13 July 2017

ఇబ్న్ బటుట మరియు అతని కాలము.Ibn Batutaa the Traveller





14 వ శతాబ్దపు ముస్లిం యాత్రికుడు ఇబ్న్ బటుట ఇస్లామిక్  ప్రపంచం లో సాగించిన ప్రయాణపు గాధలు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను విశేషంగా  ఆకర్షించినవి.  మధ్యయుగ సమాజాన్ని అర్ధం చేసుకోవటం లో అతని  పర్యటనలు  తోడ్పడినవి.మధ్యయుగ సమాజం లో కనిపించే  ప్రపంచ ప్రఖ్యాత ఆక్రమణదారులు, అన్వేషకులు, వ్యాపారులు, సాహసికులు  మరియు ప్రతిభ గల వివిధ దేశాల స్త్రీ-పురుషులు,  మత నాయకులు, మరియు చక్రవర్తులు అతని పర్యటన గాధలలో దర్సనమిస్తారు.

ఇబ్న్ బటుట మధ్యయుగ యాత్రికులలో ఘనుడు. అతని పర్యటన గాథలు మార్కో పోలోతో పోల్చినప్పుడు చాలా ఘనమైనవి. రాజకీయ మరియు సాంస్కృతిక అన్వేషణల మద్య అసాధారణ జీవితాన్ని  అతను గడిపినాడు. అతను గొప్ప సాహసి. అతని పర్యటనలు ఇస్లామిక్ ప్రపంచం లోని రకరకాల ఆచారాలను అలవాటులను వివరిస్తాయి. అతని పర్యటనలను  గురించిన  సమాచారం  మద్య యుగ చరిత్రను, నాటి  సమాజంను విశ్లేషించడంలో  సహాయపడతాయి.

ఇబ్న్ బటుట మూలాలు:
ఇబ్న్ బటుట తాన్గిర్స్ మొరాకో ప్రాంతం లోని  బెర్బెర్ సున్నీ ముస్లిం పండితుల కుటుంబానికి చెందినవాడు. ఒక పవిత్ర ముస్లింగా తన బాధ్యతను నెరవేర్చటానికి అతను 21 ఏళ్ళ వయసులో అనగా 1325 లో మక్కా హజ్ యాత్ర కొరకు ఇంటిని విడిచినాడు. అనంతరం మరొక 29 ఏళ్ళ పాటు పర్యటనలు  కొనసాగించినాడు. నాటి ఇస్లామిక్ ప్రపంచం  “దార్ అల్-ఇస్లాం” (వెస్ట్ ఆఫ్రికా నుంచి మాఘ్రిబ్ (ఉత్తర ఆఫ్రికా మధ్యధరా సముద్ర ప్రాంతం) మరియు దక్షిణ ఆఫ్రికా లోని హార్న్, సెంట్రల్, దక్షిణ, ఆగ్నేయ ఆసియా మరియు మధ్యప్రాచ్య ఆసియా నుండి చైనా వరకు విస్తరించిన1,20,000 కి.మీ ఇస్లామిక్ పాలకుల క్రింద ఉన్న విశాల భూభాగం) లోని 44 దేశాలలో విస్తృతంగా పర్యటించినాడు. 

ఇబ్న్ బటుట యొక్క పర్యటనలు మనోహరమైన ఘనీభవించిన  పర్వత దారుల మద్య, ఎడారులు, కల్లోల నదులు మరియు దట్టమైన అడవులు, బంజరు భూములు,  ప్రకృతి దృశ్యాల మద్య కొనసాగినవి. పురాతన  జానపద గాధలలోని బందిపోట్లు, క్రూరమైన అడవి జంతువులు, చక్రవర్తులు ఇతని పర్యటన లలో దర్సనమిస్తారు. ఇతను తన పర్యటనలలో(travels) ప్రముఖ ముస్లిం మతాచార్యుల వద్ద ధార్మిక, లౌకిక విద్య అబ్యాసించినాడు. అనేక సార్లు వివాహం చేసుకున్నాడు, అనేకమంది భార్యలను కలిగి ఉన్నాడు మరియు అతనికి అనేకమంది పిల్లలు జన్మించారు. అతని అనేక సాహసాలను గురించిన వర్ణన రిహ్లా లేదా పర్యటన  లో వివరంగా ఉంది. 
ఇబ్న్ బటుట గురించి ఉత్తమoగా  తెలిసిన విద్వాంసుల్లో ఒకరు, టిమ్ మాకింతోష్-స్మిత్ తన BBC పర్యాటక  డాక్యుమెంటరీ “రిహ్ల ( Rihla)” లో ఇబ్న్ బటుట వ్రాసిన  పర్యటక విశేషాలు   గురించి వివరిస్తూ అవి ఒక  “పురాణ' యాత్రా మరియు  భౌగోళిక, మానవ శాస్త్ర విశేషాలు”  అని పేర్కొన్నాడు. విద్యావంతులైన పురుషులు వ్రాసిన ప్రయాణ సాహిత్యంలో “రిహ్లా” ఒక భాగమని అమెరికన్ రచయిత డగ్లస్ బుల్లిస్ వివరించారు. ఇబ్న్ బటుట యొక్క కథనం మద్య యుగ  సమాజానికి సంబంధించిన వివరాలను, పాలిటీ, భూగోళ శాస్త్రం, ఆచారాలు మరియు ప్రముఖ వ్యక్తుల వ్యక్తిత్వాలను,  పవిత్ర ప్రదేశాల గురించి వివరిస్తుంది. రిహ్లా దాని క్రోనాలజీ, యాత్ర విశేషాలు మరియు కధనాల  గురించి విమర్శలను ఎదుర్కొంది. అయినప్పటికీ ఇబ్న్ బట్టుట మౌఖిక చరిత్రకు గొప్ప మూలం గా మిగిలాడు.  ఆంగ్ల అనువాదకుడు H. A. R. గిబ్ రిహ్ల ను '. మొట్టమొదటిది ఒక మానవ డైరీ' అని పిలుస్తాడు.

డిల్లీ మరియు దాని సుల్తాన్ పై అతని అభిప్రాయలు:
తన పర్యటన లో భాగం గా ఇబ్న్ బటుటా డిల్లి సుల్తాన్ ముహమ్మద్ బిన్ తుగ్లక్ ఆస్థానానికి 1334 లో చేరినాడు. ఆక్కడ 8 సంవత్సరాలు లేదా పర్యాటక జీవితం లోని పావు వంతు గడిపినాడు.

ఢిల్లీ గురించి అతను ఇలా చెప్పాడు:
భారతదేశం యొక్క మహానగరాలలో  దిల్లీ నగరం ఒకటి, అది బహు  విస్తారమైన మరియు అద్భుతమైన నగరం. అది చుట్టూ గోడతో నిండి ఉంది, ఇది మొత్తం ముస్లిం ప్రాచ్యం లో అతిపెద్ద నగరం.
కుతుబ్ మినార్ గురించి అతను ఇలా చెప్పాడు:
ప్రాంగణం(court) ఉత్తర భాగం లో  మినార్ ఉంది. ఇది ఎర్ర రాతితో నిర్మించబడింది, మిగిలిన భవనం వలె కాకుండా, శిల్పాలతో అలంకరించబడి గొప్ప ఎత్తు కలిగి ఉంది. పైభాగంలో బంతిని తెల్లని పాలరాయితో మరియు దాని 'ఆపిల్స్' (ఒక మినార్ను ఆవహించిన చిన్న బంతులు) స్వచ్ఛమైన బంగారంతో ఉన్నాయి.నడక దారి  ఏనుగులు  వెళ్ళగల విశాలం గా ఉంది. నిర్మించినప్పుడు ఏనుగు రాళ్ళదారి గుండా పైకి ఎక్కేవి.  
మెహ్రౌలి వద్ద ఐరన్ పిల్లర్:
మసీదు మధ్యలో ఒక స్థంభం (పిల్లర్) కలదు మరియు పిల్లర్  నిర్మించిన లోహం  గురించి ఎవ్వరికి  తెలియదు, హాఫ్ట్ జష్ అనగా 'ఏడు లోహాల” తో  నిర్మించబడింది అంటారు. ఈ స్థంభం (పిల్లర్) యొక్క నిలువు భాగం లో  వేలు వెడల్పు భాగం మెరుగుపరచబడింది, మరియు అది  ఒక అద్భుతమైన కాంతిని  ఇస్తుంది. పిల్లర్  ముప్పై మూరలు పొడువు ఉంది మరియు  దాని చుట్టూ ఒక తలపాగాని చుట్టగా అది ఎనిమిది మూరల వెడల్పుగా ఉండేది.
అనేక మంది వ్యాపారులు, పండితులు, సైనికులు, కళాకారులు, కళాకారులు మరియు పర్యాటకులు ఢిల్లీ నగరానికి వచ్చారు. డిల్లి సుల్తాన్ విదేశీ పండితులను అనేక బహుమతులతో స్వాగతించారు మరియు తన ఆస్థానం లో సేవలో ఉండమని  వారిని కోరినాడు. బటుట ఒక మాలికి న్యాయాధిపతి యొక్క స్థానం పొంది, ఎక్కువ జీతం, బహుమానం గా  అనేక గ్రామాల నుండి వచ్చే  ఆదాయాలు, ట్రెజరీ నుండి వచ్చే బహుమతులు మరియు నగదు పొందేవాడు.  డిల్లి సుల్తాన్ ఒక హింసాత్మక, అనూమాన  పాలకుడు, అతను విదేశి పండితులు, న్యాయనిర్ణేతలు మరియు పరిపాలకులను నియమించుకోవడం  ద్వారా తన ప్రభుత్వo సుస్థిరంగా ఉండేటట్లు చూస్తాడు.

డిల్లి సుల్తాన్ బహుమతులు ఇవ్వడం లోను మరియు రక్తం పారిoచడం లోను ఆసక్తి కలవాడు. డిల్లి సుల్తాన్ ఒక హింసాత్మక, అనూమాన  పాలకుడు. అతని ద్వారం ఎల్లప్పుడూ అతని ఔదార్యం  మరియు క్రూరత్వంతో నిండి ఉండేది.  అతని హింసాకాండ గురించి  ప్రజలలో కథలు ఉన్నాయి మరియు అతను ఎల్లప్పుడూ సామాన్య ప్రజల పట్ల సమానత్వం మరియు న్యాయం చూపించడానికి సంసిద్దం గా ఉండేవాడు.
డిల్లి సుల్తాన్ యొక్క అసంతృప్తి కి గురిఅయిన  ఒక సూఫీ షేక్ తో ఉన్న అనుబంధం కారణంగా ఇబ్న్ బటుట సుల్తాన్ ఆగ్రహానికి గురి అయినాడు. సూఫీ షేక్ క్రురంగా హింసించబడినాడు  మరియు చివరికి అతనికి శిరఛ్చేదం జరిగినది. సుల్తాన్ ను క్షమాబిక్ష కోరటం కోసం ఇబ్న్ బటుట తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి చివరకు సుల్తాన్  క్షమాభిక్ష పొందినాడు. క్షమా బిక్ష పొందినప్పటికీ ఈ అనుభవము ఇబ్న్ బటుటా ను పూర్తిగా క్రుంగ దిసింది. అత్యంత విలాస  జీవితాన్ని త్యజించి   కమలద్దిన్ అబ్దుల్లా అల్-ఘారీ అని పిలవబడే మరొక సుఫీ సన్యాసి సాంగత్యం లో ఐదు నెలలు గడిపినాడు.  
వెయ్యి మంది సైనికులు, బంగారు మరియు వెండి పాత్రలు, కత్తులు, స్క్రాబ్బార్డ్లు, టోపీలు, గుర్రాలు, మగ బానిసలు, నృత్యం చేసే అమ్మాయిలు మరియు నపుంసకులతో తన రాజ ప్రతినిధిగా చైనాకు వెళ్లవలసినదిగా బటుటాను చక్రవర్తి పిలుపునిచ్చారు. కానీ బతుటూ దౌత్య సమూహం పై  ఢిల్లీ వెలుపల తిరుగుబాటుదారులు దాడి చేశారు. జరిగిన దాడులలో అతను తన బృందం నుండి వేరుచేయబడ్డాడు మరియు చాలా కష్టాలను ఎదుర్కొన్న తర్వాత ఒక వారం తర్వాత తన సమూహం తో చేరినాడు.
దౌత్య సమూహం కాంబే చేరుకోని  అక్కడ నుండి కాలికట్ చేరుకోOది. ఇక్కడ వారు రెండు చైనా వెళ్ళేటానికి  రెండు   ఓడలు మరియు చిన్న కకంను పొందారు.  కానీ ఇబ్న్ బటుట దురదృష్టవశాత్తు ఒక భయంకర   తుఫాను లో చిక్కుకొని  తన విలువైన సరుకు, పరివారాన్ని, జంతువులను నష్ట పోయాడు.  మిగిలిన చిన్న ఓడను  సముద్రపు దొంగలు దోచుకొన్నారు.  ఉత్త చేతులతో ఢిల్లీకి తిరిగి  వెళ్ళటానికి, సుల్తాన్ కు  వివరణ ఇవ్వడానికి ఇబ్న్  బటుట కు ధైర్యం చాలలేదు. ఇబ్న్ బటుట యొక్క తన ప్రయాణం కొనసాగించినాడు మాల్దీవ్, శ్రీలంక, సుమత్రా మీదగా చివరకు చైనా చేరినాడు.

ఒక సాటిలేని కథకుడు, ఉత్తమ పర్యాటకుడు.


షేక్ అబూ అబ్దుల్లా మహ్మద్ ఇబ్న్ అబ్దుల్లాహ్ ఇబ్న్ మొహమ్మద్ ఇబ్న్ ఇబ్రహీం అల్-లాతతి అల్-తన్జీ ఇబ్న్ బట్టుట (అది అతని పూర్తి పేరు) కేవలం ప్రస్సిద్ద యాత్రికుడు కాదు, అతను సందర్శించిన భూముల చరిత్రకు గొప్ప మూలం. వివిధ దేశాల ప్రజలు మరియు స్థలాల యొక్క అతని వర్ణనలు  అతని పర్యటనలను వివరిస్తాయి.  అతను తన కాలం నాటి ఉత్తమ కధకుడు, పర్యాటక చక్రవర్తి. 

5 July 2017

తల్లిపాలపై ఇస్లామిక్ అభిప్రాయాలు.





ఒక చిన్న పిల్లవాడి ఆకలి తీర్చడానికి సహజ మార్గంగా తల్లిపాలను ఇస్లాం ప్రోత్సహిస్తుంది.ఇస్లాం ప్రకారం  తల్లిదండ్రులు మరియు పిల్లలు ఇద్దరూ హక్కులను  మరియు బాధ్యతలను కలిగి ఉన్నారు. ఇస్లాం లో తల్లి నుండి తల్లిపాలను పొందటం  ఒక బిడ్డ యొక్క హక్కుగా పరిగణిస్తారు, మరియు దానిని తల్లి నెరవేర్చవలసిన  అత్యంత ముఖ్యమైన కార్యంగా సిఫార్సు చేయబడింది.

తల్లిపాల పై  దివ్య ఖుర్ఆన్ వివరణ:

దివ్య  ఖుర్ఆన్ లో తల్లిపాలు అత్యంత  స్పష్టంగా ప్రోత్సహించబడినవి. “తమ సంతానం యొక్క పాలు పట్టే గడువు పూర్తి కావాలని తండ్రులు కోరిన పక్షం లో తల్లులు తమ పిల్లలకు పూర్తిగా  రెండు సంవత్సరములు పాలు పట్టాలి. అప్పుడు ఆమెకు పిల్లల తండ్రి తగురీతిగా భోజన వస్త్రాలను ఇచ్చి పోషించ వలసి ఉంటుంది.  కాని శక్తీ కి మించిన భారం ఎవరి మీద మోప కూడదు. బిడ్డకు తండ్రి కనుక తండ్రిని ఇరకాటం లో పెట్టడం కూడా సమంజసం కాదు- పాలిచ్చే తల్లిని పోషించే బాద్యత తండ్రి పై ఉన్న విధంగానే తండ్రి వారసులపై పై కూడా ఉంది- కాని ఇరు పక్షాల వారు సంప్రదించుకొని పరస్పర అంగీకారం తో  బిద్దచే పాలు విడిపిస్తే అందులో దోషం లేదు. ఇంకా మీరు మీ మీ సంతానానికి వేరే స్త్రీ ద్వారా పాలు ఇప్పించే ఏర్పాటు చెయ్యదలిస్తే అది అక్షేపణీయం కాదు. కాని మీరుఅమెకు ఇవ్వవలసిన దానిని న్యాయ సమ్మతం గా చెల్లించాలి. అల్లాహ్ కు బయపదండి. మీరు చేస్తున్నదంతా అల్లాహ్ ద్రుష్టి లో ఉంది అనే విష్యం తెలుసుకొండి”.- దివ్య ఖురాన్  (2: 233).

 అలాగే వారి తల్లిదండ్రుల పట్ల  దయతో వ్యవహరించడానికి ప్రజలను గుర్తుచేస్తూ, దివ్య ఖురాన్ ఇంకా ఇలా చెబుతోంది: "అతని తల్లి  బలహీనత పై బలహీనతను  సహించి అతనిని తన కడుపున మోసింది. అతను పాలు విడిచిపెట్టడానికి రెండు సంవత్సరాలు పట్టింది. " (31:14).  
అల్లాహ్ దివ్య ఖురాన్ లో ఇలా అన్నాడు: "అతని తల్లి అతనిని ఎంతో శ్రమతో తన గర్భం లో పెట్టుకొని మోసింది. ఎంతో శ్రమతో అతనిని కన్నది. అతనిని గర్భం లో పెట్టుకొని మోసేందుకు, అతని చే పాలు మన్పించేదుకు ముప్పై మాసాలు పట్టింది. " (46:15).

అందువల్ల ఇస్లాం  తల్లిపాలను సిఫార్సు చేస్తుంది, కానీ వివిధ కారణాల వలన తల్లిదండ్రులు రెండు సంవత్సరాల కాలం  పూర్తి చేయలేకపోవచ్చు. తల్లిపాలను గురించి తల్లిదండ్రులు ఇద్దరు  పరస్పర మంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దివ్య ఖుర్ఆన్ ఇంకా ఇలా చెబుతోంది: "ఇరు పక్షాల వారు సంప్రదించుకొని పరస్పర అంగీకారం తో  బిద్దచే పాలు విడిపిస్తే అందులో దోషం లేదు. " (2: 233).అదే ఆయత్ ఇంకా ఇలా చెబుతుంది "మీరు మీ సంతానానికి వేరే స్త్రీ ద్వారా పాలు ఇప్పించే ఏర్పాటు చెయ్యదలిస్తే అది అక్షేపణీయం కాదు. కాని మీరుఅమెకు ఇవ్వవలసిన దానిని న్యాయ సమ్మతం గా చెల్లించాలి.  (2: 233).

పాలు విడుచుట:

పైన ఉదహరించబడిన దివ్య ఖురాన్ ఆయతుల ప్రకారం పిల్లవాడు రెండు సంవత్సరాల వయస్సు వరకు తల్లి పాలు పొందటాన్ని ఒక హక్కుగా పరిగణిస్తారు. ఇది ఒక  సాధారణ మార్గదర్శకం; తల్లిదండ్రులు  తమ పరస్పర అంగీకారంతో రెండుసంవత్సరాల కాలం ముందే లేదా ఆతరువాత  గాని పాలు విడిపించ వచ్చు. తల్లిపాల విడుపు సమయం ముందే విడాకులు తీసుకుంటే, భర్త పాలిచ్చెతన  మాజీ భార్యకు ప్రత్యేకమైన పోషణ వ్యయం చెల్లించాల్సి ఉంటుంది.

" ఇస్లాంలో "మిల్క్ సిబ్లింగ్స్ లేదా పాల సోదరులు "

కొన్ని సంస్కృతులలో మరియు లేదా విబ్బిన్న కాలాల్లో, శిశువులను పెంపుడు-తల్లి పాలిచ్చి పెంచడం  జరుగుతుంది.(వారిని కొన్నిసార్లు ""పాల తల్లి" లేదా పెంపుడు తల్లి   అని పిలుస్తారు). ప్రాచీన అరేబియాలో నగర కుటుంబాల వారు  తమ శిశువులను ఎడారిలో ఒక పెంపుడు తల్లి వద్దకు పంపింటం సాధారణంగా జరిగేది  కారణం  అక్కడ అది ఆరోగ్యకరమైన జీవన వాతావరణంగా పరిగణించబడేది. ప్రవక్త ముహమ్మద్ (స) వారు కుడా చిన్న తనం లో  తన తల్లి మరియు హాలిమా అనే పెంపుడు  తల్లిచే  పెంచబడినారు.

ఇస్లాం  పిల్లల యొక్క పెరుగుదల మరియు అభివృద్ధికి తల్లిపాల అవశ్యకతను గుర్తించినది  మరియు ఒక నర్సింగ్ స్త్రీ మరియు శిశువుకు మధ్య అభివృద్ధి చెందే ప్రత్యేక బంధాన్ని గుర్తించింది. ఇస్లామిక్ చట్టం క్రింద శిశువు కు పాలు ఇచ్చే స్త్రీ ప్రత్యేక హక్కులతో శిశువు కు "పాలు తల్లి" గా మారుతుంది. పాలు పొందే శిశువు పాల తల్లి యొక్క ఇతర పిల్లల పూర్తి తోబుట్టువుగా గుర్తింపు పొందుతాడు మరియు పాల తల్లి కి మహ్రుం అవుతాడు.  ముస్లిం దేశాలలో దత్తత తీసుకొన్న  తల్లులు కొన్నిసార్లు ఈ నర్సింగ్ అవసరాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు తద్వారా దత్తత తీసుకున్న బిడ్డ కుటుంబానికి మరింత సులువుగా విలీనం చేయబడుతుంది.

మోడేస్టి (సబ్యత) మరియు బ్రెస్ట్ ఫీడింగ్:

ముస్లిం మహిళలు  దుస్తులు ధరించడం లో సబ్యత పాటిస్తారు మరియు శిశువు కు  పాలు ఇచ్చేటప్పుడు  చాతిని దుస్తులు, దుప్పట్లు లేదా స్కార్వ్లు ధరించడం  ద్వారా మరుగు పరుస్తారు.అయితే వ్యక్తిగతం గా  లేదా ఇతర మహిళలతో కలసి ఉన్నప్పుడు  ముస్లిం మహిళలు సాధారణంగా వారి పిల్లలకు బహిరంగంగా పాలు పడతారు. ఇది కొంతమంది కి   వింత అనిపించవచ్చు. కాని పిల్లలకు  పాలు పట్టడం అనేది తల్లికి సహజ ధర్మంగా  భావించబడుతుంది మరియు  ఇది ఏవిధమైన అశ్లీలమైన, అక్రమమైన  లేదా లైంగిక చర్యగా పరిగణించబడదు.

 టఫ్సీర్  విద్వాంసుల  అభిప్రాయాలు:

 పైన తెలిపిన ఆయతులను  ప్రస్తావిస్తూ, ఇబ్నె కథీర్ ఈ విధంగా వ్యాఖ్యానించారు: " పిల్లలకు రెండు సంవత్సరాల పాటు తల్లిపాలు ఇవ్వడం కోసం తల్లులకు ఇది మార్గదర్శకత్వం."
ప్రవక్త ముహమ్మద్ (స)ప్రకారం  "నా కొడుకు ఇబ్రాహీమ్ చనిపోయాడు. అతడు స్వర్గం  లో రెండు సంవత్సరాల పాటు పాలు ఇచ్చే ఇద్దరు  పాల  తల్లులను కలిగి ఉన్నాడు." (ముస్లిం) “అతను స్వర్గం లో ఒక పాల తల్లి ని కలిగి ఉన్నాడు.  [అల్ బుఖారీ]

  " చాలామంది ప్రవక్త(స) యొక్క సహచరులు మరియు ఇతరులు “పాలు త్రాగే శిశువుకు రెండు సంవత్సరాలు రానంత వరకు   పెళ్లిని నిషేదించడం  ఒక అలవాటు గా” భావిస్తారు. వారిలో అలీ, ఇబ్న్ అబ్బాస్, ఇబ్నె మాసూద్, జాబిర్, అబు హురైరా, ఇబ్నె ఉమర్, ఇబ్న్ సలామహ్, సయీద్ ఇబ్నె అల్-ముసాయిబ్ మరియు 'అటా' ముఖ్యులు.

ఇదే అభిప్రాయం ఎక్కువమంది పండితుల ఆమోదం పొందినది.  అల్-ఖుర్తుబి “రెండు సంవత్సరాల కాలం  సంతానం యొక్క పూర్తి పాలు తాగే  కాలం” అని అన్నారు.
ఇమామ్ మలాక్ అభిప్రాయo లో  వివాహాన్ని నిషేధించడం పిల్లల వయస్సు రెండు సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నప్పుడు జరుగుతుంది.

ఇబ్నె అబ్బాస్ ప్రకారం ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా పలికినారు, " శిశువు పాలు త్రాగే రెండు సంవత్సరాల కాలం ల్లో వివాహం నిషేదించడం జరుగుతుంది."
తన తఫ్సీర్ గ్రంథంలో, అర-రాజీ ఇలా అన్నారు, "రెండు సంవత్సరములు తల్లి పాలివాలన్ని పేర్కొనడం షరియత్ లో  లో ప్రత్యేకమైన నిర్ణయాన్ని సూచిస్తుంది. 
తన తఫ్సీర్లో అష్-షావకానీ మాట్లాడుతూ, "రెండు సంవత్సరాల పాటు శిశువుకు రొమ్ముపాలు ఇవ్వడం పరిపూర్ణత చర్యగా ఉంటుంది, కానీ అంతకు తక్కువ కాలం ఇవ్వడానికి కూడా అనుమతి ఉంది."

రెండు సంవత్సరాల కాలానికి కారణము
 షరియా ప్రకారం శిశువుకు రెండు సంవత్సరాల కాలం వరకు  తల్లి పాలు ఇవ్వడం  జరుగుతుoది.  కానీ, దిని వెనుక ఏమైనా శాస్త్రీయ వైద్య ఆధారం  ఉందా?

1994 లో ప్రచురించబడిన ప్రపంచ ప్రసిద్ధమైన పీడియాట్రిక్స్ మ్యాగజిన్ నెల్సన్ ఎసెన్షియల్స్ లో  తల్లి పాలిచ్చె కాలానికి   మరియు టైపు -1 మధుమేహంమద్య ఉన్న సంభందాన్ని వివరించినది.   ఇది నార్వే, స్వీడన్ మరియు డెన్మార్క్లలో పిల్లలపై నిర్వహించిన కొన్ని సంబంధిత అధ్యయనాలపై ఆధారపడింది.తల్లి పాలు పిల్లలలో ప్యాంక్రియాటిక్ బీటా కణాలను నాశనం చేసే పర్యావరణ కారకాలకు వ్యతిరేకంగా శిశువుని రక్షించుతాయి. కృత్రిమ ఆహారాలు మరియు ఆవు పాలు కూడా ఆ కణాలను విషపూరితం చేసే రసాయనిక అంశాలని కలిగి ఉంటాయి. అదేవిధంగా ఇతర దేశాల్లో కూడా తల్లి పాలిచ్చె కాలనికి  మధుమేహం కు మద్య దగ్గిర సంభంధం  ఉన్నట్లు గమనించారు. అందువల్ల, పరిశోధకులు తల్లిదండ్రులు  శిశువు కు ఎక్కవ కాలo తల్లిపాలను ఇవ్వడాన్ని సిఫార్సు చేస్తారు దీనితో శిశువు ఆరోగ్యనికి సంపూర్ణ రక్షణ ఉంటుంది.

ఇటీవల అభివృద్ధి చెందిన ఒక సిద్ధాంతం ప్రకారం  ఆవు పాలు  ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ప్యాంక్రియాటిక్ కణాలు నాశనం చేయడాన్ని సూచిస్తుంది. ఈ సిద్ధాంతానికి మద్దతుగా, డయాబెటిస్ పిల్లల సీరం లో  ఆవు పాల ప్రోటీన్లకు అధిక ప్రతిచర్యలు ఉన్నట్లు కనుగొనబడింది.
1998 లో డయాబెటిస్ డైజెస్ట్ యొక్క జనవరి సంచికలో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో, ఆవు పాల ప్రోటీన్ కొందరు  పిల్లలలో  మధుమేహం కలిగించే ఒక స్వతంత్ర మూలకం అని పరిశోధకులు కనుగొన్నారు. అదే జర్నల్ దయబితిస్ కు ఆవు పాలు త్రాగే శిశువు మొదటి సంవత్సర కాలం  మద్య మధుమేహం అభివృద్ధిలో ఉన్న బలమైన సంబంధాన్ని వివరించినది.

1998 లో మరో అధ్యయనం "ఇమ్యునిటీ జర్నల్ "లో ప్రచురించబడింది. దాని ప్రకారం పరిశోధకులు, తల్లి  పాల కు  ప్రత్యామ్నాయంగా ఇచ్చే  పాల ఆహారం మరియు కొన్ని ఇతర కృత్రిమ శిశువు ఆహారాలు తొమ్మిది నెలల శిశువులకు మధుమేహం త్వరగా అభివృద్ధి చేయడానికి దారితీసిందని వెల్లడించారు. అందువల్ల వారు దీర్ఘకాలిక సహజమైన తల్లిపాలను సిఫార్సు చేస్తారు.

పై పరిశోదనలు శిశువు కు తల్లిపాల కొరకు  దివ్య ఖుర్ఆన్ నిర్దేశించిన రెండు పూర్తి సంవత్సరాల కాలం ను స్పష్టంగా రుజువు చేస్తుంది. దివ్య ఖురాన్ ఇంకా ఇలా చెబుతోంది: "అతని తల్లి  బలహీనత పై బలహీనతను  సహించి అతనిని తన కడుపున మోసింది. అతను పాలు విడిచిపెట్టడానికి రెండు సంవత్సరాలు పట్టింది. " (31:14).

అల్లాహ్ దివ్య ఖురాన్ లో ఇలా అన్నాడు: "అతని తల్లి అతనిని ఎంతో శ్రమతో తన గర్భం లో పెట్టుకొని మోసింది. ఎంతో శ్రమతో అతనిని కన్నది. అతనిని గర్భం లో పెట్టుకొని మోసేందుకు, అతని చే పాలు మన్పించేదుకు ముప్పై మాసాలు పట్టింది. " (46:15).

షరియా ప్రకారం  తల్లి పాలు ఇవ్వడానికి రెండు సంవత్సరాల నియమం సరళ తరం చేయబడింది. "రెండు సంవత్సరాల పాటు శిశువుకు రొమ్ముపాలు ఇవ్వడం పరిపూర్ణత చర్యగా ఉంటుంది, కానీ అంతకు తక్కువ కాలం ఇవ్వడానికి కూడా అనుమతి ఉంది."ఇరు పక్షాల వారు సంప్రదించుకొని పరస్పర అంగీకారం తో  బిడ్డచే పాలు విడిపిస్తే అందులో దోషం లేదు. -దివ్య ఖురాన్  (2: 233).

ఇబ్న్ కతేర్ ఇలా అంటాడు, "రెండు సంవత్సరాల లోపు తల్లి పాలు మాన్పించడం అనేదానికి తల్లితండ్రుల ఇద్దరి అంగీకారం ఆవసరం.  పిల్లలను పెంచడం  మరియు మార్గదర్శక పొందటం లో అల్లాహ్ యొక్క దయ పొంది అల్లాహ్  యొక్క నియమాలను పాటించడం తల్లిదండ్రులకు  మేలుతరం.”  

తల్లిపాలను ఇవ్వడం వలన బిడ్డకు మరియు  తల్లి కి  అనేక ప్రయోజనాలు కలవు.   తల్లి పాలు పసిపిల్లలకు ఉత్తమమైన పోషకాహారం అనే శాస్త్రీయ దృక్పధo కు  ఇస్లాం మద్దతు ఇస్తుంది, మరియు బిడ్డకు రెండు సంవత్సరాల వరకు తల్లి పాలు ఇవ్వవలనని అది సిఫార్సు చేస్తుంది


దివ్య ఖుర్ఆన్ లో  ఉదహరించబడిన విధంగా, తల్లి పాలు పొందటానికి పూర్తి రెండు సంవత్సరాలు కాలం  ఎందుకు పూర్తి చేయాలనేది ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయం లో పదనాలుగు వందల సంవత్సరాల క్రితం  దివ్య  ఖుర్ఆన్ చేసిన అద్భుత సిఫారసులను ఆధునిక వైద్య శాస్త్రం ద్రువికరించినది. అల్లాహ్ ఇంకా  ఇలా ప్రకటిస్తున్నాడు: "మేము త్వరలోనే వారికి మా సూచలను వారి చుట్టూ ఉన్న ప్రపంచంలో చూపిస్తాము. వారిలోనూ చూపిస్తాము. చివరికి ఈ ఖురాన్ నిస్సందేహంగా సత్యమైనదని వారికి విశదమైపోతుంది. నీ ప్రభువు ప్రతి  దానికి సాక్షి అనే విషయం సరి పోదా? తేలుసుకో, అయన ప్రతి వస్తువును పరివేష్టించి ఉన్నాడు.- దివ్య ఖురాన్ 41:53.