31 October 2022

యెమెన్‌ రాణి సయ్యిదా హుర్రా అర్వా అల్-సులేహి (1067–1138) “ది లిటిల్ క్వీన్ ఆఫ్ షెబా” The Queen of Yemen(1067–1138) Sayyida Hurra Arwa al-Sulayhi: “The Little Queen of Sheba”

 



సంక్షిప్తంగా:

సయ్యదా హుర్రా అర్వా ఆఫ్ యెమెన్: "ది లిటిల్ క్వీన్ ఆఫ్ షెబా"

యెమెన్‌లోని ఇస్మాయిలీ సులేహిద్ రాజవంశం (పదకొండవ-పన్నెండవ శతాబ్దం) సభ్యురాలు  సయ్యిదా హుర్రా క్వీన్ అర్వా ఒక ప్రత్యేకమైన ముస్లిం మహిళా నాయకురాలు: క్వీన్ అర్వా రాజకీయ మరియు ఆధ్యాత్మిక అధికారాలను ఏకకాలంలో కలిగి ఉంది. క్వీన్ అర్వా మొదట తన భర్త సహకారంతో రాణి గా, తర్వాత తన కుమారునికి రాజప్రతినిధిగా, చివరకు 1138లో మరణించే వరకు స్వంత సార్వభౌమాధికారురాలిగా యెమెన్‌ను పరిపాలించింది.

కైరో లోని ఫాతిమిద్ ఖలీఫా తో సమన్వయము కలిగి క్వీన్ అర్వా యెమెన్‌లో పరిపాలనా స్వాతంత్ర్యం మరియు స్వయంప్రతిపత్తి కలిగి ఉంది. క్వీన్ అర్వా యెమెన్ లో తయ్యిబి ఇస్మాయిలీ సంఘం స్థాపించింది.

క్వీన్ అర్వా తన ప్రజలకు న్యాయం మరియు స్థిరత్వాన్ని అందజేస్తూ, శక్తివంతమైన మరియు పోటీతత్వం గల యెమెన్ గిరిజన నాయకులను అదుపులో ఉంచుకోగలిగింది. ఇమామ్-ఖలీఫ్ అల్-ముస్తాన్సీర్ అర్వా రాణిని మత నాయకుడిగా, హుజ్జాగా ఉన్నతీకరించారు. అర్వా రాణి సార్వభౌమాధికారం కింద యెమెన్ అభివృద్దిని సాధించినది మరియు క్వీన్  అర్వా "అపారమైన ప్రజాదరణ పొందింది".


 విస్తారం గా:

 "నిరాశ చెందకు, నీ శత్రువుకు తెలిస్తే  సంతోషించును." యెమెన్ సామెత

చరిత్రలో, మహిళలు అధికారంలో ఉన్న కొన్ని సందర్భాలు ఉన్నాయి. చాలా సందర్భాలలో మహిళలకు అధికారం వారసత్వంగా లేదా  అనుభవం కారణంగా వచ్చును. యెమెన్ చరిత్రలో ఎక్కువ కాలం పాలించిన అర్వా అల్-సులేహి యెమెన్ యొక్క ఏకైక పాలకురాలుగా నియమించబడటానికి వారసత్వం లేదా  అనుభవం రెండూ  కారణాలే. అర్వా అల్-సులేహి పాలనకు ముందు యెమెన్ చరిత్ర గందరగోళం మరియు అశాంతి లో ఉంది. అర్వా అల్-సులేహి రాజవంశం క్రింద యెమెన్ శాంతి మరియు సొభాగ్యంతో ఉంది.

1047లో అలీ ఇబ్న్ ముహమ్మద్ అల్-సులేహిచే స్థాపించబడిన అరబ్ రాజవంశం సులేహిద్ రాజవంశము. చారిత్రాత్మకమైన యెమెన్‌లో అత్యధిక భాగాన్ని సులేహిద్ రాజవంశము పాలించింది. సులేహిద్ రాజవంశం యెమెన్‌కు శాంతిని మరియు సౌభాగ్యాన్ని తెచ్చింది.

సులేహిద్‌లు. బను సలౌహ్ Banu Salouh యొక్క అరబ్ యెమెన్ తెగకు చెందినవారు, సులేహిద్‌లు, అల్-హజూర్ తెగ, వారి నుండి హషీద్ తెగ, వారి నుండి హమ్దానిద్‌ తెగ నుండి వచ్చారు.

ఫాతిమిడ్ కాలిఫేట్ స్థాపించబడటానికి ముప్పై సంవత్సరాల ముందు యెమెన్‌లో మత ప్రచారకుల ద్వారా సులేహిద్‌ రాజవంశం యొక్క పెరుగుదల ప్రారంభించబడింది.. సున్నీ బను సలౌహ్ అరబ్ యెమెన్ తెగ నాయకుని కుమారుడు అలీ బిన్ ముహమ్మద్ అస్-సులేహి, ఫాతిమిడ్స్‌తో కలిసిపోయాడు.

1046లో, అలీ బిన్ ముహమ్మద్ అస్-సులేహి ఖలీఫాగా నియమించబడ్డాడు. ఒక సంవత్సరం తరువాత, అలీ బిన్ ముహమ్మద్ అస్-సులేహి హరాజ్‌ Haraz ప్రాంతం లో సాయుధ బలగాలను సేకరించి సులైహిద్ రాజవంశాన్ని స్థాపించాడు. తరువాతి సంవత్సరాల్లో, అలీ బిన్ ముహమ్మద్ అస్-సులేహి పాలన క్రిందకు యెమెన్ మొత్తo వచ్చింది.

1060లో తిహామాన్ లోతట్టులోని నజాహిద్‌ల పాలకుడు విషప్రయోగం చేయబడ్డాడు మరియు అతని రాజధాని జాబిద్‌ను సులేహిద్‌లు స్వాధీనం చేసుకున్నారు. మొదటి సులేహిద్ పాలకుడు 1062లో మొత్తం యెమెన్‌ను జయించాడు మరియు హెజాజ్‌ Hejaz ను ఆక్రమించడానికి ఉత్తరం వైపు వెళ్లాడు. కొంత కాలానికి, సులేహిద్‌లు మక్కా అమీర్‌లను కుడా  నియమించారు.

జైదియాకు వ్యతిరేకంగా పోరాటాన్ని విజయవంతంగా ముగించిన తర్వాత 1063 నుండి అలీ బిన్ ముహమ్మద్ అస్-సులేహి,  సనాను కూడా జయించాడు.అలీ బిన్ ముహమ్మద్ అస్-సులేహి రాజ్యానికి రాజధానిగా సనా చేయబడింది.

అలీ బిన్ ముహమ్మద్ అస్-సులేహి మరణించిన తరువాత, అతని కుమారుడు అల్-ముకర్రమ్ అహ్మద్ సింహాసనాన్ని అధిష్టించాడు. ప్రారంభం లో అల్-ముకర్రమ్ అహ్మద్ పాలన సంతృప్తికరంగా లేదు మరియు సులేహిద్‌లచే నియంత్రించబడిన ప్రాంతం తీవ్రంగా తగ్గిపోయింది.  సనా ప్రాంతానికి పరిమితమైనది.

కొన్ని సంవత్సరాల తర్వాత, అల్-ముకర్రమ్ అహ్మద్,  నజాహిద్‌లచే బంధించబడిన తన తల్లి అస్మా బింట్ షిహాబ్‌ను రక్షించి, సులేహిద్ సైన్యాలు పోగొట్టుకొన్న  చాలా భూభాగాన్ని తిరిగి పొందాయి. తిహామాలో నజాహిద్‌లు తన అధికారానికి దూరంగా ఉండకుండా అల్-ముకర్రమ్ అహ్మద్ నిరోధించలేకపోయాడు అయితే సులేహిద్‌లు యెమెన్‌లో అత్యంత శక్తివంతమైన పాలకులు గా మిగిలిపోయారు.

ఏడెన్‌లో, మరొక రాజవంశం అయిన జురాయిద్‌లు 1083లో అధికారంలోకి వచ్చారు. అల్-ముకర్రమ్ అహ్మద్ పాలన 1086లో ముగిసింది మరియు  ముకర్రమ్ అహ్మద్ భార్య రాణి అర్వా పాలన ప్రారంభం అయినది. అర్వా రాణి పరిపాలన ప్రారంభ సంవత్సరాలలో ముకర్రమ్ అహ్మద్ వెనుక నుండి కొంత ప్రభావాన్ని చూపి ఉండవచ్చు. ముకర్రమ్ అహ్మద్ 1091లో అష్యా కోటలో మరణించాడు. 

క్వీన్ అర్వా:

సులేహిద్ రాజవంశం యొక్క పాలకులలో క్వీన్ అర్వా చివరిది. క్వీన్ అర్వా ను “అల్-మాలికా అల్-హుర్రా” అని పిలుస్తారు. మహిళా సార్వభౌమాధికారిగా, అర్వాకు యెమన్  చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది: అంతర్జాతీయ ముస్లిం ప్రపంచంలో మహిళా చక్రవర్తులు ఉన్నప్పటికీ, ముస్లిం అరబ్ ప్రపంచంలో ఏకైక మహిళా చక్రవర్తులు అర్వా మరియు అస్మా, రాచరిక హోదా, మసీదులలో వారి పేరు తో  ఖుత్బా ప్రకటించబడింది. అర్వా  అనేక మసీదులను స్థాపించింది, వాటిలో ప్రముఖమైనది క్వీన్ అర్వా మసీదు.

అర్వా హరాజ్‌లో జన్మించినది. అర్వా అప్పటి యెమెన్ పాలకుడు అలీ అల్-సులైహికి మేనకోడలు. చిన్న వయస్సులోనే అనాథ అయిన అర్వా సనాలోని రాచరిక ప్యాలెస్‌లో అత్త,  అస్మా బింట్ షిహాబ్, ఆధ్వర్యంలో పెరిగారు,

1066లో, 17 సంవత్సరాల వయస్సులో, అర్వా తన బంధువైన అహ్మద్ అల్-ముకర్రం బిన్ అలీ బిన్ ముహమ్మద్ అల్ సులైహిని ఏడెన్ నగరాన్ని మహర్‌గా పొంది వివాహం చేసుకుంది మరియు రాజమాత అస్మా,  అర్వా అత్తగా మారింది.

అలీ అల్-సులైహి మరణం తర్వాత అర్వా తన అత్తగారు అస్మా మరియు తన భర్త అల్-ముకర్రమ్ అహ్మద్ కు పాలన లో సహాయం చేసింది. అర్వా, ధైర్యవంతురాలు, దార్మికురాలు, స్వతంత్ర స్వభావాన్ని కలిగి ఉండేదని చరిత్రకారులు చెబుతారు.

అర్వా గొప్ప జ్ఞాపకశక్తిని కలిగి పద్యాలు, కథలు మరియు చారిత్రక సంఘటనల వివరాలను బాగా నేర్చుకుంది. దివ్య  ఖురాన్ మరియు హదీసు శాస్త్రాలలో అర్వాకు చాలా అవగాహన ఉంది. అరబ్ చరిత్రకారులు అర్వాను చాలా అందమైనదని  పేర్కొన్నారు.

సయ్యద్ అలీ అల్-సులైహి మరణం తరువాత, అర్వా భర్త అల్-ముకర్రమ్ అహ్మద్ యెమెన్‌కు పాలకుడు అయ్యాడు, కానీ పక్షవాతం కు గురి అయి  మంచాన పడి పాలించలేకపోయాడు. అల్-ముకర్రమ్ అహ్మద్ తన పాలన అధికారాన్ని అర్వాకు ఇచ్చాడు మరియు ఖుత్బాలో అర్వా పేరు, ఫాతిమిడ్ ఖలీఫ్ అల్-ముస్తాన్సీర్ బిల్లా పేరు తరువాత ప్రస్తావించబడినది.

అర్వా అత్తగారు రాజమాత అస్మా బింట్ షిహాబ్ చనిపోయేవరకు  అర్వా, అస్మా బింట్ షిహాబ్  తో బాటు కో-రెజెంట్‌గా పరిపాలించింది. రాజ్య పాలన లో అస్మా బింట్ షిహాబ్  కు బిన్నంగా అర్వా ప్రవర్తిoచినట్లు బహిర్గతం కాలేదు.

జబిద్‌లోని నజాహిద్ పాలకుడు సైద్ ఇబ్న్ నజర్‌ను ఎదుర్కోవడానికి సనా నుండి జిబ్లాకు రాజధానిని మార్చడం రాణి  అర్వా మొదటి చర్యల్లో ఒకటి. అర్వా జిబ్లా వద్ద ఒక కొత్త రాజభవనాన్ని నిర్మించింది మరియు పాత ప్యాలెస్‌ను గొప్ప మసీదుగా మార్చింది, అక్కడ అర్వా చివరికి ఖననం చేయబడింది.

అహ్మద్ అల్-ముకర్రమ్ మరణం తర్వాత, సయ్యదా అర్వాను సబా ఇబ్న్ అహ్మద్‌ను వివాహం చేసుకోoది. అధికారంలో ఉండటానికి అర్వా అయిష్టంగానే ఇలా చేసింది. సబా చనిపోయే వరకు అర్వా, సబా తో కలసి  యెమెన్‌ను పాలించింది. అప్పటి నుండి అర్వా ఒంటరిగా పరిపాలించింది

 సనాలో, అర్వా గ్రాండ్ మసీదును విస్తరించింది మరియు నగరం నుండి సమర్రాకు రహదారి మెరుగుపడింది. జిబ్లాలో, క్వీన్ అర్వా కొత్త ప్యాలెస్ భవనం మరియు పేరుగల క్వీన్ అర్వా మసీదును నిర్మించింది. క్వీన్ అర్వా తన రాజ్యం అంతటా అనేక పాఠశాలలను నిర్మించి ప్రసిద్ది చెందింది. ఆర్వా వ్యవసాయo పట్ల  ఆసక్తి చూపుతూ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచారు.

1138లో అర్వా మరణించినది  జి జిబ్లా వద్ద అర్వా నిర్మించిన మసీదు వద్ద  ఖననం చేయబడినది. అర్వా పాలన ప్రజల పట్ల శ్రద్ధ మరియు కరుణను చూపించే ఒక ఉదాహరణగా నిలిచింది.

 

30 October 2022

అబ్బాసిద్ (బాగ్దాద్) యొక్క ఇద్దరు రాణులు: హరున్ అల్-రషీద్ తల్లి మరియు భార్య-ఖైజురాన్ & జుబైదా Two Queens of Abbasid (Baghdad): Mother and Wife of Harun al-Rashid- Khayzuran & Zubayda

 

అల్-ఖైజురాన్(?-789):

ఖైజురాన్ ఎనిమిదవ శతాబ్దం మధ్యలో అరేబియా ద్వీపకల్పంలోని నైరుతి భాగంలో జన్మించినది. ప్రవక్త ముహమ్మద్(స) మరణించిన 100 సంవత్సరాల తర్వాత, ఖైజురాన్ చిన్నతనంలోనే బానిస వ్యాపారులచే కిడ్నాప్ చేయబడి, 758 మరియు 765 మధ్య, మక్కాలో బాగ్దాద్ స్థాపకుడు అబ్బాసిద్ ఖలీఫ్ అల్-మన్సూర్‌కు విక్రయించబడినది. ఖైజురాన్ ను అల్-మన్సూర్‌ తన కుమారుడు మరియు వారసుడు అల్-మహ్దీకి ఇచ్చాడు.

అల్-మహ్దీ,  ఖైజురాన్ కి ఒక కుమార్తె మరియు ఇద్దరు కుమారులను కలిగారు. కుమారులు  ఇద్దరు ఖలీఫాలు అయ్యారు. వారిలో ఒకరు  ప్రఖ్యాత ఖలీఫా హరున్ అల్-రషీద్.

789లో ఖైజురాన్ మరణించే సమయానికి, ఆమె వార్షిక ఆదాయం 160 మిలియన్ దిర్హామ్‌లు.  ఇది అబ్బాసిద్ సామ్రాజ్య మొత్తం ఆదాయంలో దాదాపు సగం అని 10వ శతాబ్దపు చరిత్రకారుడు అల్-మసూది తెలిపారు. ఖైజురాన్ తన కాలంలోని ముస్లిం ప్రపంచంలో అత్యంత ధనవంతురాలు  అని చరిత్రకారిణి నబియా అబాట్ పేర్కొన్నారు.  

ఖైజురాన్ యొక్క రాజకీయ అధికార ప్రస్థానం రాచరిక హరామ్ లేదా మహిళల క్వార్టర్స్ ద్వారా జరిగింది. అల్-మహ్దీ యొక్క మొదటి భార్య మరియు బంధువు అయిన రీటా అబ్బాసిద్ సామ్రాజ్య స్థాపకుడు అబు అబ్బాస్ అబ్దుల్లా యొక్క కుమార్తె.

అల్ తబరి యొక్క రచన  ప్రవక్తలు మరియు రాజుల చరిత్ర History of the Prophets and Kings లో 775లో అల్ మహ్ది బానిస అమ్మాయి ఖైజురాన్ ను వివాహం చేసుకొన్నాడు అని పేర్కొన్నాడు.  ఖలీఫాలు కులీన వంశ స్త్రీలను  వివాహం చేసుకోనే  సమయంలో, ఖైజురాన్‌ రాణిగా ఎదగడం సంప్రదాయానికి ఒక సాహసోపేతమైన విరామంఅని ఆధునిక చరిత్రకారుడు హ్యూ కెన్నెడీ అన్నాడు.

అబ్బాసిడ్ కోర్టులోని ఉన్నత కులీన వంశం లో జన్మించిన స్త్రీలు ఖైజురాన్ ఉనికిని  వెక్కిరించిన  ఖైజురాన్ దానిని దయతో స్వీకరించినది. రీటా మరియు ఖైజురాన్ మధ్య ప్రత్యక్ష ఉద్రిక్తతకు చారిత్రిక ఆధారాలు లేవు. ఖైజురాన్ కుమారులు మూస అల్-హైది మరియు హరున్ అల్-రషిద్ వారసులుగా పరిగణింప బడినారు. 

అరబిక్ లో ఖైజురాన్ అంటే “ రెల్లు” అని అర్ధం. ఖైజురాన్ రెల్లు లాగా సన్నగా, మనోహరం గా ఉండేది అని వర్ణింపబడినది.  ఖైజురాన్ తెలివైనది, స్వేచ్ఛగా కవిత్వాన్ని చెప్పేది మరియు ప్రముఖ ఇస్లామిక్  పండితుల వద్ద దివ్య ఖురాన్, హదీసులు మరియు ఫికా అధ్యయనం చేసింది.

ఖైజురాన్ హాస్యప్రియురాలు.  ఖైజురాన్ ప్రాక్టికల్ జోక్‌లను ఆస్వాదించెది మరియు అల్-మహ్దీ తో ప్రైవేట్‌గా ఖలీఫా  అల్ మన్సూర్ కోపాన్ని గురించి ఎగతాళి చేసేది.

రాజ్య పాలనా విషయానికి వస్తే, ఖైజురాన్ సమర్ధురాలు.  అల్-హదీ-ఖైజురాన్ మొదటి కుమారుడు ముసా ఖలీఫాగా  రాజ్యం ప్రారంభించిన సమయంలో, అల్-ఖైజురాన్ ముసా ను ఏ మాత్రం సంప్రదించకుండానే ముసా పై తన అధికారాన్ని చలాయించేది మరియు పాలనా విషయాలపై పూర్తి నియంత్రణను కలిగి ఉండేది అని అల్-తబరి పేర్కొన్నాడు.

కొత్త ఖలీఫా మూస అల్-హైది తన తల్లి ఆధిపత్యంను  నిరసించాడు. బహుశా తన తమ్ముడు హరున్ అల్-రషీద్ పట్ల ఖైజురాన్ కున్న చిరకాల అభిమతం పట్ల ముసా ఆగ్రహం వ్యక్తం చేసి ఉండవచ్చు. అసమ్మతి ఎక్కువ కాలం కొనసాగలేదు: మరుసటి సంవత్సరం ముసా అల్-హదీ మరణించాడు. (ఖైజురాన్ అతనికి విషప్రయోగం చేసిందని  పుకార్లు వ్యాపించాయి, కానీ వాటికి అధికారిక ఆధారం  లేదు.) హరున్ అల్-రషీద్ మొరాకో నుండి పర్షియా వరకు విస్తరించిన అబ్బాసిద్ సామ్రాజ్యానికి ఖలీఫా  అయ్యాడు మరియు అబ్బాసిద్ శకం అత్యున్నత స్థాయికి చేరుకొంది.

అల్-ఖైజురాన్ 789లో మరణించినది.

లెగసి:

అల్-ఖైజురాన్ బలమైన వ్యక్తిత్వం “వన్ థౌజండ్ అండ్ వన్ నైట్స్‌”లో ప్రధాన పాత్ర అయిన షెహెరాజాడ్‌పై కీలక ప్రభావం చూపిందని పలువురు సాహిత్య చరిత్రకారులు విశ్వసించారు. చాలా కథలు హరున్ అల్-రషీద్ మరియు అతని అద్భుతమైన రాజాస్థానం ద్వారా ప్రభావితమయ్యాయి

 

అబ్బాసిద్ చరిత్ర  ఖైజురాన్ యొక్క రాజకీయ విజయాలను వివరించలేదు, కానీ ఖైజురాన్ పేరు మీద నాణేలు ముద్రించబడినవి.  రాజభవనాలకు  ఖైజురాన్ పేరు పెట్టబడ్డాయి మరియు తరువాతి అబ్బాసిద్ పాలకుల అంత్యక్రియలు జరిగే  స్మశానవాటిక కూడా ఖైజురాన్ పేరును కలిగి ఉంది.  

 

 జుబైదా(?-831):

అల్-ఖైజురాన్ కోడలు అయిన జుబైదా, ఖలీఫా  హరున్ అల్-రషీద్‌ భార్య. 13వ శతాబ్దపు రచయిత ఇబ్న్ ఖలీఖాన్ ప్రకారం, జుబైదా తాత అల్-మన్సూర్, జుబైదా బొద్దుగా, ముద్దుగా  ఉండటం వలన జుబైదా ను "చిన్న వెన్న ముద్ద" అని పిలిచేవాడు.

చరిత్రకారుల ప్రకారం పెద్దయ్యాక, జుబైదా "దాన ధర్మాలు  పుష్కలంగా చేసేది మరియు  జుబైదా ప్రవర్తన సద్గుణమైనది". వంద మంది బానిస బాలికలు ప్రతిరోజూ జుబైదా గదిలో దివ్య ఖురాన్‌ లో  పదో వంతు పఠించేవారని మరియు జుబైదా ప్యాలెస్ దివ్య ఖురాన్‌ పఠనం తో ప్రతిధ్వనిస్తుంది" అని చరిత్రకారులు చెప్పారు.

అబ్బాసిడ్ సామ్రాజ్యం యొక్క అత్యున్నత కాలం లో జన్మించిన జుబైదా విలాసవంతమైన జీవనం గడిపేది. అల్-జుబైర్ యొక్క 11వ శతాబ్దపు గ్రంధం “బుక్ ఆఫ్ గిఫ్ట్స్ అండ్ రేరిటీస్ Book of Gifts and Rarities ప్రకారం జుబైదా ఆనాటి ధనవంతులు మరియు ప్రసిద్ధుల జీవనశైలి” గడిపేది. జుబైదా-ఖలీఫా  హరున్ అల్-రషీద్‌ వివాహ ఖర్చు 50 మిలియన్ దినార్‌లకు చేరుకుంది.

జుబైదా-ఖలీఫా  హరున్ అల్-రషీద్‌ వివాహ ఉత్సవం లో “వధువు కెంపులు మరియు ముత్యాలతో పొదిగిన జాకెట్ " ధరించినది. దాని విలువను అంచనా వేయలేము.  అతిథులు వెండి గిన్నెలలో బంగారు దీనార్లు మరియు బంగారు గిన్నెలలో వెండి దినార్లు బహుమతులు అందుకున్నారు.

"విలువైన రాళ్లతో ఎంబ్రాయిడరీ చేసిన చెప్పులు పరిచయం చేసిన మొదటి వ్యక్తి జుబైదా" అని అల్-మసూది తెలిపారు. అరబ్ చరిత్రకారుడు అల్-మసూది ప్రకారం సామ్రాజ్య అధికారిక  ఉత్సవాలలో “జుబైదా వేసుకొన్న నగలు మరియు ధరించిన దుస్తుల బరువు తో నడవడం చాలా కష్టం."గా ఉండేది మరియు జుబైదా కు సేవకులు మద్దతు ఇవ్వవలసి ఉంటుంది అని అన్నాడు.

జుబైదా ప్రజాపయోగ పనులపై అమితంగా ఖర్చు చేసేది. జుబైదా తన కాలంలోని పాలకుల కంటే మక్కా యాత్రికుల కోసం ఎక్కువ స్వచ్ఛంద కార్యక్రమాలను చేసింది.

805నాటికి  జుబైదా మక్కాకు కనీసం ఐదు తీర్థయాత్రలు చేసింది. మక్కాలో సంభవించిన  కరువు ప్రజలను నాశనం చేసిందని మరియు జంజామ్ యొక్క పవిత్రమైన బావిలో నీటిని   తగ్గించిందని జుబైదా బాధ పడినది. జుబైదా జంజామ్ బావిని లోతుగా చేయమని ఆదేశించింది మరియు మక్కా మరియు చుట్టుపక్కల ప్రాంతాల  నీటి సరఫరాను మెరుగుపరచడానికి దాదాపు 2 మిలియన్ దినార్లు ఖర్చు చేసింది. తూర్పున 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న హునైన్ స్ప్రింగ్ నుండి అక్విడెక్ట్ నిర్మాణం, అలాగే హజ్‌ యాత్ర లోని ఆచార ప్రదేశాలలో ఒకటైన అరాఫత్ మైదానంలో ప్రసిద్ధి చెందిన "జుబైదా వసంతం“Spring of Zubayda” " కూడా జుబైదా నిర్మించినది. చరిత్రకారుడు ఇబ్న్ ఖలీఖాన్ ప్రకారం సాంకేతిక ఇబ్బందులు, ఖర్చు  పట్టించుకోకుండా  పనిని నిర్వహించాలని జుబైదా ఇంజినీర్లకు ఆదేశాలు ఇచ్చేది.

బాగ్దాద్‌కు దక్షిణంగా ఉన్న కుఫా నుండి మక్కా వరకు 1,500-కిలోమీటర్ల దర్బ్ (రహదారి) నిర్మాణం, మార్గమద్యలో  లో నీటి వసతి మరియు కొండపై రాత్రిపూట ప్రయాణికులకు మార్గనిర్దేశం చేసే బీకాన్‌లు నిర్ణిత వ్యవధిలో జుబైదా పూర్తిచేసింది.

చరిత్రకారుడు అల్-అజ్రాకీ, "మక్కా ప్రజలు మరియు యాత్రికులు తమ జీవితంలో దేవుని పక్కన ఉన్న [జుబైదా]కి రుణపడి ఉంటారని" ప్రకటించారు మరియు "దేవుడు జుబైదాను ఆశీర్వదించుగాక " అనే యాత్రికుల కేకలు ఇప్పటికీ దర్బ్ జుబైదా అని పిలువబడే మార్గంలో తరతరాలుగా ప్రతిధ్వనించాయి. (యాత్రికులు ఒంటెల మీదుగా రైలు, ఆటో మరియు విమాన ప్రయాణాలను ఎంచుకున్నప్పుడు ఇది నిరుపయోగంగా మారింది.)

813లో జుబైదా తన సొంత కొడుకు ఖలీఫా అల్-అమీన్ అవినీతికి పాల్పడినప్పుడు అతని స్థానం లో తన సవతి కొడుకు అల్-మామున్  ను  ఖలీఫా చేయడాన్ని ఆమోదించడం ద్వారా తన సొంత మాంసం మరియు రక్తం కంటే సామ్రాజ్య ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యతనిచ్చింది.

విద్యా,సంస్కారవంతుడైన అల్-మామున్ బాగ్దాద్ యొక్క ప్రఖ్యాత బైత్ అల్-హిక్మా bayt al-hikma (house of wisdom) (వివేకం యొక్క ఇల్లు)ని స్థాపించి అత్యంత వివేకవంతమైన పాలకుడిగా ప్రసిద్ది చెందాడు.

బైత్ అల్-హిక్మా అరబిక్ భాషలోకి గ్రీకు, రోమన్ మరియు ఇతర శాస్త్రీయ గ్రంథాల అనువాదానికి కేంద్రంగా మారింది. అనువాద గ్రీకు, రోమన్ మరియు ఇతర శాస్త్రీయ గ్రంథాలు అబ్బాసిడ్ సామ్రాజ్య మేధో వాతావరణాన్ని తెలియజేయడమే కాకుండా, తరువాత యూరోపియన్ పునరుజ్జీవనానికి పునాదులుగా మారాయి.

జుబైదా 831లో మరణించినది.

జుబైదా అబ్బాసిద్ యుగ చరిత్ర మరియు సాహిత్యం రెండింటిలోనూ ప్రభావవంతమైన మహిళగా కీర్తి గడించినది. హరున్ అల్-రషీద్, ఆల్ఫ్ లైలా వా లైలా (1001 రాత్రులు) alf layla wa layla (1001 Nights) యొక్క యూరోపియన్ సేకరణలో ప్రధాన పాత్రధారి ఖలీఫా  అయ్యాడు మరియు జుబైదా కల్పిత షెహెరాజాడేకి నిజ జీవిత ఆధారం అయినది.

29 October 2022

రోక్సెలానా 1505-1558 ఒట్టోమన్ చక్రవర్తి సులేమాన్ ది మాగ్నిఫిసెంట్ భార్య Roxelana wife of Süleyman the Magnificent

 


రోక్సెలానా లేదా  రోక్సోలానా ను హుర్రెమ్ హసేకి సుల్తాన్ అని కూడా పిలుస్తారు. రోక్సెలానా,అసలు పేరు  అలెగ్జాండ్రా లిసోవ్స్కా Aleksandra Lisovska. 1505లో  రోహటిన్, పోలాండ్ ప్రస్తుత ఉక్రెయిన్‌లో జన్మించారు. రోక్సెలానా ఏప్రిల్ 1558లో ఇస్తాంబుల్,  టర్కీ లో  మరణించారు.

కాన్స్టాంటినోపుల్, ఒట్టోమన్ సామ్రాజ్యం (ఇప్పుడు ఇస్తాంబుల్, టర్కీ) కి  స్లావిక్ మహిళ అయిన రోక్సెలానా బలవంతంగా ఉంపుడుగత్తెగా వచ్చింది మరియు తరువాత ఒట్టోమన్ సుల్తాన్ సులేమాన్ ది మాగ్నిఫిసెంట్ కి  భార్య అయింది. సుల్తాన్‌ సులేమాన్ పై ప్రభావం కలిగి, అంతఃపుర/ప్యాలెస్ కుట్రల  ద్వారా, రోక్సెలానా గణనీయమైన అధికారాన్ని పొందినది.

రోక్సెలానా 1505లో ప్రస్తుతం పశ్చిమ ఉక్రెయిన్‌లో ఉన్న రోహటిన్ పట్టణంలో జన్మించింది. కొందరు చరిత్రకారుల  ప్రకారం, రోక్సెలానా క్రైస్తవ పేరు అలెగ్జాండ్రా లిసోవ్స్కా. క్రిమియన్ తాతార్ యోధులు రోక్సెలానాను చిన్నతనంలో బంధించి, ఒట్టోమన్ రాజధాని కాన్స్టాంటినోపుల్ (ఇప్పుడు ఇస్తాంబుల్)కి తీసుకువెళ్లారు, అక్కడ రోక్సెలానాను బానిస మార్కెట్‌లో 1520లో సుల్తాన్‌గా మారిన సులేమాన్‌తో సంబంధం ఉన్న వ్యక్తికి విక్రయించారు. ఆతరువాత ఇస్లాం లోకి మారి  సుల్తాన్ సులేమాన్ అంతఃపురంharemలోకి ప్రవేశించినది.

రోక్సెలానా ఆహ్లాదకరమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంది (రోక్సెలానా టర్కిష్ పేరు, హుర్రెమ్, అంటే "ఆనందకరమైనది") మరియు త్వరగా అంతఃపురంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. రోక్సెలానా 1521లో తన మొదటి కుమారుడైన మెహ్మద్‌ Mehmed ను కన్నది. ఒట్టోమన్ సామ్రాజ్య ఆచారం ప్రకారం, ఒక ఉంపుడుగత్తెకు ఒక కొడుకును  మాత్రమే ఉండే అవకాశం ఉంది; ఉంపుడుగత్తె కొడుకు యుక్తవయస్సు వచ్చినప్పుడు, తల్లి మరియు కొడుకు కలిసి బయటకు పంపబడతారు. 

ఏది ఏమైనప్పటికీ, రోక్సెలానా, సుల్తాన్ సులేమాన్ తో  కనీసం నలుగురు కుమారులను కన్నది  మరియు వారు యుక్తవయస్సు వచ్చిన తర్వాత కూడా రాజధానిలోనే ఉన్నారు. కొంతకాలం తరువాత సుల్తాన్ సులేమాన్ రోక్సెలానాను చట్టబద్ధంగా వివాహం చేసుకున్నాడు, సులేమాన్ సుల్తాన్ భార్యగా/వధువుగా, రోక్సెలానా బానిసత్వం నుండి విముక్తి పొందింది.

రోక్సెలానా మరియు సుల్తాన్ సులేమాన్‌ల మధ్య సన్నిహిత సంబంధం కలదు. ఉంది. సుల్తాన్ సులేమాన్‌, రోక్సెలానా  తరచూ ఒకరికొకరు ప్రేమ కవిత్వం రాసుకునేవారు.

పోలాండ్ రాజు సిగిస్మండ్ II అగస్టస్‌Sigismund II Augustus,తో మరియు పర్షియాకు చెందిన షాహ్మాస్ప్IṬahmāsp I భార్య మరియు సోదరితో రోక్సెలానా రాజ్య పాలన విషయాలపై ఉత్తరప్రత్యుత్తరాలు చేసేది. 

రోక్సెలానా విజయాలతో అసూయ చెందిన ఆమె ప్రత్యర్ధులు రోక్సెలానాను  ఒక మంత్రగత్తె అని భావించేవారు. సుల్తాన్‌పై తన ప్రభావాన్ని పెంచుకోవడానికి 1536లో సుల్తాన్ గ్రాండ్ విజియర్ (ముఖ్యమంత్రి) ఇబ్రహీం పాసా హత్యకు పథకం వేసిన స్కీమర్‌గా కూడా రోక్సెలానా పిలవబడింది.

రోక్సెలానా తన అంతఃపురాన్ని ఓల్డ్ సెరాగ్లియో (ఎస్కి సారే) నుండి టాప్‌కాపిTopkapı Palace ప్యాలెస్‌కి తరలించినది. టాప్‌కాపిTopkapı Palace ప్యాలెస్‌ లోనే సులేమాన్ నివసించి రాజ దర్బార్ నిర్వహించేవాడు.

1543లో మెహ్మద్ మరణించినప్పుడు సులేమాన్ మరియు రోక్సెలానా దుఃఖించారు. సులేమాన్ మరియు రోక్సెలానా తమ కుమార్తె మిహ్రిమాను 1544లో గ్రాండ్ విజియర్‌గా మారిన రుస్టెమ్ కి  వివాహం చేశారు. 

సులేమాన్ 1566 వరకు జీవించాడు తరువాత సెలిమ్II, ఒట్టోమన్ చక్రవర్తిగా నియమితుడయ్యాడు. సెలిమ్II, బలహీనమైన పాలకుడు. సెలిమ్II పాలనలో ఒట్టోమన్ చక్రవర్తి పై  గ్రాండ్ విజియర్‌ కన్నా అంతఃపుర ప్రభావం ఎక్కువుగా ఉండేది. ఫలితంగా "సుల్తానేట్ ఆఫ్ ది ఉమెన్" అనే   పరిస్థితి ఏర్పడింది, ఇది తరచుగా రోక్సెలానా కు ఆపాదించబడింది.

రోక్సెలానా ఏప్రిల్ 1558లో మరణించినది. ఇస్తాంబుల్లోని సులేమానియే మసీదు వద్ద రోక్సెలానా సమాధి కలదు.  

 

లెగసి:

హుర్రెమ్ హసేకి సుల్తాన్, లేదా రోక్సెలానా, మక్కా నుండి జెరూసలేం (అల్-ఖుద్స్) వరకు ప్రజా భవనాలను నిర్మించినది.  

ఒట్టోమన్ రాయల్ ఆర్కిటెక్ట్ సినాన్ ద్వారా రోక్సెలానా అనేక పబ్లిక్ వర్క్స్ ప్రాజెక్టులను ప్రారంభించింది. వారి మొదటి పెద్ద ప్రాజెక్ట్, 1539 నాటికి ప్రారంభించబడిన, కాన్స్టాంటినోపుల్‌లోని హసేకి మసీదు సముదాయం. హసేకి మసీదు సముదాయం లో రెండు పాఠశాలలు మరియు ఒక ఆసుపత్రి,  ఒక ఫౌంటెన్ మరియు మహిళల ఆసుపత్రి ఉన్నాయి. 

రోక్సెలానా కాన్‌స్టాంటినోపుల్‌ హగియా సోఫియాలోని విశ్వాసకుల కోసం  హుర్రెమ్ సుల్తాన్ బాత్‌హౌస్‌ను కూడా ప్రారంబించినది.

రోక్సెలానా, అడ్రియానోపోల్ మరియు అంకారాలో మసీదు సముదాయాలను కూడా నిర్మించింది.

జెరూసలేంలో రోక్సెలానా 1552లో పేదలకు ఆహారం ఇవ్వడానికి హసేకి సుల్తాన్ ఇమారెట్ అనే పబ్లిక్ సూప్ కిచెన్‌ను స్థాపించింది, ఇది కనీసం 500 మందికి రోజుకు రెండుసార్లు ఆహారం ఇచ్చేదని చెప్పబడింది.

రోక్సెలానా మక్కాలో పబ్లిక్ సూప్ కిచెన్‌ను కూడా నిర్మించింది.

2007లో, ఉక్రెయిన్లోని ఓడరేవు నగరమైన మారియుపోల్లో ముస్లింలు రోక్సెలానాను గౌరవించేందుకు ఒక మసీదును ప్రారంభించారు.

హుర్రెమ్ హసేకి సుల్తాన్, లేదా రోక్సెలానా, ఆధునిక టర్కీ మరియు పశ్చిమ దేశాలలో ప్రసిద్ధి చెందింది మరియు రోక్సెలానా పేరు మీద అనేక కళాత్మక రచనలు వెలుబడినవి.

1561లో, హుర్రెమ్ మరణించిన మూడు సంవత్సరాల తర్వాత, ఫ్రెంచ్ రచయిత గాబ్రియేల్ బౌనిన్ లా సోల్టేన్ పేరుతో ఒక విషాదాన్ని tragedy రాశాడు.

రోక్సెలానా ప్రేరణ తో అనేక  పెయింటింగ్స్, సంగీత రచనలు, ఒపెరా, బ్యాలెట్, నాటకాలు, అనేక నవలలు ప్రధానంగా రష్యన్, ఉక్రేనియన్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్,  స్పానిష్  మరియు పోలిష్ భాషలలో వెలుబడినవి.