమతిగా ఇర్షాద్ అలీ ఇవ్వాలనుకుంటున్నారు.

హాజీ ఇర్షాద్ అలీ బనార్స్ నగరంలోని భిలోపూర్ ప్రాంతంలో నివసిస్తున్న  చీరల వ్యాపారి. ఇర్షాద్ అలీ ఇంతకుముందు హనుమాన్ చాలీసాను రెండు మీటర్ల గుడ్డపై గంగానది మట్టితో వ్రాసాడు. ఇర్షాద్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి హనుమాన్ చాలీసాను బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాడు.

ఇర్షాద్ అలీ దాదాపు నాలుగు రోజుల్లో హనుమాన్ చాలీసాను పూర్తి చేశాడు. ఇర్షాద్ హనుమాన్ చాలీసా రాయడానికి ముందు చదివి అర్థం చేసుకున్నాడు.వరదల సమయంలో గంగా మట్టిని సేకరిం చామన్నారు. దీనిని ఫిల్టర్ చేసి ఎండబెట్టారు. తరువాత ఇర్షాద్ గంగాజల్ మరియు చేతితో తయారు చేసిన జిగురును కలిపి హనుమాన్ చాలీసాను వ్రాసాడు.

ఇర్షాద్ హనుమాన్ చాలీసా మాత్రమే కాకుండా హనుమంతుడిని మరియు భగవద్గీతను స్తుతించే ‘హనుమాన్ సహస్త్రాణం’ నుండి శ్లోకాలను కూడా వ్రాసాడు.

శ్రీమద్ భగవత్ గీత, హనుమాన్ సహస్త్రనామం మరియు హనుమాన్ చాలీసా మొత్తం 30 మీటర్ల వస్త్రంపై వ్రాయబడింది.

ఇర్షాద్ తన భగవద్గీత యొక్క మాన్యుస్క్రిప్ట్‌ను కాశీ విశ్వనాథ్ ధామ్ మరియు దేశం యొక్క కొత్త పార్లమెంటు భవనంలో ప్రదర్శించాలని కోరుకుంటున్నాడు.

ఇర్షాద్ ఈ ప్రాజెక్టును కొనసాగించేందుకు తన పిల్లలు ప్రోత్సహించారని తెలిపారు.

హాజీ ఇర్షాద్ అలీ పవిత్ర ఖురాన్, హనుమాన్ చాలీసా మరియు ఇతర మతపరమైన పుస్తకాలను కాటన్ క్లాత్‌పై అదే శైలిలో రాశారు. శ్రీమద్ భగవద్గీతను వ్రాయడానికి ముందు ఇర్షాద్ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి సంస్కృతం నేర్చుకున్నాడు.

ఇర్షాద్, కాటన్ గుడ్డ ముక్కలపై విష్ణు శాస్త్రం Vishnu Shastranam, హనుమాన్ చాలీసా మరియు జాతీయ గీతాన్ని కూడా రాశాడు.

"నాకు 14 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఖననం చేయడానికి ముందు కప్పటానికి అర మీటరు గుడ్డపై షహదాతిన్/సాక్ష్యాలు రాయడం ప్రారంభించాను" అని ఇర్షాద్ చెప్పారు. షహదాతిన్ అంటే విశ్వాసం యొక్క ప్రకటన – ఒకే దేవుడు ఉన్నాడని మరియు ముహమ్మద్ అతని దూత అని ప్రకటించడం. "

 క్రమంగా హాజీ ఇర్షాద్ అలీకి రాయడం పట్ల మక్కువ పెరిగింది మరియు ఇర్షాద్ పవిత్ర ఖురాన్‌ను గుడ్డ ముక్కలపై వ్రాయాలని నిర్ణయించుకున్నాడు. పవిత్ర ఖురాన్‌ ను  గంగా మట్టి, జంజామ్ బావి నీరు, కుంకుమపువ్వు మరియు గమ్‌ తో తయారు చేసిన పవిత్రమైన సిరాతో రాసాడు.  ఇర్షాద్ అలీకి పవిత్రమైన సిరా తో రాయడానికి దాదాపు ఆరు సంవత్సరాలు పట్టింది. ఇర్షాద్ తను రాసిన దివ్య ఖురాన్‌ను బనారసీ సిల్క్ బ్రోకేడ్‌తో ఫ్రేమ్ చేసాడు.

ఇర్షాద్ కుటుంబం మొత్తం ఈ పనిలో-భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సహా కుటుంబ సభ్యులందరూ అండగా ఉంటారు. సిరా సిద్ధం చేస్తున్నప్పుడు ఇర్షాద్ భార్య మరియు కుమార్తెలు గుడ్డ షీట్లను సిద్ధం చేస్తారు

ఇర్షాద్ మతపరమైన పుస్తకాలను వస్త్రంపై వ్రాసి రికార్డు సృష్టించడమే కాకుండా భారతదేశం యొక్క వైవిధ్య నాగరికతకు చిహ్నంగా కూడా మారాడు.

 

25 February 2023

న్యూజిలాండ్ లో లబించిన తమిళ గంట రహస్యం The Age-Old Mystery of New Zealand’s Tamil Bell

 


1836లో ఇంగ్లాండ్‌కు చెందిన క్రిస్టియన్ మిషనరీ విలియం సెలెన్సో, న్యూజిలాండ్‌లోని మారుమూల మావోరీ గ్రామంలో ఒక గంటను కనుగొన్నాడు. గంటను పరిశీలించిన  విలియం సెలెన్సో ఆ గంట మీద ఒక తెలియని భాషలో గుర్తులు మరియు రూన్‌ల శ్రేణిని కనుగొన్నాడు. సెలెన్సో దానిని స్థానికుల నుంఛి పొంది ఆ గంటను   అప్పటి డొమినియన్ మ్యూజియo లేదా నేటి వెల్లింగ్టన్‌లోని న్యూజిలాండ్ టె పాపా టోంగరేవా మ్యూజియం లో భద్రపరిచాడు.

1870లో, ఎథ్నోగ్రాఫర్ J. T. థాంప్సన్ ఆ గంట మీది రాతలకు అర్ధం తెలుసుకోవాలనే ఉద్దేశం తో ఫోటోలు తీసి భారతదేశం అంతటా పంపాడు. రెండు నెలల తర్వాత, థాంప్సన్‌కు సిలోన్/ఆధునిక శ్రీలంక మరియు పెనాంగ్, మలేషియా జలసంధిలోని  ఒక సెటిల్మెంట్ నుండి ప్రత్యుత్తరాలు వచ్చాయి.ఆ గంట మీద అస్పష్టంగా ఉన్న శాసనాలు పురాతన తమిళ భాషగా గుర్తించబడ్డాయి మరియు  "మొహైదీన్ బక్ష్ షిప్ యొక్క గంట" అని అనువదించబడ్డాయి.గంట యజమాని ఒక తమిళ ముస్లిం, పొట్టిగా  ఉంటాడని మరియు భారతదేశం లోని నాగపట్టంలో ఉన్న ప్రసిద్ధ భారతీయ షిప్పింగ్ కంపెనీకి యజమాని అని అనువదించబడినది.

తరువాత 1940లో జరిగిన పరిశోధనలలో   ఆ గంట 400-500 సoమత్సరాల ప్రాచీనమైనదని మరియు   1400 నుండి 1500 AD మధ్య కాలానికి చెందినది అని రుజువైనది.  ఇంకా ఇంగ్లిష్ కెప్టెన్ థామస్ కుక్ న్యూజిలాండ్‌ Poverty Bay లో1769లో  అడుగు పెట్టడానికి ముందే న్యూజిలాండ్‌కు  బయటి ప్రపంచం తో సంబంధాలు ఉన్నాయని  సూచిస్తుంది.

1877లో, రాగ్లాన్ మరియు అయోటియా ఓడరేవుల మధ్య ఓడ ప్రమాదం లో  ఇసుకలో సగం కూరుకుపోయిన ఒక ఓడ కనుగొనబడింది. న్యూజిలాండ్ తీరం అత్యంత ప్రమాదకరమైనది మరియు అక్కడ ఓడ ప్రమాదాలు సర్వసాధారణం కాబట్టి ఇది మొదట ఆధునిక నౌకగా భావించబడింది. కానీ వాస్తవం ఇందుకు బిన్నంగా ఉంది. ప్రమాదానికి గురి అయిన నౌక ఆగ్నేయాసియాలో టేకు తో నిర్మించబడి  చాలా పురాతనమైనదని గమనించబడినది. తమిళ శాసనాలు ఉన్న ఇత్తడి పలక మరియు మొహాయిద్ బుక్ పేరు ఉన్న చెక్క పలక ఓడ  లోపల భాగం లో కనుగొనబడ్డాయి.

వీటి ఆధారం గా చరిత్రకారులు అనేక సిద్ధాంతాలను ముందుకు తెచ్చారు.

కొందరు ఇది న్యూజిలాండ్‌లో ప్రారంభ తమిళ కాలనీకి రుజువు అని వాదించారు. ఓడ నిర్మాణం లో తమిళుల కున్న నైపుణ్యం మరియు తమిళ నావికుల నావికా నైపుణ్యం కారణంగా వారు న్యూజిలాండ్‌కు ప్రయాణించే అవకాశం ఉందని మరికొందరు అభిప్రాయపడ్డారు.

కాని చారిత్రక రికార్డులను పరిశీలిస్తే  భారతీయ నావికులకు తూర్పున అత్యంత సరిహద్దు-ప్రస్తుత ఇండోనేషియాలోని బాలి పక్కన ఉన్న లాంబాక్ ద్వీపం. అలాగే జాజికాయ, జాపత్రి మరియు లవంగాలకు ప్రసిద్ది చెందిన వెస్ట్ న్యూ గినియాలోని స్పైస్ దీవులు తమిళులచే నియంత్రించబడలేదు బదులుగా అవి టెర్నేట్, టిడోర్ మరియు అంబోయ్నా యొక్క స్థానిక మాగ్నెట్‌ల చేతుల్లోనే ఉన్నాయి. దీనికి తోడు న్యూజిలాండ్‌లో మరే ఇతర భారతీయ అవశేషాలు కనుగొనబడలేదు.

మరొక సిద్ధాంతం ప్రకారం తమిళ బెల్ వాస్తవానికి పోర్చుగీస్ ఓడకు చెందినదని    మరియు పోర్చుగీస్ చక్రవర్తి స్పైస్ దీవులను సంరక్షించడానికి పంపిన నౌకాదళంలోని ఒక  ఓడ నుండి వచ్చినదని పేర్కొనబడినది. 1490ల నుండి, పోర్చుగీస్ హిందూ మహాసముద్ర వాణిజ్య నెట్‌వర్క్‌లో ప్రధాన పాత్రదారి అయినది. 1511లో పోర్చుగీస్ వారు మలక్కా స్ట్రెయిట్స్‌లో మరియు భారత ప్రధాన భూభాగంలో గోవా తో సహా అనేక ప్రదేశాలలో వాణిజ్య కాలనీలు  కూడా స్థాపించారు.

1521లో పోర్చుగీస్ వైస్రాయ్ స్పైస్ దీవుల ఆవల ఉన్న భూములను అన్వేషించడానికి క్రిస్టోవాస్ డి మెండోంకా కెప్టెన్‌గా మూడు కారవెల్స్‌ను పంపాడు. మెండోంకా యొక్క కారవెల్ మాత్రమే తిరిగి వచ్చింది, మిగిలిన 2 కారవెల్స్‌ సముద్రంలో తప్పిపోయాయి మరియు వాటి జాడ లేదు.

1877లో, న్యూజిలాండ్ తీరంలో కనుగొనబడిన ధ్వంసం అయి ముంగిపోయిన ఓడ గోవాలో నిర్మించబడినట్లు గుర్తించబడింది. గోవాలో తమిళం విస్తృతంగా మాట్లాడబడుతుంది, ఇది గంటపై గల తమిళ రచనను వివరించింది.

అయితే, ఇవన్నీ చాలా అసంభవం. పోర్చుగీస్ కారవాల్‌పై గంట ఉన్నట్లు సూచించే ప్రత్యక్ష ఆధారాలు లేవు. చివరగా, పోర్చుగీస్ వారికి హిందూ మహాసముద్రం లో తెలియని ప్రపంచం లేదు మరియు మరింత కొత్త ప్రదేశాలను  అన్వేషించడానికి వారికి ఎటువంటి ఉద్దేశ్యం లేదు.

మరొక అత్యంత ప్రసిద్ధమైన మరియు వివాదాస్పదమైన సిద్ధాంతాలలో ఒకటి రాబర్ట్ లాంగ్డన్ తన పుస్తకం 'ది లాస్ట్ కారావెల్‌' లో అందించాడు, దీనిలో రాబర్ట్ లాంగ్డన్  తమిళ్ బెల్‌ను న్యూజిలాండ్‌కు ఈస్ట్ ఇండీస్‌కు చెందిన స్పానిష్ నావికుల బృందం తీసుకువచ్చిందని ప్రకటించాడు, వారు దిక్కుతోచని స్థితిలో ఉండి చివరికి న్యూజిలాండ్‌ లో స్థిరపడ్డారు. ఇది న్యూజిలాండ్ కు ఇంగ్లాండ్ కు చెందిన  థామస్ కుక్ రాకకు వందల సంవత్సరాల ముందు జరిగినది అని అంటాడు.

తమిళ మరియు పోర్చుగీస్ నౌక సిద్దాంతాల వలె, అందుబాటులో ఉన్న సాక్ష్యాల కొరత కారణంగా లాంగ్డన్ యొక్క వాదన చాలా విమర్శించబడింది. ఫ్రెంచ్ పాలినేషియాకు చెందిన విద్యావేత్త బెంగ్ట్ డేనిల్సన్ దీనిని "మానవశాస్త్ర విజ్ఞాన కల్పన"గా అభివర్ణించారు. బెంగ్ట్ డేనిల్సన్ ప్రకారం లాంగ్డన్ పసిఫిక్ పై ఇప్పటికే ఉన్న అన్ని పురావస్తు మరియు చారిత్రక సాహిత్యాన్ని విస్మరించాడు మరియు ఇది  లాంగ్‌డన్ ఆలోచనలకు విరుద్ధంగా ఉంది అని అన్నాడు.లాంగ్‌డన్ యొక్క వాదన క్రమపద్ధతిలో నిరాకరించబడింది.

తమిళ్ బెల్‌/గంట పై గందరగోళం కొనసాగింది.

అనేక సంవత్సరాల తర్వాత, బ్రెట్ హిల్డర్ గంట తమిళ ఓడ నుండి వచ్చిందనే మునుపటి వాదనను మళ్లీ ఉత్తేజపరిచినాడు. అంటార్కిటికా మరియు ఖండాల దక్షిణ ప్రాంతాల మధ్య తూర్పు వైపు సముద్ర ప్రవాహంలో చిక్కుకున్న తమిళ వ్యాపారి నౌక నుండి తమిళ్ బెల్ ఉద్భవించిందని హిల్డర్ భావించాడు.తమిళ బెల్ 1400 మరియు 1500ల మద్య సమయం నాటిది అయినప్పుడు, ఆకాలం లో  తమిళ నావికులు విశాలమైన హిందూ మహాసముద్రం యొక్క వాణిజ్య నెట్‌వర్క్‌లలో పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ముస్లిం తమిళులు ప్రత్యేకించి నైపుణ్యం కలిగిన నావికులు, సముద్రం మీదుగా ఆఫ్రికా తూర్పు తీరం వరకు వాణిజ్యం నిర్వహించారు.

1836లో కనుగొనబడినప్పటి నుండి, తమిళ్ బెల్ చుట్టూ ఉన్న చాలా సిద్ధాంతాలు చాలా ఊహాజనితంగా ఉన్నాయి మరియు తీవ్రంగా పరిగణించడానికి తగిన సాక్షాధారాలు  లేవు. బ్రెట్ హిల్డర్ వాదం తమిళ్ బెల్ కోసం ఒక రుజువును అందించింది.కాని హిల్డర్ సిద్ధాంతానికి కూడా బలహీనతలు ఉన్నాయి.

1890 నాటికి సముద్రపు ఇసుకలో సగం మునిగిపోయినట్లు చెప్పబడిన నాశనమైన ఓడ రహస్యంగా అదృశ్యమైంది, మరలా కనిపించలేదు. 1975 నాటికి శిధిలాలను తిరిగి కనుగొనడానికి చేసిన తదుపరి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

దీంతో తమిళ బెల్ యొక్క రహస్యం ఇంకా కొనసాగుతుంది.