12 February 2022

నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరియు అతని ముస్లిం సహచరుల వీరోచిత కథ नेताजी सुभाष चंद्रा बोस और उनके मुस्लिम साथियों की वीरगाथा

 

 




నేతాజీ సుభాష్ చంద్రబోస్ గొప్ప విప్లవ  నాయకుడు. బోస్ తన ఆజాద్ హింద్ ఫౌజ్ ద్వారా భారత దేశం,  బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందటానికి కృషి  చేసారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ హిందూ/ముస్లిం వంటి పదాలకు దూరంగా ఉండేవారు.


ఆజాద్ హింద్ ఫౌజ్‌లో ముస్లింల పాత్రను చూద్దాం:-

1.అబిద్ హసన్: జై హింద్ నినాద సృష్టికర్త  మరియు నేతాజీ వ్యక్తిగత సహాయకుడు జర్మనీ నుండి జపాన్‌కు జలాంతర్గామి ప్రయాణంలో నేతాజీతో కలిసి ప్రయాణించారు..

2.కల్నల్ హబీబుర్ రెహమాన్: ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులలో ఒకరు మరియు నేతాజీకి అత్యంత నమ్మకమైన సహచరుడు, నేతాజీ 18 ఆగస్టు 1945న తన చివరి విమాన ప్రయాణంలో నేతాజీ తో పాటు కలసి ఉన్నారు.

౩.కల్నల్ ఎహ్సాన్ ఖాదిర్: ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులలో ఒకరు, ఆజాద్ హింద్ రేడియోకు డైరెక్టర్ కూడా అయ్యారు. ఆజాద్ హింద్ దళ్ స్థాపనలో కూడా ఆయన ముఖ్య పాత్ర పోషించారు.

4.కల్నల్ ఇనాయతుల్లా హసన్: ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క ముఖ్య శిక్షకుడు, అలాగే ఆజాద్ హింద్ రేడియో కోసం దేశభక్తి నాటకాల రచయిత.

5.మేజర్ జనరల్ షానవాజ్ ఖాన్: ఆజాద్ హింద్ ఫౌజ్ కమాండర్ ఆఫ్ ఫోర్స్‌లో ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులు భారత భూభాగంపై దాడులు ప్రారంభించారు, ఇందులో నాగాలాండ్ అరకాన్ మహాజ్.

6.కల్నల్ మెహబూబ్ అహ్మద్: ఆజాద్ హింద్ ఫౌజ్ మరియు ఆజాద్ హింద్ ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేసిన ముఖ్యమైన అధికారి. ఆయన నేతాజీ సైనిక కార్యదర్శి కూడా.

7.కరీం ఘని మరియు DM ఖాన్: ఆజాద్ హింద్ ప్రభుత్వానికి ఆరుగురు సలహాదారులలో ఇద్దరు మరియు 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత బ్రిటన్ చే శత్రువులుగా ప్రకటించిన జాబితా లో ఉన్నారు.

8.యూసుఫ్ మర్ఫానీ: ఆజాద్ హింద్ ఫౌజ్‌కు గొప్ప దాత. ఆ సమయంలో కోటి విరాళం ఇచ్చి ఆజాద్ హింద్ ఫౌజ్ ఆర్మీ యూనిఫాం తీసుకున్నాడు.

9.మేజర్ జనరల్ మొహమ్మద్ జమాన్ ఖాన్ కియానీ: గాంధీ/నెహ్రూ/ఆజాద్ బ్రిగేడ్ కమాండ్  తో కూడిన  ఆజాద్ హింద్ ఫౌజ్ మొదటి డివిజన్ కమాండర్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18న హబీబ్ ఉర్ రెహ్మాన్ తో కలసి  విమాన ప్రయాణo చేసినప్పుడు ఆర్మీ చీఫ్ మేజర్ జనరల్ గా మహ్మద్ జమాన్ ఖాన్ కియానీని చేశారు.

10.నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వారా  "తమ్గా-ఎ-సదర్-ఎ-జంగ్तमगा-ए-सदर-ए-जंग " అవార్డు అందుకున్న ముస్లిం సైనికులు:

1. కల్నల్ S.A. మాలిక్

2. మేజర్ సికందర్ ఖాన్

3. మేజర్ అబిద్ హుస్సేన్

4. కెప్టెన్ తాజ్ మహ్మద్.

11.నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వారా  "తమ్గా-ఇ-వీర్-ఏ-హింద్ तमगा-ए-वीर-ए-हिन्द " అవార్డు అందుకున్న ముస్లిం సైనికులు:

1. లెఫ్టినెంట్ అస్రఫీ మండల్

2. లెఫ్టినెంట్ ఇనాయత్ ఉల్లా

12.నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వారా  "తమ్గా-ఎ-బహదూరి तमगा-ए-बहादुरी " అవార్డు అందుకున్న ముస్లిం సైనికులు:

1. హవల్దార్ అహ్మద్ దీన్

2. హవల్దార్ దిన్ మహ్మద్

3. హవల్దార్ హకీమ్ అలీ

4. హవల్దార్ గులాం అహ్మద్ షా

13.నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేత "తమ్గా-ఎ-శత్రునాష్ तमगा-ए-शत्रुनाश " అవార్డు అందుకున్న ముస్లిం సైనికులు:

1. హవల్దార్ పీర్ మహ్మద్

2. హవల్దార్ హకీమ్ అలీ

3. నాయక్ ఫైజ్ మహ్మద్

4. సిపాయి గులాం రసూల్

5. నాయక్ ఫైజ్ బక్ష్

14.నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేత "సనద్-ఎ-బహదూరి सनद-ए-बहादुरी " అవార్డు అందుకున్న ముస్లిం సిపాయిలు:

1. హవల్దార్ అహ్మదుద్దీన్

2. హవల్దార్ మహ్మద్ అస్గర్

3. హవల్దార్ గులాం షా

15.కల్నల్ షౌకత్ అలీ మాలిక్: 14 ఏప్రిల్ 1944, ఆజాద్ హింద్ సైన్యం మణిపూర్ మొయిరాంగ్‌ను విముక్తి చేసినప్పుడు, స్వతంత్ర భారతదేశంలో ఆజాద్ హింద్ ప్రభుత్వం యొక్క త్రివర్ణ పతాకాన్ని మొట్టమొదట ఎగురవేసిన వ్యక్తి షౌకత్ మాలిక్. అందులో చిహ్నంగా టిప్పు సుల్తాన్ గుర్తుగా  పులి కలదు.. అక్కడ అబిద్‌ హసన్‌ ఇచ్చిన జై హింద్‌ నినాదం ఢిల్లీ వరకు వినిపించేంతగా ప్రతిధ్వనించింది.

 

 

No comments:

Post a Comment