పై ఫోటో లో అప్పట్లో బ్రిటిష్ యాజమాన్యంలో ఉన్న 'ది స్టేట్స్మన్' పత్రిక సంపాదకుడు ఇయాన్ స్టీఫెన్స్కు నెహ్రూ 'శీర్షాసనం' వేసి చూపిస్తున్నారు. 1952లో, భారతదేశ ఆరోగ్య విద్యలో యోగా ఒక భాగంగా ఉండాలని కోరుతూ నెహ్రూ రాజ్యసభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 1929లో స్వామి కువలయానందను కలిసినప్పటి నుండి, అంటే 1931 నుంచే నెహ్రూ క్రమం తప్పకుండా యోగా సాధన చేసేవారు. 1946లో తాను రాసిన 'ది డిస్కవరీ ఆఫ్ ఇండియా' (భారతదేశ ఆవిష్కరణ) పుస్తకంలో నెహ్రూ యోగా ప్రాముఖ్యత గురించి ప్రస్తావించారు.
అదేవిధంగా 1930వ
దశకంలో, రాజకీయాలను వదిలి యోగా సాధువుగా
మారిపోతానని మహాత్మా గాంధీ ప్రకటించారు. గాంధీ జీ ని ఆ నిర్ణయం నుండి
మళ్లించడానికి వారాల తరబడి ప్రయత్నించాల్సి వచ్చింది.
No comments:
Post a Comment