భారతీయ జర్నలిజానికి ముస్లిం జర్నలిస్టులు గణనీయమైన సేవ అందించారు.ముఖ్యంగా ఆంగ్ల మీడియాలో ముస్లిం జర్నలిస్టులు సంఖ్యలో తక్కువగా ఉండవచ్చు, కానీ వారి ప్రభావం శక్తివంతమైనది మరియు శాశ్వతమైనది.
ముస్లిం జర్నలిస్టులు ప్రాతినిధ్యం తక్కువగా ఉన్నప్పటికీ - ప్రజా చర్చను రూపొందించడంలో, అన్యాయంపై నివేదించడంలో మరియు అధికారంలో ఉన్నవారిని జవాబుదారీగా ఉంచడంలో కీలక పాత్ర పోషించినారు.
భారతదేశంలో ముస్లిం జర్నలిస్టుల సహకారం భారతదేశ స్వాతంత్ర్య పోరాట మూలాల నుండి ఉంది. సంవత్సరాలుగా, భారతదేశం లో అనేక మంది ప్రముఖ ముస్లిం ఆంగ్ల జర్నలిస్టులు, పురుషులు మరియు మహిళలు ఇద్దరూ ఆవిర్భవించారు.
భారతదేశంలోని ప్రముఖ ముస్లిం జర్నలిస్టులు:
సంవత్సరాలుగా, ముస్లిం జర్నలిస్టులు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో తమదైన ముద్ర వేశారు. వారిలో సయీద్ నఖ్వీ, ఎం.జె. అక్బర్, జఫారుల్ ఇస్లాం ఖాన్, జియా ఉస్ సలాం, హసన్ సురూర్, అర్ఫా ఖానుమ్ షేర్వానీ, మొహమ్మద్ జుబైర్ మరియు రాణా అయూబ్ ఉన్నారు
సయీద్ నఖ్వీ
సయీద్ నఖ్వీ, “ది ఇండియన్ ఎక్స్ప్రెస్, ది స్టేట్స్మన్ మరియు సండే మ్యాగజైన్” వంటి ప్రచురణలతో పనిచేశారు. సయీద్ నఖ్వీ, నెల్సన్ మండేలా, ఫిడేల్ కాస్ట్రో మరియు మిఖాయిల్ గోర్బచెవ్ వంటి ప్రపంచ నాయకులను ఇంటర్వ్యూ చేశారు. సయీద్ నఖ్వీ ఇటీవలి రాసిన పుస్తకం “ది ముస్లిం వానిషెస్” ప్రసంశలు అందుకుంది. సయీద్ నఖ్వీ ధైర్యమైన కథనానికి విస్తృతంగా ప్రశంసలు లబించినవి.
నఖ్వీ రచనలు “ది న్యూయార్క్ టైమ్స్, ది గార్డియన్ మరియు ది వాషింగ్టన్ పోస్ట్”లలో ప్రచురితమయ్యాయి. సయీద్ నఖ్వీ అంతర్దృష్టితో కూడిన వ్యాఖ్యానాలు ఆయనను ప్రపంచ మరియు దేశీయ రాజకీయాలపై గౌరవనీయమైన స్వరంగా మార్చాయి.
ఎం.జె. అక్బర్
ఎం.జె. అక్బర్ భారతదేశంలోని అత్యంత ప్రముఖ ముస్లిం జర్నలిస్టులలో ఒకరు.”ది టెలిగ్రాఫ్, ది ఏషియన్ ఏజ్ మరియు ది సండే గార్డియన్” వంటి వార్తాపత్రికలను ప్రారంభo మరియు ఎడిటింగ్ లో ప్రసిద్ధి చెందారు. ఎం.జె. అక్బర్ పుస్తకాలు మరియు సంపాదకీయ పని భారతీయ మీడియాపై శాశ్వత ప్రభావాన్ని చూపింది. ఒక గొప్ప రచయిత అయిన ఎం.జె. అక్బర్ అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన అనేక పుస్తకాలను రచించారు. ముఖ్యంగా 1980లు మరియు 1990లలో రాజకీయ జర్నలిజాన్ని రూపొందించడంలో అక్బర్ పాత్రికేయ రచనలు గమనార్హం,
రాణా అయూబ్
ప్రస్తుతం వాషింగ్టన్ పోస్ట్కు కాలమిస్ట్గా ఉన్న రాణా అయూబ్, సాహసోపేతమైన పరిశోధనాత్మక జర్నలిజానికి విస్తృతంగా గుర్తింపు పొందింది. 2002 గుజరాత్ అల్లర్లు మరియు అధికారుల సహకారం గురించి రాణా అయూబ్ రాసిన గుజరాత్ ఫైల్స్: అనాటమీ ఆఫ్ ఎ కవర్-అప్ Gujarat Files: Anatomy of a Cover-Up అనే పుస్తకం భారతదేశంలో అత్యంత ముఖ్యమైన సమకాలీన జర్నలిస్టిక్ రచనలలో ఒకటిగా మిగిలిపోయింది.
రాణా అయూబ్ ఓవర్సీస్ ప్రెస్ క్లబ్ అవార్డు, ఎక్సలెన్స్ ఇన్ ఇంటర్నేషనల్ జర్నలిజం అవార్డు, టెక్సాస్ టెక్ విశ్వవిద్యాలయం నుండి హ్యూమన్ రైట్స్ అవార్డు మరియు ఫ్రీ ప్రెస్ అన్లిమిటెడ్ నుండి మోస్ట్ రెసిలెంట్ జర్నలిస్ట్ అవార్డును అందుకుంది. 2019లో, టైమ్ మ్యాగజైన్ రాణా అయూబ్ ను ప్రపంచవ్యాప్తంగా అత్యంత బెదిరింపులకు గురైన పది మంది జర్నలిస్టులలో ఒకటిగా పేర్కొంది.
మహమ్మద్ జుబైర్
ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్, నకిలీ వార్తలు మరియు తప్పుడు సమాచారానికి వ్యతిరేకంగా పోరాటంలో కీలక వ్యక్తిగా ఎదిగారు. జుబైర్ యొక్క వాస్తవ తనిఖీ వేదిక fact-checking platform నకిలీ కథనాలు మరియు వైరల్ తప్పుడు సమాచారాన్ని బహిర్గతం చేయడంలో కీలక పాత్ర పోషించింది.మహ్మద్ జుబైర్ జవాబుదారీతనం మరియు సత్యానికి సాధనంగా జర్నలిజాన్ని నమ్ముతాడు.
అర్ఫా ఖానుమ్ షేర్వానీ
ది వైర్లో తన పని ద్వారా అర్ఫా ఖానుమ్ షేర్వానీ డిజిటల్ జర్నలిజంలో ప్రముఖ
వ్యక్తిగా మారారు. పౌర స్వేచ్ఛలు, మత సామరస్యం మరియు రాజకీయ జవాబుదారీతనంపై అర్ఫా ఖానుమ్ షేర్వానీ రిపోర్టింగ్కు ప్రసిద్ధి
చెందినది. అర్ఫా ఖానుమ్ షేర్వానీ తన 20 సంవత్సరాల కెరీర్లో, చమేలి దేవి జైన్ అత్యుత్తమ
మహిళా మీడియా వ్యక్తుల అవార్డు మరియు రాజకీయ రిపోర్టింగ్ కోసం రెడ్ ఇంక్ అవార్డుతో
సహా అనేక అవార్డులను గెలుచుకుంది.
టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ నుండి ప్రచురణ అయిన
యూత్ టైమ్స్ సంపాదకురాలిగా ఒక ముద్ర వేసిన అనీస్ జంగ్ మునుపటి వ్యక్తులలో ఒకరు.
శక్తివంతమైన రచయిత మరియు సామాజిక వ్యాఖ్యాత అయిన జంగ్, మహిళల హక్కులు, సంప్రదాయం మరియు ముస్లిం
సమాజాలలో మార్పు యొక్క సమస్యలను అన్వేషించే విస్తృత ప్రశంసలు పొందిన పుస్తకాలను
రచించారు.
ఆన్లుకర్కు నాయకత్వం వహించిన ఎం. రెహమాన్ మరియు కరెంట్ వీక్లీ ఎడిటర్ అయ్యూబ్ సయ్యద్ కూడా తమకాలంలో భారతీయ జర్నలిజంలో ప్రభావవంతమైన స్వరాలుగా ఉన్నారు. దేశంలో రాజకీయ ప్రజాభిప్రాయాన్ని రూపొందించడంలో వారి సంపాదకీయ నాయకత్వం సహాయపడింది.
సబా నఖ్వీ
ప్రఖ్యాత జర్నలిస్ట్, కాలమిస్ట్ మరియు రాజకీయ
వ్యాఖ్యాత అయిన సబా నఖ్వీ, ప్రముఖ ప్రచురణలతో పనిచేశారు మరియు నాలుగు
పుస్తకాలు రాశారు. సబా నఖ్వీ రచన - అంతర్దృష్టి, ధైర్యం మరియు లోతైన సమాచారం, మతపరమైన ఉద్రిక్తతలు మరియు
అధికారం యొక్క అంతర్గత పనితీరును అన్వేషిస్తుంది. నఖ్వీ రచనలు వాటి సమతుల్యత మరియు ధైర్యానికి ప్రతీకగా నిలుస్తుంది.
ప్రస్తుతం ది హిందూ గ్రూపులో పని చేస్తున్న ఉన్న
జియా ఉస్ సలాం, మంచి సాహిత్య విమర్శకుడు, జర్నలిస్ట్ మరియు సామాజిక
వ్యాఖ్యాత. ది పయనీర్, ది స్టేట్స్మన్ మరియు ది టైమ్స్ ఆఫ్ ఇండియాలో గతంలో పనిచేసిన జియా ఉస్
సలాం, సామాజిక-సాంస్కృతిక సమస్యలపై తన సూక్ష్మమైన దృక్పథాలు మరియు లోతైన పుస్తక
సమీక్షలకు అద్భుతమైన ఖ్యాతిని సంపాదించుకున్నారు. విశ్లేషణాత్మక స్పష్టతకు
పేరుగాంచిన సలాం, మత గుర్తింపు, రాజ్యాంగ విలువలు మరియు సామాజిక మార్పుల విషయాలపై క్రమం తప్పకుండా రాస్తారు..
జియా ఉస్ సలాం ముస్లిం మిర్రర్ సలహా మండలిలో కూడా ఉన్నారు,
మీర్ అయూబ్ అలీ ఖాన్ ఇంగ్లీష్ మరియు ఉర్దూ
జర్నలిజం రెండింటిపై పట్టు కలిగిన హైదరాబాద్కు చెందిన మరొక బహుముఖ జర్నలిస్ట్. మీర్
అయూబ్ అలీ ఖాన్ 1975లో డైలీ న్యూస్తో తన కెరీర్ను ప్రారంభించి, ఆపై యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియాకు మారాడు.
బహుశా హైదరాబాద్ నుండి బహుళ యుద్ధ ప్రాంతాలలోకి
ప్రవేశించి గ్రౌండ్ కవరేజ్ అందించిన ఏకైక జర్నలిస్ట్ మీర్
అయూబ్ అలీ ఖాన్ కావచ్చు. గల్ఫ్ యుద్ధం, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాన్ని మీర్ అయూబ్
అలీ ఖాన్ కూడా కవర్ చేశారు. మీర్ అయూబ్ అలీ ఖాన్ సౌదీ గెజిట్లో డిప్యూటీ
మేనేజింగ్ ఎడిటర్గా పనిచేశాడు. మీర్ అయూబ్ అలీ ఖాన్ డెక్కన్ క్రానికల్లో చీఫ్
ఆఫ్ బ్యూరోగా మరియు టైమ్స్ ఆఫ్ ఇండియాలో స్పెషల్ అఫైర్స్ ఎడిటర్గా పనిచేశాడు.
న్యూస్టైమ్, డెక్కన్ క్రానికల్, టైమ్స్ ఆఫ్ ఇండియా మరియు బిబిసి మరియు రాయిటర్స్ వంటి ఏజెన్సీలతో పనిచేసిన సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ, న్యూస్రూమ్లో తన ఫోటోగ్రాఫిక్ జ్ఞాపకశక్తి మరియు వేగానికి ప్రసిద్ధి చెందిన అనుభవజ్ఞుడు.
తక్కువగా ఉన్నప్పటికీ, ఇంగ్లీష్ మీడియాలో ముస్లిం
జర్నలిస్టులు జర్నలిజం వృత్తికి భారీ సహకారాలు అందించారు. నిశ్శబ్దంగా ఉన్న
స్వరాలను విస్తరించారు, ఒత్తిళ్లను భరించారు మరియు మార్గదర్శకులు అయ్యారు.
No comments:
Post a Comment