ముంబై:
మీరా రోడ్లోని కిక్కిరిసిన హాలులో భారత-బ్రిటిష్ ఇస్లామిక్ పండితుడు మహమ్మద్ అక్రమ్ నద్వీ ప్రసంగీస్తూ తొలి ఇస్లాం కాలం నాటి ఉదాహరణలను ఉటంకిస్తూ, మహిళలను మసీదులకు వెళ్లకుండా, అక్కడ నమాజ్ చేయకుండా ఆపడం ప్రవక్త ముహమ్మద్(స) సంప్రదాయాలకు విరుద్ధమని నద్వీ అన్నారు.
ప్రవక్త(స) మరియు ఆయన సహచరులు చాలామంది చేసిన దానికి విరుద్ధంగా, భారత ఉపఖండంలోని చాలా మసీదులు మహిళలు ప్రార్థనలు చేయడానికి అనుమతించవు.
ఆక్స్ఫర్డ్ సెంటర్ ఫర్ ఇస్లామిక్ స్టడీస్లో మాజీ రీసెర్చ్ ఫెలో, రచయిత మరియు వ్యాఖ్యాత అయిన 65 ఏళ్ల నద్వీ, ముంబైలోని పలు వేదికలలో ప్రసంగించారు. "ప్రవక్త(స) చాలా విషయాలను నేరుగా మహిళలతో మాట్లాడేవారు, మహిళలు ఆయనను ప్రశ్నలు అడిగేవారు,ఆదిమ ఇస్లాంలో మహిళలు యుద్ధాలలో పాల్గొనగలిగినప్పుడు, పురుషులతో కలిసి ప్రార్థనలలో పాల్గొనకుండా వారిని ఎందుకు నిరోధించాలి?" అని నద్వి అన్నారు.
ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్కు చెందిన, లక్నోలోని ప్రఖ్యాత నద్వతుల్ ఉలేమా మదర్సాలో విద్యాభ్యాసం చేసిన నద్వి, ఉన్నత విద్య కోసం ఆక్స్ఫర్డ్కు వెళ్లారు. నద్వి పరిశోధన అంశo: ప్రవక్త యొక్క హదీసులు లేదా సూక్తులు/సంప్రదాయాలను వివరించే మహిళా కథకులు.
ప్రవక్త ముహమ్మద్(స)పై అవతరించిన దైవిక వాక్యాలు కలిగిన ఖురాన్ మరియు హదీసులు లేదా సూక్తులు ఇస్లాంకు మూలస్తంభం. హదీసులను వివరించిన వారిలో పురుషులు, మహిళలు ఇద్దరూ చాలా మంది ఉన్నారు. నద్వి ముహద్దితా లేదా హదీసులను వివరించే మహిళా కథకులపై 43 సంపుటాలలో 10,000 మందికి పైగా మహిళా హదీసు కథకుల వివరాలు వెలువడ్డాయి.
ఇఖ్రా ఇంటిగ్రల్
ఉమెన్స్ అలయన్స్ (IIWA) అనే
స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక-డైరెక్టర్ అయిన ఉజ్మా నహీద్,
నద్వి ను "సమకాలీన ఇస్లాం యొక్క ప్రముఖ
పండితుడు" అని అభివర్ణించారు. నద్వి కృషి అత్యంత ప్రాముఖ్యమైనది.
"అక్రమ్ నద్వి వంటి పండితుల కృషికి ధన్యవాదాలు, ఇప్పుడు
చాలా మసీదులు మహిళలకు కూడా తమ తలుపులు తెరుస్తున్నాయి."
No comments:
Post a Comment