3 December 2025

ఇస్మాయిలీ ముస్లిం వ్యాపార కుటుంబం చినోయ్‌లు భారతదేశ అంతర్జాతీయ వైర్‌లెస్ కమ్యూనికేషన్‌కు మార్గదర్శకత్వం వహించింది How a Khoja Ismaili Muslim business family The Chinoys pioneered India’s international wireless communication system

 

ఖోజా 

 

ముంబై (గతంలో బాంబే), మహారాష్ట్ర :


బొంబాయికి చెందిన చినోయ్ కుటుంబం భారతదేశ అంతర్జాతీయ వైర్‌లెస్ కమ్యూనికేషన్‌కు మార్గదర్శకత్వం వహించింది

భారతదేశాన్ని సాంకేతికత, ఆర్థికం మరియు కమ్యూనికేషన్ వ్యవస్థను  ప్రపంచ సర్క్యూట్‌లతో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషించిన బొంబాయికి చెందిన ఖోజా ఇస్మాయిలీ ముస్లిం వ్యాపార కుటుంబం చినోయ్‌ల గురించి తెలుసుకొందాము.

చైనా వాణిజ్యం నుండి భారతదేశ అంతర్జాతీయ వైర్‌లెస్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌కు నాయకత్వం వహించే స్థాయికి చినోయ్‌ల ఎదుగుదల భారతదేశ ఆర్థిక చరిత్రలో ఒక విలక్షణమైన క్షణాన్ని ప్రకాశవంతం చేస్తుంది

గుజరాతీ ముస్లిం వ్యాపారులు చినోయ్‌లు సముద్ర వాణిజ్యం ప్రారంభించారు. చినోయ్‌ల  పూర్వికుడు మెహెరల్లీ చినోయ్, పందొమ్మిదవ శతాబ్దం మధ్యలో ఖోజా వ్యాపారి యువరాజు జైరాజ్‌భోయ్ పీర్‌భోయ్‌కు శిష్యుడిగా తన వ్యాపార ప్రస్థానం ప్రారంభించారు. చైనా మరియు జపాన్‌లకు పదేపదే ప్రయాణాల ద్వారా, మెహెరల్లీ చినోయ్ వాణిజ్య చతురతకు ఖ్యాతిని పెంచుకున్నాడు మరియు అతని కుమారులు వ్యాపారాన్ని విస్తరించారు.

1920ల నాటికి, ఫజల్‌భోయ్ మెహెరల్లీ (F.M.) చినాయ్ & కో. - గోధుమలు, ముత్యాలు, కిరోసిన్, పోస్టల్ కాంట్రాక్టులు, సినిమా ప్రదర్శన మరియు ముఖ్యంగా భారతదేశంలోని తొలి మరియు అత్యంత విజయవంతమైన మోటారు కార్ ఏజెన్సీలలో ఒకటైన బాంబే గ్యారేజ్‌ వ్యాపారం లోకి కూడా  ప్రవేశించినది.

చినోయ్‌లు  బొంబాయిలోని ప్రముఖ వ్యాపార కుటుంబాలలో ఒకటిగా ఉన్నారు, మునిసిపల్ కార్పొరేషన్‌లో ఉన్నారు, షెరీఫ్ కార్యాలయాన్ని కలిగి ఉన్నారు మరియు శాసనసభలలో పాల్గొన్నారు.

ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభం నాటికి, జలాంతర్గామి కేబుల్ నెట్‌వర్క్ విస్తరించింది. రేడియో కమ్యూనికేషన్ వేగవంతమైన మరియు చౌకైన ప్రత్యామ్నాయాన్ని అందించింది. మార్కోని వైర్‌లెస్ టెలిగ్రాఫ్ కంపెనీ 1910లో లండన్‌ను దాని కాలనీలకు లాంగ్-వేవ్ రేడియో ద్వారా అనుసంధానించే ప్రతిష్టాత్మక 'ఇంపీరియల్ వైర్‌లెస్ చైన్'ను ప్రతిపాదించింది. ఈ రంగంలోకి చినోయ్‌లు అడుగుపెట్టారు.

1921లో, సుల్తాన్ చినోయ్ మార్కోని కంపెనీతో చర్చలు జరపడానికి మరియు భారతదేశానికి హక్కులను పొందేందుకు ఇంగ్లాండ్‌కు వెళ్లాడు. మార్కోని కఠినమైన నిబంధనలను డిమాండ్ చేశారు.

చినోయ్‌లు, బొంబాయి వాణిజ్య ఉన్నత వర్గాల పార్సీ పారిశ్రామికవేత్తలు కుస్రో మరియు నెస్ వాడియా, హిందూ ఫైనాన్షియర్ సర్ పురుషోత్తమదాస్ ఠాకూర్‌దాస్ మరియు గౌరవనీయ ముస్లిం నాయకుడు ఇబ్రహీం రహీమ్‌తూలా, ఇతరులతో కలసి  ఒక బోర్డును ఏర్పాటు చేశారు. ఫలితంగా ఏర్పడిన కంపెనీ, ఇండియన్ రేడియో టెలిగ్రాఫ్ కంపెనీ (IRTC),

1925లో, ఇండియన్ రేడియో టెలిగ్రాఫ్ కంపెనీ (IRTC) భారత ప్రభుత్వం నుండి పదేళ్ల లైసెన్స్‌ను పొందింది. మార్కోని ఒక పురోగతిని ప్రకటించాడు: షార్ట్‌వేవ్ లేదా "బీమ్" వైర్‌లెస్, సందేశాలను 95% చౌకగా మరియు మూడు రెట్లు వేగంగా ప్రసారం చేయగలదు. IRTC 1927 నాటికి, భారతదేశం-ఇంగ్లాండ్ బీమ్ సర్వీస్ ప్రారంభమైంది

వారంలోనే, సందేశ ట్రాఫిక్ అంచనాలను మించిపోయింది; ఒక సంవత్సరం లోపల,  ఇండియన్ రేడియో టెలిగ్రాఫ్ కంపెనీ (IRTC) కంపెనీ అంతర్జాతీయ కమ్యూనికేషన్ లో  విజయాన్ని చవి చూసింది. బీమ్ వైర్‌లెస్, పాత కేబుల్ టెలిగ్రాఫ్ కంపెనీలను వేగంగా దెబ్బతీసింది, అవి  1932లో IRTC లో  విలీనానికి దారితీసింది.

కొత్త సంస్థ, ఇండియన్ రేడియో అండ్ కేబుల్ కమ్యూనికేషన్స్ కో. (IRCC), భారతదేశంలోని దాదాపు అన్ని బాహ్య ట్రాఫిక్‌ను నిర్వహించింది. కొద్దికాలంలోనే, భారతీయుల నేతృత్వంలోని కంపెనీ భారతదేశంలోని అత్యంత సున్నితమైన అంతర్జాతీయ కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలపై నియంత్రణను చేపట్టింది.

పార్సీ, హిందూ మరియు ముస్లిం పెట్టుబడిదారులను ఏకం చేయడంలో, చినోయ్‌లు రాణించినందున IRTC విజయం సాధించింది. అత్యాధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీపై పట్టు సాధించడం వల్ల భారతీయ వ్యాపారానికి అపూర్వమైన పరపతి లభిస్తుందని చినోయ్‌ సోదరులు గుర్తించారు.

IRTCతో పాటు ప్రారంభించబడిన ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ (IBC)కి కూడా చినోయ్‌లు నాయకత్వం వహించారు. కానీ బీమ్ వైర్‌లెస్ వృద్ధి చెందుతుండగా, IBC కుప్పకూలింది.

1930 నాటికి, IBC రద్దు చేయబడింది; 1936 నాటికి, IBC ఆల్ ఇండియా రేడియోగా మారింది. సర్ రహీమ్‌తూలా చినోయ్ ఆల్ ఇండియా రేడియో మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడయ్యాడు, ఇది చినోయ్ కుటుంబాన్ని రేడియో వాణిజ్యం మరియు నియంత్రణ కేంద్రంలో ఉంచింది.

భారతదేశ అంతర్జాతీయ కమ్యూనికేషన్ వ్యవస్థపై చినాయ్‌ల నాయకత్వం 1947 వరకు కొనసాగింది, స్వతంత్ర భారత దేశ ప్రభుత్వం IRCCని జాతీయం చేసింది. అప్పటికి, చినోయ్ కుటుంభం  దేశంలోని ప్రముఖ పెట్టుబడిదారులు మరియు ప్రజా ప్రముఖులలో తమ స్థానాన్ని సంపాదించుకున్నారు, బ్యాంకులు, మునిసిపల్ సంస్థలు మరియు జాతీయ ఆర్థిక ప్రతినిధులలో సీనియర్ పదవులను నిర్వహించారు.

చినాయ్‌ల కథ గుజరాతీ ముస్లిం వ్యాపారులు కేవలం సముద్ర ఆధారిత వ్యాపారులు కాదు; వారు సాంకేతిక పరివర్తనను నడిపించగల సామర్థ్యం కలిగి ఉన్నారు.

 

మూలం: http://www.thewire.in నవంబర్ 26, 2025


No comments:

Post a Comment