9 November 2018

ఉన్నత విద్య లో పెరిగిన స్త్రీల, ముస్లింల ఎన్రోల్మెంట్





ఆర్థిక మరియు సామాజిక దుర్బలత్వం నుండి బయటపడటానికి విద్య ఒకేటే సాధనమని భారతీయుల మధ్య అవగాహన పెరుగుతుంది. ఉన్నత విద్య నమోదులో  ముస్లింలు మరియు మహిళల ముందంజ వారి సామాజిక-ఆర్థిక వెనుకబడటాన్ని పరిష్కరించడానికి సహాయపడుతుంది.

అఖిల భారత సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2016-17 ప్రకారం దేశంలో ఉన్నత విద్య ఎన్రోల్మెంట్/నమోదులో మహిళలు మరియు ముస్లింల సంఖ్యపెరిగింది.ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2016- 17 నివేదిక ప్రకారం ఉన్నత విద్యలో మొత్తం ముస్లింల నమోదు 37% పెరిగింది మరియు ముస్లిం  మహిళల నమోదు శాతం ఉన్నత విద్యలో  45% పెరిగింది.

పెరిగిన ముస్లిం ఎన్రోల్మెంట్:


·        గత ఐదు సంవత్సరాల్లో ఉన్నత విద్యాసంస్థలలో నమోదైన ముస్లింల సంఖ్య 37% పెరిగినది. ఇది అన్ని వర్గాల విద్యార్ధులలో  18% పెరుగుదలగా  ఉంది.


·        గత ఐదు సంవత్సరాల్లో ఉన్నత విద్య లో ముస్లిముల నమోదు శాతం  37% పెరిగినది మరియు  ముస్లిం మహిళల నమోదు శాతం 45% పెరిగింది.
  
·        ముస్లిం మహిళల నమోదు 2010-11లో 12 మిలియన్ల నుంచి 2017-18 లో 17.4 మిలియన్లకు పెరిగినది అనగా  45 శాతం పెరిగింది అని  అల్ ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2016-17 నివేదిక తెలుపుతుంది.


·        2013-14 సంవత్సరంలో భారతదేశ ఉన్నత విద్యా వ్యవస్థలో 12.80 లక్షల మంది ముస్లిం విద్యార్ధులు ఉన్నారు, వారు మొత్తం విద్యార్ధుల సంఖ్య లో  4 శాతం మాత్రమె  ఉన్నారు. అప్పటి నుండి, ప్రతి సంవత్సరం స్థిరమైన పెరుగుదల ఉంది.

·        లింగ సమానత్వం అన్ని వర్గాలలో మెరుగుపడింది.


·        గత ఐదేళ్ళలో ముస్లిం మహిళల నమోదు  46 శాతం పెరిగింది.  కాగా అన్ని వర్గాల నమోదు 24 శాతానికి పెరిగింది అని  సర్వే వెల్లడించింది.

·        గత ఐదు సంవత్సరాల్లో ముస్లిం మహిళల నమోదు నిష్పత్తి మరియు మొత్తం ముస్లింల నమోదు నిష్పత్తి, సాధారణ నిష్పత్తి కంటే 1 పాయింట్ అధికంగా ఉంది.


·        తాజా నివేదిక ప్రకారం, ఉన్నత విద్యలో చేరిన ముస్లింలలో 49 శాతం మహిళలు కాగా  మొత్తం లో అది  48 శాతంఉంది.

·        ముస్లిం పురుషుల సంఖ్యలో పెరుగుదల శాతం 2013-14 నాటికి రెండింతలు పెరిగిoది.


·        2001 లో  సచార్ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం గ్రాడ్యుయేట్లలో  ముస్లింల సంఖ్య కేవలం 6.3% ఉంది. అది ఎస్సీలు / ఎస్టీల వాటా  8.2% కంటే తక్కువగా ఉంది.

·        20 సంవత్సరాలు అంతకంటే వయస్సు అధికంగా  ముస్లిం యువకులలో  గ్రాడ్యుయేట్లు కేవలం 3.6% ఉన్నారు.


·        ఉన్నత విద్యలో ముస్లింల  స్థూల నమోదు నిష్పత్తి 5.2% ఉంది. అది అన్ని సామాజిక-మత వర్గాలతో పోలిస్తే  చాలా తక్కువ.


·        ఇటీవలి ఉన్నత విద్య నమోదు గణాంకాలలో ముస్లిం పురుషులు మరియు మహిళల పెరుగుదల వలన ముస్లిం కమ్యూనిటీ భవిష్యత్తు ఆశాజనకం గా ఉంటుంది.

·        అయితే, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఉన్నత విద్యలో చేరే  ముస్లింలు అతి తక్కువ ఉన్నారు.
·        రాజస్థాన్ యొక్క మొత్తం జనాభాలో ముస్లింల శాతం 9% కంటే ఎక్కువగా ఉన్నారు  కాని  ఉన్నత విద్యలో వారి నమోదు శాతం  కేవలం 2.65% మాత్రమే ఉంది.

·        రాజస్తాన్ లోని ఇతర వర్గాలతో పోల్చినప్పుడు  2016-17లో 33,794 మంది ముస్లింలు ఉన్నత విద్య లో ఎన్రోల్ అవగా 2017-18లో అది  38,556 కు చేరుకొంది అని ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2016- 17 తెల్పుతుంది.


·        దేశంలోని ఉపాధ్యాయుల సంఖ్య లో  జనరల్ కేటగిరీ నుంచి 56.8%, ఎస్.సి. నుంచి  8 శాతం మరియు ఎస్టి 2.27 శాతం ఉన్నారు. అది వారి  రిజర్వేషన్ కోటా వరుసగా 15 శాతం, 7.5 శాతం కన్నా తక్కువ.

·        దేశంలోని ఉపాధ్యాయుల సంఖ్య లో  ముస్లిమ్స్  కేవలం 5% మాత్రమే ఉన్నారు.


స్త్రీల ఎన్రోల్మెంట్- ప్రగతి:

మహిళల నమోదు 45% పెరుగుదలను చూపించింది

·        మహిళల ఎన్రోల్మెంట్/నమోదు 2010-11లో 12 మిలియన్ల నుండి 2017-18 లో 17.4 మిలియన్లకు అనగా  45% పెరిగింది.

·        2010-11లో పీహెచ్డీ, ఎంపీహిల్, పిజి ఎన్రోల్మెంట్/నమోదులలో మహిళల వాటా పురుషలలో సగం కంటే తక్కువగా ఉండేది.


·        కాని 2017-18 లో MPhil మరియు పిజిలలో  మహిళల విద్యార్థుల ఎన్రోల్మెంట్/నమోదు సంఖ్య మగ విద్యార్థుల సంఖ్యను  మించిపోయింది
.  
·        మొత్తం MPhil విద్యార్థులలో  64% మంది మరియు మొత్తం పిజి విద్యార్ధులలో  53.8% విద్యార్ధులు మహిళలుగా ఉన్నారు.

·        ఈ సర్వే ప్రకారం మహిళలు తమ ఆధిపత్యాన్ని పోస్ట్గ్రాడ్యుయేట్ సైన్స్లో విభాగం లో కొనసాగించారు.
·        వారి ఎన్రోల్మెంట్ గత ఐదు సంవత్సరాలలో MSc మరియు MA కోర్సులలో గణనీయంగా పెరిగింది.

·        అయితే, ఉన్నత విద్యలో మహిళల ఎన్రోల్మెంట్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ విభాగాల్లో చాలా తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.


·        ఉదాహరణకు B.Tech కోర్సుల్లో 21.19 లక్షల మంది విద్యార్థులు ఎన్రోల్ కాగా వారిలో  72% పురుషులు ఉన్నారు.

·        అదేవిధంగా, BE లో, 18.2 లక్షల మంది విద్యార్ధులు ఎన్రోల్ కాగా వారిలో  71% మంది పురుషులు.


·        PG అయిన విద్యార్ధులలో లో పీహెచ్డీ కి ఎన్రోల్ అయినవారు 0.5% కంటే తక్కువగా ఉన్నారు.

·        ఇది పరిశోధనలో భారతదేశంలో కల మానవ వనరుల లోటును వెల్లడిస్తుంది.










No comments:

Post a Comment