30 July 2016

భారతదేశం లో 'బిచ్చగాడు' అని వర్గీకరించబడిన ప్రతి 4 లో ఒక వ్యక్తి ముస్లిం.


అధికారికంగా భారత దేశం లో  ఉన్న  3.7 లక్షల 'బిచ్చగాళ్ళ' జనాభాలో ముస్లింల వాటా దేశ జనాభాలో ముస్లిం కమ్యూనిటీ వాటా కంటే ఎంతో పెద్దది.

యాచించడం భారతదేశం లో చట్టవిరుద్ధం. భారతదేశం జనాభాలో 14.23% ముస్లింలు ఉన్నారు. అయితే 2011 సెన్సస్ ప్రకారం బిచ్చగాళ్ళు గా నమోదు చేసిన  3.7 లక్షల మంది  వ్యక్తులలో ముస్లింలు   సుమారు 25%గా ఉన్నారు.

గత నెల విడుదల అయిన  సెన్సస్ 2011 డేటా విశ్లేషణ  లో  మతo ఆధారంగా “కార్మికులు కాని వారిగా” (deemed ‘non workers’)   లెక్కించబడిన వారిలో అధికులు ముస్లింలు. అయితే కొందరు మానవ హక్కుల కార్యకర్తల వాదన ప్రకారం  నిర్దిష్ట సమూహాలకు లేదా పౌరుల సమూహాలకు పరిమితంగా లేదా అసమానo గా ప్రభుత్వ పథకాలు మరియు సేవలు అందుబాటులో ఉన్నాయని అవి  వారిని మరింత పేదరికం లోనికి నేడుతుంన్నావని  వాదించు చున్నారు.

ఏ ఆర్థిక కార్యకలాపంలో పాల్గొనని వ్యక్తులు -చెల్లించే లేదా చెల్లించబడని - గృహ విధులు, లేదా వ్యవసాయం లో ఉన్నవారిని “నాన్ వర్కర్స్” గా” జనగణన(senses)లో నిర్వచించబడ్డారు.
సెన్సస్ డేటా ప్రకారం మొత్తం 72.89 కోట్ల మంది కార్మికులు కానివారుగా ఉన్నారు. వారిలో  3.7 లక్షల బిచ్చగాళ్ళు ఉన్నారు. 2001 లో జరిగిన సెన్సస్ లో బిచ్చగాళ్ళు సంఖ్య 6.3 లక్షలుగా ఉంది. ఈ సంఖ్య 2011 లో 41% తగ్గినది.  
.
బిచ్చగాళ్ళుగా  వర్గీకరించబడిన వ్యక్తుల జాబితా  లో  ముస్లింలు అసాధారణ శాతం లో  ఉన్నారు. దేశం మొత్తం బిచ్చగాళ్ళ జనాభా 3.7 లక్షలు అందులో  నాలుగోవంతు అనగా – 92,760 మంది ముస్లింలు.

హిందువులు భారతదేశం యొక్క జనాభా లో 79.8% ఉన్నాయి, కానీ వారిలో  2.68 లక్షల మంది వ్యక్తులు  బిచ్చగాళ్ళ జనాభాలో 72.22% గా  ఉన్నారు. జనాభాలో 2.3% ఉన్న  క్రైస్తవులు, బిచ్చగాళ్ళ  జనాభా లో  3,303 వ్యక్తులు గా అనగా  0.88% ఉన్నారు. బౌద్ధులు (0.52%), సిక్కులు (0.45%), జైనులు (0.06%) మరియు ఇతరులు (0.30%) ఉన్నారు.

మరింత విస్మయకరంగా   ముస్లిం మహిళలు, ముస్లిం పురుషులకన్నా అధికంగా బిచ్చగాళ్ళుగా ఉన్నారు. మరియే  ఇతర వర్గంలో ఇంతమంది స్త్రీ బిచ్చగాళ్ళు లేరు. కేవలం “ఇతరత్రా” 'అని వర్గీకరించబడిన వారు తప్ప. బిచ్చగాళ్ల జాతీయ సగటు స్త్రీల లో 46.87% ఉండగా,  పురుషులలో  53.13% గా  ఉంది.  ముస్లింలలో ఈ  నిష్పత్తి 43.61% పురుష బిచ్చగాళ్ళు మరియు 56.38% మహిళా బిచ్చగాళ్ళు గా ఉంది.

"పేదరికo అనేది  పౌరులకు భద్రతను అందించడం లో  ప్రభుత్వ కార్యక్రమాల వైఫల్యం ఫలితమే అని  చెప్పవచ్చు.ప్రభుత్వ  సేవలు మరియు ప్రభుత్వ కార్యక్రమాలు  తక్కువ అందుబాటు లో ఉండుట వలన అధికులు పేదరికం తో భాధ పడుతున్నారు, దీనికి ఉదాహరణ సమాజంలో కొన్ని సమూహాలు అని బొంబాయి లోని TISS కు చెందినఇల్లు లేనివారికి మరియు పేదల ఫీల్డ్ ప్రాజెక్ట్ “కోషిష్”యొక్క కొ-అర్దినేటర్ మహమ్మద్ తారిక్  చేప్పారు.

2001 సేన్సస్ ప్రకారం బిచ్చగాళ్ళ జనాభా                 = 6,30,940
(ప్రతి లక్ష మంది పౌరులకి 61మంది బిచ్చగాళ్ళ ఉన్నారు).
2011 సేన్సస్ ప్రకారం బిచ్చగాళ్ళ జనాభా                 =3,72,217.
(ప్రతి లక్ష మంది పౌరులకి  30మంది బిచ్చగాళ్ళ ఉన్నారు)
కమ్యూనిటి
సంఖ్య
దేశ జనాభా లో వారి శాతం
బిచ్చగాళ్ళ లో వారి శాతం
హిందువులు
266837
79.8%
72.2%
ముస్లిమ్స్
 92760
14.2%
24.5%
క్రైస్తవులు
  3303
  2.30%
 0.88%
సిక్కులు
 1677
  1.72%
 0.45%
బౌద్ధులు
 1963
  0.70%
 0.52%
జైన్స్
  241
  0.37%
 0.06%
ఇతరులు
 1121
  0.66%
 0.3%
మతం అంటే తెలియని వారు
 2370
  0.24%
 0.62%

  
మొత్తం బిచ్చగాళ్ళ లో స్త్రీ-పురుష శాతం
కమ్యూనిటీ
పురుషులు
స్త్రీలు
హిందువులు
151343 (56.29%)
117494 (43.70%)
ముస్లిమ్స్
  40454 (43.61) 
 52306 (56.38%)
క్రైస్తవులు
  1693 (51.25%)
  1610 (48.74%)
సిక్కులు
  1078 (64.28)
    599 (35.71%)
బౌద్ధులు
  1048 (53.38%)    
    915 (46.61%)
జైన్లు
    128 (53.11%)
    113 (45.88%)
ఇతరులు
    553 (49.11%)
    573 (50.88%)
మొత్తం
197725(53.12%)
174492(46.87%)
2011 సెన్సెస్ ఆధారంగా



భారతదేశం లో యాచించడం చట్టవిరుద్ధం, మరియు దానికి 3-10 సంవత్సరాలవరకు  ఖైదు లో శిక్షింపబడతారు.1959 బొంబాయి యాచక నిరోధక చట్టం  భారత దేశం లోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో అనుసరించబడతుంది. మానవ హక్కుల  కార్యకర్తలు అభిప్రాయం ప్రకారం చట్టం లో  బిచ్చగాళ్ళు కి  స్పష్టమైన వర్గీకరణ లేదు మరియు వివిధ పట్టణాలకు వలస వెళ్ళేవ ఇళ్లులేని మరియు భూమిలేని కూలీలు బిచ్చగాళ్ళుగా  వర్గీకరించబడుతున్నారు. . అనేకభారతదేశం యొక్క చట్టాల వలె, యాచక నిరోధక చట్టం ఒక ప్రాచీన బ్రిటీష్ చట్టం ఆధారంగాదేశ దిమ్మరులకు  వ్యతిరేకంగా రూపొందిoచబడినది.

1959 బొంబాయి యాచక నివారణ చట్టం కింద, జీవనానికి ఎలాంటి కనిపించే సాధనాలు లేక మరియు ఒక బహిరంగ ప్రదేశంలో దిమ్మరిగా తిరుగుతూ కనిపించేవారు ఎవరినైనా ఒక బిచ్చగాడు అని నిర్వచించవచ్చు.దిని ప్రకారం విధిలో పాటలు పాడటం,నృత్యం చేయడం, బవిష్యతు వివరించేవారు,  ప్రదర్సనలు ఇచ్చేవారు  కూడా బిచ్చగాళ్ళుగా  భావించబడతారు. 
       
ఎవరైనా ఒకరిని అతను బిచ్చగాడు లేదా తనను తాను పోషిoచుకోలేని  నిరాశ్రయుడు అని అనుమానం వస్తే అతనిని అరెస్ట్ చేయడానికి పోలీసులకు విచక్షణ అధికారoఉంది.

.మానవ హక్కుల కార్యకర్తల అభిప్రాయం ప్రకారం చట్టం యాచకులకి పునరావాసం కల్పించుట కాకుండా, పేద మరియు మానసిక అనారోగ్యం బాధపడుతున్న వారిని చట్టం పేరున  శిక్షిస్తుంది. . బీహార్ వంటి కొన్ని రాష్ట్రాలు బిచ్చగాళ్ళు పునరావాసానికి కార్యక్రమం చేపట్టాయి. కానీ మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాల్లో వీధిలో యాచిస్తూ  కనిపించే ఒక వ్యక్తిని పట్టుకొని జైలులో పెడుతున్నారు.

స్వాతంత్రం వచ్చి 60 ఏళ్ళు గడుస్తున్నా దేశం లోని వెనుకబడిన వర్గాల /అల్పసంఖ్యాకుల పరిస్థితులలో మార్పు రాలేదు. దేశ ప్రగతి ఫలాలు వారికి అందుబాటులో రాలేదు. వారి పట్ల ఇంకా వివక్షత  ఇంకా కొనసాగుతు  ఉంది. 2006 లో ఏర్పాటు చేసిన సచార్ కమిటి ఆనంతరం ఎర్పాటు చేసిన రంగనాథ మిశ్రా కమిటి, కుందు కమిటి  నివేదికలు భారత దేశం లోని అల్పసంఖ్యాకులు ముఖ్యంగా ముస్లిమ్స్ పరిస్థితి ఎస్.సి./ఎస్.టి. కన్నా దుర్భరంగా ఉన్నాయి అని చెబుతున్నాయి. వారు సామాజిక,ఆర్ధిక ,రాజకీయ మరియు ఉపాధి రంగాలలో ముందుకు రావాలంటే రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొన్నాయి.

సచార్ కమిటి నివేదిక అనంతరం అమలు చేసిన ప్రధాన మంత్రి 15 సూత్రాల మైనారిటీ అభివృద్ధి పదకం, మైనారిటీ సంక్షేమ శాఖ అమలు జరిపే అనేక పదకాలు వారి స్థితిగతులలో మార్పులు తేలేక పోయినవి. చిత్తశుద్ది మరియు పారదర్సకత లేక ఆ పధకాల అమలులో అనేక అడ్డంకులను ఎదుర్కొంటున్నవి.
2011 జనాభా లెక్కల విశ్లేషణ ఒక బయంకరమైన నిజాన్ని వెలుగులోనికి తెచ్చింది.  భారత దేశం లోని యాచకులలో అత్యధికులు ముస్లిమ్స్. ఇంకా ఆశ్చర్యకరమైనా విషయం వారిలో స్త్రీ యాచకుల సంఖ్య పురుష యాచకుల కన్నా అదికం మరియు శాతం దృష్ట్యా అన్ని వర్గాల స్త్రీల కన్నా అధికం. ఇది ఎంత సిగ్గు పడవలసిన విషయం. దేశ జనాభాలో 14% ఉన్న ముస్లిమ్స్ లో యాచకుల సంఖ్య వారి జనాభా నిష్పతి కి మించి 25% వరకు ఉంది.

మతరిత్యా  ఇస్లాం లో యాచన నిషేధం. అనేక హదీసుల ప్రకారం ప్రవక్త (స) యాచనను నిరసించారు. దానికి బదులు కాయకష్టం చేసి  తన జీవనోపాధిని స్వయంగా సoపాదిoచుకోమన్నారు. కాయకష్టo చేసిన దానితోనే తన జీవనాన్ని ప్రవక్త దావూద్ కొనసాగించేవారు. కాయకష్టానికి, శ్రమైక్య జీవనానికి ప్రాధన్యత ఇచ్చిన ధర్మం ఇస్లాం ధర్మం. అటువంటి ధర్మావాలoబికులే స్వతంత్ర భారత దేశం లో యాచన లో ముందు ఉన్నారని తెలిసి చాల భాదపడుతున్నాను.

ఇస్లాం ధర్మం లో ఆర్ధిక సమానత్వ సాధనకు జకాత్, సదకా వంటి మంచి సాధనాలు ఉన్నాయి. అవి పేదవారికి సహాయపడి ఆర్ధిక సమానత్వం సాధనకు తోడ్పడును. అదేవిధంగా ఇస్లాం మూలసుత్రాలలో   జకాత్ చేరినది. నేటి ముస్లిమ్స్ ఇస్లామిక్ మూలవిశ్వాసాలను పాటించుట లేదు. కేవలం నమాజ్ ఆచరణ తో తమ బాద్యత తీరినది అనుకొంటున్నారు.

ఇప్పటికైనా ముస్లిమ్స్ తమ అంధ;విశ్వాసాలను, పద్దతులను విడనాడి విద్యావంతులు కానిదే వారి పరిస్తితులు మెరుగు పడవు. దివ్య ఖురాన్ లో అల్లాహ్ స్వయంగా అంటాడు తమను తాము మెరుగు పరుచుకొని జాతిని అల్లాహ్ కూడా మెరుగు పరచ లేడు”. ఇది నిజం, వాస్తవం.



No comments:

Post a Comment