15 May 2024

భారతదేశంలో ఉన్నత విద్యలో ముస్లింల ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థల్లో ముస్లిం విద్యార్థుల కంటే హిందూ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది: CSR-NOUS నివేదిక Hindu students outnumber Muslim students in higher education in Muslim-run institutions in India: CSR-NOUS Report

 



న్యూఢిల్లీ-

ఢిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ స్టడీ అండ్ రీసెర్చ్ (CSR) మరియు NOUS నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహించిన "భారతదేశంలో ముస్లింలు నిర్వహించే ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల ఉన్నత విద్యకు సంబంధించిన ఒక సర్వే" ప్రకారం దేశవ్యాప్తంగా ముస్లింలు నిర్వహించే విద్యాసంస్థల్లో ఉన్నత విద్యలో ముస్లిం విద్యార్థుల కంటే హిందూ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

Ø సర్వే ప్రకారం ముస్లింలు నిర్వహించే ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల ఉన్నత విద్యాసంస్థల్లో హిందువులు  55 శాతంగా ఉండగా ముస్లిం విద్యార్థులు 42 శాతంగా ఉన్నారు.

ముస్లిములు నిర్వహించే విద్యాసంస్థలకు సంబంధించి సమాజంలోని కొన్ని వర్గాల మధ్య ఉన్న తప్పుడు అభిప్రాయానికి వ్యతిరేకంగా ఈ అధ్యయనం అనుభావిక సాక్ష్యాలను అందిస్తుంది.

Ø అంతేకాకుండా ముస్లింల ఆధ్వర్యంలో నడిచే విశ్వవిద్యాలయాలలో, హిందువులు మెజారిటీ విద్యార్థులు (52.7%)గా , ముస్లింలు 42.1% గా ఉన్నారు.

Ø ముస్లిం మైనారిటీలు నిర్వహించే కళాశాలలో హిందువులు (55.1%), ముస్లింలు (42.1%) మరియు ఇతర మైనారిటీ సమూహాలు (2.8%) గా ఉన్నారు.


భారత దేశ మొత్తం జనాభాలో ఎస్సీలు మరియు ఎస్టీలు వరుసగా 16.6% మరియు 8.6% గా ఉన్నారు.

Ø ఉన్నత విద్యలో షెడ్యూల్డ్ కులాలు (SC) 15.3% మరియు షెడ్యూల్డ్ తెగల (ST) నమోదు రేట్ల 6.3% గా ఉన్నవి.

భారతదేశ జనాభాలో ముస్లింలు 14% పైగా ఉన్నారు.

ఉన్నత విద్యలో ముస్లిముల ప్రాతినిధ్యం తక్కువగానే ఉంది.

Ø తాజా ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (AISHE-2021-22) ప్రకారం, ఉన్నత విద్యలో చేరిన విద్యార్థులలో కేవలం 4.8% మంది మాత్రమే ముస్లింలు. ఇది షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగల (ST) నమోదు రేట్ల కంటే కూడా తక్కువ


Ø ముస్లిం విద్యా సంస్థలతో అనుబంధంగా ఉన్న కళాశాలల్లో ముస్లిం విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి 1.23గా ఉంది.

Ø విశ్వవిద్యాలయాలలో ముస్లిం విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి కేవలం 0.23 గా ఉంది.

Ø ముస్లిం విద్యార్థుల ఉమ్మడి స్థూల నమోదు నిష్పత్తి 1.46. అయితే, IITలు, IIITలు, IISERలు, NITలు మరియు IIMల వంటి జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలలో కేవలం 1.72% మంది విద్యార్థులు మాత్రమే ముస్లింలు ఉన్నారు.

17 ఏళ్ల కిందట ముస్లిం సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులపై సచార్ కమిటీ నివేదిక విడుదల చేసినా పెద్దగా పురోగతి లేదు.

2006లో సచార్ నివేదిక వెలువడినప్పుడు ఉన్నత విద్యలో ముస్లింల నమోదు 3.6%గా ఉంది.

2012-13లో మొదటి AISHE నివేదిక ఆరేళ్ల తర్వాత ఉన్నత విద్యలో ముస్లింల నమోదు 0.6% మాత్రమే పెరిగింది.

ఒక దశాబ్దం తరువాత, AISHE నివేదిక మరో 0.6% పెరుగుదలను సూచించింది. దీనికి విరుద్ధంగా, SC మరియు STలు వంటి ఇతర వెనుకబడిన వర్గాలు గణనీయమైన పురోగతిని సాధించాయి. వారి నమోదు రేట్లు 2006లో 2.4% నుండి 2021-22లో వరుసగా 15.3% మరియు 6.3%కి పెరిగాయి.

ముస్లింలతో పోలిస్తే ఎస్సీ మరియు ఎస్టీల నమోదు రేట్లు చాలా పెరుగుదలను చూపించాయి. ఉన్నత విద్యలో వారి వాటా 2006లో ఉమ్మడి 2.4% నుండి 2021-22లో SCలకు 15.3% మరియు STలకు 6.3%కి పెరిగింది.

సచార్ నివేదిక ప్రారంభంలో SCలు మరియు STలకు కలిపి 2.4% నమోదు రేటును నివేదించింది.

 

అధ్యయనం యొక్క ఇతర ముఖ్య ఫలితాలు:

 

విశ్వవిద్యాలయాలు:

1. AISHE 2020-21 డేటా ప్రకారం భారతదేశంలోని మొత్తం 1113 విశ్వవిద్యాలయాలలో, 23 విశ్వవిద్యాలయాలు ముస్లిం మైనారిటీకి చెందినవి. ముస్లిం మేనేజ్‌మెంట్ విశ్వవిద్యాలయాల వాటా కేవలం 2.1% మాత్రమే.

2. ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, తర్వాతి స్థానంలో కర్ణాటక ఉంది.

3. 23 ముస్లిం విశ్వవిద్యాలయాలలో, మెజారిటీ (43.5%) ప్రైవేట్‌గా నిర్వహించబడుతున్నాయి, ప్రభుత్వ రాష్ట్ర విశ్వవిద్యాలయాలు (26.1%), డీమ్డ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు (13%), మరియు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు (13%) ఉన్నాయి.

4. దాదాపు 69.9% ముస్లిం విశ్వవిద్యాలయాలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి.

5. 2021-22 విద్యా సంవత్సరంలో ముస్లిం విశ్వవిద్యాలయాలలో  నమోదు చేసుకున్న మొత్తం 97,928 మంది విద్యార్థులలో 42.1% మంది ముస్లింలు, 52.7% హిందువులు మరియు 5.2% ఇతర మైనారిటీ వర్గాలకు చెందినవారు.

6. ముస్లిం విద్యార్థులకు సంబంధించి, ఉన్నత విద్యలో 26,039 (63.09%) మంది విద్యార్థులు మరియు 15,236 (36.91%) మంది మహిళా విద్యార్థులు ఉన్నారు.

7. నమోదు చేసుకున్న 41,275 ముస్లిం విద్యార్థులలో 1% కంటే తక్కువ మంది షెడ్యూల్డ్‌ తెగలు, 34% ఇతర వెనుకబడిన తరగతులకు చెందినవారు, 42.8% అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీకి చెందినవారు మరియు మిగిలిన 16.4% ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు

 

కళాశాలలు:

1. AISHE 2020-21 డేటా ప్రకారం భారతదేశంలోని మొత్తం 43,796 కాలేజీలలో 1,155 కాలేజీలు ముస్లిం మైనారిటీ కమ్యూనిటీచే నిర్వహించబడుతున్నాయి. అంటే ముస్లిం మేనేజ్‌మెంట్ కాలేజీల వాటా కేవలం 2.6% మాత్రమే.

2. 1,155 కళాశాలల్లో 141 (12.2%) ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో నమోదు చేయబడిన సాంకేతిక కళాశాలలు.

3. అన్ని మైనారిటీ సమూహాలలో 73.4% ఉన్నప్పటికీ, ముస్లిం మైనారిటీ కమ్యూనిటీలు సాంకేతిక కళాశాలల్లో 16.6% వాటాను మాత్రమే కలిగి ఉన్నాయి. దీనికి విరుద్ధంగా, ఇతర మైనారిటీ సమూహాలు, జనాభాలో 26.6%, కాని సాంకేతిక కళాశాలల్లో 83.4% వాటాను కలిగి ఉన్నాయి.

4. భారతదేశంలోని 6.4% ముస్లిం కళాశాలలు బాలికల కోసం మాత్రమే ఉన్నాయి.

5. భారతదేశంలోని కళాశాలల సంఖ్య పరంగా మొదటి 10 రాష్ట్రాలు కేరళ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ మరియు జమ్మూ & కాశ్మీర్.

దేశంలోని మొత్తం కళాశాలల్లో ఈ రాష్ట్రాల వాటా 90.47%.

6. 1,155 ముస్లిం మైనారిటీ కళాశాలల్లో 85.5% ప్రైవేట్ (అన్ ఎయిడెడ్), 10.6% ప్రైవేట్ (ఎయిడెడ్), మరియు 3.9% ప్రభుత్వ కళాశాలలు.

7. కేరళలో లక్ష జనాభాకు 24.9 కళాశాలలు ఉండగా, యుపిలో 4.9 కళాశాలలు మరియు పశ్చిమ బెంగాల్‌లో లక్ష జనాభాకు కేవలం 1.8 కళాశాలలు ఉన్నాయి. లక్ష జనాభాకు జాతీయ కళాశాలల సగటు 6.4%గా ఉంది.

8. 1155 ముస్లిం మైనారిటీ కళాశాలల్లో 85.5% ప్రైవేట్ (అన్ ఎయిడెడ్), 10.6% ప్రైవేట్ (ఎయిడెడ్), మరియు 3.9% ప్రభుత్వ కళాశాలలు.

9. దాదాపు 57.8% ముస్లిం మైనారిటీ కళాశాలలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.

10. మెజారిటీ కళాశాలలు (93.16%) అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి, అయితే 6.32% మాత్రమే పీహెచ్‌డీ స్థాయి ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి.

11. కేరళలో అత్యధిక సంఖ్యలో PhD ప్రోగ్రామ్‌లను అందిస్తున్న కళాశాలలు ఉన్నాయి, ఆ తర్వాత తమిళనాడు మరియు మహారాష్ట్ర ఉన్నాయి.

12. దాదాపు 51% కళాశాలలు అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి ప్రోగ్రామ్‌లను మాత్రమే అందిస్తాయి.

13. 2021-22 విద్యా సంవత్సరంలో నమోదు చేసుకున్న మొత్తం 524,441 మంది విద్యార్థులలో 42.1% మంది ముస్లింలు, 55.1% హిందువులు మరియు 2.8% ఇతర మైనారిటీ వర్గాలకు చెందినవారు.

14. ముస్లిం విద్యార్థుల పరంగా, 104,163 (47.18%) మంది విద్యార్థులు మరియు 116,622 (52.82%) మహిళా విద్యార్థులు ఉన్నత విద్యలో చేరారు.

15. నమోదు చేసుకున్న 220,785 ముస్లిం విద్యార్థులలో, 1% కంటే తక్కువ మంది షెడ్యూల్డ్ తెగలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, 48.1% ఇతర వెనుకబడిన తరగతులకు చెందినవారు,

50.7%అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ నుండి వచ్చాయి మరియు మిగిలిన 0.9% ఆర్థికంగా బలహీనమైన విభాగాల (EWS) నుండి వచ్చినవి.

16. 96.4% కళాశాలలు 2023 NIRF ర్యాంకింగ్‌లో పాల్గొనలేదు.

17. NIRF 2023 కాలేజీ ర్యాంకింగ్స్‌లో ఏ కాలేజీ కూడా టాప్ 100లో స్థానం సంపాదించలేదు.

 

No comments:

Post a Comment