21 February 2023

మదరసా విద్యలో సంస్కరణల ఆవశ్యకత The need of Madrasa Eeducational Reforms

 

మదర్సా విద్యావ్యవస్థలో ప్రభుత్వ జోక్యం దాదాపు ఖాయమైంది. ఉలేమా ఆత్మపరిశీలన కోసం ఒత్తిడిలో ఉన్నారు. ఈ సమయంలో, రాజ్యం మరియు ఉలేమా (ఇస్లామిక్ పండితులు) ఇద్దరూ పాఠశాల స్థాయిలో మెరుగైన విద్యా వ్యవస్థను ప్రవేశ పెట్టడానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది.

నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) వంటి సంస్థల నివేదికలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మెరుగైన విద్య కోసం మదర్సా విద్యా వ్యవస్థను పునరుద్ధరించాలని NCPCR కనుగొన్నది. యూపీ, అస్సాం, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు కూడా ఇలాంటి సర్వేలు చేశాయి.

భారతదేశంలో, ముస్లిం విద్య(మదరసా) ఎల్లప్పుడూ రాజ్య నిబంధనల నుండి స్వతంత్రంగా ఉంది. విద్యార్థుల ఎదుగుదలలో ఉలేమాలు ముఖ్యపాత్ర పోషించారు.భారతీయ మదర్సా విద్య యొక్క దృష్టి విద్యార్థులను ఉద్యోగావకాశాలుగా మార్చడం కంటే మంచి మానవులుగా తయారు చేయడంపై ఉంది. అనేకమంది మదరసా విద్యార్థులు మత గురువులుగా మరియు అనువాదకులుగా మారారు.

భారతదేశంలోని చాలా మదర్సాలు ప్రభుత్వ గుర్తింపు పొందలేదు. ఇక్కడ సమర్థవంతమైన సమగ్ర విద్యా విధానాన్ని తీసుకురావడం ఒక సమస్యగా మారింది. పెద్ద సంఖ్యలో ఉలేమాలు మారుతున్న కాలపు అవసరాలకు తగినట్లుగా  సంస్కరణలను ప్రారంభించడంలో వెనుకాడారు.

పంతొమ్మిదవ శతాబ్దంలో, మొఘల్ సామ్రాజ్య క్షీణత తరువాత భారతదేశంలోని సంస్కరణవాద ఉలేమా ఇస్లామిక్ వారసత్వ పరిరక్షణకు  లక్నోలోని ఫిరంగి మహల్ వంటి కొత్త పాఠశాలలను(మదరసాలు)  స్థాపించారు.పాఠశాల (మదరసా) విద్య అరబిక్ వ్యాకరణం, తర్కం, తత్వశాస్త్రం, గణితం, వాక్చాతుర్యం, ఫిఖ్ మరియు వేదాంతశాస్త్రం మరియు ఖురాన్ మరియు హదీత్‌లను కలిపి ఒక క్రమబద్ధీకరించబడిన పాఠ్యాంశమైన డార్స్-ఇ-నిజామీపై ఆధారపడింది.

బ్రిటీష్ వారు 1825లో ఢిల్లీ కళాశాల వంటి ముస్లిం మరియు బ్రిటీష్ విద్యా వ్యవస్థల లక్షణాలను కలిపి(ఆంగ్ల ట్రాక్ మరియు ఓరియంటల్ ట్రాక్) విద్యాసంస్థలను స్థాపించారు. వాటిలో ఉర్దూలో శాస్త్రాలు బోధించబడ్డాయి.

స్వాతంత్ర్యానికి ముందు మదర్సాలు పిల్లలకు విద్యకు ప్రధాన వనరుగా ఉండేవి. రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ మరియు ప్రఖ్యాత రచయిత మున్షీ ప్రేమ్ చంద్ వంటి ప్రముఖులు మదర్సాలలో చదువుకున్నారు

భారతదేశంలో నేడు మదర్సా విద్య ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ప్రభుత్వం పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు  లౌకిక విద్యను కూడా అందించడం ద్వారా మదరసా విద్యను మరింత అర్ధవంతం చేయాలని కోరుతోంది.

అయితే ప్రపంచంలోని అనేక దేశాలలో కనిపించే విధంగా కఠినమైన నియంత్రణ ప్రతికూలంగా ఉంటుందని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి అదేవిధంగా  విద్యార్థులకు కేవలం ఇస్లామిక్ అధ్యయనాలను అందించడం వల్ల వారికి ఉపాధి లభించదని ఉలేమాలు గ్రహించాలి. కొన్ని మదర్సాలు ఆధునిక విషయాలను ప్రవేశపెట్టినప్పటికీ, వాటిలో ఎక్కువ భాగం కేవలం మతపరమైన విద్యను మాత్రమే అందిస్తున్నాయి.

ప్రభుత్వం మరియు ఉలేమాలు రెండింటికీ ముందున్న మార్గం మితవాద అభ్యాసం. మదర్సాలు వాటి సారాంశాన్ని అనుసరించడానికి ప్రభుత్వం అనుమతించాలి, అయితే ఉలేమాలు తమ కరిక్యులెం లో కొత్త సబ్జెక్టులు ప్రవేశ పెట్టాలి. సంస్కరణలు తీసుకురావడానికి పౌర సమాజం కీలక పాత్ర పోషించాలి. ఇది గతంలో జరిగింది మరియు ఇది మళ్లీ చేయవచ్చు. సర్ సయ్యద్ అహ్మద్ తీసుకొచ్చిన విద్యా సంస్కరణలు ముస్లిం ప్రపంచాన్ని జ్ఞానవంతం  చేశాయి.

మదరసా విద్యార్థులు హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు, మేనేజ్‌మెంట్ మరియు కాంటెంపరరీ సైన్సెస్‌లను అభ్యసించడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం తద్వారా వారు తాజా సాంకేతికతల నుండి నేర్చుకుంటారు మరియు మంచి వృత్తిని పొందవచ్చు.

 

No comments:

Post a Comment