2 May 2024

సెజైర్లీ గాజీ హసన్ పాషా 1713 –1790 Cezayirli Gazi Hasan Pasha 1713 –1790

 


18వ శతాబ్దం చివరిలో సెజైర్లీ గాజీ హసన్ పాషా లేదా అల్జీర్స్‌ (1713 -  1790)  ఒట్టోమన్ గ్రాండ్ అడ్మిరల్ (కపుడాన్ పాషా) (1770-1790) మరియు ఒట్టోమన్ గ్రాండ్  వజీర్  (1790).

 గాజీ హసన్ పాషా పశ్చిమ అనటోలియాలోని  టెకిర్డాగ్ లో ఒక టర్కిష్ వ్యాపారి వద్ద  జార్జియన్ బానిసగా పెరిగాడు. గాజీ హసన్ పాషా ను తన  సొంత కొడుకులతో సమానంగా భావించి టర్కిష్ వ్యాపారి పెంచాడు.

గాజీ హసన్ పాషా ఒట్టోమన్ మిలిటరీ లో క్రమంగా ఎదిగాడు మరియు అల్జీర్స్‌లో ఉన్న బార్బరీ కోస్ట్ పైరేట్స్‌తో కొంతకాలం ఉన్నాడు (అందుకే గాజీ హసన్ పాషా పేరు సెజైర్లీ, అంటే టర్కిష్‌లో "అల్జీరియన్" అని అర్ధం). గాజీ హసన్ పాషా చెస్మే యుద్ధంలో ఒక టర్కిష్ ఫ్లీట్ కమాండర్ మరియు ఆ యుద్దంలో   టర్కిష్ నౌకాదళాన్ని ఘోర  విపత్తు నుండి కాపాడాడు

తను చేసిన కార్యానికి గాజీ హసన్ పాషా ఒట్టోమన్ రాజ్య ప్రశంసలు అందుకున్నాడు. గాజీ హసన్ పాషా మొదట చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా మరియు తరువాత గ్రాండ్ విజియర్‌గా పదోన్నతి పొందాడు. గాజీ హసన్ పాషా ఏజియన్ ద్వీపం లెమ్నోస్‌లో స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న రష్యన్ నౌకాదళాన్ని పారదోలాడు..

చెస్మే యుద్ధం తరువాత గాజీ హసన్ పాషా 1773లో నావల్ ఇంజనీరింగ్ గోల్డెన్ హార్న్ షిప్‌యార్డ్ (తరువాత టర్కిష్ నావల్ అకాడమీ) స్థాపించినాడు.

పాలస్తీనా యొక్క స్వయంప్రతిపత్త అరబ్ పాలకుడు జహీర్ అల్-ఉమర్ పాలిత ప్రాంతం అరేAcreను 1775 వేసవిలో హసన్ పాషా దిగ్బంధించాడు. ముట్టడిని సడలించడానికి హసన్ పాషా 50,000 పైస్టర్లు చెల్లించాలని జహీర్ అల్-ఉమర్ ను ఆదేశించాడు. జహీర్ నిరాకరించాడు మరియు హసన్ పాషా యొక్క ఓడలు అరేAcreపై బాంబు దాడి చేశాయి. జహీర్ అల్-ఉమర్ పారిపోయాడు, కానీ తప్పించుకునేలోపు హసన్ పాషా యొక్క దళాలచే చంపబడ్డాడు

16వ శతాబ్దం ప్రారంభంలో ఒట్టోమన్ సామ్రాజ్యం ఉత్తర ఆఫ్రికాపై ఆధిపత్యం చెలాయించింది, ఎందుకంటే అల్జీర్స్ 1525లో, 1551లో ట్రిపోలీ మరియు 1574లో టునిస్ ఒట్టోమన్ రీజెన్సీగా ఉన్నాయి.ఒట్టోమన్ పాలకులు అల్జీరియా, టునిస్ మరియు ట్రిపోలీలను నియంత్రించారు.

రీజెన్సీలు నియమించబడిన గవర్నర్లచే పాలించబడతాయి కాలక్రమేణా, గవర్నర్ల స్థానంలో నియమించబడిన సైనిక పాలకులు "దైలార్" (మేనమామలు)గా పిలవబడ్డారు. సైనిక పాలకులు తమ జెండాలను ఎగురవేసి అట్లాంటిక్ మహాసముద్రం మరియు మధ్యధరా సముద్రంలో ప్రయాణించారు. సైనిక పాలకులు అమెరికా తీరాల నుండి ఐస్‌లాండ్ వరకు ప్రతిచోటా దాడి చేస్తూ గొప్ప భీభత్సాన్ని సృష్టించారు. యూరోపియన్లు చాలా చోట్ల ఒట్టోమన్ నావికుల గురించి వ్రాసిన అనేక పాటలు మరియు జానపద కథలు ఉన్నాయి.

18వ శతాబ్దం చివరి నాటికి ఒట్టోమన్ సామ్రాజ్యం దాని పూర్వ శక్తిని కోల్పోయినప్పటికీ, ఇది ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సామ్రాజ్యాలలో ఒకటి. 1783లో స్వాతంత్ర్యం ప్రకటించిన తర్వాత యునైటెడ్ స్టేట్స్ మహాసముద్రాలు మరియు సముద్రాలలో చురుకుగా ఉంది.

అమెరికన్లు 1786లో అరబిక్‌లో మొరాకోతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మొరాకో నౌకాశ్రయాలను ఉపయోగించేందుకు అమెరికన్ నౌకలకు మొరాకో రాజు నుండి అనుమతి పొందారు.

అల్జీరియన్ సముద్రపు దొంగలు 1785 నుండి అమెరికన్ నౌకలను దోచుకోనేవారు. జూలై 1785లో, కాడిజ్ తీరంలో చిక్కుకున్న U.S. నౌకను అల్జీర్స్ నౌకాశ్రయానికి తీసుకువచ్చారు.

తరువాతి సంవత్సరాల్లో, డజన్ల కొద్దీ U.S. నౌకలను అల్జీరియన్ సముద్రపు దొంగలు స్వాధీనం చేసుకున్నారు. 1794లో, U.S. కాంగ్రెస్ బార్బరీ సముద్రపు దొంగలకు వ్యతిరేకంగా పోరాడేందుకు దాదాపు $700,000 కేటాయించింది మరియు బలమైన నౌకలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంది. 1795లో, US తమ నౌకలను కాపాడుకోవడానికి జోసెఫ్ డొనాల్డ్‌సన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని అల్జీర్స్‌కు పంపింది.

సుల్తాన్ సెలిమ్ III పాలనలో, అల్జీరియన్ నాయకులు సెప్టెంబర్ 5, 1795న ఒట్టోమన్‌లో యునైటెడ్ స్టేట్స్‌తో ఒప్పందంపై సంతకం చేశారు

అల్జీర్స్ గవర్నర్ హసన్ పాషా మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, అల్జీర్స్‌లోని అమెరికన్ నౌకా ఖైదీలను విడిపించడానికి మరియు సంవత్సరానికి $21,600 (12,000 అల్జెరిన్ సీక్విన్స్) పన్నును చెల్లించడానికి అమెరికా US $642,500 కప్పంగా హసన్ పాషాకు ఇస్తుంది.

ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఉన్న U.S. 18వ శతాబ్దం చివరిలో మధ్యధరా సముద్రంలో తన వాణిజ్య నౌకలు తిరగడానికి  ఒట్టోమన్ రీజెన్సీ ఆఫ్ అల్జీర్స్‌కు టాక్స్/కప్పం చేల్లిచినది. .

19వ శతాబ్దం మొదటి త్రైమాసికం వరకు అమెరికా ఈ పన్నును 20 సంవత్సరాలకు పైగా చెల్లించింది.తరువాత, అమెరికా దాని బలమైన నౌకాదళం మరియు సైనిక శక్తి కారణంగా టాక్స్ కట్టడం మానేసింది.

ఈజిప్ట్‌కు ప్రావిన్స్‌లో వాస్తవ పాలకులుగా మారిన ఇబ్రహీం బే (మమ్లుక్) మరియు మురాద్ బే నేతృత్వంలోని మామ్లుక్ ఎమిర్‌లను తరిమికొట్టమని 1786లో, హసన్ పాషా,  సుల్తాన్ అబ్దుల్ హమీద్ I నుండి ఆదేశం పొందినాడు. హసన్ పాషా ఆగష్టు 1786 ప్రారంభంలో ఈజిప్ట్‌కు చేరుకున్నాడు మరియు ఈజిప్ట్ లోని మామ్లుక్ ఎమిర్‌లను పారద్రోలినాడు. ఒక సంవత్సరం పాటు హసన్ పాషా ఈజిప్ట్ యొక్క వాస్తవ ఒట్టోమన్ గవర్నర్‌గా కొనసాగారు. హసన్ పాషా తరువాత అతని కేతుడా (సహాయకుడు/డిప్యూటీ) ఇస్మాయిల్ పాషా ట్రిపోలిటానియన్  ఈజిప్ట్‌కు ఒట్టోమన్ గవర్నర్‌గా నియమించబడ్డాడు (1788–89, 1789–91).

1787-1792 నాటి రష్యన్ -టర్కిష్ యుద్ధంలో, హసన్ పాషా (అప్పుడు 74సంవత్సరాల వయస్సు లో ) టర్కిష్ దళాలకు నాయకత్వం వహించాడు, 17 జూన్ 1788, ఫిడోనిసి యుద్ధం మరియు ఓచకోవ్ ముట్టడిలో హసన్ పాషా పాల్గొన్నాడు.

హసన్ పాషా అనారోగ్యంతో లేదా బహుశా విషం కారణంగా 19 మార్చి 1790న మరణించాడు. 

హసన్ పాషా విగ్రహం రిసార్ట్ పట్టణం అయిన ఎస్మేÇeşme లో కలదు. హసన్ పాషా ఆఫ్రికాలో ఉన్నప్పుడు మచ్చిక చేసిన సింహంను  ప్రతిచోటా తనతో పాటు తీసుకువెళ్ళేవాడు...

 

No comments:

Post a Comment