8 September 2021

S. వాజిద్ అలీ S. Wajid Ali 1890-1951

 



S. వాజేద్ అలీ లేదా షేక్ వాజిద్ అలీ (బెంగాలీ: এস ওয়াজেদ আলী; 4 సెప్టెంబర్, 1890 - 10జూన్, 1951) ఒక బెంగాలీ రచయిత, జాతీయవాది మరియు బారిస్టర్. వాజిద్ అలీ 1890 సెప్టెంబర్ 4 న హూగ్లీ జిల్లాలోని జానై మరియు బేగంపూర్ సమీపంలోని బరతాజ్‌పూర్ గ్రామంలో జన్మించారు.

 

వాజేద్ అలీ ప్రాధమిక విద్య 'గ్రామీణ మదరసా' లేదా పాఠశాలలో ప్రారంభమైంది. 1897 లో ఏడు సంవత్సరాల వయస్సులో వాజేద్ అలీ మొదటి వివాహం, ఆరు నెలల కజిన్ అయేషాతో జరిగింది.  1898 లోవాజేద్ అలీ షిల్లాంగ్‌లోని ఆంగ్ల మాధ్యమం మోఖర్ Mokhar పాఠశాలలో చేరాడు, తరువాత వాజేద్ అలీ అలిఘర్ MAYO కళాశాలకు వెళ్లాడు, అక్కడ అతను అత్యంత ప్రతిభ కల/మెరిటోరియస్ విద్యార్థిగా గుర్తింపు పొందాడు.

 

వాజేద్ అలీ 1910లో అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ అయ్యాడు.  తదుపరి విద్య కోసం మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభానికి కొన్ని సంవత్సరాల ముందు లండన్ వెళ్లాడు. వాజేద్ అలీ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం యొక్క లా స్కూల్లో చేరాడు, అక్కడ నుండి BA మరియు బారిస్టర్-ఎట్-లా డిగ్రీలు పొందాడు.

 

కేంబ్రిడ్జ్‌లో ఉన్నప్పుడు, వాజేద్ అలీ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు మరియు అతనికి బ్రిస్టల్‌కు చెందిన మిస్ ఎలియనోర్ సాక్స్‌బీ వైద్య సపర్యలు చేసేది. క్రమంగా వారి మద్య అనుభందం పెరిగినది, ఇది మొదటి భార్య అయేషా బేగం తో విడాకులు మరియు మిస్ ఎలియనోర్ సాక్స్‌బీ తో వివాహానికి దారి తీసింది.

 

1915 లో ఎస్. వాజేద్ అలీ కలకత్తా హైకోర్టులో లా ప్రాక్టీస్ ప్రారంభించి 1922 వరకు కొనసాగించారు.ఆతరువాత ఎస్. వాజేద్ అలీ సమకాలీన సమాజం గురించి లోతైన అధ్యయనాలలో మునిగిపోయాడు మరియు ఆనాటి ఉన్నత సాహిత్య ప్రపంచంలో పాల్గొన్నాడు. బెంగాలీలో రాయడం ప్రారంభించాడు మరియు సాహిత్య వృత్తిని ప్రారంభించాడు;

 

1923లో, ఎస్. వాజేద్ అలీ కలకత్తా యొక్క మూడవ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేట్‌గా నియమించబడ్డాడు. ఈ కాలంలోనే సాహిత్య రచన ఆరంభించాడు. గద్యం, సింబాలిజం, కథ-రచన, అనువాదం, ప్రయాణ కథనాలు మొదలైన రంగాలలో అత్యున్నత సృజనాత్మకతను ప్రదర్శించాడు. 1928 లో ఎస్. వాజేద్ అలీకి  ఎలియనోర్ సాక్స్‌బీ (నెల్లీ) కి మద్య విడాకులు జరిగినవి.

 

కుటుంబ జీవితంలో ఒంటరితనానికి గురైన ఎస్. వాజేద్ అలీ, ఉద్యోగ విధులు, సాహిత్య కార్యకలాపాలు, వివిధ సంఘాలు మరియు సంస్థల ఛైర్మన్‌షిప్‌లు మొదలైన కార్యకలాపాలతో తనకాలం  గడప సాగాడు. ఆ సమయం లో వాజేద్ అలీకి ఒక బర్మీస్ మహిళా పరిచయం అయింది తరువాత ఆమె అతని జీవిత భాగస్వామిని  శ్రీమతి బద్రున్నెస్సా అలీ Badrunnessa Ali గా మారింది. రెండు సంవత్సరాల తరువాత, 26 అక్టోబర్ 1931, శ్రీమతి బద్రున్నెస్సా అలీ తన ఏకైక సంతానం పుట్టిన ఒక రోజు తర్వాత మరణించినది.. నవజాత శిశువు షేక్ బద్రుద్దీన్ అలీ  యొక్క సంరక్షణ కోసం ఒక ఆంగ్ల నర్సును నియమించారు.

1932 డిసెంబరులో 'గులిస్తాన్' అనే పత్రిక స్థాపన S. వాజేద్ అలీ జీవితంలో ముఖ్యమైన అధ్యాయం. గులిస్తాన్ పత్రిక ముఖ్య ఉద్దేశం 'హిందూ-ముస్లిం ఐక్యతకు మార్గదర్శకత్వం' వహించడం. కాజీ నజ్రుల్ ఇస్లాం, డాక్టర్. మొహమద్ షహిదుల్లా, కవిశేఖర్  కాళిదాస్ రే, బరింద్రనాథ్ ఘోష్, బుద్ధా దేవ్ బసు, నిర్మల్ దాస్, అనురూప దేవి,  ప్రభావతి దేవి  సరస్వతి, హుమాయున్ కబీర్, కామ్రేడ్ అబ్దుల్ అజీజ్ , ఫణీంద్రనాథ్ ముఖోపాధ్యాయ్, ధరాజ్ భట్టాచార్య, సౌరమోహన్ ముఖోపాధ్యాయ్, అబ్బాసుద్దీన్ అహ్మద్ మొదలగు సమకాలిన అగ్రశ్రేణి రచయితలు ఈ పత్రికలో రచనలు చేసేవారు.

'గులిస్తాన్' మ్యాగజైన్ వ్యవస్థాపకుడిగా కాకుండా, ఎస్. వాజేద్ అలీ 'బులెటిన్ ఆఫ్ ది ఇండియన్ రేషనలిస్టిక్ సొసైటీ'.అనే ఆంగ్ల భాష పత్రిక ప్రచురణకర్త మరియు సంపాదకుడు కూడా:

31 అక్టోబర్ 1945, S. వాజేద్ అలీ మూడవ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేట్ గా రిటైర్ అయ్యారు మరియు తన సొంత  న్యాయవాద వృత్తిని పున:ప్రారంభించారు.

ఎస్. వాజేద్ అలీ ప్రత్యేకమైన ఆలోచనాత్మక స్వభావం, విలక్షణమైన వ్యక్తిత్వం, కలిగిన మృదువైన వ్యక్తి.

1949 మధ్యలో, ఎస్. వాజేద్ అలీ' సెరిబ్రల్ థ్రోంబోసిస్'తో బాధపడ్డాడు.అతని శరీరం యొక్క ఒక వైపు పక్షవాతానికి గురైంది. చివరగా, జూన్ 10, 1951 న మరణించారు (వయస్సు 60)కలకత్తాలోని గోబ్రా స్మశానవాటికలో అతని చివరి భార్య శ్రీమతి బద్రున్నెస్సా అలీ సమాధి పక్కన ఖననం చేయబడ్డారు,

.

ఎస్. వాజేద్ అలీ' రచనలు-లెగసె:

·       ఎస్. వాజేద్ అలీ రాసిన ' మొదటి బంగ్లా వ్యాసం 'ఒటిటర్ బోజా'Otiter Bojha' ' -1919 లో ప్రచురించబడింది

·       ఎస్. వాజేద్ అలీ రాసిన ' చిన్న కథ 'రాజా' - 1925 లో ప్రచురించబడింది

·       ఎస్. వాజేద్ అలీ' 'బొంగియో ముషోల్మాన్ షాహిత్య షామిటీ'Bongio Musholman Shahitya Shamity' ' –కు 1925లో  ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు

·       ఎస్. వాజేద్ అలీ' 'బొంగియో ముషోల్మాన్ షాహిత్య షామిటీ'లో అధ్యక్ష పాత్రను పోషించాడు మరియు ఐదవ వార్షిక సమావేశంలో అధ్యక్ష ప్రసంగాన్ని ఇచ్చాడు.. -1925

·       31 జూలై- 'బొంగియో ముషోల్మాన్ షాహిత్య సమితి' సాధారణ సమావేశంలో పాల్గొని 'టొరునర్ కాజ్' పేపర్ చదివారు.. -1926

·       డిసెంబర్. 'బొంగియో ముషోల్మాన్ షాహిత్య సమితి' అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు. - 1926

·       'గుల్-దస్తా' -1927

·       డిసెంబర్- నజ్రుల్ ఇస్లాం నేషనల్ రిసెప్షన్ కమిటీ ఛైర్మన్ గా, కలకత్తాలోని ఆల్బర్ట్ హాల్‌లో స్వాగత ప్రసంగాన్ని సమర్పించారు. -1929

·       'డోర్బెషర్ దోవా'Dorbesher Doa '- 1931

·       డిసెంబర్- ఎస్. వాజేద్ అలీ 'పయనీర్ ఇలస్ట్రేటెడ్ మ్యాగజైన్ ఆఫ్ హిందూ-ముస్లిం ఐక్యత'- 'గులిస్తాన్' ప్రచురించారు. -1932

·       ఫిబ్రవరి-సిరాజ్‌గోంజ్ లో  'ఆల్-బెంగాల్ ప్రైమరీ టీచర్ అసోసియేషన్' కాన్ఫరెన్స్ కు అద్యక్షత వహించారు.. – 1935

·       జూలై., 'తాజ్‌పూర్ Tajpur  ఇనిస్టిట్యూట్' మొదటి వార్షికోత్సవం కు హాజరై అద్యక్ష ఉపన్యాసం ఇచ్చారు..

·       -1935 మే - 'బొంగియో ముషోల్మాన్ షాహిత్య సమితి' 6 వ సాహిత్య సమావేశానికి అధ్యక్షుడిగా హాజరయ్యారు మరియు థీమ్ ప్రసంగాన్ని అందించారు.

·       'బొంగియో ముషోల్మాన్ షాహిత్య సమితి' 'గ్రంథాలయ కమిటీ' ఉపాధ్యక్షుడు మరియు  సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. -1939

·       'గ్రెనడార్ శేష్బీర్'Granada'r Sheshbir' – 1941'

·       'జిబోనర్ శిల్పో'Jiboner Shilpo''- 1941

·       'ప్రాచ్యా ఓ ప్రతిచ్యా'Prachya o Pratichya''- 1943

·       'వోబిస్‌వాటర్ బంగాలీ' 'Vobiswater bangalee'-1943

·       'అఖిలస్సాం బంగ్లా లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ కాన్ఫరెన్స్' అధ్యక్షుడిగా హాజరై థీమ్ ప్రసంగాన్ని అందించారు. - 1943

·       'బాద్షాహి గోల్పో'Badshahi ' -1944

·       'గోల్పెర్ మోజ్లిస్'Golper Mojlis'' -1944

·       'అమర్ మసీదు`_1944 వీక్లీ బంగాలిలో ఎమ్. సలావుద్దీన్ (1912_72) చే ఎడిట్ చేయబడినది.  

 

 

 

 

No comments:

Post a Comment