8 August 2022

అషురా విశ్వాసం, సోదరభావం మరియు సహజీవనానికి చిహ్నం Ashura a symbol of faith, fraternity and coexistence

 


ప్రవక్త ముహమ్మద్ యొక్క బోధనలను (సున్నత్) అనుసరించి అల్లాహ్ ప్రవక్త ముసా ను రక్షించిన రోజును గుర్తుంచుకోవడానికి మరియు గౌరవించడానికి ముస్లింలు ప్రతి సంవత్సరం అషురా రోజును జరుపుకుంటారు

ప్రవక్త ముహమ్మద్ యొక్క బోధనలను (సున్నత్) అనుసరించి ముస్లింలు ప్రతి సంవత్సరం అషురా రోజును జరుపుకుంటారు, అల్లా ప్రవక్త మోసెస్‌ను అతని ప్రజలతో పాటు మునిగిపోకుండా రక్షించిన రోజును కీర్తించడానికి మరియు గౌరవించటానికి. అల్లాహ్‌చే గౌరవించబడిన రోజుగా అషురా ను మనం స్మరించుకోవాలి

.

మతాల అంతటా పరస్పర సంబంధాలను, ప్రవక్తల సమన్వయాన్ని మరియు వారి సందేశాల ఏకీకరణను నొక్కి చెబుతూ, ప్రవక్త యొక్క హదీసు ఇలా పేర్కొంది:

"ప్రవక్తలు అనేక స్త్రీలు మరియు ఒకే విశ్వాసం కల  ఒక పురుషుని కుమారులు. “Prophets are sons of one man with many women and one faith.”

దీనర్థం ప్రవక్తలు వారి ప్రవచనంలో సోదరులు మరియు రక్తంలో కాదు, ప్రవచనంలో వారికి ఒకే తండ్రి ఉన్నారు; వారి తండ్రి ఆడమ్, మరియు వారి చట్టాలు భిన్నంగా ఉంటాయి.

విశ్వాసాలు మరియు వారి ప్రవక్తల అంతటా ఇటువంటి పరస్పర సంబంధాలకు మరింత సూచన ఏమిటంటే, మోషే రక్షించబడినందుకు యూదులు ఉపవాసం ఉన్న సమయంలో ప్రవక్త ముహమ్మద్ మదీనాకు వచ్చారు. ముహమ్మద్ ప్రవక్త చేసిన ప్రకటనలో ఇది స్పష్టంగా ఉంది:"మేము వారి కంటే మోషేకు దగ్గరగా ఉన్నాము."

దాని ప్రకారం ప్రవక్త ముహమ్మద్ ఆ రోజు ఉపవాసం ఉండి ఆ రోజు విశ్వాసులను  ఉపవాసం ఉండాలని ఆదేశించారు. ఈ గొప్ప ప్రవచనo   సహనం మరియు మొత్తం మానవాళిలో మతపరమైన సౌభ్రాతృత్వం యొక్క ఏకీకరణ కోసం పిలుపునిస్తుంది, శాంతి, భద్రతతో సహజీవన పద్ధతులను ప్రోత్సహించడం మరియు మతపరమైన సోదరభావాన్ని ప్రత్యేకంగా మానవ సోదరభావాన్ని పవిత్రం చేయడానికి. ఇస్లాం వచ్చింది, ఇస్లాం యొక్క లక్ష్యం సామరస్యం మరియు సహజీవనం.

ఇస్లాంలో అషురా యొక్క ప్రాముఖ్యత:

ఇస్లాం అషూరా రోజుకి గొప్ప ప్రాముఖ్యతను ఇచ్చింది మరియు ఉపవాసం వంటి ఆరాధన పద్ధతుల ద్వారా ఇది ఆచరించబడుతుంది. ప్రపంచ ముస్లిం సమాజం ప్రతి సంవత్సరం అషూరా ఉపవాసాలను ఆచరిస్తారు.  ఇస్లామిక్ ప్రపంచంలోని ఏ ఇల్లు కూడా అషురా ఉపవాసం లేకుండా ఉండదు. ఇది ముస్లిం  ప్రవక్తలు మరియు దూతలతో ఇతర మతాలు మరియు సంస్కృతుల అనుబంధం పై ముఖ్యమైన ఆధారాలను అందిస్తుంది.

మదీనా రాజ్యాంగం ఇస్లామిక్ ప్రపంచంలో ముస్లిములతో పాటు ముస్లిమేతరులకు కూడా  హక్కులను ప్రసాదించినది. ఇది పౌర రాజ్యం యొక్క మొదటి రాజ్యాంగం, ఇది మతం, జాతి, లింగం లేదా రంగు పరంగా పౌరుల మధ్య భేదం లేని ఇస్లామిక్ రాజ్యాన్ని రూపొందించింది. మదీనా రాజ్యాంగం రాజ్య పౌరుల మద్య విభేదాలు, సంఘర్షణ మరియు విభజన స్థానం లో పరిచయం, సంభాషణ మరియు కలయికపై ఆధారపడి ఉంటుంది.

దివ్య ఖురాన్ లో పేర్కొన్నట్లు (49:13):

"మానవులారా! మేము మిమ్మల్ని ఒకే పురుషునినుండి, ఒకే స్త్రీ నుండి సృజించాము. తరువాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకొనేందుకు మిమ్మల్లి జాతులుగాను, తెగలుగానూ చేసాము."

చారిత్రాత్మక అషురా దినంనాడు  ముస్లిములందరూ విధిగా ఉపవాసం పాటిస్తారు. ముస్లింలు ప్రవక్తలు మరియు సందేశకులందరి సందేశాలకు మరియు వారి పుస్తకాలకు పూర్తి గౌరవం ఇస్తారు. ఇస్లాం కేవలం ముస్లింల గుత్తాధిపత్యం కాదు; బదులుగా, అది వారికి మరియు ఇతరులకు సమానంగా ఉంటుంది ఎందుకంటే శాంతి అనేది పౌరులందరి హక్కు.ఇస్లాం ప్రకారం అషురా అనేది న్యాయం, సహనం, శాంతి మరియు సహజీవనాన్ని వ్యాప్తి చేసే రోజు. దైవిక సందేశం యొక్క మూలం మరియు ప్రాముఖ్యత వివరించే రోజు. శాంతి, సహజీవనం మరియు కరుణను ఇస్లాం యొక్క మూల సూత్రాలు. ముస్లిములు వాటి నుండి ప్రేరణ పొందడం మంచిది.

అషురా నాడు ఉపవాసం మంచితనం మరియు మానవత్వం ఉన్న ప్రజలు  తమ  దాతృత్వం, దయ మరియు శ్రేయస్సు కోసం దీవెనలను అందించే అల్లాహ్‌కు ప్రకటించే కృతజ్ఞత. అషురా రోజున సమస్త మానవాళి అన్యాయం, ఆక్రమణ, హింస, తీవ్రవాదం స్థానంలో ప్రపంచవ్యాప్తంగా న్యాయం,శాంతి మరియు సహజీవనం కోసం ఉపవాసం  ఉండాలని పిలుపునిద్దాం.

మూల రచన: అరబ్ న్యూస్ సౌజన్యం.

రచయిత, ఫైసల్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ ముఅమ్మర్.

తెలుగు సేత: సల్మాన్ హైదర్ 

No comments:

Post a Comment