6 April 2023

మహమ్మద్ కులీ కుతుబ్ షా- హైదరాబాద్ వ్యవస్థాపకుడు Mohammed Quli Qutb Shah, the founder of Hyderabad

 







హైదరాబాద్:

ప్రపంచంలోని చాలా నగరాలు, తమ వ్యవస్థాపకులను గౌరవిస్తాయి మరియు వారిని గుర్తుంచుకోoటాయి. హైదరాబాద్ వాసులుగా మనం 1591లో హైదరాబాద్ నగరానికి పునాది వేసిన స్థాపకుడు మహమ్మద్‌ కులీ కుతుబ్‌ షాను స్మరించుకోవాలి.

 

1518 నుండి 1687 వరకు ఉనికిలో ఉన్న గోల్కొండ కుతుబ్ షాహీ రాజవంశం లో 1566 ఏప్రిల్‌ 4న జన్మించిన మహమ్మద్‌ కులీ కుతుబ్‌ షా నాల్గవ రాజు. నాలుగు శతాబ్దాల నిరంతర చరిత్రను కలిగి ఉండే కొత్త నగరాన్ని నిర్మించాలనే ఆలోచన కలిగి ఉన్నందుకు మనం మహమ్మద్‌ కులీ కుతుబ్‌షాని గుర్తుంచుకోవాలి.

హైదరాబాద్ నగరానికి గుర్తుగా నిర్మించిన మొదటి స్మారక చిహ్నం అయిన చార్మినార్ నేడు ప్రపంచ ప్రసిద్ధి చెందింది మరియు దాని పునాదుల నుండి హైదరాబాద్ గొప్పతనo  ఇప్పటికీ ఉదాహరణగా నిలుస్తుంది. మహ్మద్ కులీ తన ప్రేమికురాలు  భాగమతి తో తన అనుబంధానికి ప్రసిద్ధి చెందాడు.

హైదరాబాదును మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించడానికి చాలా ముందు, 15వ శతాబ్దం చివరలో హమదాన్ (ఇరాన్) నుండి వలస వచ్చిన తర్వాత మహమ్మద్ కులీ కుతుబ్ షా తాత సుల్తాన్ కులీ తెలంగాణలో స్థిరపడ్డారు. హైదరాబాద్‌లోని గోల్కొండ కోట ప్రాకారాలతో కూడిన నగరం, దీని నుండి మొదటి ముగ్గురు కుతుబ్ షాహీ రాజులు పాలించారు.

గోల్కొండ కోట యొక్క మూలాలు 14వ శతాబ్దంలో వరంగల్ డియో రాయ్ రాజు (వరంగల్ నుండి పాలించిన కాకతీయ రాజ్యంలో) నిర్మించిన ఒక మట్టి కోటతో ఉన్నాయి. దీనిని 1358-75 మధ్య కాలంలో బహమనీ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నది. 1518లో చివరి సార్వభౌమ బహమనీ చక్రవర్తి మహమూద్ షా బహమనీ మరణించినప్పుడు కుతుబ్ షాహీ (లేదా గోల్కొండ) రాజ్యాన్ని స్థాపించిన సుల్తాన్ కులీ కాలం లో గోల్కొండ కోట పూర్తి స్థాయి కోటగా అభివృద్ధి చేయబడింది.

సుల్తాన్ కులీ బహమనీ సామ్రాజ్యం (1347-1518) క్రింద తిలాంగ్ (తెలంగాణ) యొక్క కమాండర్ మరియు తరువాత గవర్నర్‌గా ఉన్నారు, బహమనీ సామ్రాజ్య రెండవ రాజధాని బీదర్‌లో ఉంది. సుల్తాన్ కులీ బహమనీల పాలనలో గవర్నర్ స్థాయికి ఎదిగాడు. ఈ సమయంలో సుల్తాన్ కులీ కి గోల్కొండ కోట ఇవ్వబడింది, సుల్తాన్ కులీ గోల్కొండ కోటను  గోడలతో కూడిన నగరంగా అభివృద్ధి వృద్ధి చేసాడు. ఇది చివరికి గోల్కొండ కోట అని పిలువబడింది (ఈ పేరు గొల్ల-కొండ లేదా గొర్రెల కాపరుల కొండ నుండి వచ్చింది).

సుల్తాన్ కులీ చిన్న కుమారుడు ఇబ్రహీం కుతుబ్ షా కుతుబ్ షాహీ రాజ్యానికి మూడవ చక్రవర్తి. ఇబ్రహీం కుతుబ్ షా భార్య భగీరథు Bhagirathu కు జన్మించినవారిలో  మహమ్మద్ కులీ ఒకరు. మొహమ్మద్ కులీ చివరికి 1580లో తన తండ్రి మరణించిన తర్వాత నాల్గవ రాజు అయ్యాడు. యువ చక్రవర్తి మొహమ్మద్ కులీ 1591లో గోల్కొండ కోటలో మౌలిక సదుపాయాలు లేకపోవటం లేదా కోట లోపల స్థలం లేకపోవడంతో సహా అనేక కారణాల వల్ల అక్కడి నుండి బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

గోల్కొండ కోట చారిత్రాత్మకంగా డైమండ్ మార్కెట్‌లకు మరియు వాణిజ్యానికి ప్రసిద్ధి చెందింది. వజ్రాలు చారిత్రాత్మకంగా ఆంధ్ర ప్రాంతంలో (అప్పుడు గోల్కొండ సామ్రాజ్యం కింద) తవ్వబడ్డాయి మరియు కోట మార్కెట్లలో మరియు తరువాత హైదరాబాద్‌లో విక్రయించబడ్డాయి. హైదరాబాద్ ముత్యాలకు ప్రసిద్ధి చెందింది.

1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని స్థాపించినప్పుడు, అది గొప్ప భవనాలతో రూపొందించబడింది మరియు ప్రపంచ వాణిజ్యానికి దారి తీసింది. హైదరాబాద్ నగరం యొక్క ప్రధాన భాగం అయిన చార్మినార్, నగర పునాది స్మారక చిహ్నంగా నిర్మించబడింది. హైదరాబాద్ నగరం చార్మినార్ మరియు ఇతర స్మారక కట్టడాలతో ప్రసిద్దిచెందినది. హైదరాబాద్ నగరం లోని ప్రధాన ప్రాంతం లేదా బజార్లు 16వ మరియు 17వ శతాబ్దాలలో విదేశీవ్యాపారులను  ఆకర్షించాయి.

మహ్మద్ కులీ కాలం నాటి కొన్ని నిర్మాణాలలో బాద్షాహీ అషుర్ఖానా ఒకటి. ఇది 1592లో నిర్మించబడింది.  బాద్షాహీ అషుర్ఖానా,  ఇమామ్ హుస్సేన్ బలిదానం కోసం షియా ముస్లిం సంతాప ప్రదేశం. కుతుబ్ షాహీ రాజులు కూడా సనాతన షియాలే.

భారతీయ వ్యాపారులతో పాటు, మహ్మద్ కులీ కుతుబ్ షా యొక్క హైదరాబాద్ నగరం పర్షియన్, అర్మేనియన్, పోర్చుగీస్ మరియు బ్రిటిష్ వ్యాపారులను ఆకర్షించింది. ఫ్రెంచ్ యాత్రికుడు మాన్సియూర్ థెవెనోట్ హైదరాబాద్ ఆరవ రాజు సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా (1626-72) కాలం లో హైదరాబాద్ నగరం ఎలా ఉండేదో వివరించినాడు..

ఫ్రెంచ్ యాత్రికుడు మాన్సియూర్  తన ట్రావెలాగ్ లో హైదరాబాద్ ను బాగ్‌నగర్ అని పిలిచాడు. మాన్సియూర్ ప్రకారం  హైదరాబాద్ పట్టణం లోని తోటలు చాలా అందమైనవి, మరియు ఆహ్లాదకరమైనవి”.

 “ హైదరాబాద్ పట్టణంలోని వ్యాపారులు మరియు భూమిని సాగుచేసే వారు దేశ స్థానికులు. రాజ్యంలో చాలా మంది ఫ్రాంక్‌లు కూడా ఉన్నారు మరియు ఎక్కువ మంది పోర్చుగీస్ వారుకూడా ఉన్నారు. ఆంగ్లేయులు మరియు డచ్‌లు ఇటీవల అక్కడ స్థిరపడ్డారు మరియు చివరివారు గొప్ప లాభాలను ఆర్జించారు, ”అని థెవెనోట్ తన హైదరాబాద్ పర్యటన గురించి రాశాడు.

మహ్మద్ కులీ దక్కన్ లో మాట్లాడే దఖ్నీలో రాశాడు మరియు ఇది తరచుగా ఉర్దూగా తప్పుగా భావించబడుతుంది. మహ్మద్ కులీ దఖ్నీ కవి, మహ్మద్ కులీ తన జీవితకాలంలో వేల కవితా పంక్తులను సంకలనం చేశాడు. మహ్మద్ కులీ దాదాపు 50000 లేదా అంతకంటే ఎక్కువ కవితా పంక్తులు వ్రాసాడు.

నిస్సందేహంగా, నేటికీ, చార్మినార్ హైదరాబాద్ యొక్క ప్రధాన ఆకర్షణ. చార్మినార్ క్లిష్టమైన డిజైన్‌లు మరియు అద్భుతాన్ని దక్కన్‌లో లేదా దేశంలో దేనితో సమాంతరంగా ఉంచలేము. చార్మినార్ దక్కన్‌లో 16వ శతాబ్దపు ప్రపంచీకరణను కూడా ప్రతిబింబిస్తుంది.

డిజైన్ పరంగా దాని పర్షియన్ మరియు స్థానిక ప్రభావాలే కాకుండా, చార్మినార్ లో  పైనాపిల్ మోటిఫ్‌లు కూడా ఉన్నాయి. పోర్చుగీస్ (వాస్తవానికి బ్రెజిల్ నుండి తెచ్చిన) వాణిజ్యం ద్వారా పైనాపిల్ దక్కన్‌కు దిగుమతి చేయబడింది. అది కాకుండా, చార్మినార్  సెంట్రల్ ఆర్కేడ్‌లో షిర్డాల్ (లేదా గ్రిఫిన్స్) మూలాంశాలు కూడా ఉన్నాయి.

హైదరాబాదులోని మొదటి మసీదు చార్మినార్ కు ఎదురుగా ఉన్న జామా మసీదు. చార్మినార్ రెండవ అంతస్తులో కల మసీదు ముస్లిం పిల్లలకు పాఠశాల లేదా సెమినరీగా ఉపయోగించబడిందని కూడా చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.

1687లో మొఘలులతో సాగిన  ఎనిమిది నెలల యుద్ధంలో విజయం పొందిన ఔరంగజేబు హైదరాబాద్ నగరం లోని రాజభవనాలతో  సహా అనేక కట్టడాలను ధ్వంసం చేసినాడు.

కుల,మత, రాజకీయాలకు అతీతంగా, హైదరాబాద్ వ్యవస్థాపకుడు మహ్మద్ కులీని స్మరించుకోవడం మన కర్తవ్యం. మహ్మద్ కులీ లేకుంటే హైదరాబాద్ ఉండేది కాదు.

 

 

 

No comments:

Post a Comment