5 December 2025

చరిత్రకారుడు సర్ షాఫాత్ అహ్మద్ ఖాన్ Historian Sir Shafaat Ahmed Khan

 




సెప్టెంబర్ 2, 1946, తాత్కాలిక ప్రభుత్వ సభ్యులు ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. బ్రిటిష్ వారి నుండి భారతీయులకు అధికారాన్ని బదిలీ చేయడానికి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది, వైస్రాయ్ మరియు కమాండర్-ఇన్-చీఫ్ మినహా తాత్కాలిక ప్రభుత్వo పూర్తిగా భారతీయులతో కూడినది.

ఐదుగురు హిందువులు, ఐదుగురు ముస్లింలు మరియు షెడ్యూల్డ్ కులం, పార్సీ, సిక్కు మరియు క్రైస్తవ వర్గాల నుండి ఒక్కొక్క సభ్యుడు ఉండేలా మొత్తం 14 మంది సభ్యులు ఉండాలని ప్రణాళిక వేయబడింది, కాని 12 స్థానాలు మాత్రమే భర్తీ చేయబడ్డాయి: జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, సి. రాజగోపాల్‌చారి, శరత్ చంద్ర బోస్, డాక్టర్ జాన్ మత్తాయ్, సర్దార్ బల్దేవ్ సింగ్, జగ్జీవన్ రామ్, సి.హెచ్. భాభా, అసఫ్ అలీ, సయ్యద్ అలీ జహీర్ మరియు సర్ షఫాత్ అహ్మద్.

అసఫ్ అలీ, సయ్యద్ అలీ జహీర్ మరియు సర్ షఫాత్ అహ్మద్ -ముగ్గురు ముస్లింలను చేర్చడం వల్ల తాత్కాలిక ప్రభుత్వంలోని ముస్లిం సభ్యులందరూ లీగ్ నుండి రావాలనే జిన్నా డిమాండ్ దెబ్బతింది.

సర్ షఫాత్ చేరిక ముస్లిం లీగ్‌కు ఇష్టం లేదు  ఎందుకంటే సర్ షఫాత్ ముస్లిం లీగ్ నుండి ప్రాథమిక తేడాల కారణంగా వదిలిపెట్టాడు.

1946 ఆగస్టు 24 సాయంత్రం, సర్ షఫాత్ వాకింగ్ నుండి తిరిగి వస్తుండగా, సిమ్లాలోని దర్భాంగా హౌస్ (ఇప్పుడు పాఠశాల ఉంది) సమీపంలో ఇద్దరు యువకులు సర్ షఫాత్ పై దాడి చేశారు. సర్ షఫాత్ కు లోతైన గాయాలు అయ్యాయి.

అక్టోబర్ 26, 1946, జిన్నా తాత్కాలిక ప్రభుత్వంలో చేరడానికి అంగీకరించిన తర్వాత, ముగ్గురు సభ్యులు - శరత్ బోస్, సర్ షఫాత్ మరియు సయ్యద్ జహీర్ - ముస్లిం లీగ్‌కు మార్గం కల్పించడానికి రాజీనామా చేశారు.

ఉన్నత ప్రభుత్వ పదవికి ఈ క్లుప్తమైన ఎదుగుదల సర్ షఫాత్ రాజకీయ జీవితంలో ఉన్నత స్థానం. తరువాత జనవరి 1947లో, సర్ షఫాత్ ను కెనడాకు భారత హైకమిషనర్‌గా నియమించాలనే చర్చలు జరిగాయి, కానీ అవి కార్యరూపం దాల్చలేదు.

సర్ షఫాత్ 1920లలో యుపి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా, రౌండ్ టేబుల్ సమావేశానికి ముస్లిం ప్రతినిధి బృందంలో భాగంగా ఉన్నారు మరియు 1941 నుండి 1944 వరకు దక్షిణాఫ్రికాకు భారత హైకమిషనర్‌గా కూడా ఉన్నారు.

సర్ షఫాత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ స్థాపనలో పాత్ర పోషించినాడు. జూన్ 1935లో పూణేలో జరిగిన ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించినాడు.  అలహాబాద్ విశ్వవిద్యాలయంలో మోడరన్ ఇండియన్ హిస్టరీ ఛైర్మన్‌గా సర్ షఫాత్ 1924లో జర్నల్ ఆఫ్ ఇండియన్ హిస్టరీని ప్రారంభించారు. మద్రాస్ విశ్వవిద్యాలయం మరియు అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో కూడా ఇండియన్  హిస్టరీ  బోధించారు.

అనారోగ్యంతో బాధపడుతూ సర్ షఫాత్ జూలై 1947లో సిమ్లాలో మరణించారు.

 

మూలం: http://www.thewire.in / సెప్టెంబర్ 02, 2020

ముస్లిం పురుషులలో బహుభార్యత్వం-డేటా Data points to Muslim men are not the most polygamous

 

 

"ముస్లింలు నలుగురు భార్యలను కలిగి ఉండవచ్చు. ఇది వారిలో సర్వసాధారణం". ప్రత్యక్ష టెలివిజన్ చర్చలలో మరియు రోడ్డు పక్కన ఉన్న స్టాల్ లో టీ తాగుతున్నప్పుడు నలుగురు చేసే ఈ సాధారణీకరణలను మీరు  చూసి ఉండవచ్చు.

నిజంగా  భారతదేశంలోని ఇతర వర్గాల కంటే ముస్లింలలో బహుభార్యత్వం ఎక్కువగా ఉందా? లేదా ఇది ప్రచారమా, మన పక్షపాతాల ప్రతిబింబమా?

బహుభార్యత్వంపై అత్యంత ప్రామాణికమైన డేటా - బహుళ భార్యల ఆచారం - ప్రభుత్వం నిర్వహించిన పెద్ద ఎత్తున సర్వే అయిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) నుండి వచ్చింది.

2019–21లో నిర్వహించిన తాజా మరియు ఐదవ NFS ప్రకారం, భారతదేశం అంతటా వివాహిత స్త్రీలలో 1.4 శాతం మంది మాత్రమే తమ భర్తలకు ఒకటి కంటే ఎక్కువ భార్యలు ఉన్నారని నివేదించారు. దీని అర్థం 100 వివాహాలలో 98–99 వివాహాలు ఏకపత్నీవ్రతమైనవి.

దీని అర్థం భారతదేశంలో బహుభార్యత్వం విస్తృతంగా లేదు.

రెండవ ప్రశ్న: ముస్లింలలో బహుళ వివాహాల ఆచారం ఎక్కువగా ప్రబలంగా ఉందా?

NFS డేటా ప్రకారం భారతదేశంలో ముస్లింలు అత్యంత బహుభార్యత్వ సమాజం కాదు.

ముస్లిం మహిళల్లో, 1.9 శాతం మంది తమ భర్తలకు రెండవ భార్య ఉందని నివేదించారు.

హిందూ మహిళల్లో, ఈ సంఖ్య 1.3 శాతం. గిరిజన వర్గాలతో సహా ఇతర మతాలలో, ఇది 1.6 శాతం.

హిందువులు మరియు ముస్లింల మధ్య బహుభార్యత్వ రేటులో వ్యత్యాసం చాలా తక్కువ: 1.3 శాతం వర్సెస్ 1.9 శాతం. దీని అర్థం ప్రతి 100 వివాహిత ముస్లిం జంటలలో, బహుశా ఇద్దరికి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ భార్యలు ఉంటారు,

అయితే హిందువులలో, ఇది ఒకటి నుండి ఒకటిన్నర వరకు ఉంటుంది. రెండవది, హిందూ జనాభా ముస్లిం జనాభా కంటే దాదాపు 4–5 రెట్లు ఎక్కువ.

కాబట్టి, సంఖ్యల ఆధారంగా మాత్రమే, బహుళ భార్యలు ఉన్న మొత్తం హిందువుల సంఖ్య ముస్లింల సంఖ్యకంటే తక్కువ కాదు.

అందువల్ల, ముస్లింలు మాత్రమే నాలుగు సార్లు వివాహం చేసుకుంటున్నారు, హిందువులు వివాహం చేసుకోరు అనే వాదన డేటాకు విరుద్ధంగా ఉంది..

మూడవ ప్రశ్న: ముస్లింలలో బహుభార్యత్వం ఎప్పుడైనా ఎక్కువగా ఉందా? ప్రతి ముస్లిం పురుషుడు రెండు, మూడు లేదా నాలుగు సార్లు వివాహం చేసుకున్నాడా? కొంచెం వెనక్కి వెళ్దాం, ఎందుకంటే చాలా మంది ఇలా అంటారు, "గతంలో, ఈ ఆచారం ముస్లింలలో చాలా ప్రబలంగా ఉండేది."

1961 జనాభా లెక్కలు  బహుభార్యత్వ డేటాను విడిగా చివరిసారి నమోదు చేసినవి..

1961 జనాభా లెక్కల నుండి వెలువడే చిత్రం మరింత దిగ్భ్రాంతికరంగా ఉంది: గిరిజన వర్గాలలో బహుభార్యత్వం 15 శాతం, బౌద్ధులలో 7.9 శాతం, జైనులలో 6-7 శాతం, హిందువులలో 5.8 శాతం మరియు ముస్లింలలో 5.7 శాతం వరకు ఉందని చూపిస్తుంది.

1961 జనాభా లెక్కల ప్రకారం, బహుళ వివాహాలు చేసుకున్న వర్గాల జాబితాలో ముస్లింలు అట్టడుగున ఉన్నారు. కాబట్టి, "ముస్లింలు ప్రత్యేకంగా లేదా అధిక బహుభార్యత్వం కలిగి ఉన్నారు" అని చరిత్ర కూడా చెప్పలేదు. భారతదేశంలోని వివిధ మతాలు మరియు వర్గాలలో ఈ దృగ్విషయం స్పష్టంగా కనిపించింది మరియు అన్ని వర్గాలలో క్షీణత ధోరణి డేటాలో స్పష్టంగా కనిపిస్తుంది.

ఏ సమాజంలో వాస్తవానికి బహుభార్యత్వం అత్యధికంగా ఉంది?

NFHS డేటా బహుభార్యత్వం మతం కంటే ప్రాంతం మరియు సమాజంతో ముడిపడి ఉందని రుజువు చేస్తుంది.

గిరిజన వర్గాలలో బహుభార్యత్వం అత్యధికంగా ఉంది - NFHS-5లో సుమారు 2.4 శాతం. సాంప్రదాయకంగా, బహుభార్యత్వ కేసులు ఈశాన్య మరియు గిరిజన ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నాయి.

ముస్లింలలో కూడా, వారి సమాజానికి జాతీయ సగటుతో పోలిస్తే, ఒడిశా (3.9 శాతం), బీహార్ (2.2 శాతం), జార్ఖండ్ (2.4 శాతం), పశ్చిమ బెంగాల్ (2.8 శాతం), అస్సాం (3.6 శాతం) మరియు కర్ణాటక (2.6 శాతం)లలో బహుభార్యత్వం ఎక్కువగా ఉంది.

 లీగల్ ఫ్రేమ్ వర్క్/చట్టపరమైన చట్రం ఏమిటి?

 1955 నాటి హిందూ వివాహ చట్టం ప్రకారం బహుభార్యత్వం హిందువులు, బౌద్ధులు, జైనులు మరియు సిక్కులకు నేరం.

ప్రత్యేక చట్టాలు క్రైస్తవులు మరియు పార్సీలకు బహుభార్యత్వాన్ని కూడా నిషేధించాయి.

అయితే, 1937 నాటి ముస్లిం పర్సనల్ లా (షరియా) అప్లికేషన్ యాక్ట్ ప్రకారం, ఒక ముస్లిం పురుషుడు గరిష్టంగా నాలుగు వివాహాలు చేసుకోవడానికి అనుమతి ఉంది. ముస్లింలపై ఉన్న అపోహ/తప్పుడు భావనకు ఇదే మూలం.

అయితే, చట్టపరమైన అనుమతి అంటే తప్పనిసరిగా విస్తృతమైన ఆచారం కాదని గణాంకాలు చూపిస్తున్నాయి.

హిందువులు, సిక్కులు, క్రైస్తవులు లేదా మరెవరిలాగే చాలా మంది ముస్లింలు జీవితకాలంలో ఒకసారి మాత్రమే వివాహం చేసుకుంటారు. లీగల్ ఫ్రేమ్ వర్క్/చట్టపరమైన చట్రాన్ని మరియు ప్రాథమిక వాస్తవికతను విడివిడిగా అర్థం చేసుకోవడం ముఖ్యం.

 ఇతర ఆరోగ్య సర్వేలు ఏమి వెల్లడిస్తున్నాయి:

2005-06లో నిర్వహించిన NFHS-3 సమయంలో, బహుభార్యత్వ నిష్పత్తి దాదాపు 2 శాతం ఎక్కువగా ఉంది మరియు 2005 సర్వే సమయంలో, బహుళ వివాహాలు కలిగిన వర్గాలలో బౌద్ధులు 3.8 శాతం ఎక్కువగా ఉన్నారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు, క్రైస్తవులలో బహుభార్యత్వ రేటు 2.4 శాతం, మరియు ముస్లింలలో2.6 శాతంగా ఉంది.

NFHS-5 నాటికి (2019-21) ఇది 1.4 శాతానికి పడిపోయింది.

బహుళ వివాహాల సంఖ్యలో ముస్లింలు మరియు హిందువుల మధ్య అంతరం కాలక్రమేణా తగ్గింది.

NFHS-3లో ఈ అంతరం ఎక్కువగా ఉంది. ముస్లింలలో బహుభార్యత్వం దాదాపు 2.6 శాతం మరియు హిందువులలో దాదాపు 1.8 శాతం.

ఇప్పుడు, NFHS-5 నాటికి, ఈ వ్యత్యాసం ముస్లింలలో దాదాపు 1.9 శాతానికి మరియు హిందువులలో 1.3 శాతానికి తగ్గింది.

గణాంక దృక్కోణం నుండి మరో ఆసక్తికరమైన విషయం: 2019 సర్వేలో, బౌద్ధులలో బహుభార్యత్వం 1.3 శాతానికి తగ్గింది, కానీ క్రైస్తవులలో, ఇది కొద్దిగా తగ్గింది 2.1 శాతం.

2016 NFHS 4 సర్వే నుండి క్రైస్తవులలో బహుభార్యత్వం లేదా బహుళ వివాహాలు పెరిగాయని గమనించడం కూడా ఆసక్తికరంగా ఉంది.

2016లో, క్రైస్తవులలో బహుభార్యత్వం రేటు 2 శాతంగా ఉంది, ఇది స్వల్పంగా పెరిగింది.


భారతదేశంలో మొత్తం బహుభార్యత్వం క్రమంగా తగ్గుతోందని అనేక పరిశోధన సంక్షిప్తాలు మరియు విశ్లేషణలు స్పష్టంగా చూపిస్తున్నాయి మరియు ఈ తగ్గుదల ముస్లింలలో మాత్రమే కాకుండా అన్ని మతాలలో కనిపిస్తుంది.

భారతదేశంలోని అగ్ర ముస్లిం ఇంగ్లీష్ జర్నలిస్టులు Top Muslim English Journalists of India

 


 

భారతీయ జర్నలిజానికి ముస్లిం జర్నలిస్టులు  గణనీయమైన సేవ అందించారు.ముఖ్యంగా ఆంగ్ల మీడియాలో ముస్లిం జర్నలిస్టులు సంఖ్యలో తక్కువగా ఉండవచ్చు, కానీ వారి ప్రభావం శక్తివంతమైనది మరియు శాశ్వతమైనది.

ముస్లిం జర్నలిస్టులు ప్రాతినిధ్యం తక్కువగా ఉన్నప్పటికీ - ప్రజా చర్చను రూపొందించడంలో, అన్యాయంపై నివేదించడంలో మరియు అధికారంలో ఉన్నవారిని జవాబుదారీగా ఉంచడంలో కీలక పాత్ర పోషించినారు.

భారతదేశంలో ముస్లిం జర్నలిస్టుల సహకారం భారతదేశ స్వాతంత్ర్య పోరాట మూలాల నుండి ఉంది. సంవత్సరాలుగా, భారతదేశం లో  అనేక మంది ప్రముఖ ముస్లిం ఆంగ్ల జర్నలిస్టులు, పురుషులు మరియు మహిళలు ఇద్దరూ ఆవిర్భవించారు.

భారతదేశంలోని ప్రముఖ ముస్లిం జర్నలిస్టులు:

సంవత్సరాలుగా, ముస్లిం జర్నలిస్టులు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో తమదైన ముద్ర వేశారు. వారిలో సయీద్ నఖ్వీ, ఎం.జె. అక్బర్, జఫారుల్ ఇస్లాం ఖాన్, జియా ఉస్ సలాం, హసన్ సురూర్, అర్ఫా ఖానుమ్ షేర్వానీ, మొహమ్మద్ జుబైర్ మరియు రాణా అయూబ్ ఉన్నారు

సయీద్ నఖ్వీ

సయీద్ నఖ్వీ, “ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ది స్టేట్స్‌మన్ మరియు సండే మ్యాగజైన్” వంటి ప్రచురణలతో పనిచేశారు. సయీద్ నఖ్వీ,  నెల్సన్ మండేలా, ఫిడేల్ కాస్ట్రో మరియు మిఖాయిల్ గోర్బచెవ్ వంటి ప్రపంచ నాయకులను ఇంటర్వ్యూ చేశారు. సయీద్ నఖ్వీ ఇటీవలి రాసిన పుస్తకం “ది ముస్లిం వానిషెస్” ప్రసంశలు అందుకుంది.  సయీద్ నఖ్వీ ధైర్యమైన కథనానికి విస్తృతంగా ప్రశంసలు లబించినవి.

నఖ్వీ రచనలు “ది న్యూయార్క్ టైమ్స్, ది గార్డియన్ మరియు ది వాషింగ్టన్ పోస్ట్‌”లలో ప్రచురితమయ్యాయి. సయీద్ నఖ్వీ అంతర్దృష్టితో కూడిన వ్యాఖ్యానాలు ఆయనను ప్రపంచ మరియు దేశీయ రాజకీయాలపై గౌరవనీయమైన స్వరంగా మార్చాయి.

ఎం.జె. అక్బర్

ఎం.జె. అక్బర్ భారతదేశంలోని అత్యంత ప్రముఖ ముస్లిం జర్నలిస్టులలో ఒకరు.”ది టెలిగ్రాఫ్, ది ఏషియన్ ఏజ్ మరియు ది సండే గార్డియన్” వంటి వార్తాపత్రికలను ప్రారంభo మరియు  ఎడిటింగ్ లో ప్రసిద్ధి చెందారు. ఎం.జె. అక్బర్ పుస్తకాలు మరియు సంపాదకీయ పని భారతీయ మీడియాపై శాశ్వత ప్రభావాన్ని చూపింది. ఒక గొప్ప రచయిత అయిన ఎం.జె. అక్బర్ అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన అనేక పుస్తకాలను రచించారు. ముఖ్యంగా 1980లు మరియు 1990లలో రాజకీయ జర్నలిజాన్ని రూపొందించడంలో అక్బర్ పాత్రికేయ రచనలు గమనార్హం,

రాణా అయూబ్

ప్రస్తుతం వాషింగ్టన్ పోస్ట్‌కు కాలమిస్ట్‌గా ఉన్న రాణా అయూబ్, సాహసోపేతమైన పరిశోధనాత్మక జర్నలిజానికి విస్తృతంగా గుర్తింపు పొందింది. 2002 గుజరాత్ అల్లర్లు మరియు అధికారుల సహకారం గురించి రాణా అయూబ్ రాసిన గుజరాత్ ఫైల్స్: అనాటమీ ఆఫ్ ఎ కవర్-అప్ Gujarat Files: Anatomy of a Cover-Up అనే పుస్తకం భారతదేశంలో అత్యంత ముఖ్యమైన సమకాలీన జర్నలిస్టిక్ రచనలలో ఒకటిగా మిగిలిపోయింది.

రాణా అయూబ్ ఓవర్సీస్ ప్రెస్ క్లబ్ అవార్డు, ఎక్సలెన్స్ ఇన్ ఇంటర్నేషనల్ జర్నలిజం అవార్డు, టెక్సాస్ టెక్ విశ్వవిద్యాలయం నుండి హ్యూమన్ రైట్స్ అవార్డు మరియు ఫ్రీ ప్రెస్ అన్‌లిమిటెడ్ నుండి మోస్ట్ రెసిలెంట్ జర్నలిస్ట్ అవార్డును అందుకుంది. 2019లో, టైమ్ మ్యాగజైన్ రాణా అయూబ్ ను ప్రపంచవ్యాప్తంగా అత్యంత బెదిరింపులకు గురైన పది మంది జర్నలిస్టులలో ఒకటిగా పేర్కొంది.

మహమ్మద్ జుబైర్

ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్, నకిలీ వార్తలు మరియు తప్పుడు సమాచారానికి వ్యతిరేకంగా పోరాటంలో కీలక వ్యక్తిగా ఎదిగారు. జుబైర్ యొక్క వాస్తవ తనిఖీ వేదిక fact-checking platform నకిలీ కథనాలు మరియు వైరల్ తప్పుడు సమాచారాన్ని బహిర్గతం చేయడంలో కీలక పాత్ర పోషించింది.మహ్మద్ జుబైర్ జవాబుదారీతనం మరియు సత్యానికి సాధనంగా జర్నలిజాన్ని నమ్ముతాడు.

అర్ఫా ఖానుమ్ షేర్వానీ

ది వైర్‌లో తన పని ద్వారా అర్ఫా ఖానుమ్ షేర్వానీ డిజిటల్ జర్నలిజంలో ప్రముఖ వ్యక్తిగా మారారు. పౌర స్వేచ్ఛలు, మత సామరస్యం మరియు రాజకీయ జవాబుదారీతనంపై అర్ఫా ఖానుమ్ షేర్వానీ రిపోర్టింగ్‌కు ప్రసిద్ధి చెందినది.  అర్ఫా ఖానుమ్ షేర్వానీ తన 20 సంవత్సరాల కెరీర్‌లో, చమేలి దేవి జైన్ అత్యుత్తమ మహిళా మీడియా వ్యక్తుల అవార్డు మరియు రాజకీయ రిపోర్టింగ్ కోసం రెడ్ ఇంక్ అవార్డుతో సహా అనేక అవార్డులను గెలుచుకుంది.

 అనీస్ జంగ్

టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ నుండి ప్రచురణ అయిన యూత్ టైమ్స్ సంపాదకురాలిగా ఒక ముద్ర వేసిన అనీస్ జంగ్ మునుపటి వ్యక్తులలో ఒకరు. శక్తివంతమైన రచయిత మరియు సామాజిక వ్యాఖ్యాత అయిన జంగ్, మహిళల హక్కులు, సంప్రదాయం మరియు ముస్లిం సమాజాలలో మార్పు యొక్క సమస్యలను అన్వేషించే విస్తృత ప్రశంసలు పొందిన పుస్తకాలను రచించారు.

 ఎం రెహమాన్ మరియు అయ్యూబ్ సయ్యద్

ఆన్‌లుకర్‌కు నాయకత్వం వహించిన ఎం. రెహమాన్ మరియు కరెంట్ వీక్లీ ఎడిటర్ అయ్యూబ్ సయ్యద్ కూడా తమకాలంలో భారతీయ జర్నలిజంలో ప్రభావవంతమైన స్వరాలుగా ఉన్నారు. దేశంలో రాజకీయ ప్రజాభిప్రాయాన్ని రూపొందించడంలో వారి సంపాదకీయ నాయకత్వం సహాయపడింది. 

సబా నఖ్వీ

ప్రఖ్యాత జర్నలిస్ట్, కాలమిస్ట్ మరియు రాజకీయ వ్యాఖ్యాత అయిన సబా నఖ్వీ, ప్రముఖ ప్రచురణలతో పనిచేశారు మరియు నాలుగు పుస్తకాలు రాశారు. సబా నఖ్వీ రచన - అంతర్దృష్టి, ధైర్యం మరియు లోతైన సమాచారం, మతపరమైన ఉద్రిక్తతలు మరియు అధికారం యొక్క అంతర్గత పనితీరును అన్వేషిస్తుంది. నఖ్వీ రచనలు  వాటి సమతుల్యత మరియు ధైర్యానికి ప్రతీకగా  నిలుస్తుంది.

 జియా ఉస్ సలాం

ప్రస్తుతం ది హిందూ గ్రూపులో పని చేస్తున్న ఉన్న జియా ఉస్ సలాం, మంచి సాహిత్య విమర్శకుడు, జర్నలిస్ట్ మరియు సామాజిక వ్యాఖ్యాత. ది పయనీర్, ది స్టేట్స్‌మన్ మరియు ది టైమ్స్ ఆఫ్ ఇండియాలో గతంలో పనిచేసిన జియా ఉస్ సలాం, సామాజిక-సాంస్కృతిక సమస్యలపై తన సూక్ష్మమైన దృక్పథాలు మరియు లోతైన పుస్తక సమీక్షలకు అద్భుతమైన ఖ్యాతిని సంపాదించుకున్నారు. విశ్లేషణాత్మక స్పష్టతకు పేరుగాంచిన సలాం, మత గుర్తింపు, రాజ్యాంగ విలువలు మరియు సామాజిక మార్పుల విషయాలపై క్రమం తప్పకుండా రాస్తారు.. జియా ఉస్ సలాం ముస్లిం మిర్రర్ సలహా మండలిలో కూడా ఉన్నారు,

 మీర్ అయూబ్ అలీ ఖాన్

మీర్ అయూబ్ అలీ ఖాన్ ఇంగ్లీష్ మరియు ఉర్దూ జర్నలిజం రెండింటిపై పట్టు కలిగిన హైదరాబాద్‌కు చెందిన మరొక బహుముఖ జర్నలిస్ట్. మీర్ అయూబ్ అలీ ఖాన్ 1975లో డైలీ న్యూస్‌తో తన కెరీర్‌ను ప్రారంభించి, ఆపై యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియాకు మారాడు.

బహుశా హైదరాబాద్ నుండి బహుళ యుద్ధ ప్రాంతాలలోకి ప్రవేశించి గ్రౌండ్ కవరేజ్ అందించిన ఏకైక జర్నలిస్ట్ మీర్ అయూబ్ అలీ ఖాన్ కావచ్చు. గల్ఫ్ యుద్ధం, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాన్ని మీర్ అయూబ్ అలీ ఖాన్ కూడా కవర్ చేశారు. మీర్ అయూబ్ అలీ ఖాన్ సౌదీ గెజిట్‌లో డిప్యూటీ మేనేజింగ్ ఎడిటర్‌గా పనిచేశాడు. మీర్ అయూబ్ అలీ ఖాన్ డెక్కన్ క్రానికల్‌లో చీఫ్ ఆఫ్ బ్యూరోగా మరియు టైమ్స్ ఆఫ్ ఇండియాలో స్పెషల్ అఫైర్స్ ఎడిటర్‌గా పనిచేశాడు.

 సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ

న్యూస్‌టైమ్, డెక్కన్ క్రానికల్, టైమ్స్ ఆఫ్ ఇండియా మరియు బిబిసి మరియు రాయిటర్స్ వంటి ఏజెన్సీలతో పనిచేసిన సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ, న్యూస్‌రూమ్‌లో తన ఫోటోగ్రాఫిక్ జ్ఞాపకశక్తి మరియు వేగానికి ప్రసిద్ధి చెందిన అనుభవజ్ఞుడు. 

తక్కువగా ఉన్నప్పటికీ, ఇంగ్లీష్ మీడియాలో ముస్లిం జర్నలిస్టులు జర్నలిజం వృత్తికి భారీ సహకారాలు అందించారు. నిశ్శబ్దంగా ఉన్న స్వరాలను విస్తరించారు, ఒత్తిళ్లను భరించారు మరియు మార్గదర్శకులు అయ్యారు.