22 March 2014

క్రమంగా దేశవ్యాప్తం గా ముస్లింల సామాజిక,ఆర్థిక,విద్యా,వైద్య మానవాభివృద్ధి సూచికలలో పెరుగుదల



భారత దేశము లోని ముస్లింల సామాజిక,ఆర్ధిక,విద్యా స్థితిగతులను పరిశీలించటానికి కేంద్ర ప్రభుత్వం చే నియమింపబడిన సచార్ కమిటీ 1990 దశకానికి సంబందించిన జాతీయ గణాంకాలను ఆదారంగా తన నివేదికను రూపొందించినది. ఆ నివేదికల్లో భారత దేశంలోని ముస్లింలు, ఇతర సామాజిక వర్గాలకన్న,మానవాభివృద్ధికి సంబందించి  సామాజిక,ఆర్ధిక,విద్యా  సూచికలలో క్రింది స్థానంలో ఉన్నారు మరియు వారి పరిస్థితి ఎస్‌సి,ఎస్‌టి ల కన్నా ఆధమంగా ఉన్నదన్న విషయం స్పష్టం అయినది.
అయితే ఐ‌హెచ్‌డి‌ఆర్ నివేదిక 2011 ప్రకారం గత దశాబ్ధం లో అనగా 2001నుంచి 2011 వరకు గల 10 సంవత్సరాల కాలంలో ముస్లింల స్థితిగతులను పరిశీలించిన క్రమంగా  ముస్లిం ల స్థితి గతులు మెరుగు చెంది అవి    దేశ సామాజిక,ఆర్ధిక,విద్యా  సరాసరి సూచికలతో సరిసమానంగా ఉన్నాయని  గణాంకాలు చెపుతున్నాయి.  సగటు తలసరి వినియోగ ఖర్చు,నిరుద్యోగ శాతం,బాలకార్మికుల శాతం,శిశు/పిల్లల మరణాల శాతం,పునరుత్పత్తి రేట్, పిల్లల టికాకరణ(ఇమ్మునైజేషన్)మరుగు దొడ్డి సదుపాయం, అక్షరాస్యతా మొదలగు వాటి విషయంలో ముస్లింల సూచికలు మిగతా దేశ ప్రజల సూచికలతో సమానంగా ఉన్నాయి.
సచార్ కమిటీ నివేదిక ప్రకారం ముస్లింలలో బరువు తక్కువ గా పుట్టే పిల్లల సరాసరి శాతం 1998-99 నాటికి 48.3% ఉండి దేశ సరాసరి శాతం47% గా  కన్నా ఎక్కువుగా ఉంది. కానీ 2000దశకం లో అది ముస్లిం పిల్లలలో 6.5% తగ్గింది, దేశ సరాసరి శాతం 4.5% కు తగ్గినది. అనగా 2005-06 నాటికి ముస్లింలలో బరువు తక్కువ గా పుట్టే పిల్లల సరాసరి శాతం41.8% కు తగ్గినధి దేశ సరాసరి శాతం 42.5%  కు తగ్గింది.
శిశుమరణాలు,5సంవత్సరాలలోపు పిల్లలలో మరణాల శాతం క్రమంగా తగ్గుతుంది.1992-99 వరకు జాతీయ సరాసరి సూచికకు ముస్లిం పిల్లల సరాసరి సూచికకు మద్య వ్యత్యాసo అధికంగా ఉండేది, కానీ 1998-2006 మద్య ఈ వ్యత్యాసం జాతీయ సరాసరితో సమానంగా ఉంది అనగా ముస్లింలలో శిశుమారణాలు,5సంవత్సరాలలోపు పిల్లల మరణాలు తగ్గినవి.
అదేవిధంగా ముస్లింలలో విద్యాభివృద్ధి పెరిగి, వారిలో అక్షరాస్యతా శాతం దేశ అక్షరాస్యతా శాతం కు దగ్గిరగా ఉంది. 2001 నాటికి గ్రామీణ ప్రాంతాలలో ముస్లింలలో అక్షరాస్యతా శాతం దేశ అక్షరాస్యతా శాతం కన్నా 6% తక్కువుగా, పట్టణ ప్రాంతాలలో 10% తక్కువుగా ఉండేదిది. కానీ 2007-2008 నాటికి అది గ్రామీణ ప్రాంతాలలో 3,5%,పట్టణ ప్రాంతాలలో 8.5% శాతం వ్యత్యాసం కు తగ్గిపోయినది. అయినప్పటికి  2008 నాటికి ముస్లింల అక్షరాస్యతా శాతం దేశ అక్షరాస్యతా శాతం కన్నా తక్కువుగానే ఉంది. 2011-12నేషనల్ సాంపుల్ సర్వే నివేదిక ప్రకారం దేశప్రజలలో అనగా 7సంవత్సరాలు ఆపైన ఉన్నవారిలో అక్షరాస్యులు 75% కాగా అది ముస్లింలలో 72% గా ఉంది.
1992-93 నాటికి 15-49 సవత్సరాలలోపు ఉండే స్త్రీలలో పునర్వుత్పాదను రేట్ ముస్లిం స్త్రీలలో అధికంగా ఉండి,దేశ స్త్రీల సరాసరి పునరుత్పాదన రేట్ కన్నా  0.7% అధికంగా ఉండేది.  1998-99 నాటికి ఈ వ్యత్యాసం 1% కు పెరిగింది. కానీ 2006 నాటికి ముస్లిం స్త్రీలలో పునరుత్పాదన రేట్ కేవలం .5% కు పెరిగి 3.09గా ఉంది. 2006 లో జాతీయ స్త్రీల పునర్ ఉత్పాదన రేట్ 2.6% గా ఉంది. అనగా కేవలం ముస్లిం స్త్రీలలో .49%పెరుగుదల  గానే ఉంది.  కాబట్టి కొంత మంది ఆరోపించినట్లు ముస్లిం ల జన సంఖ్యా విపరీతం గా పెరగటం జరగదు. దేశ జనాభాలో 2001 జనాభా లెక్కల ప్రకారం ఉన్నట్లు  ముస్లిం జనాభా శాతం 13.4%కన్నా పెరగదు.
అంతిమంగా చెప్పేదిఏమిటంటే జాతీయ మనవాభివృద్ధి సూచికలలో ముస్లింలు,ఇతరులకు మద్య ఉన్న వ్యత్యాసం క్రమంగా తగ్గుతుంది ముస్లింల పురోభివృద్ధి జరుగుతుంది. సామాజికాభివృద్ధి సూచికలలో ముస్లింల స్థితి క్రమంగా ఎస్‌సి,ఎస్‌టి ల కన్నామెరుగు ఆవుతుంది. కానీ శిశుమరణాలు,5సంవత్సరాలలోపు పిల్లల మరణాలు,మరుగుదొడ్డి సౌకర్యం,తక్కువ బరువు తో పుట్టే  పిల్లలు మొదలగు సూచికల విషయాలలో ముస్లిం ల పరిస్థితి జాతీయ సరాసరుల కన్నా తక్కువుగా ఉన్నాయి. అన్నీ వర్గాలలో సగటు తలసరి వినియోగ ఖర్చు పెరుగుతుంది, పేదరికం తగ్గుతుంది. కానీ ముస్లింలలో పట్టణ ప్రాంతాలలోముస్లింల తలసరి వినియోగ ఖర్చు మిగాతా వర్గాలకన్న  బిన్నoగా ఉంది, గ్రామీణ ప్రాంతాలలో ముస్లింల తలసరి వినియోగ ఖర్చు ఇతరవర్గాలతో సమంగా ఉంది. స్త్రీల పోషకాహార లేమి విషయంలో ముస్లిం స్త్రీలు పట్టణ ప్రాంతాలలో మిగతా వారికన్న బిన్నం గా అధిక పోషకాహార లేమితో బాధ పడుతున్నారు.  
అదేవిధంగా మానవాభివృద్ధి సూచికలపై ప్రణాళికా సంఘం క్రింద పనిచేసే ఐ‌ఏ‌ఎం‌ఆర్ సంస్థ ప్రచురిన గణాంకాల ప్రకారం భారత దేశంలోని పేద రాష్ట్రాలలో (బీమారు రాష్ట్రాలు)నివశిస్తున్న ముస్లింలు మానవాభివృద్ధి సూచికలలో ఇతర బలహీన వర్గాల వారికన్నా మెరుగైన స్థానం లో ఉన్నారు. భారత దేశం లోని ఎనిమిది పేద రాష్ట్రాలు ఐనా బిహార్,ఛత్తీస్ ఘడ్,మద్యప్రదేశ్,ఒరిస్సా,రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలు దేశ జనాభాలోని, 44% ముస్లిం లను కలిగి ఉన్నాయి. సామాజిక అబివృద్ధి- మానవాభివృద్ధి సూచిక 2011 నివేదిక ప్రకారం.జమ్ము-కాశ్మీర్, ఆంధ్ర ప్రదేశ్ లోని ముస్లింలు ఆరోగ్య సూచిక ల విషయం లో వారి రాష్ట్రాలలోని హిందువుల కన్నా, యూ‌పి,ఎం‌పి,బిహార్, గుజరాత్ లోని హిందువుల కన్నా మెరుగుగా ఉన్నారు.. 


ఇండియన్ హ్యూమన్ డవలప్మెంట్ సర్వే (IHDS) నివేదిక-మహిళలకు సంబంధించిన సత్యాలు


భారత దేశ జనాభాలో స్త్రీలు 50% వరకు ఉన్నారు. వోటర్లలో కూడా దాదాపు 50% వరకు స్త్రీ వోటర్లు ఉన్నారు. దేశ ప్రధాని, రాష్ట్ర పతి వంటి ఉన్నత పదవులను స్త్రీలు అధిష్టించినారు. మహిళా సాధికారికత సాదించడానికి ప్రభుత్వపరము గా అనేక చర్యలు తీసుకొంటున్నారు. ఆర్ధిక రంగంలో సాదికారికత సాదించదానికి అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టబడినవి. రాజకీయ రంగం లో సాదికారికత సాదించడానికి మహిళా రేజర్వేషన్ బిల్లును అమలులోనికి తేవడానికి తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో 50% సీట్లను కొన్ని రాష్ట్రాలలో కేటాయించడం కూడా జరిగింది. మాత -శిశు సంక్షేమానికి అనేక పధకాలు ప్రవేశ పెట్టడం జరిగింది. ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికి స్త్రీల అబివృద్ధి ఆశించినంతగా  లేదు. ముఖ్యంగా మానవాభివృద్ధి సూచికలలో అనగా విద్యా,వైద్య,ఉపాధి తదితర రంగాలలో స్త్రీల అభివృద్ధి ఆశించినంత లేదు.
నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్  ఎకనామిక్ రిసర్చ్ సంస్థ నిర్వహించిన ఇండియన్ హ్యూమన్ దవలప్మెంట్ సర్వే 2005-12 వరకు నిర్వహించిన సర్వే లో వెలుబడిన ఫలితాలను ఈ క్రింది విధంగా అబివర్ణించవచ్చును.

IHDS నివేదిక ప్రకారం

§  భారత దేశం లో 18% మహిళలు ఇంటినుంచి బయటకు లేదా కిరాణా షాపు లకు కూడా స్వయంగా వెళ్లలేరు.
§  మహిళలలో 50% ఏవోరో ఒకరి తోడు లేకుండా బయటకు వెళ్లరు/స్వల్ప దూరం కూడా ప్రయాణం చేయరు.
§  వారికి లేదా వారి పిల్లలు జబ్బు పడినపుడు కేవలం 25% మంది మహిళలు  మాత్రమే స్వయంగా నిర్ణయం తీసుకోగలరు.
§  25% మహిళలకు మాత్రమే వివాహానికి పూర్వం వారికి కాబోయే భర్తలను/భాగస్వామిని  గురించిన పరిచయం ఉంది.
§  40% మహిళలకు వారి వివాహ విషయం లో స్వాతంత్ర్యం లేదు
§  80 % మహిళలకు  వైద్యుని దర్శించటానికి ఇంటివారి  అనుమతి కావలె .
§  60% మహిళలలు  తమ శిరస్సును కప్పుకొనేదరు.59% సవర్ణ  హిందు స్త్రీలు,83% ముస్లిం స్త్రీలు పరదా /గూంఘాట్ వాడేదారు. ఎక్కువగా రాజస్తాన్ లో 96% స్త్రీలు, తక్కువుగా తమిళనాడులో 6% స్త్రీలు తమ శిరస్సును కప్పుకొనేదారు.
§  25 స౦వత్సరాలు దాటిన 18% స్త్రీలకు వివాహానికి పూర్వమే తమ జీవిత భాగస్వామి తో పరిచయం ఉంది.
§  భారత దేశం లో ప్రతి కుటుంబం సరాసరి కట్నం క్రింద 333463 రూపాయిలు  ఇవ్వవలసి ఉంది. కట్నం ఖర్చు సవర్ణ హిందువులలో ఎక్కువ ఉండగా, ఆదివాసిలలో తక్కువుగా ఉంది. కేరళలో ఎక్కువ ఉండగా, అస్సామ్ లో తక్కువుగా ఉంది.
§  కట్నం క్రింద 39% మంది టి‌వి,ఫ్రిజ్,కార్ లాంటి విలాస వస్తువులను బహుమతిగా తెస్తారు. ఇది
డి ల్లి లో ఎక్కువ,కేరళలో తక్కువ.
§  సరాసరి వరుని వివాహ ఖర్చు 81952రూపాయిలు ఉండగా, వధువు వివాహ ఖర్చు 1,26,724రూపాయిలుగా ఉంది.
§  91%మంది స్త్రీల చేతిలో నగదు ఉంటుంది. వస్తువులు కొనుటలో 76% మంది స్త్రీల మాట చెల్లును.
§  19% స్త్రీల పేరు మీద ఇంటి దస్తావేజులు  ఉండును.
§  2012 నాటికి 25 సంవత్సరాలు నిండిన మహిళలలో 48% మంది కి  18 సంవత్సరాలకు లోపే వివాహాము జరిగినది. అది 2005 లో 60% వరకు ఉంది.
§  దక్షిణ భారత దేశం లోని స్త్రీలు ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక లోని స్త్రీలలో 20%మండి బయటి సంబంధాలకన్న బందువులలోనే వివాహం చేసుకొంటున్నారు. కానీ సరాసరి బారత దేశం లో బయటి సంబంధాలు చేసుకోవడం పెరిగింధి.
§  మహిళలలో పునరుత్పాదన రేట్ తగ్గినది.2005 లో 3.85 ఉండగా ప్రస్తుతం అది 3.55 కు తగ్గినది
§  2005 లో గ్రామీణ ప్రాంతాలలో  15-59 మద్య వయస్సు ఉంది పనిచేసే మహిళలు 58% ఉండగా అది 2012 నాటికి 54% కు తగ్గింది. పట్టణ ప్రాంత మహిళలలో అది 23% నుంచి 20% కు తగ్గింది.
§  గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పనులు చేసే పురుషుల సంఖ్య 2005 లో 73% ఉండగా, 2012 లో 65% కు తగ్గింది.
§  గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పనులు చేసే స్త్రీల సంఖ్య 2005 లో 91% ఉండగా, 2012 లో 86% కు తగ్గింది.
§  మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధక లభిదారులలో 44% మంది స్త్రీలు.   
§  2005 లో 50% కాన్పులు హాస్పటల్ లో జరగగా, 2012 లో దాని శాతం 70% కు పెరిగింది.
§  2005 లో బ్యాంక్ అక్కౌంట్ లు ఉన్న స్త్రీల శాతం 18% ఉండగా, 2012 నాటికి అది 38% కు పెరిగింది.
§  2005 లో 6-14 సంవత్సరాల మద్య ఉండి  పాఠశాలలో నమోదు చేసుకొన్న బాలికల శాతం 88% ఉండాగా 2012 నాటికి అది 96% కు పెరిగింది.
§  2005 లో 6-14 సంవత్సరాల మద్య ఉండి  పాఠశాలలో నమోదు చేసుకొన్న బాలుర శాతం 92% ఉండాగా 2012 నాటికి అది 96% కు పెరిగింది.
§  2001లో0-6సంవత్సరాల మద్య వయస్సు గల పిల్లలలో  ప్రతి 1000మంది బాలురకు 927 మంది బాలికలు కలరు. 2012 నాటికి అది తగ్గి ప్రతి 1000మంది బాలురకు 919 బాలికలు ఉన్నారు.
§  పురుషుల సగటు వివాహ వయస్సు 17.8 సంవత్సరాలుగా ఉంది.

మానవభివృద్ధి సూచిక లో ఆంధ్ర ప్రదేశ్ వెనుకంజ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో మహిళలకు ఆర్ధిక రంగంలో సాదికారికత సాధించుటకు ఏర్పడిన స్వయం-సహాయక బృందాలు (SHG)జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని సాదించినవి. సుమారు 10.53 లక్షల స్వయం-సహాయక బృందాలు,ఎక్కువుగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఒక కోటి మంది కి పైగా మహిళలను సబ్యులుగా కలిగి దేశంలోనే అధికంగా బ్యాంక్ రుణాలను పొందిన రాష్ట్రం గా ఆంధ్ర ప్రదేశ్ పేరుగాంచినది. కానీ 2011 జనాభా లెక్కలు,నేషనల్ హెల్త్ సర్వే-3,రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రచురించిన బులిటెన్ ప్రకారం మనవాభివృద్ధి సూచికలో అనగా  అక్షరాస్యతా,ఆరోగ్యం, వివాహ వయస్సు,పునరుత్పత్తి,స్త్రీ-పురుష నిష్పత్తి,జనన-మరణాల శాతం,మాత-శిశు మరణాల శాతం మొదలగు విషయాలలో దేశం లో   అత్యంత దిగువ స్థానం లో ఉన్నది.
·        జాతీయ అక్షరాస్యతా శాతం 74.04% ఉండగా అది ఆంధ్ర ప్రదేశ్ లో 67.6% గా ఉంది.
·        జాతీయo గా స్త్రీ వివాహ వయస్సు సగటున 20.2 సంవత్సరాలు ఉండగా ఆంధ్ర ప్రదేశ్ లో అది 18.7 సంవత్సరాలు గా ఉంది.
·        ఆంధ్ర ప్రదేశ్ లోని 33.5%  స్త్రీల బాడీ మాస్ ఇండెక్స్ సాదారణ స్థాయి కన్నా తక్కువగా ఉంది.
·        జాతీయం గా స్త్రీలలో రక్త హీనత కలిగిన వారు 55.3% ఉండగా, ఆంధ్ర ప్రదేశ్ లోని స్త్రీలలో 62.9% స్త్రీలు రక్త హీనతతో బాదపడుతున్నారు.
·        జాతీయం గా గ్రామీణ ప్రాంతాలలోని శిశువుల మరణ శాతం 7% గా  ఉండగా అది ఆంధ్ర ప్రదేశ్ లో 7.4% శాతం  ఉంది.
·        పుట్టిన నవజాత శిశువులలో 50%మండి పుట్టిన 28 రోజుల లోపే మరణిస్తున్నారు.
·        ఆస్పత్రులలో కాన్పుల సంఖ్య పెరిగినప్పటికి, శిశు మరణాల రేట్ తగ్గలేదు.
మొత్తం మీద ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని 50% స్త్రీలు నిరక్షరాస్యులు,తొందరగా వివాహం చేసుకొంటున్నారు,రక్తహీనతతో భాదపడుతున్నారు.తక్కువ బరువుతో పుట్టడం, ఇతర ఆరోగ్య కారణాలవలన ఆంధ్ర ప్రదేశ్ లో  శిశుమరణాల శాతం కూడా అధికంగానే  ఉంది. 




భారత దేశం లో ఎన్నికల విశేషాలు




భారత దేశము ప్రపంచములో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం లో ఎన్నికలను ప్రతి 5 సంవత్సరాలకు ఒక సారి నిర్వహిస్తారు. ఎన్నిక లను నిర్వహించడానికి రాజ్యాంగబడ్డం గా ఏర్పడిన స్వతంత్ర ప్రతిపత్తి  కల ఎన్నికల సంఘం ఏర్పాటు అయినది. 1952 లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి నేటివరకు మొత్తం 15 సార్లు లోక్ సభ కు ఎన్నికలను నిర్వహించడం జరిగింది. 2014 లో 16వ లోక్ సభ కు ఎన్నికలను నిర్వహించడం జరుగుతుంది.2014 లోక్ సభ ఎన్నికలలో 81.46 కోట్ల మంది వోటర్లు పాల్గొబోతున్నారు.543 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగును. 7 కేంద్ర పాలిత ప్రాంతాలు, 28 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగును. దేశవ్యాప్తం గా 9,30,000 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబడినవి. దాదాపు 1కోటి 10 లక్షల మంది ఎన్నికల అధికారులు ఎన్నికలను నిర్వహిస్తారు. ఈ సందర్భం గా భారత దేశం లో ఎన్నికలకు సంబందించిన కొన్ని విశేషాలను పరిశీలించుదాము.
భారత దేశం లో ఎన్నికల విశేషాలు
·       జమ్ము-కాశ్మీర్ లోని హబ్బాకాదల్ నియజకవర్గం లో పోలింగ్ శాతం కనిష్టం గా 11.62% ఉండగా, మణిపుర్ లోని హీరోక్ నియోజకవర్గం లో అత్యధికంగా 96.02% వోట్లు పోలు అయినావి.
·       రాష్ట్ర శాసన సభలకు చెంది యూ‌పి లోని సాహిబాబాద్ నియోజకవర్గం లో అత్యధికంగా  676637 మంది వోటర్లు ఉండగా,  సిక్కిం లోని సంఘ నియోజక వర్గం లో 3058 మంది  వోటర్లు ఉన్నారు.
·       యూ‌పి లో అత్యధికంగా 403 రాష్ట్ర అసెంబ్లీ నియోజక వర్గాలు ఉండగా, కనిష్టం గా పాండుచ్చేరి లో 30 అసెంబ్లి నియోజక వర్గాలు ఉన్నాయి.
·       యూ‌పి లోని సదర్ నియోజక వర్గానికి చెందిన ఎస్‌పి కి చెందిన ఎం‌ఎల్‌ఏ అరుణ్ కుమార్ అందరిలోకి అత్యంత పిన్న వయస్కుడు అనగా  జనవరి 2012 నాటికి అతని వయస్సు 25 సంవత్సరాలు.
·       కర్ణాటక బీదర్ నుంచి రామచంద్ర వీరప్ప 94 సంవత్సరాల వయస్సు లో ఎన్నికలలో విజయం సాదించాడు. 
·       ఎన్నికలలో ఈ‌వి‌ఎం లను మొదటిసారిగా కేరళలో వాడటం జరిగింది. ఒక ఈ‌వి‌ఎం లో 64 మంది వరకు అబ్యర్ధులకు గుర్తులు కల్పించవచ్చు.
·       కాండిడేట్ అనే పదానికి లాటిన్ భాషలో తెలుపు దుస్తులు దరించినవాడు అని అర్థం.
·       1996 లో తమిళనాడు లోని మోదౌరిచి నియజక వర్గం  నుంచి 1033 అబ్యర్ధులు పోటీ చేసినారు.బ్యాలెట్ పేపర్ ను బుక్లెట్ రూపం లో ముద్రించతమైనది.
·       అరుణాచల్ ప్రదేశ్ లోని బొందిల జిల్లాలోని ఒక నియోజక వర్గం లో కేవలం 3గురు మాత్రమే వోట్ చేసినారు.
·       1950 వ దశకం లో జరిగిన ఎన్నికలలో ఒకే బాలట్ బాక్స్ కాకుండా  ప్రతి పార్టీ  అబ్యర్ధికి ఒక రంగు బాలట్ బాక్స్ చొప్పున వివిద రంగుల బాలట్ బాక్స్ లను వాడేవారు.
·       ఎం‌పి లోని రాజనందగావ్ నుంచి తండ్రి-తల్లి-కుమారుడు వివిధ ఎన్నిక లలో ఎన్నికైనారు.
·       1957 సాదారణ ఎన్నికలలో గరిష్టం గా  62.2% వోట్లు పోలు అయినాయి.1967 సాదారణ ఎన్నికలలో కనిష్టం గా  33% వోట్లు పొలుఐనాయి.
·       ఏరియా ప్రకారం రాజస్తాన్ లోని బార్మర్ నియోజక వర్గం గరిష్టం గా  71601.24 స్క్వేర్ కిలోమేటర్ల వైశాల్యాన్ని కలిగిఉంది.
·        ఏరియా ప్రకారం ముంబై సౌత్ నియోజక వర్గం కనిష్టం గా  13.73 స్క్వేర్ కిలోమేటర్ల వైశాల్యాన్ని కలిగిఉంది.
·       గుజరాత్ లోని గిర్ అడవులలోని బనేజ్ గ్రామం లోని  ఒకే ఒక్క వోటర్ కోసం పోలింగ్ బూత్ ఏర్పాటు చేయబడినది.
·       అందరి కన్నా అత్యధిక వోట్లు 855543  సాదించినది ఔటర్ డిల్లీ నుంచి సజ్జన్ కుమార్. తక్కువ వోట్లు సాదించినది చాందిని చౌక్ నుంచి అశోక్ కుమార్ 45.
·       మొదటిసారిగా  వోటర్లకు లోక్ సభ ఎన్నికలలో  NOTA (none of the above)ఆప్షన్ ఇవ్వబడినది
·        




15 వ లోక సభ లోని ముస్లిం ఎం.పి. లు కొన్ని విశేషాలు

 త్వరలో మనదేశం లో 16వ లోక్ సభ కు 2014 లో  సార్వత్రిక ఎన్నికలు జరగ పోతున్నాయి.. ఇటువంటి పరిస్తుతులలో  15 వ లోక్ సభ లో ఎంతమంది ముస్లిం సబ్యులు కలరో ఒకసారి పరిశీలించుదాము.

 

          భారత దేశాజనాభాలో ముస్లింల శాతం 15-20% వరకు ఉంది.వారి  జనాభా నిష్పత్తి ప్రకారం అయితే  లోక్ సభలో ఉండ వలసిన ముస్లిం సబ్యుల సంఖ్య 72. కానీ ప్రస్తుత లోక్ సభ అనగా 15 వ లోక్ సభ లోని మొత్తం ముస్లిం సబ్యుల సంఖ్య  30. ముస్లిం లోక్ సభ సబ్యులలో ప్రముఖులు సలాఉద్దీన్ ఒవైసీ, సల్మాన్ ఖుర్షీద్,మహమ్మద్ అజరుద్దీన్, E. అహ్మెద్, షానవాజ్ హుస్సైన్, ఫరూక్ అబ్దుల్లా, మహమ్మద్ హమీదుల్లా సయీద్ ముఖ్యులు.

          పార్టీల వారీగా చూస్తే వీరిలో 11మండి కాంగ్రెస్స్-ఐ కు, నేషనల్ కాన్ఫరెన్సు కు 4గురు, బి.ఎస్.పి. కు 4 గురు, తృణమూల్ కాంగ్రెస్స్ కు 3, ముస్లిం లీగ్ కు ఇరువురు, ఎం.ఐ.ఎం.కు ఒకరు, అస్సామ్ యునైటెడ్ డెమోక్రెటిక్ ఫ్రంట్ కు ఒకరు, జనతా దాల్ యునైటెడ్ కు 1, డి.ఎం.క.కు ఒకరు, సి‌పి‌ఐ‌ఎం కు ఒకరు, బి.జే.పి.కు ఒకరు మొత్తం 30 మంది కలరు.

          ఇక రాష్ట్రాల వారీగా పరిశీలించిన ఆంధ్ర ప్రదేశ్ నుండి ఒకరు, అస్సామ్ నుంచి ఇద్దరు, బీహార్ నుంచి ముగ్గురు, జమ్ము-కాశ్మీర్ నుంచి నలుగురు, కేరళ నుంచి 3గురు, తమిళ నాడు నుంచి రెండు, యూ.పి. నుంచి ఏడుగురు, పశ్చిమ బెంగాల్ నుంచి 7గురు, లక్షద్వీపాలనుంచి ఒకరు మొత్తం 30 మంది ఎన్నికైనారు.

                      15 వ లోక్ సభ లోని మొత్తం 30 మంది లోక్ సభ ముస్లిం సబ్యులలో 27 మంది పురుషులు, 3 స్త్రీలు కలరు. 15 వ లోక్ సభ లో ఎన్నికైన మహిళా ముస్లిం సబ్యలు వరుసగా తబసుమ్ బేగమ్(యూ.పి.-బి.ఎస్.పి.),కైసర్ జహాన్(యూ.పి.-బి.ఎస్.పి),మౌసమ్ నూర్(పశ్చిమ బెంగాల్ -కాంగ్రెస్-ఐ)
          వీరి ముగ్గురులో మౌసమ్ అత్యంత చిన్న వయసును అనగా కేవలం 27 సం. ల వయసును కలిగినది మరియు ముగ్గురులో ఆమె అంత్యంత అధిక విద్యావంతురాలు. ఆమె ఎల్‌ఎల్‌బి కలకత్తా విశ్వవిద్యాలయము నుండి పూర్తిచేసినది. ఆమె  బెంగాల్ కు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు అబ్దుల్ ఘని ఖాన్ చౌదరి కుటుంబం నుండి వచ్చినది. తబసుమ్ (39స.లు)10వ తరగతి, కైసర్ జహాన్(35 స. లు ) 8వ తరగతి వరకు చదివిరి.
          ఇంతవరకు ఏర్పడిన 15 లోక్ సభలలో ముస్లిం స్త్రీ సబ్యుల సంఖ్య 3 సార్లు మాత్రమే 3కు చేరింది. విచారకరమైన విషయం ఏమిటంటే ముస్లిం మహిళా లోక్ సభ సబ్యుల సంఖ్య ఎప్పుడు 3 కు మించలేదు.
6,8,15 వ లోక్ సభ లలో ముస్లిం మహిళా లోక్ సభ సబ్యుల సంఖ్య అత్యధికంగా 3 మాత్రమే.
1,4,5,9,10,12 లోక్ సభలలో అసలు ముస్లిం  మహిళా లోక్ సభ సబ్యులే లేరు.
2,3,7 లోక్ సభలలో ఇరువురు చొప్పున ముస్లిం మహిళా సబ్యులు ఎన్నికైనారు.
11,13,14 లోక్ సభలలో  ఒకరు చొప్పున  ముస్లిం మహిళా సబ్యులు ఎన్నికైనారు
ఇంతవరకు ఏర్పడిన 15 లోక్ సభ లలో మహిళా సబ్యుల సంఖ్య 549 కాగా అందులో ముస్లిం మహిళా సభ్యుల సంఖ్య 18 మాత్రమే.  
ప్రస్తుత రాజ్య సభలో ఒక నామినటెడ్ సబ్యునితో సహ20 మండి ముస్లిం సబ్యులు కలరు.వీరిలో యూ‌పి నుంచి 4+1నామినటెడ్ సబ్యుడు,బిహార్ నుంచ్2,మహారాస్త్ర నుంచి2,అస్సామ్ నుంచి 1,జమ్ము-కాశ్మీర్ నుంచి 3,రాజస్తాన్ నుంచి1,డిల్లీ నుంచి 1, మద్య ప్రదేశ్ నుంచి 1.వెస్ట్ బెంగాల్ నుంచి 1,తమిళనాడు నుంచి 1, ఆంద్రప్రదేశ్ నుంచి 1, ఛత్తీస్గర్ నుంచి 1 మొత్తం 20 మంది కలరు.
పార్టీ ల వారీగా ఇండిపెండెంట్ ఒకరు, నామినేటెడ్ సబ్యుడు ఒకరు, కాంగ్రెస్స్ నుంచి 7, జే‌డి(యూ) నుంచి 2, బి‌ఎస్‌పి నుంచి 3, బి‌జే‌పి నుంచి 1, డి‌ఎం‌కే నుంచి 1, ఎస్‌పి నుంచి 1, తృణమూల్ కాంగ్రెస్స్ నుంచి 1,ఎన్‌సి‌పి నుంచి ఒకరు, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఒకరు ఎన్నికైనారు.
వీరిలో నుంచి  పురుషులు 17 మంది కాగా ముగ్గురు మాత్రమే ముస్లిం మహిళా సభ్యులు, వీరు   మోహిషినా కిద్వాయి (కాంగ్రెస్-ఐ)న నజ్నీన్ ఫారూఖ్ (కాంగ్-ఐ)  హెజ్మా నఫ్తుల్ల బి.జే.పి. కు చెందినవారు.రాజ్య సభ ఎక్స్-అఫ్ఫిషియో ఛైర్మన్ గా ఉపరాష్ట్ర పతి శ్రీ హమీదుల్ అన్సారీ వ్యవహరించును. 
ప్రభుత్వ వెబ్ సైట్స్ అంధించిన వివరాల ప్రకారము అందరూ ముస్లిం లోక్ సభ సబ్యులు తమకు కేటాయించిన ఎం‌పి‌ఎల్‌ఏ‌డి (ఎంపీలాడ్) నిధులు పూర్తిగా ఖర్చు చేయలేదు. యూ‌పి కు చెందిన షఫికూర్ రహ్మాన్ మాత్రం తమ నిధులను పూర్తిగా ఖర్చు పెట్టిరి.. 16 మండి ముస్లిం లోక్ సభ సబ్యులు తమకు ఒక్కకరికి వ్యక్తిగతం గా   కేటాయించిన 12 కోట్ల నిధులలో 4-7 కోట్ల వరకు నిధులను ఖర్చు చేయలేదు. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 




 

 

 

 




2009-14 మద్యకాలం లో 15 వ లోక్ సభ విధి నిర్వహణ తీరుతెన్నులు


:

2009-14 సంవత్సరాల మద్య కాలం లో 15వ లోక సభ తన పదవి కాలాన్ని  ప్రధాన విధి ఐన బిల్లుల ఆమోదం కన్నాతరచూ సభ కార్యక్రమాలకు అంతరాయం కలగటం తోనే ముగించినది.15వ  లోక్ సభ విధినిర్వహణకు అంతరాయం కలిగించిన అంశాలలో 2జి స్కామ్,బొగ్గు క్షేత్రాల కేటాయింపు, రిటైల్ రంగంలో ఎఫ్‌డి‌ఐ లకు అనుమతి,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్, కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం మొదలగు నవి ముఖ్యమైనవి. 15వ లోక్ సభ, మునుపటి  లోక్ సభలు ఆమోదించిన బిల్లులకన్నా తక్కువ బిల్లులను ఆమోదించినప్పటికి ఆమోదించిన బిల్లులలో విద్యా హక్కు (ఆర్‌ఈ‌ఏ)భూ సేకరణ ,ఆహార భద్రత, కంపనీబిల్లు  మరియు సివిల్ లియాబిలిటీ ఫర్ న్యూక్లియర్ డామేజ్ బిల్లులు ముఖ్యమైనవిగా చెప్పవచ్చును.

2009-14 మద్యకాలం లో  15 వ లోక్ సభ 
విధి నిర్వ
హణ -తీరుతెన్నులు- ఒక విశ్లేషణ

Ø  గత 5సంవత్సరాల కాలం లో (2009-14) 15వ లోక్ సభ ఉత్పాదకత 61% గా ఉంది. ఇది లోక్ సభ గత 50సంవత్సరాల చరిత్రలో అత్యంత కనిష్టం. 13వ లోక్ సభ 91% ఉత్పాదకతను, 14 వ లోక్ సభ 87% ఉత్పాదకతను కలిగి ఉంది.
Ø  15వ లోక్ సభ తన నిర్ధారిత 356 సిట్టింగ్స్ లో 345 సిట్టింగ్స్ పూర్తి చేసింది
Ø  2009 బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్ సభ 162 గంటలు పనిచేసింది నిర్ధారిత సమయం కన్నా 4 గంటలు అదనంగా పనిచేసినది.
Ø  మొత్తం 15వ  లోక్ సభ  నిర్ధారిత 2070 పని గంటలలో 1330.9 గంటల ఉత్పాదక పనిగంటల పని  జరిగినది. కొన్ని సమావేశాలు తుడుచిపెట్టుకొని పోయినాయి.2010 శీతాకాల సమావేశాలలో నిర్ధారిత 138 గంటలలో 7.62గంటల ఉత్పాదక పని జరిగింది. 2012 వర్షా కాల సమావేశాలలో 21%, 2013 బుడ్జెట్ సమావేశాలలో 49% ఉత్పాదక పని జరిగింది.
Ø  15వ లోక్ సభ కాలం లో రాజ్య సభ 67% ఉత్పాదకతను సాదించినది. రాజ్య సభ నిర్ధారిత 1785 గంటలలో 1198.38 గంటలు ఉత్పాదక పని జరిగింది.  2010రాజ్య సభ శీతాకాల సమావేశాలలో కేవలం 2% ఉత్పాదక పని జరిగింది
Ø  15 వ లోక్ సభ మొదటి 5 సమావేశాలు సగటున 81% విధులను  నిర్వహించగా, 2010 శీతాకాల సమావేశాల తరువాత(2జి స్పెక్ట్రమ్ పై జే‌పి‌సి కమిటీని వేయమని)  సగటున 52% మాత్రమే విధులను  నిర్వహించినది. రాజ్య సభ 55% విధులను  నిర్వహించినది.
Ø  మొత్తం మీద  తనకు నిర్దేశించిన నిర్ణీత సమయం లో తరచూ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ కు అంతరాయం కలుగుట వలన లోక్ సభ 61%, రాజ్య సభ 67% తమ విధి నిర్వహణ ను పూర్తి చేసినాయి.
Ø  15వ లోక్ సభ (2009-14) తన  ఐదు సంవత్సరాల పదవి కాలం లో తన ముందుకు వచ్చిన 328 బిల్లులలో 179 బిల్లులను చర్చించి ఆమోదించినది. ఐదు సంవత్సరాల పదవీకాలం లో మిగతా లోక్ సభలు ఆమోదించినదాని కన్నా ఇది చాలా తక్కువ. 13వ లోక్ సభ 297 బిల్లులను, 14వ లోక్ సభ 248 బిల్లులను ఆమోదించినవి.
Ø  15 వ లోక్ సభ ముందుకు వచ్చిన 228 సాధారణ బిల్లులలో, చర్చ జరగనందున 68 బిల్లులు మురిగి పోయినాయి వాటిలో మహిళా రిజర్వేషన్ బిల్లు, డైరెక్ట్ టాక్స్ కోడ్,మైక్రో ఫీనాన్స్ బిల్లు ముఖ్యమైనవి.
Ø  15వ లోక సభ 2010 శీతాకాల సమావేశాలలో  కనిష్టం గా 11.2%,2011 శీతాకాల సమావేశాలలో గరిష్టం గా 39.53% శాసనాల రూపొందనకు ఖర్చు చేయడం జరిగింది.
Ø  ఆర్ధిక బిల్లులపై 81.35% నిర్ధారిత సమయం ఖర్చు చేయడం జరిగింది. 

Ø  15 వ లోక్ సభ వచ్చే నాటికి 37 పెండింగ్ బిల్లులు ఉండగా, రేపు వచ్చే 16 వ లోక్ సభముందు 60 పెండింగ్ బిల్లులు ఉండబోతున్నాయి. .
Ø  15 వ లోక్ సభ 116 సాధారణ బిల్లులను ఆమోదించినపటికి వాటిలో అధిక శాతం బిల్లులు తగినంత చర్చ లెకుండానే ఆమోదించడం జరిగింధి.15 వలోక సభ ఆమోదించిన బిల్లులలో 36% బిల్లులను అరగంట లోపునే చర్చించడం ఆమోదించడం జరిగింది. వీటిలో 20 బిల్లు ఐదు నిమిషాల లోపునే చర్చించడం  ఆమోదించడము  జరిగింది.
Ø  15వ లోక్ సభ కాలం లో రాజ్య సభ లో ఆమోదించిన మొత్తం బిల్లులలో 38% బిల్లులను  రెండు గంటలకన్న  అధిక సమయం లో  చర్చించి ఆమోదించడం, కొన్ని బిల్లులను అనగా 7 బిల్లులను 5నిమిషాలలోపు చర్చించడం జరిగింది
Ø  15 వ లోక్ సభ పదవి కాలం ముగిసే నాటికి రాజ్య సభ లో పెండింగ్ లో 60 బిల్లు లలో జుడీషియల్ అప్పాయింట్మెంట్ కమిషన్ బిల్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్(అమెండ్మెంట్) బిల్, రియల్ ఎస్టేట్ బిల్, ప్రేవేన్షన్ ఆఫ్ కరప్షన్ (అమెండ్మెంట్)బిల్ ముఖ్య మైనవి
Ø  15వ లోక్ సభ లో క్వశ్చన్ ఆవర్ సమయం  అంతరాయాల  వలన బాగా నష్ట పోయినది. లోక్ సభ ప్రారంభము  లో మొదటి గంట ను క్వశ్చన్ అవర్ అందురు.సాధారణం గా  క్వశ్చన్ ఆవర్ సమయం లో పార్లమెంట్ సబ్యుల ప్రశ్నలకు మంత్రులు మౌఖికం గా సమాధానాలు ఇస్తారు.
Ø  చాలా సందర్భాలలో ను క్వశ్చన్ అవర్ కు కేటాయించిన దానిలో 1% కూడా పని జరగలేదు. 2010 శీతాకాల సమావేశాలలో క్వశ్చన్ అవర్ కు కేటాయించిన దానిలో 0.78%సమయంలో    మరియు 2012 వర్షాకాల సమావేశాలలో 1.23%సమయం లో    ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది. 2009 బుడ్జెట్ సమావేశాలలో క్వశ్చన్ అవర్ కు కేటాయించిన దానిలో 19.75% సమయం లో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది.   
Ø  మొత్తం లోక్ సభలో 61%, రాజ్య సభ లో 59%  క్వశ్చన్ ఆవర్ సమయం నష్టపోయినది.
Ø  15 వ లోక్ సభలో మొత్తం 6479 పశ్నలకు మంత్రుల నుంచి మౌఖికం గా సమాధానాలు ,రాజ్య సభ లో 6512 ప్రశ్నలకు మంత్రుల నుంచి మౌఖికం గా సమాధానాలు రావలసి ఉంది. కానీ వీటిలో లోక్ సభలో 10% ప్రశ్నలకు, రాజ్య సభ లో 12% ప్రశ్నలకు మౌఖిక సమాధానాలు లబించినవి.
Ø  15వ లోక్ సభ మూడు సమావేశాల కాలం లో రాజ్య సభ లో ఏ మౌఖిక ప్రశ్నకు సమాధానం లబించలేదు.
Ø  గత కొద్ది కాలం గా పార్లమెంట్ బడ్జెట్ ప్రస్తావనలపై చర్చ  తక్కువ సమయం జరుగుతుంది, 15వ లోక్ సభ లో అనేక సార్లు ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్ధిక ప్రతిపాదనలపై చర్చ, పరిశీలన జరగకుండానే ఆమోదించడం జరుగుతుంది. క్రిందటి 5 సంవత్సరాలలో మొత్తం ఉత్పాదక సమయంలో  బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చ కు 29% లబించినది. .
Ø  2014 ఇంటీరియమ్ బడ్జెట్ ను చర్చ జరపకుండానే ఆమోదించటం జరిగింది.
Ø  2013 లో ఫీనాన్స్ బిల్లు, 16.6 లక్షల కోట్ల గ్రాంట్ల డిమాండ్ల  పై చర్చ జరపకుండానే వోటింగ్ జరపటం ఆమోదించడం జరిగింది.
Ø  2011 లో 81% మరియు 2012 లో92% మొత్తం డిమాండ్ల పై చర్చ జరపకుండానే వోటింగ్ జరపటం జరిగింది.
Ø  15 వ లోక్ సభ కాల పరిమితిలో 2011 లో బడ్జెట్ ను,గ్రాంట్ల డిమందులను వివిధ మంత్రిత్వ శాఖల  స్టాండింగ్ కమిటీల పరిశీలనకు పంపకుండానే ఆమోదించడం  జరిగింది.







.