27 April 2023

కుల గణన అనేది అంబేద్కర్‌కు నిజమైన నివాళి Caste Census Would be Real Tribute to Ambedkar

 

అట్టడుగు వర్గాల జనాభాను నిజాయితీగా అంచనా వేయడం ప్రభుత్వ విధానాలను సవరించడం/రూపొందించడంలో మరియు భారతదేశం యొక్క అసమాన పురోగతిని సమానత్వ మార్గంలో ఉంచడంలో సహాయపడుతుంది.

ఏప్రిల్ 14, అనేక సంస్థలు మొదటి కేంద్ర న్యాయ మంత్రి మరియు రాజ్యాంగ నిర్మాణ కమిటి చైర్మన్  డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ 132వ జయంతిని జరుపుకున్నాయి. భారతదేశంలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషికి గుర్తుగా ఈ సంవత్సరం వేడుకలు గత సంవత్సరాల్లో నిర్వహించబడిన వాటికన్నా మెరుగుగా పెద్దఎత్తున  నిర్వహించడినవి.

ఈ ఏడాది 150కి పైగా దేశాల్లో డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. సామాజిక న్యాయం మరియు సమానత్వానికి కట్టుబడి ఉన్న చాలా సమూహాలు, ఈ రోజును గౌరవం మరియు ఆశతో గుర్తు చేసుకొంటాయి. 

అంబేద్కర్ సమాజంలోని అణగారిన వర్గాల కోసం నిశ్చయాత్మక చర్యను ప్రతిపాదించారు. రిజర్వేషన్లు మొదట్లో పదేళ్ల పాటు కొనసాగాలని భావించారు- కాని కులాల ఆధారంగా వివక్ష మరియు బహిష్కరణ కొనసాగుతూనే ఉంది  మరియు సామాజిక న్యాయం వైపు సాగడానికి దానికి అంతం అవసరం.

అంబేద్కర్ నాయకత్వం వహించిన భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ షెడ్యూల్డ్ కులాలు మరియు తెగలకు రిజర్వేషన్లు కల్పించింది. అయితే, సమాజంలో గణనీయమైన భాగం అయిన వెనుకబడిన తరగతులకు గుర్తింపు లేదా రిజర్వేషన్లు లభించలేదు. ఇతర వెనుకబడిన తరగతులు (OBC) 1990లలో మండల్ కమిషన్ నివేదికను అమలు చేసే వరకు చట్టపరమైన వర్గం legal category కాదు.

భారతదేశంలో చివరి  కుల గణన 1931లో జరిగింది. ఆ సమయంలో, వెనుకబడిన తరగతుల నిష్పత్తి 52%, మండల్ నివేదిక దానిపై ఆధారపడింది. 1990లలో వెనుకబడిన తరగతులకు 27% రిజర్వేషన్లు కల్పించేందుకు ఇది ప్రాతిపదికగా మారింది. ఈ తరగతులు సాంఘిక మరియు విద్యాపరమైన వెనుకబాటుతనం ఆధారంగా గుర్తించబడ్డాయి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత ఇటీవల కర్ణాటకలోని కోలార్‌లో చేసిన ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్ గాంధీ వెనుకబడిన తరగతుల (BC)జనాభా గణనను కోరాడు మరియు కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నత బ్యూరోక్రసీలో 7% మంది మాత్రమే అత్యంత అట్టడుగున ఉన్న లేదా వెనుకబడిన వర్గాలకు(BC) చెందినవారు ఉన్నారని అన్నాడు. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్‌లోని ఇతర పార్టీలతో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని పంచుకున్నప్పుడు నిర్వహించిన 2011 కుల జనాభా గణనలోని ఫలితాలను తప్పనిసరిగా బహిరంగపరచాలని రాహుల్ గాంధీ అన్నారు.

దేశ రాజకీయాల్లో “ఓబీసీలు, దళితులు, ఆదివాసీలకు వారి జనాభాకు అనుగుణంగా తగిన ప్రాతినిధ్యం లేకుంటే డేటా ఆధారాలను అందిస్తుంది’’ అని రాహుల్ గాంధీ అన్నారు. జనాభాలో వారి వాటాకు అనులోమానుపాతంలో అధికారం మరియు ప్రాతినిధ్యంలో భాగస్వామ్యం అనేది భారతదేశం యొక్క వెనుకబడిన వర్గాల నుండి చాలా కాలంగా ఉన్న నినాదం మరియు డిమాండ్.

కేంద్ర ప్రభుత్వం BC జనాభా గణన "పరిపాలనపరంగా కష్టతరమైనది మరియు గజిబిజిగా ఉంటుంది" అని 2021లో సుప్రీంకోర్టు కు తెలిపింది . "సెన్సస్ పరిధి నుండి అటువంటి సమాచారాన్ని మినహాయించడం చేతన విధాన నిర్ణయం conscious policy decision " అని పేర్కొంది.

గత తొమ్మిదేళ్లలో కేంద్రం,  ఆర్థికంగా బలహీనమైన విభాగం లేదా EWS కోసం రిజర్వేషన్‌లను ప్రవేశపెట్టింది. సంవత్సరానికి రూ. 8 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న అగ్ర  కుల సమూహాలలోని  సభ్యులకు EWS సహాయం చేస్తుందని అర్థం చేసుకోబడింది.

రిజర్వేషన్లు కల్పించడానికి లేదా తిరస్కరించడానికి ఆర్థిక స్థితి ఎప్పుడూ ప్రమాణం కాదు అనేది వాస్తవం.  భారతదేశంలో రిజర్వేషన్లు చారిత్రక వివక్ష (షెడ్యూల్డ్ కులాలకు), భౌగోళిక దూరం (షెడ్యూల్డ్ కులాలకు) మరియు సామాజిక మరియు విద్యాపరమైన వెనుకబాటుతనం (OBCలకు) ఆధారంగా ఉంటాయి.

విధానాలను సవరించడానికి/రూపొందించడానికి  మరియు సమాజం యొక్క అసమాన వృద్ధిని సమానత్వ మార్గంలో తీసుకురావడానికి వివిధ అట్టడుగు వర్గాల(BC) జనాభా యొక్క నిజమైన అంచనా అవసరం.

కుల ఆధారిత వివక్షను ఎదుర్కోవడానికి మనo  మేల్కొనాలి. భారతదేశ భవిష్యత్తు కోసం కుల నిర్మూలన సమాజం కోసం మనం ప్రయత్నించాలి.

 

వ్యాస రచయిత:

రామ్ పునియాని | 19 ఏప్రిల్ 2023-రచయిత మానవ హక్కుల కార్యకర్త మరియు IIT బొంబాయిలో బోధిoచారు..

 

No comments:

Post a Comment