25 April 2024

కాంగ్రెస్‌ను ఓడించి భవిష్యత్ BSPకి పునాది వేసిన AMU అధ్యాపకులు When AMU defeated Congress and laid foundation of a future BSP

 

రాంధారి సింగ్, మధు లిమాయ్, మణి రామ్ బగ్రీ, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా, బి పి మౌర్య, ఎస్ ఎం జోష్


1962 జనరల్ ఎన్నికలలో జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్‌ను అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం (AMU) అద్యాపకులు ఓడించడం చరిత్రలోని ఆసక్తికరమైన వాస్తవం. మరో ఆశ్చర్యకరమైన వాస్తవం ఏమిటంటే, AMUలో ప్రారంభమైన ఈ రాజకీయ ఉద్యమం దశాబ్దాల తర్వాత ఉనికిలోకి వచ్చిన బహుజన్ సమాజ్ పార్టీ (BSP) కి పునాదులను వేసింది.

కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాల నుండి అద్యాపకులు రాజకీయాలలో పాల్గొనడం చాలా అరుదుగా జరిగే విషయం. 1962లో, AMU AMU అధ్యాపకులు భారతదేశ అధికార పార్టీ(కాంగ్రెస్)ని సవాలు చేశారు.

అక్టోబరు 1961లో, అలీఘర్ పట్టణం భయంకరమైన హిందూ-ముస్లిం అల్లర్లను చూసింది. అధికారిక నివేదికల ప్రకారం అల్లర్లలో 15 మంది ముస్లింలు మరణించారు. అనధికారిక వర్గాలు ఈ సంఖ్యను 40గా పేర్కొన్నాయి. అల్లర్లలో  ఒక గుంపు AMU క్యాంపస్‌లోకి ప్రవేశించింది మరియు క్యాంపస్ చుట్టూ ఉన్న దుకాణాలను తగలబెట్టారు. పశ్చిమ యుపిలోని మొరాదాబాద్ మరియు మీరట్ వంటి ఇతర నగరాలలో  కూడా మత హింస జరిగింది.

ఉత్తరప్రదేశ్ (యుపి)తో పాటు కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. సహజంగానే, ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ మరియు ముఖ్యమంత్రి సి.బి.గుప్తాపై వేళ్లు చూపించబడ్డాయి. AMUలోని లా ఫ్యాకల్టీకి చెందిన ఇద్దరు అధ్యాపకులు B. P. మౌర్య మరియు అబ్దుల్ బషీర్ ఖాన్ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ మరియు ముఖ్యమంత్రి సి.బి.గుప్తా ఇద్దరినీ విమర్శించడంలో ముందు ఉన్నారు.

 AMUలో అధ్యాపకుడిగానే కాకుండా, B P మౌర్య దళిత నాయకుడు కూడా. గాంధీ మరియు ఇతర నాయకులు ఖైర్‌ను సందర్శించిన తర్వాత, , B P మౌర్య 1941లో కాంగ్రెస్‌లో చేరాడు, తరువాత ఢిల్లీలో అంబేద్కర్‌ను కలిశాడు మరియు అంబేద్కర్‌ తమ 'అసలైన  నాయకుడు' అని B P మౌర్య గ్రహించాడు... B P మౌర్య కాంగ్రెస్‌కు రాజీనామా చేసి 1948లో SCFలో చేరాడు. B P మౌర్య అలీగఢ్‌కు తిరిగి వచ్చాడు మరియు అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో తన L. Sc, LLB మరియు LLM పూర్తి చేసాడు. అక్కడే  B P మౌర్య 1960లో రాజ్యాంగ చట్టం యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యాడు.

B P మౌర్య ఉత్తరప్రదేశ్‌లో RPI యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు అయ్యాడు. B P మౌర్య 1957లో అలీగఢ్ లోక్‌సభ స్థానంలో పోటీ చేసి ఓడిపోయాడు, కానీ 1962లో గెలిచాడు. 1960ల ప్రారంభం నాటికి, మౌర్య అలీఘర్ జిల్లాలోని జాతవ్‌ల ఆరాధ్యదైవం అయ్యాడు, మరియు B P మౌర్య కీర్తి, ప్రభావం చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. B P మౌర్య జాతీయ హోదా కలిగిన షెడ్యూల్డ్ కుల రాజకీయ నాయకుడు ఎదిగాడు.

అల్లర్లు జరిగిన సమయంలో AMU ప్రొక్టర్‌గా డాక్టర్ అబ్దుల్ బషీర్ ఖాన్ ఉన్నారు. డా. అబ్దుల్ బషీర్ ఖాన్, అలీఘర్ ముస్లిం యూనివర్శిటీలో న్యాయశాస్త్ర ప్రొఫెసర్.

ఒక కమిటీ ఏర్పాటు చేయబడింది మరియు AMU అధ్యాపకులు పశ్చిమ UP అంతటా భావసారూప్యత గల రాజకీయ నాయకులను కలిశారు. విద్యార్థుల సహాయంతో AMU అధ్యాపకులు కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించారు. B. P. మౌర్య అప్పటికే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (RPI) సభ్యుడు. AMU అధ్యాపకులు ఆర్పీఐ RPI అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. కొన్ని నియోజకవర్గాల్లో, ఇతర అభ్యర్థులు, ఎక్కువగా స్వతంత్రులకు , RPI ద్వారా మద్దతు ఇచ్చారు.

1962లో జరిగిన విధానసభ, లోక్ సభ ఎన్నికల్లో RPI/ఆర్పీఐ అందరినీ ఆశ్చర్యపరిచింది. RPI/ఆర్పీఐ పార్టీ 3 లోక్‌సభ మరియు 8 విధానసభ స్థానాలను గెలుచుకుంది మరియు దాని మిత్రపక్షాలు అనేక స్థానాలను గెలుచుకున్నాయి. మొట్టమొదటి దళిత ముస్లిం కూటమి ఏర్పడినది మరియు  B. P. మౌర్య ఒక నినాదం ఇచ్చారు. "ముస్లిం జాతవ్ భాయ్ భాయ్, బిచ్ మే హిందూ కహా సే ఆయీ" (ముస్లింలు మరియు జాతవ్‌లు సోదరులు, వారి మధ్య రావడానికి హిందువులు ఎవరు).

బి.పి.మౌర్య స్వయంగా అలీగఢ్ లోక్‌సభ స్థానంలో పోటీ చేసి విజయం సాధించారు. బి.పి.మౌర్య 73,571 ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థి జర్రార్ హైదర్‌ను మూడో స్థానానికి నెట్టారు.

అబ్దుల్ బషీర్ ఖాన్ ఆర్పీఐ అభ్యర్థిగా అలీగఢ్ విధానసభ స్థానంలో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అనంత్‌రామ్ వర్మపై అబ్దుల్ బషీర్ ఖాన్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లలో బషీర్‌కు 42.70%, వర్మకు 31.50% ఓట్లు వచ్చాయి.

ముస్లిం-ఆధిక్యత మరియు అల్లర్లతో ప్రభావితమైన మొరాదాబాద్ లోక్‌సభలో RPIకి చెందిన ముజఫర్ దాదాపు 12,000 ఓట్ల తేడాతో తిరిగి ఎన్నికైనారు. . అలీఘర్ జిల్లాలో భాగమైన హత్రాస్ లోక్‌సభ స్థానాన్ని కూడా RPIకి చెందిన జోతి సరూప్ గెలుచుకున్నారు.

పశ్చిమ UPలోని అమ్రోహా, బరేలీ, ఆగ్రా, ఫిరోజాబాద్ మరియు ఇతర ముస్లిం ప్రాబల్యం ఉన్న లోక్‌సభ స్థానాల్లో RPI బాగా పనిచేసింది. 1962 లోక్‌సభ ఎన్నికలలో UPలో పోలైన ఓట్లలో RPI 4.26% పొందినది. 22 స్థానాల్లో పోటీ చేసిన RPI 3 స్థానాలను గెలుచుకుంది. ఇతర నియోజకవర్గాల్లో దాని మిత్రపక్షాలు కాంగ్రెస్ ఆధిపత్యానికి సవాల్ విసిరాయి.

UPవిధానసభ ఎన్నికలలో, RPI 123 స్థానాల్లో పోటీ చేసి 12.32% ఓట్లతో 8 స్థానాలు గెలుచుకుంది. ముస్లింలు అధికంగా ఉండే పశ్చిమ యూపీలో విజయం సాధించింది. మహమూద్ హసన్ ఖాన్, సంభాల్ నుండి, హలీముద్దీన్, మొరాదాబాద్ సిటీ నుండి, పురుషోత్తం లాల్ బద్వార్, ఉజాని (బదౌన్)నుండి, భగవాన్ దాస్, ఫిరోజాబాద్  నుండి, బన్వారీ లాల్, ఫతేహాబాద్ నుండి, ఖేమ్ చంద్, ఆగ్రా సిటీ నుండి, అబ్దుల్ బషీర్ ఖాన్, అలీఘర్ నుండి, భూప్ సింగ్, కోయిల్ నుండి గెలిచారు. దాదాపు, పశ్చిమ యూపీ ప్రాంతంలోని,  ప్రతి విధానసభ స్థానంలో RPI అభ్యర్థులు విజేత లేదా రన్నర్‌అప్‌గా నిలిచారు.

అనేక స్థానాలను మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. ఉదాహరణకు, అలీగఢ్ జిల్లాలోని ఇగ్లాస్ విధానసభ స్థానం, AMU-RPI గ్రూపు మద్దతు ఉన్న ఠాకూర్ శివధాన్ సింగ్ (స్వతంత్ర అభ్యర్థి) గెలిచారు.

B. P. మౌర్య మరియు అబ్దుల్ బషీర్ ఖాన్ ఏనుగు ఎన్నికల గుర్తు తో RPIకి పునాది వేశారు, ఈ గుర్తును తర్వాత BSP కు చెందిన కాన్షీరామ్ స్వీకరించింది. ముస్లిం జాతవ్ కూటమి తరువాత పశ్చిమ యుపిలో బిఎస్పి రాజకీయాల ఉప్పెనకు మార్గం సుగమం చేసింది. ఈ ఎన్నికలు పశ్చిమ యుపిలో రాజకీయ శక్తిగా కాంగ్రెస్ ఆధిపత్యాన్ని కూడా ముగించాయి మరియు ఈ కుదుపు నుండి అది ఎప్పటికీ కోలుకోలేకపోయింది.

 

 


No comments:

Post a Comment