25 September 2016

ఇంగ్లాండ్ మర్చిపోయిన ముస్లిం చరిత్ర (England’s Forgotten Muslim History)


బ్రిటన్ మునుపెన్నడూ లేనంతగా విభజించబడింది. యూరోప్ ను  నిర్లక్షం చేసి ఇంగ్లాండ్ పాలకురాలు తన ద్రుష్టి ని  తూర్పు వర్తకం పై పెట్టుకుంది. అది  16 వ శతాబ్దపు చరిత్రలో  బ్రిటన్ మరియు ఆ నాటి అత్యంత ప్రసిద్ధ చక్రవర్తిని  క్వీన్ ఎలిజబెత్ I సమయం ను వివరిస్తుంది. ఆ కాలంలో ఎలిజబెత్ ఇంగ్లాండ్ తన విదేశీ మరియు ఆర్థిక విధానాలతో ఇస్లామిక్ ప్రపంచంతో  ఒక సన్నిహిత సంబంధాన్ని నడిపింది.

1558 లో సింహాసనాన్నిఅధిష్టించిన కాలం నుండి ఎలిజబెత్ రాణి ఇరాన్, టర్కీ మరియు మొరాకో లోని ముస్లిం పాలకులతో దౌత్య వాణిజ్య మరియు సైనిక సంబంధాలను వృద్ది చేసుకోంది. 1570 లో ప్రొటెస్టంట్ ఇంగ్లాండ్ కాథలిక్ విశ్వాసం వైపునకు తిరిగి రాదు అని   స్పష్టం అయిన తరువాత, పోప్ ఎలిజబెత్ ను బహిష్కరించినాడు మరియు ఆమె పాలన తొలగించుటకు పిలుపునిచ్చాడు. వెంటనే కాథలిక్ స్పెయిన్  ఆమెకు  వ్యతిరేకంగా ముట్టడి ప్రారంభిoచినది మరియు యుద్ధం అనివార్యం గా కనపడింది. ఆంగ్ల వ్యాపారులు స్పానిష్ నెదర్లాండ్స్ యొక్క మార్కెట్ల నుండి బహిష్కరింప బడినారు. కొత్తగా ఏర్పాటైన ప్రొటెస్టంట్ ఆంగ్ల దేశం కు ఆర్థిక మరియు రాజకీయ ఒంటరితనం  వెన్నాడినది.

దీనికి ప్రతిగా ఎలిజబెత్ ఇస్లామిక్ ప్రపంచం కు  దగ్గిర అయినది. ఆ కాలం లో   స్పెయిన్ యొక్క ప్రత్యర్థి ఒట్టోమన్ సామ్రాజ్యం దాని సుల్తాన్ మురాద్ III.అతని సామ్రాజ్యం ఉత్తర ఆఫ్రికా నుండి తూర్పు ఐరోపా గుండా  భారతీయ మహాసముద్రానికి విస్తరించినది.  ఒట్టోమన్లు  హంగేరి భాగాలు ఆక్రమించుకొని  దశాబ్దాలుగా హప్స్బుర్గ్స్ (Hapsburgs) తో  పోరాటం చేస్తున్నారు.  ఎలిజబెత్ రాణి కి ఒట్టోమన్   సుల్తాన్ తో సంధి స్నేహసంభoదాలు  స్పానిష్ సైనిక దళాల దూకుడు నుండి అవసరమైన ఉపశమనం అందించును మరియు  తూర్పు యొక్క  లాభదాయకమైన మార్కెట్లను ఇంగ్లీష్ వర్తకులు   పొందటం లో సహాయపడునని భావించారు. ఇంగ్లాండ్ ఒట్టోమన్లతో పాటు వారి  'ప్రత్యర్థులు అయిన పర్షియా యొక్క షా మరియు మొరాకో పాలకుడు కి దగ్గిర అయినది.

అయితే ఆ నాటి ముస్లిం సామ్రాజ్యాలు యూరోప్ లోని చిన్న దేశం అయిన ఇంగ్లాండ్ కంటే చాలా శక్తివంతమైనవి గా  ఉండేవి. ఎలిజబెత్ కొత్త వాణిజ్య పొత్తులు అన్వేషించాలని కోరుకోoది, కానీ వాటికి  ఆర్థిక సహాయం అందించ లేకపోయిoది. ఈ పరిస్థితులలో ఆమె సోదరి మేరీ ట్యూడర్ ద్వారా పరిచయం అయిన ఉమ్మడి స్టాక్ సంస్థలు ఆమెకు తోడ్పడినవి.

 షేర్-హోల్డర్స్ చే ఉమ్మడిగా నడుపబడే ఈ కంపనీలు వాణిజ్యంకు అవసరమైన పెట్టుబడులను పెట్టును మరియు  లాబాలు/నష్టాలను సమానంగా భరించును.  ఎలిజబెత్ రాణి ఉత్సాహంగా పర్షియా వర్తకం ముస్కోవే కంపెనీ కి ఇచ్చింది మరియు అది ఒట్టోమన్ సామ్రాజ్యం తో వర్తకం చేయడానికి  టర్కీ కంపనీని ఏర్పరిచినది. అలాగే ఈస్ట్ ఇండియా కంపనీ ఏర్పాటు అది చివరకు ఇండియా ను జయిoచడానికి తోడ్పడింది. 

1580 లో ఆమె ఇంగ్లీష్ వర్తకులకు ఒట్టోమన్ భూభాగం లో ఉచిత వాణిజ్య ప్రాప్తికి అనుమతిస్తూ 300 సంవత్సరాలకు వాణిజ్యపరమైన ఒప్పందాలు ఒట్టోమన్ ప్రభుత్వం తో చేసుకున్నారు. ఆమె స్పెయిన్ వ్యతిరేకంగా సైనిక మద్దతు కోరుతూ మొరాకోతో  కలిపి ఇదే రకమైన ఒప్పందాన్ని చేసుకుంది.

వర్తకం ద్వార సంపద వచ్చేకొద్దీ ఎలిజబెత్ పరస్పర వాణిజ్యం యొక్క ప్రయోజనాలను  కీర్తిస్తూ ఆమె ముస్లిం పాలకులకు లేఖలు రాయటం ప్రారంభించారు. ఆమె ఒక లేఖలో మురాద్III ను  “టర్కీ ఏకైక అత్యంత శక్తివంతమైన పాలకుడు మరియు తూర్పు సామ్రాజ్యం అత్యంత సార్వభౌమ చక్రవర్తి” అని కిర్తించినది.   కాథలిక్కుల శత్రువు అయిన ముస్లింల మద్దతు పొందటానికి తనను విగ్రహరాధకులకు  వ్యతిరేకమైన పాలకురాలు గా పేర్కొన్నది.

ఈ ఉపాయం ఫలించింది. ఇంగ్లీష్ వ్యాపారులు వేలాదిగా  సిరియా అలెప్పో, ఇరాక్ లోని మోసుల్ ప్రాంతాల వంటి సుదూర ప్రాంతాల  వరకు వర్తకం ఆరంబించారు. కాథలిక్ యూరోప్ కన్నా చాలా సురక్షితమైన వర్తక మార్గం వారికి అందుబాటులోకి వచ్చింది.

ఒట్టోమన్ అధికారులు అన్ని విశ్వాసాల ప్రజలను  స్వీకరించడం తమ  బలహీనత కాక  శక్తి యొక్క చిహ్నం గా భావించారు. కొందరు ఆంగ్లేయుల కూడా ఇస్లాంస్వీకరించారు. ఆల్జియర్స్ చీఫ్ కోశాధికారి హసన్ అగా గతం లో సామ్సన్ రౌలి  గా పరిచితుడు. కొందరు   సొంత సంకల్పము చేత అనిశ్చిత కొత్త ప్రొటెస్టంట్ విశ్వాసాన్ని కంటే మెరుగైన ఇస్లాం మతం ను స్వీకరించారు.

పట్టు మరియు తూర్పు సుగంధ ద్రవ్యాలు ఇంగ్లీష్ ప్రభువులకు ఆనందపరిచినవి కానీ టర్క్ మరియు మొరాకో వారికి ఆంగ్ల ఉన్ని అందు  ఆసక్తి లేదు. వారికి కావలసినది అవసరమైన ఆయుధాలు. ఎలిజబెత్ పాడుపెట్టిన కాథలిక్ చర్చిల నుండి గంటలు,  మెటల్ కొల్లగొట్టి వాటినుండి మందుగుండు సామగ్రి తయారుచేసి టర్కీ కి రవాణా చేసేది.  రాణి మొరాకో కి కుడా ఆయుదాలు అందించి వారినుంచి గన్పౌడర్ లో అతి ముఖ్యమైన అంశమైన సాల్ట్ పీటర్ మరియు  మరియు చక్కెర కొనుగోలు చేసేది.

చక్కెర, పట్టు, తివాచీలు మరియు సుగంధ ద్రవ్యాలు ఇంగ్లీష్ వారిని అలరించినవి. క్యాండి ("మిఠాయి") మరియు "మణి" ( "టర్కిష్ రాయి" నుండి) పదాలు సర్వసాధారణంగా మారాయి. మొదటి మొరాకో దౌత్యాధికారి యొక్క ఆరు నెలల ఆంగ్ల  పర్యటన తర్వాత "ఒథెల్లో" షేక్స్పియర్ రాయడం ప్రారంభించినాడు.
 
ఉమ్మడి స్టాక్ కంపెనీలు  వ్యాపార పరంగా విజయం సాధించినప్పటికీ, బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ బాగుపడలేదు. 1603 లో ఎలిజబెత్ మరణానంతరం, కొత్త రాజు జేమ్స్, స్పెయిన్ తో ఒక శాంతి ఒప్పందం చేసుకొని ఇంగ్లాండ్ ఒంటరితనమునకు ముగింపు పలికాడు.

ఎలిజబెత్ యొక్క ఇస్లామిక్ ప్రణాళిక ఒక కాథలిక్ దాడిని ఆపి జాయింట్ స్టాక్ పెట్టుబడికి తద్వారా వర్జీనియా కంపని ఏర్పాటుకు తుదకు   మొదటి శాశ్వత ఉత్తర అమెరికా కాలనీ ఏర్పాటుకు దారితీసింది. 

ఈ విధంగా ఇంగ్లాండ్ ఇంపీరియల్ సైనిక మరియు వాణిజ్య  కథలో ఇస్లాం ముఖ్యపాత్ర పోషించినది. నేడు ముస్లిం వ్యతిరేక రాజకీయ ఉన్నరోజులలో పాత రోజులలో ఇస్లాం ఏవిధంగా ఆంగ్ల దేశానికి సహాయ పడినదో గుర్తుకు తెచ్చుకోవటం మేలు. 

No comments:

Post a Comment