15 February 2023

అండమాన్‌లో సెల్యులార్ జైలు నిర్మాణానికి ప్రణాళిక మరియు నిర్మాణం PLANNING FOR AND CONSTRUCTING THE CELLULAR JAIL IN THE ANDAMANS

 



భారతదేశంలో  బ్రిటిష్ వలస రాజ్య పాలనను వ్యతిరేకించినందుకు గాను అనేక మంది భారతీయ విప్లవకారులను అండమాన్‌లోని సెల్యులార్ జైలుకు పంపడం గురించి మీరు విని ఉండవచ్చు. అయితే సెల్యులార్ జైలు అంటే ఏమిటి మరియు అండమాన్‌లో అది ఎలా ఏర్పడినది? అండమాన్‌లోని సెల్యులార్ జైలు శిక్ష భారతదేశంలో  ఇతర  సాధారణ జైలు శిక్షకు భిన్నంగా ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ వ్యాసం:

అండమాన్ మరియు నికోబార్ దీవులు ఎప్పటి నుంచో సముద్రపు ప్రయాణీకులకు తెలుసు. ప్రధాన భూభాగానికి దూరంగా ఉండటం వల్ల - కోల్‌కతా మరియు చెన్నై రెండింటి నుండి 1200 కి.మీ మరియు యాంగోన్ నుండి 600 కి.మీ-- వాటికి వ్యూహాత్మక ప్రాముఖ్యత లేదు లేదా వాణిజ్య స్థావరంగా ముఖ్యమైనవి కావు.

తిరుగుబాటు తరువాత బ్రిటీష్ వారు మొదటి భారత స్వాతంత్ర పోరాటం పాల్గొని  శిక్ష అనుభవించే  వారిని భారతదేశానికి దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందని భావించారు. వీరి  కోసమే అండమాన్‌లో పీనల్ సెటిల్మెంట్ penal settlement ఏర్పడింది. తిరుగుబాటుకు ముందు నుంచీ పీనల్ సెటిల్మెంట్ ఆలోచన పరిశీలనలో ఉంది. కానీ 1857 నాటి తిరుగుబాటుతో ఇది ప్రాణం పోసుకుంది.

1857 మొదటి భారత  స్వాతంత్ర పోరాటం అనంతరం బ్రిటీష్ వారికి  పట్టబడిన మొదటి బ్యాచ్ 200 మంది విప్లవకారులను 10 మార్చి 1858న చతం ద్వీపానికి తరలించారు. తిరుగుబాటు కొనసాగుతుండగానే వారు  ఇక్కడికి వచ్చారు. బ్రిటిష్ వారు ఈ ద్వీపాలలో ఏర్పాటు చేసిన మొదటి ప్రధాన స్థావరం ఇది.

నిజానికి 1790ల నుండి ఇక్కడ వైపర్ ద్వీపం వద్ద ఒక పీనల్ కాలనీ ఏర్పడింది. 1788లో బాంబే మెరైన్స్ యొక్క నౌకాదళ సర్వేయర్ ఆర్కిబాల్డ్ బ్లెయిర్ పేరుమీద అండమాన్ మరియు నికోబార్ దీవుల పరిపాలనా రాజధానికి పోర్ట్ బ్లెయిర్ అని పేరు పెట్టారు. ఆర్కిబాల్డ్ బ్లెయిర్ తనతో పాటు బొంబాయి మరియు మద్రాసు ఫోర్ట్  నుండి దోషులను పరిపాలనా భవనాలు నిర్మించడానికి తీసుకువచ్చాడు. దోషులు వైపర్ ద్వీపంలో నివసించగా, బ్రిటిష్ నిర్వాహకులు చాతం ద్వీపంలో నివసించారు. కానీ, తిరుగుబాటు కారణం గా  అండమాన్‌ను పీనల్ కాలనీ గా మార్చే పని తీవ్ర రూపం దాల్చింది.

1869 నాటికి పోర్ట్ బ్లెయిర్‌లో 'సెల్యులార్ జైలు' నిర్మించాలనే ఆలోచన పోర్ట్ బ్లెయిర్ సూపరింటెండెంట్ ద్వారా జరిగింది.. సెల్యులార్ జైలు అనేది ఫ్రెంచ్ వారిచే సృష్టించబడిన ఒక ప్రత్యేకమైన నిర్మాణం, ఇది వందలాది మంది ఖైదీలను కాపలాగా ఉంచడానికి కొంతమంది వార్డెన్‌లను ఏర్పాటు చేసింది మరియు దోషులు బయటి ప్రపంచంతో లేదా ఒకరితో ఒకరు ఎటువంటి సంబంధం లేకుండా పూర్తిగా ఏకాంతంగా జీవించేలా చూసింది.

తాజా ఖైదీలందరినీ కనీసం ఆరు నెలల పాటు సెల్‌లలో ఉంచాలి, తద్వారా వారు క్రమశిక్షణకు అనుకూలంగా ఉంటారు మరియు బయటి ప్రపంచంతో వారి సంబంధాలన్ని పోతాయి. ఆ తర్వాత కొంతమంది ఖైదీలు బయటి పనిలో పాల్గొనవచ్చు మరియు జైలు అధికారులు తమ  ఇష్టానుసారం మరికొందరి ఏకాంత కాలాన్ని మరో ఆరు నెలల పాటు పెంచడం చేయవచ్చు.

1895 నాటికి, దోషులకు సరైన జైలును నిర్మించాలనే ప్రతిపాదన చేయబడింది. 1895 మార్చి 15, పోర్ట్ బ్లెయిర్ సూపరింటెండెంట్, మేజర్ ఆర్‌సి టెంపుల్, పోర్ట్ బ్లెయిర్‌లో సెల్యులార్ జైలునిర్మించాలని భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. అండమాన్‌కు పంపబడిన ఖైదీలను మొదటి ఆరు నెలలు జైలులో ఉంచడానికి అనుమతించాలని మేజర్ ఆర్‌సి టెంపుల్ ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. 'చెడ్డ పాత్రలు‘Bad characters ' కూడా ఇందులో  ఖైదు చేయబడాలి. ఇది డాక్టర్ లెత్‌బ్రిడ్జ్ రూపొందించిన నివేదికకు అనుగుణంగా ఉంది.

లెత్‌బ్రిడ్జ్ నివేదిక దోషులుగా నిర్ధారించబడిన వారిని 'కొంత తీవ్రతతో' శిక్షించడం గురించి వివరించినది. ముఖ్యంగా ప్రమాదకరమని భావించిన వారిని ప్రత్యేక సెల్స్‌లో నిర్బంధించoడం గురించి. మొదట వారిని ఆరు నెలల పాటు నిర్బంధంలో ఉంచాలని నివేదిక సిఫార్సు చేసింది. అలాంటి ఒంటరితనం, వారిని క్రమశిక్షణలో ఉంచుతుందని  భావించబడినది. జైలు సిబ్బంది ఇష్టానుసారం ప్రత్యేక సెల్‌లలో నిర్బంధ కాలాన్ని పెంచవచ్చు

కనీసం 600 సెల్లతో కూడిన జైలును ఆలస్యం లేకుండానిర్మించాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు. పోర్ట్ బ్లెయిర్ యొక్క సూపరింటెండెంట్ మేజర్ టెంపుల్ ఖైదీలందరికీ ఏదో ఒక పని లేదా మరొక పనిని ప్రతిపాదించారు, తద్వారా వారు పనిని శిక్షగా అనుభవించవచ్చు మరియు పని వారిని క్రమశిక్షణకు మరింత అనుకూలంగా మార్చవచ్చు.

సూపరింటెండెంట్  మేజర్ టెంపుల్, ఖైదీలందరూ ఏదో ఒక పని చేయడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. 'పని'లో భాగం గా ఖైదీని ఆయిల్ ప్రెస్‌కి కట్టి గుండ్రంగా తిప్పుతూ రోజు 8 గంటలకు పైగా గింజల నుంచి నూనె తీస్తూ పనిచేయాలి. ఈ నూనెను జైలులో ఆహారాన్ని వండడానికి ఉపయోగిస్తారు మరియు మిగులు నూనె స్థానికులకు విక్రయించబడుతుంది

No comments:

Post a Comment