షబ్బీర్ అన్సారీ మహారాష్ట్రలో OBC ఉద్యమానికి పునాది స్తంభాలలో ఒకరిగా
నిలిచారు. 'అంజుమన్-ఇ-ఇస్లాం'కు చెందిన డాక్టర్ జహీర్ ఖాజీ మరియు
బీహార్కు చెందిన అలీ అన్వర్ అన్సారీ వంటి వారి మద్దతుతో, షబ్బీర్ అన్సారీ ముస్లిం OBC ఉద్యమాన్ని జాతీయ స్థాయికి
తీసుకువెళ్లడంలో సహాయపడ్డారు.
షబ్బీర్ అన్సారీ, మహారాష్ట్రలో ఒక ప్రత్యేక 'ముస్లిం OBC సంస్థ' స్థాపకుల్లో ఒకరు. 1983లో
జల్నాలో జరిగిన 'ముస్లిం OBC సంస్థ’ స్థాపన సభకు బ్రహ్మ ప్రకాష్, అస్గర్ అలీ ఇంజనీర్, ఆర్.ఎస్. గవాయి మరియు రామ్ విలాస్
పాశ్వాన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. 1995లో, ఈ చొరవ 'అఖిల భారత ముస్లిం OBC సంస్థ'గా రూపుదిద్దుకుంది.
అవిశ్రాంత కార్యకర్త అయిన షబ్బీర్ భాయ్ నిరంతరం
పర్యటిస్తూనే ఉండేవారు. మహారాష్ట్రలో పస్మాందా ముస్లిం జనాభా ఉన్న ఏ గ్రామాన్ని
కూడా ఆయన సందర్శించకుండా వదిలిపెట్టలేదు. షబ్బీర్ భాయ్ ముస్లిం సమాజంలోని 60–70కి పైగా ఓబీసీ కులాలను గుర్తించి, నమోదు చేశారు. తద్వారా, దీర్ఘకాలంగా నిర్లక్ష్యానికి గురైన
వర్గాలకు గుర్తింపు లభించింది.
1994
డిసెంబర్లో, ముస్లిం ఓబీసీల కోసం మండల్ కమిషన్
సిఫార్సులను అమలు చేయడం ప్రారంభమైనప్పుడు, షబ్బీర్
అన్సారీ ఈ విషయమై అప్పటి ముఖ్యమంత్రి అయిన
శరద్ పవార్ను కలిసారు..
పవార్ సాహెబ్కు మారుమూల ప్రాంతాల్లోని
వెనుకబడిన తరగతి ముస్లింల పేర్లు, వృత్తులు, సామాజిక పరిస్థితుల గురించి బాగా
తెలుసు. షబ్బీర్ భాయ్ వారిని సంఘటితం చేయడం లో సహాయపడినారు. అనేక వెనుకబడిన
ముస్లిం వర్గాలు దీర్ఘకాలంగా నిరాకరించబడిన ప్రయోజనాలను అందుకోవడం ప్రారంభించాయి.
జులాహా, బంకర్, మోమిన్, అత్తర్, మెహతర్, బకర్ ఖస్సాబ్,
ఖురేషీ, ములానీ, ఎలుగుబంటి మరియు కోతి శిక్షకులు, ఛప్పర్బంద్, దఫాలీవాలే, రంగ్రేజ్, రంగారీ, గుజ్జర్, ముజావర్, మదారీ, పింజారీ, నదాఫ్, పత్తర్వత్, తంబోలీ, ఫకీర్ మరియు అన్సారీ వంటి ముస్లిం OBCవర్గాలకు ఒకప్పుడు
అందుబాటులో లేని విద్య మరియు అవకాశాలను ఇప్పుడు వారి పిల్లలు పొందుతున్నారు.
ఒకప్పుడు ముస్లిం వైద్యులు మరియు ఇంజనీర్లు
వేళ్ల మీద లెక్కపెట్టగలిగేవారు. షబ్బీర్ అన్సారీ వేసిన పునాదికి ధన్యవాదాలు, ఈనాడు ఈ అణగారిన వర్గాల నుండి వేలాది
మంది యువకులు విద్య మరియు ఉపాధిలోకి ప్రవేశిస్తున్నారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి, ముస్లిం సమాజంలోని అత్యంత నిరుపేద
మరియు అణగారిన వర్గాలలో ప్రగాఢమైన సామాజిక మార్పును తీసుకువచ్చిన నాయకులు
కొద్దిమందే ఉన్నారు వారిలో షబ్బీర్ అన్సారీ ఒకరు.
షబ్బీర్ అన్సారీ ఒక సాదాసీదా రేకుల ఇంట్లో
నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. షబ్బీర్ అన్సారీ చివరి వరకు ఒక వినయశీలి గానే
మిగిలిపోయారు.
షబ్బీర్ అన్సారీ మరణంతో, ముస్లిం సమాజం OBC ముస్లింల హక్కుల కోసం అవిశ్రాంతంగా
పోరాడిన ఒక యోధుడిని కోల్పోయింది. లోహియా సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న షబ్బీర్
అన్సారీ జ్యోతిరావు పూలే,
షాహు మహారాజ్ మరియు బి.ఆర్. అంబేద్కర్
వంటి మహనీయుల వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లారు; వారి భావజాలాన్ని ముస్లిం సమాజపు లోతుల్లోకి తీసుకువెళ్లడంలో కీలక
పాత్ర పోషించారు.
No comments:
Post a Comment