8 December 2019

దౌలతాబాద్




దౌలతాబాద్(దేవగిరి) కోట  దేశంలోని  అత్యంత దృడమైన కోటలలో ఒకటిగా పరిగణిoచ బడుతుంది.   
Image result for devagiri fort aurangabad 
విక్టరీ టవర్-కమ్-అబ్జర్వేషన్ పోస్ట్ "చంద్ మినార్" 1433 లో నిర్మించబడింది

1327 సంవత్సరం లో  ముహమ్మద్-బిన్-తుగ్లక్ తన రాజధానిని  డిల్లి నుండి దేవగిరి కి మార్చదలుచుకొన్నాడు. హిందూస్తాన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలనే తన ఆశయానికి డిల్లి చాలా దూరంగా ఉత్తరాన ఉండటం వలన రాజధానిని  మొత్తం ప్రజలతో సహా 700 మైళ్ల (1100 కి.మీ) దూరంలో ఉన్న దేవగిరికి తరలించాలని నిర్ణయించుకున్నాడు.

రాజధాని మార్పిడిలో అనేక మంది ప్రజలు మార్గం లో ఆహారం లబించక చనిపోయారు.. ప్రజలకు దక్కన్ జీవితo  అలవాటు కావడం కూడా చాలా కష్టమైంది. చివరికి నిరాశకు గురైన సుల్తాన్ ముహమ్మద్-బిన్-తుగ్లక్ తన ప్రణాళికలను విరమించుకుని, కొలది కాలం లోనే తన ప్రజలను దౌలతాబాద్ ను విడిచి తిరిగి ఢిల్లీ వెళ్ళమని ఆదేశించాడు. రాజధానిని డిల్లి నుండి దక్కన్కు మార్చడం ద్వారా, మొత్తం భారతదేశాన్ని నియంత్రించాలనే చక్రవర్తి కల విఫలం అయినది.

దేవగిరి కోట పూర్వ చరిత్రను పరిశిలిద్దాము:

దేవగిరి కోట మొదట్లో యాదవ రాజవంశం క్రింద ఉండేది. ప్రశాంతమైన పరిసరాల మధ్య, ఈ కోట 183 మీటర్ల ఎత్తైన, శంఖాకార సహజ గ్రానైట్ శిల మీద కలదు. ఇది  దేవగిరి లేదా "దేవతల కొండ" అని పిలువబడుతుంది. క్రీ.శ 12 వ శతాబ్దంలో, దేవగిరి యాదవ రాజవంశం యొక్క రాజధాని - కోట యొక్క దుర్భేద్యత వారి ఎంపికకు కారణం మరియు ఇది అనేక మంది పాలకులకు బలంగా మారింది.

యాదవ పాలకులు 15 మీటర్ల లోతైన కందకానికి 50 మీటర్ల ఎత్తులో పైకి లేచిన శంఖాకార సహజ గ్రానైట్ శిల పై కోట నిర్మించారు. కందకానికి అడ్డంగా ఉండే కాజ్‌వే కోటలోకి ప్రవేశించే ఏకైక ప్రదేశంగా మారింది. బయటి గోడ ఐదు కిలోమీటర్ల పొడవు ఉండి పట్టణంలో పెద్ద జనాభాకు ఆశ్రయం ఇచ్చింది. అర కిలోమీటర్ వ్యాసార్థంతో కోట ప్రాంతాన్ని చుట్టుముట్టే రెండవ గోడను "మహాకోట్" అని పిలుస్తారు. సమీపంలోని అజంతా మరియు ఎల్లోరా గుహలలో మాదిరిగా, బౌద్ధమతం దేవగిరి వద్ద పట్టు సాధించినట్లు కనిపిస్తుంది. క్రీస్తుపూర్వం 1వ శతాబ్దానికి చెందిన కనీసం పది గుహలు ఉన్నాయి వీటిని రాజాస్థాన సిబ్బంది వసతి గృహాలు గా ఉపయోగించేవారు.

డిల్లి  సుల్తాన్ గవర్నర్‌గా నియమించబడిన  అల్లా-ఉద్-దిన్ (సుల్తాన్ జలాలుద్-దిన్ ఖిల్జీ మేనల్లుడు) దేవగిరికి చెందిన రాజా రామ్‌చంద్ర మీద విజయం సాధించినప్పుడు  1183 మరియు 1294 మధ్య సాగిన యాదవుల పాలన అంతమైనది. 1318 లో కుతుబ్-ఉద్-దిన్ ఖిల్జీ చేత నిర్మించబడిన జుమ్మ మసీదు (శుక్రవారం మసీదు) దేవగిరి కోట గోడలలోని మొదటి ముస్లిం స్మారక చిహ్నం.

1347 వరకు డిల్లి సుల్తాన్ ద్వారా నియమించిన వివిధ గవర్నర్లు ఈ నగరాన్ని పాలిచారు. "చంద్ మినార్" అని పిలువబడే విక్టరీ టవర్-కమ్-అబ్జర్వేషన్ పోస్ట్ 1433 లో నిర్మించబడింది మరియు ఇది కుతుబ్ మినార్ తరువాత భారతదేశంలో రెండవ ఎత్తైన టవర్. ఈ సమయంలోనే కోట పేరు దేవగిరి నుండి దౌలతాబాద్ లేదా "అదృష్టం యొక్క నివాసం" గా మార్చబడింది.

ఎత్తైన శిఖరం పైనగల కోట  సందర్శకులను ఆకర్షిస్తుంది.  "బాలకోట్" లో పురాతన గుహలకు దారితీసే అద్భుతమైన ప్రవేశ ద్వారం ఉంది. అక్కడ ఉన్న అనేక ఫిరంగులు కోట యొక్క శిఖరాన్ని కాపాడటానికి వ్యూహాత్మకంగా ఉన్నాయి, ఏడు అంగుళాల "పంచధాతు" (ఐదు లోహాలు) తో తయారు చేయబడిన ఫిరంగి దీనిని స్థానికంగా "శ్రీ దుర్గా" అని పిలుస్తారు మరియు దారి పొడవునా అనేక ఇతర ఫిరంగులు ఉన్నాయి. భారీగా ఉన్న స్పైక్డ్ గేట్లు, శత్రువులకు అడ్డంకులను సృష్టిస్థాయి.

రాక్ ముఖంలోని ఒక సొరంగం ఎగువ ప్రాంతాలకు ఏకైక మార్గo. ముట్టడి సమయంలో పొడవైన స్పైరలింగ్ సొరంగం దాని చివర ఇనుప అవరోధం ఉంది. దానిని వేడి చేసినప్పుడు ఎవరు ఆ వేడిమిని భరించలేరు.  కోట లోపల ముట్టడి జరిగినప్పుడు ఆరు నెలలకు పైగా మొత్తం సైన్యానికి నీటిని అందించగలిగే భారీ నీటి ట్యాంక్ మరియు ఆహారం కోసం బలవర్థకమైన గోడల లోపల నిర్మించిన పెద్ద స్థలం చూడవచ్చు.

అలంకార సిరామిక్ టైల్స్ తో కూడిన "చినిమహల్" అనే ప్యాలెస్ లో గోల్కొండ యొక్క చివరి కుతుబ్ షాహి పాలకుడు అబుల్ హసన్ మొఘల్ చక్రవర్తి రంగజేబ్ చేత 1687 నుండి 1700 వరకు ఖైదు చేయబడ్డాడు.

దౌలతాబాద్ కోటను చాలా మంది చక్రవర్తులు దక్షిణ భారతదేశం యొక్క ఆధిపత్యానికి కీలకంగా భావించారు. అహ్మద్‌నగర్‌కు చెందిన నిజాం షాహి  నుండి 1757 లో నిజాం-ఉల్-ముల్క్ కోటను, నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు.తరువాత   నిజాం-ఉల్-ముల్క్ నుండి అది మరాఠాల వశమైనది.

మరాఠాలను బ్రిటిష్ వారు ఓడించినారు. చివరకు దేవగిరి బ్రిటీష్ వారి ఆధీనమైనది.  దేవగిరి ఒక గొప్ప కోట, ఇది ఒకప్పుడు భారతదేశ రాజధానిగా ఉంది.


No comments:

Post a Comment