4 March 2022

డాక్టర్ కిచ్లేవ్ & డాక్టర్ సత్యపాల్

 

డాక్టర్ కిచ్లేవ్ & డాక్టర్ సత్యపాల్ మహోన్నతమైన స్వాతంత్ర్య సమరయోధులు, వారి అరెస్టు జలియన్ వాలా బాగ్  ర్యాలీకి దారితీసింది. డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లేవ్ మరియు డాక్టర్ సత్యపాల్  అరెస్ట్ - అమృత్‌సర్‌లోని  జలియన్ వాలా బాగ్ ఊచకోత తో ముడిపడి ఉంది.

జనరల్ డయ్యర్ యొక్క బుల్లెట్ల ద్వారా "చెదరగొట్టబడిన" సమావేశం డాక్టర్ కిచ్లేవ్ మరియు డాక్టర్ సత్యపాల్ అరెస్టుకు నిరసనగా పిలువబడింది. ఏప్రిల్ 6 హర్తాళ్ సందర్భంగా ఇద్దరు మహోన్నత నాయకులు హిందూ-ముస్లిం ఐక్యతకు గొప్ప చిహ్నాలుగా ఉద్భవించారు మరియు ఏప్రిల్ 9న, ప్రజలు రామనవమి  ఉత్సవం సందర్భం గా జరిపిన ఊరేగింపులో  'కిచ్లేవ్ జీ కీ జై' మరియు 'సత్యపాల్ జీ కీ జై' నినాదాలు చేశారు. హిందువులు, ముస్లింలు బహిరంగంగా ఒకే గ్లాసులో నీళ్లు తాగుతున్నారన్నది ఇరువురు నేతలు చాటి చెప్పారు.

ఎంబ్రాయిడరీ శాలువాల వ్యాపారం చేసే ప్రముఖ కాశ్మీరీ వ్యాపారవేత్త డాక్టర్ కిచ్లేవ్ తండ్రి అజీజుదీన్ 19వ శతాబ్దంలో అమృత్‌సర్‌కు వెళ్లారు. అతను తన కుమారుడు  కిచ్లేవ్ ని ఇంగ్లాండ్ మరియు జర్మనీలకు పంపాడు, అక్కడ నుండి కిచ్లేవ్ PhD డిగ్రీని పొందాడు మరియు జవహర్లాల్ నెహ్రూతో సన్నిహిత సంబంధాలను కూడా పెంచుకున్నాడు.

కిచ్లూ అమృత్‌సర్‌ ప్రజల చే విస్తృతంగా ఆరాధించబడ్డాడు మరియు స్వాతంత్ర్య పోరాటంలో కిచ్లూ చేసిన త్యాగాలకు నివాళిగా దాదాపు ప్రతి దుకాణంలో కిచ్లూ చిత్రం వేలాడదీయబడింది. పొడవాటి, సొగసైన తెల్లటి ఖాదీ దుస్తులు ధరించి, కిచ్లూ తన మర్యాద మరియు అద్భుతమైన చిరునవ్వుకు ప్రసిద్ధి చెందాడు, ”అని అమృత్‌సర్‌కు చెందిన చరిత్రకారుడు ప్రొఫెసర్ విఎన్ దత్తా తన పుస్తకం యొక్క ముందుమాటలో గుర్తు చేసుకున్నారు.

" తన మరణానికి కొన్ని రోజుల ముందు, డాక్టర్ కిచ్లే, తనను మరియు సత్యపాల్‌ను అరెస్టు చేయకుంటే ఏప్రిల్ 10న అమృత్‌సర్‌లో తలెత్తిన అలజడులను నివారించవచ్చని ప్రొఫెసర్ దత్తాతో చెప్పారు. ప్రభుత్వం పూర్తిగా నిరంకుశంగా వ్యవహరిస్తోందని, ప్రజలు ఏమనుకుంటున్నారో, ఏమి కోరుకుంటున్నారో అర్థం చేసుకోలేదని” ఆయన అన్నారు. 

విభజన తర్వాత, డాక్టర్ కిచ్లెవ్ పాకిస్తాన్‌కు వెళ్లడానికి నిరాకరించాడు మరియు అమృత్‌సర్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. అయితే తదనంతరం జరిగిన  అల్లర్లలలో  అమృత్‌సర్ నడిబొడ్డున ఉన్న డాక్టర్ కిచ్లెవ్ నాలుగు అంతస్తుల ఇంటిని మరియు కుటుంబ యాజమాన్యంలోని కిచ్‌లే హొసిరీ ఫ్యాక్టరీని తగలబెట్టబడడంతో డాక్టర్ కిచ్లెవ్ తను అత్యంత ఇష్టపడే నగరాన్ని విడిచిపెట్టి ఢిల్లీకి మారవలసి వచ్చింది.

ప్రొఫెసర్ దత్తా ప్రకారం ఢిల్లీలో డాక్టర్ కిచ్లేవ్‌ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కడు బీదరికం తో జీవించాడు. అతని నివాసం ఒక పాత మంచాన్ని, కొంత పాత ఫర్నిచర్ నిండి ఉండేది.. అయినా డాక్టర్ కిచ్లేవ్‌ భాధ పడలేదు. "జవహర్ లాల్ నెహ్రు చేసిన ఆర్ధిక సహాయంతో నేను జీవించగలుగుతున్నాను" అని అతను చెప్పాడు.

డాక్టర్ కిచ్లేవ్ చిన్న కుమారుడు తౌఫిక్‌ తన చివరి రోజులను కడు భారంగా గడిపాడు. చనిపోయే ముందు, తౌఫిక్‌ అమృత్‌సర్‌కు మారాలనే  కోరికను వ్యక్తం చేశాడు మరియు పంజాబ్ ప్రభుత్వం అద్దె రహిత వసతి గృహన్ని  కూడా ప్రకటించినది,  కానీ అది కార్యరూపం దాల్చలేదు.

 పంజాబ్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ దర్బారీ లాల్ అభిప్రాయం లో డాక్టర్ కిచ్లూ ఒక శక్తివంతమైన వక్త, ఆయన మాటలు జనాలను కదిలించేవని పేర్కొన్నారు.

మరోవైపు విభజన తర్వాత డాక్టర్ సత్యపాల్ పంజాబ్ విధానసభ స్పీకర్ అయ్యారు. పంజాబ్ యూనివర్శిటీలో బంగారు పతకంతో ఎంబీబీఎస్ పూర్తి చేసి స్వాతంత్య్ర పోరాటంలో క్రియాశీలకంగా వ్యవహరించారు .

డాక్టర్ సత్యపాల్‌ అరుదైన చిత్తశుద్ధి మరియు వ్యక్తిత్వo గల వ్యక్తి.. కాంగ్రెస్‌లో జరిగిన తప్పుల గురించి కూడా ఆయన గళం విప్పారు.. అమృత్‌సర్‌లో ఏఐసీసీ సెషన్‌ను నిర్వహించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అతను 1954 లో మరణించాడు మరియు అతని ఇద్దరు కుమార్తెలు విదేశాలకు వెళ్లారు.

"డాక్టర్ కిచ్లేవ్ మరియు డాక్టర్ సత్యపాల్ అమృత్‌సర్‌లోని ప్రతి ఒక్కరికి సుపరిచితులు.."

No comments:

Post a Comment