25 September 2016

ఇస్లాంధర్మం పై మహాత్మా గాంధీ అభిప్రాయలు




ఇస్లాం అనే పదమునకు   శాంతి అని అర్థం.గాంధీజీ కి ఇస్లాం తో పరిచయం అతని చిన్నతనం లోనే జరిగింది. గుజరాత్ లో ముస్లిం వర్తక బృందాలు ఉండేవి. ముస్లింలు అతిధులుగా గాంధీ ఇంట ఆహ్వనింప బడేవారు.  అతని బాల్యం ముస్లిం పొరుగున జరిగింది. అతని కుటుంభ సబ్యులకు ముస్లింలతో మంచి సంభందాలు ఉండేవి. స్కూల్ లో అతను ఇతర మతస్తుల పిల్లలతో స్నేహం చేసి వారి ఆచార వ్యవహరముల పట్ల అదరం చూపేవాడు. 

గాంధిజీ విదేశాలలో ఉన్నతోబ్యాసం పూర్తి చేసుకొని తన స్వస్థలం కు బారిస్టర్ గా తిరిగి వచ్చినప్పుడు అతను ఒక ముస్లిం కంపనీ తరుఫున దక్షిణ ఆఫ్రికా పంపబడినాడు.  సౌత్ ఆఫ్రికా లో అనేక మంది ముస్లిం వర్తకులతోను ఇండియా తిరిగి వచ్చిన తరువాత బొంబాయి లో మరియు పోర్బందర్ లో  అనేకమంది ముస్లింలతో గాంధీకి పరిచయం ఏర్పడినది మరియు వారి ఇంట ఆతిద్యం గాంధి స్వీకరించెవాడు. దాదాపు 20సంవత్సరాల పాటు   వారి అలవాట్లు, వారు మత విశ్వాసాలతో గాంధి కి పరిచయం ఏర్పడినది.  ముస్లిం స్నేహితులు అతనిని తమ కుటుంభ సబ్యునిగా పరిగణించేవారు. వారి స్త్రీలు అతని ముందు పరదా పాటించేవారు కాదు. సౌత్ ఆఫ్రికా లో అతని అనుచరుల్లో అనేకమంది ముస్లిమ్స్ కలరు.

ఇంగ్లాండ్ లో విద్య నబ్యసించెటప్పుడు గాంధీ థామస్ కార్లైల్ యొక్క సుప్రసిద్ధ ఉపన్యాసం “ The Hero as Prophet” ను చదివాడు. ఆ వ్యాసం లో గాంధీ ప్రవక్త (స) గొప్ప తనం, అతని నిరాడంబర జీవితాన్ని గాంధీ  గమనించాడు. ప్రవక్త(స) పట్ల అతనిలో గౌరవ భావము ఏర్పడినది. అదేవిధంగా గాంధీ షిబ్లినుమని పుస్తకం “Biographips of Muslim Heroes” మరియు సయ్యద్ అమీర్ అలీ  “ఇస్లామిక్ చరిత్ర” చదివాడు. వీటి పఠనం వలన గాంధి లో ప్రవక్త(స) గొప్పతనం అర్ధమైనది.తన రచనలలో గాంధీజీ కార్లైల్, నుమాని, అమీర్ అలీ పుస్తకాలను ప్రస్తావించే వాడు.

తరువాత కాలంలో ప్రసిద్ద ఇస్లాం పండితులు మౌలానా ముహమ్మద్ అలీ జుహర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, హకీమ్ అజ్మల్ ఖాన్, జాకీర్ హుస్సేన్, ముహమ్మద్ ముజీబ్, షేక్ అబిద్ హుస్సేన్ వంటి పండితుల సాంగత్యం వాళ్ళ గాంధీ ఇస్లాం గురించి విస్తృతంగా తెలుసుకొన్నారు.

గాంధీ ముస్లిం మిత్రులు జామియా మిలియా స్థాపించినప్పుడు గాంధీ  ప్రసిద్ద కవి అల్లమా ఇక్బాల్ ను ఆ విద్యాలయం లో దిరేక్తర్ గా చేరమని ఆహ్వానించారు. ఇది కొద్దిమందికి మాత్రమే తెలుసు. తన కుమారులలో ఒకరిని జామియా ఇస్లామీయ చదివించెను.

గాంధీజీ అల్లామా ఇక్బాల్ కవితలను ఆస్వాదించేవారు. వాటినుంచి తను  ప్రేరణ పొందేవారు. అయితే ఇక్బాల్ ఆ ఆహ్వానంను మృదువుగా తిరస్కరించెను. గాంధీ తన విద్యావిధానం “బెసిక్ ఎడ్యుకేషన్” కు జాకీర్ హుస్సిన్ ను ఇంచార్జ్ గా నియమించెను.

గాంధీ అలీ సోదరులు ప్రారంభించిన ఖిలాఫత్ ఉద్యమం కు తన పూర్తి సహాయ సహకారములు అందించెను.  ఖిలాఫత్ ఉద్యమం మరియు శాసనుల్లంఘన ఉద్యమం సందర్భంగా గాంధీ ప్రముఖ ముస్లిం నాయకులైన అలీ సోదరులు, ఇక్బాల్, అబుల్ కలాం ఆజాద్, జాకీర్ హుస్సియన్, వంటి వారితో మంచి సంభందాలు ఏర్పడెను. ఇటువంటి ఇస్లామిక్ పండితుల పరిచయం తో ప్రవక్త(స) పట్ల గాంధీకి గౌరవం ఏర్పడినది మరియు అతనిని విశ్వ నాయకుడి గా గుర్తించెను. ప్రపంచవ్యాప్తం గా కోట్లాదిమంది ని ప్రభావితం చేసిన ప్రవక్త(స) గురించి మరింత వివరంగా గాంధీ తెలుసుకోదల్చేను.

ప్రవక్త జీవిత చరిత్ర తో పాటు గాంధీ తరచుగా దివ్య కొరాన్ చదేవే వారు. తన ప్రార్ధనలలో దివ్య ఖురాన్ లోని సురా ఫాతెహా భాగము వినిపించేవారు. గాంధీ అన్నారు : “ఎందుకు హిందువులు కొరాన్ దివ్యత్వమును విశ్వసించరు మరియు ఎందుకు భగవంతుడు ఒకడే అని నమ్మరు, ముహమ్మద్ ను అతని ప్రవక్త అని విశ్వసించరు? మన మతం సంకుచితమైనది కాదు విస్తృత మైనది” అని ప్రశ్నించేవాడు.

మహాత్మా గాంధీ దివ్య ఖుర్ఆన్ మరియు ప్రవక్త(స)జీవిత చరిత్ర అయన హదిసుల    మీద అనేక పుస్తకాలు చదివినానని  పేర్కొన్నారు. ( గాంధీ, 1949, 235) ఆయన మౌలానా సాహిబ్ యొక్క “ప్రవక్త జీవితం” మరియు “ఉస్వ-ఎ-సహాబా” చదివినాడు మరియు ఇస్లాం మతం ఇతర  మతాల ప్రార్థనా స్థలాలు నాశనం చేయమని ఎప్పుడూ చెప్పలేదని  పేర్కొన్నారు. ( గాంధీ, 1949, 139)

ప్రవక్త(స) తరచూ ఉపవాసం మరియు ప్రార్ధనలో తన జీవితం గడిపేవారు  మరియు ప్రవక్త(స) ఏనాడు సుఖమైన మరియు  విలాసవంతమైన జీవనo గడప లేదని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ కి ఇస్లాం మతం పట్ల అపార గౌరవం ఉండేది. ( గాంధీ 1949, 94) ఇస్లాం బోధనలు  మరియు ఆచరణ లో ఇస్లాం యొక్క పద్ధతి కి మధ్య తేడా గమనించారు.గాంధీ  శాంతి మతం అని ఇస్లాం మతం భావిస్తారు.

గాంధీ అభిప్రాయం లో దివ్య ఖుర్ఆన్ లో మత మార్పిడి కి శక్తీ ఉపయోగించమని చెప్పలేదు అన్నారు. పైగా దివ్య ఖురాన్ లో ధర్మం విషయం లో ఎలాంటి బలవంతం లేదు అని చెప్పారు. ప్రవక్తలు అందరు   జీవితంలో మతం బలవంతం కాదు అని అంగీకరించడం జరిగింది. ఇస్లాం మతం దాని విస్తరణకు బలం మీద ఆధారపడాలని అనుకుంటే అది ఒక ప్రపంచ మతం హోదా ను కోల్పోవు తుంది అని  వాదించాడు. హరూన్-అల్ రషీద్, మామున్ (Mamun)రోజుల్లో ఇస్లాం మతం ప్రపంచం లో అత్యంత సహనం కల్గిన మతం గా ఉంది.

మహాత్మా గాంధీ, ఒక ముస్లిం వలే ఒక నిరాడంబరమైన ఇస్లామిక్ జీవితాన్ని గడిపాడు.
తన కొత్త పుస్తకం "ఫెయిత్ అండ్ ఫ్రీడం, మహాత్మా గాంధీ ఇన్ హిస్టరీ లో  అంతర్జాతీయంగా ప్రఖ్యాత చరిత్రకారుడు మరియు ఢిల్లీ లో జామియా మిల్లియా ఇస్లామియా మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ముషిరుల్ హసన్  మహాత్మా గాంధీ యొక్క జీవితము మరియు వారసత్వం పై ఒక రహస్యమైన విషయం - ముస్లింలతో అతని సాంగత్యంను  వివరిస్తారు: మహాత్మా గాంధీ యొక్క ముస్లింల పట్ల అభిమానం  అతని జీవితాన్ని  బలి తిసుకోంది అని చెప్పుకుంటారు ఎందుకంటే, ఒక హిందూ మతోన్మాది 1948 లో అతడిని హత్యచేసాడు.

హసన్ పుస్తకం  ముస్లింలపై  మహాత్మా గాంధీ కి ఉన్న  అపారమైన ప్రేమను  తెలియజేస్తుంది. ఒకసారి జైలులో ఆయన ఆత్రుతగా కొందరు ముస్లిం  ఖైదీలకు పాటు ఈద్ చంద్రుని  అవలోకనం కోసం తన మెడ సారించి చూసారు.  - మహాత్మా గాంధీకి  ముస్లిం నాయకులతో గొప్ప వ్యక్తిగత అవగాహన ఉంది కానీ, హసన్ ప్రకారం గాంధీ కి ఒక "పరిమిత లేదా ఒక నిర్దిష్ట అవగాహన" ఇస్లాం పట్ల కలిగి ఉండేది. ఇది దక్షిణాఫ్రికా మరియు వర్తక గుజరాతీ ముస్లిం కమ్యూనిటీ యొక్క ప్రారంభ అనుభందం  ద్వారా నిర్దేశించబడుతుంది.

దివ్య ఖురాన్ 5.48,11.118,  అద్యయాలలో  వివరించిన "సమానత్వం, సహనం, సరళత్వం" అనే భావనలు గ్రంధ ప్రజల కోసం  వివరించిన 3.64 అధ్యాయం లో కుడా ఉన్నవి.  మహాత్మా గాంధీ యొక్క విశ్వాసం మత గ్రంధాల పై ఆధారపడినది. న్యాయం, దయ మరియు ధర్మానికి సంభందించిన  మానవాళి యొక్క గొప్ప ఆలోచనలు కొన్ని మతం నుండి వచ్చినవె? అని గాంధీ  భావం. మహాత్మా గాంధీ దేశ విభజన ఆపలేకపోయాడు.అతను కొత్తగా ఏర్పాటు పాకిస్థాన్ హక్కుల కు మద్దతు తెలిపాడు. అందువలననే రొమైన్ రోల్యాండ్ గాంధీని "మొర్తల్ డెమి-గాడ్"(Mortal Demy-God) గా పిలిచాడు.

 అబ్డుల్లాః సుహ్రవర్డి రచించిన “Sayings of Muhammad” అనే గ్రంధానికి ముందు మాట రాస్తూ మహాత్మా గాంధీ ఇలా ప్రకటించారు: "మనము మన మతం లాగ ఇతర మతాలను అర్ధం చేసుకొని గౌరవించనంత కాలం ఈ భూమి మీద శాశ్వత శాంతి ఉండదు."

MJ అక్బర్ దీన్ని మరింతగా విశదీకరించారు: " మహాత్మా గాంధీ యొక్క నిబద్ధతను కేవలం   ఒక మతానికి పరిమితం చేయలేము అతని   రామ రాజ్యo లో, ప్రతి మతానికి పూర్తి స్వేచ్ఛ మరియు పూర్తి సమానత్వం ఉంది. అతని ప్రార్థన సమావేశాలు లలో భగవద్గీత, పవిత్ర ఖురాన్, బైబిల్ మరియు గురు గ్రంథ సాహెబ్ కు చోటు ఉంది”.  

గాంధీ ప్రకారం దివ్య ఖురాన్ యొక్క ఆత్మ శాంతి భోధన తో కూడినది(గాంధి1949, 263,131). ఒక మతము దాని విశ్వాసుల ప్రవర్తన పై ఆధార పడి ఉంటది. ఇస్లాం లో విశ్వాసి ప్రవర్తన కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడినది (గాంధి 1949, 72).
ముస్లింలను ప్రేమ తో జయంచమని గాంధీ కోరినారు.(గాంధీ, 1949, 24, 26) ముస్లింల హృదయాలను అహింసా మార్గాన క్షమా గుణం అలవారచుకోవటం ద్వార గెలవాలని అదేవిధంగా ఒకరి తప్పులను ఒకరు క్షమించాలని కోరినారు. మత విషయం లో హింస పనికి రాదని గాంధీ అభిప్రాయ పడినాడు.  (గాంధీ 1949, 47)
తప్పును ఎదిరించాలిగాని తప్పు చేసిన వానిని కాదు అనే దానిని  గాంధీ నమ్మాడు(గాంధీ,1949, 163.) జీవించు, ఇతరులను జివించనీయుము(లైవ్ అండ్ లైవ్) అనేది గాంధీ ఉద్దేశం. గాంధీ ఈ సూత్రమును దివ్య ఖురాన్ గ్రంధం నుండి అబ్యసించినాడు(గాంధీ,1949, 236) గాంధీ అభిప్రాయం లో మతము, మనుషులను కలుపును గాని విడదియదు కాబట్టి ఇస్లాం కేవలం ముస్లింలను మాత్రమే కాకా అందరు మానవుల ఐక్యతకు సహాయపడును. ప్రవక్త ముహమ్మద్ యొక్క బోధనలు కేవలము ముస్లింలకు గాక సమస్త మానవాళికి వర్తించును. బిన్నముగా పలికిన వ్యక్తి ముస్లిం కాదు అనెను (గాంధీ,  1949, 310)
మహాత్మా గాంధీ బెంగాల్ పర్యటన లో తన వెంట గీత, దివ్య ఖురాన్, బైబుల్ గ్రంధాలను తీసుకోని వెళ్ళేవారు.  (గాంధీ 1949, 500) ఇస్లాం చదివి అర్ధం చేసుకోనే హక్కు  అందరికి ఉన్నదని నమ్మినాడు. ఇస్లాం సమస్త మానవాళికి అవతరించిన గ్రంధం అని నమ్మినాడు. తానూ అన్ని మతాలకు  చెందిన వాడినని గాంధీ భావించెను.(గాంధీ, 1949, 538) తన ప్రార్ధన లలో గాంధి కురానే షరిఫ్ నుంచి కొన్ని సూక్తులను ఉల్లేకిoచే వారు. కురాన్ సూక్తులు లేకుండా తన ప్రార్ధనలు నిర్వహించే వారు కాదు. (గాంధి,1949, 584).
ప్రవక్త ముహమ్మద్(స) ను తన ప్రవక్త గా ఎందుకు భావించ రాదు అని ప్రశ్నించే వారు?  (గాంధీ 1949, 589)

నిజమైన విశ్వాసి నాలుక మరియు చేతుల యందు మానవాళి సురక్షితంగా ఉండును అనే ప్రవక్త(స) హదీసు అందు మహాత్మా గాంధీ కి నమ్మకముంది. అదేవిధంగా తను కోరుకొన్నది తన సోదరుడి కి కుడా విశ్వాసి కోరును మరియు జిహాద్ అనగా ఆత్మ (అహం) ను జయిoచుట, కష్టం లో ఉన్న తోటి మానవునకు సహయపడమన్న  ప్రవక్త(స) వాక్కుల అందు  గాంధీజీ విశ్వాసం ఉంచెను. (గాంధీ,1949, 509)

గాంధీ ఖలీఫా  అలీ మరియు అతని కుమారులు హసన్ మరియు హుస్సియన్ పట్ల అమిత గౌరవం ప్రదర్శించేవాడు. నిరంకుశత్వం కు  వ్యతిరేకంగా అలీ కుమారుల  పోరాటం తనకు ప్రేరణ అని అన్నారు.
గాంధీ వివిధ మతాల మద్య పరస్పర విశ్వాసం మరియు గౌరవం కొరకు మతాంతర వివాహములను కోరుకొనెను. గాంధీ కి రాజ్య మతం లో విశ్వాసము లేదు. అన్ని మతాలను గౌరవించే ప్రభుత్వం ను కోరుకొనెను. (గాంధి,1949, 543) 



No comments:

Post a Comment