16 July 2026

సోఫియా షేక్ -2022 జమ్నాలాల్ బజాజ్ అవార్డు గ్రహీత-ఒడిశాలోని భద్రక్‌కు చెందిన సామాజిక కార్యకర్త Jamnalal Bajaj Award Winner in 2022-Sophia Shaikh of Bhadrak, Odisha-A social activist

 

-

సోఫియా షేక్ ఒడిశాకు చెందిన ఒక సామాజిక కార్యకర్త. సోఫియా షేక్ అణగారిన మహిళలు మరియు పిల్లల సాధికారత కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. 'సొసైటీ ఫర్ వీకర్ కమ్యూనిటీ' (SWC) ద్వారా, సోఫియా షేక్ మానవ అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ మరియు ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు. సోఫియా షేక్ 2022లో ప్రతిష్టాత్మకమైన జమ్నాలాల్ బజాజ్ అవార్డును పొందారు.  

ఒడిశాలోని భద్రక్ జిల్లాకు చెందిన సోఫియా షేక్ తండ్రి షేక్ అబ్దుస్ సలాం కూడా ఒక సామాజిక కార్యకర్త,పేదలు మరియు అణగారిన వారి హక్కుల కోసం నిరంతరం గళం విప్పేవారు. షేక్ అబ్దుస్ సలాం సామాజిక సంస్కరణల కోసం చేసిన కృషి, స్థానిక పెత్తందారీ నాయకులను వ్యతిరేకించడం వల్ల, ఆయన సంఘ విద్రోహ శక్తుల క్రూరమైన దాడికి గురయ్యారు.

14 ఏళ్ల వయసులో, అబ్దుస్ సలాం కుమార్తె సోఫియా షేక్ న్యాయం కోసం గళం విప్పారు.తన తండ్రికి న్యాయం జరగాలని, సోఫియా షేక్ ఒంటరిగా నిరాహార దీక్ష చేపట్టారు. అంత చిన్న వయసులోనే సోఫియా షేక్ చూపిన ధైర్యం, పట్టుదల ప్రభుత్వాన్ని చర్యలు తీసుకునేలా చేశాయి, ఫలితంగా నిందితులను చివరికి అరెస్టు చేశారు. 15 ఏళ్ల వయసు నుండి  సోఫియా షేక్ తనను తాను పూర్తిగా సాంఘిక సేవకు, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటానికి తన జీవితం అంకితం చేసుకుంది.

సోఫియా షేక్ ఒడిశాలోని భద్రక్ జిల్లాలో 1971 నవంబర్ 11న జన్మించారు. సాంఘిక సంక్షేమం పట్ల తండ్రి అబ్దుస్ సలాం చూపిన స్ఫూర్తి, పట్టుదల, అభిరుచి సోఫియా షేక్ లో లోతుగా నాటుకుపోయి, సమాజ అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసేలా ప్రేరేపించాయి.

1987లో, సోఫియా తండ్రి స్థాపించిన 'సొసైటీ ఫర్ వీకర్ కమ్యూనిటీ' (SWC) అనే ప్రభుత్వేతర సంస్థకు నాయకత్వం వహించి తద్వారా  అణగారిన మహిళలు, పిల్లల హక్కులపై దృష్టి సారిస్తూ సాంఘిక సేవలో తన పూర్తిస్థాయి ప్రయాణాన్ని ప్రారంభించారు.

సోఫియా షేక్ నాయకత్వంలో, 'సొసైటీ ఫర్ వీకర్ కమ్యూనిటీ' SWC పేద మరియు అణగారిన వర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టింది. సోఫియా షేక్ పోలీసు మరియు పరిపాలనా యంత్రాంగంతో కలిసి పనిచేస్తూ, మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అనేక రెస్క్యూ ఆపరేషన్లకు నాయకత్వం వహించారు. ఈ ప్రయత్నాల ద్వారా, వందలాది మంది బాలికలు బలవంతపు వ్యభిచారం మరియు అక్రమ రవాణా వలయాల నుండి రక్షించబడ్డారు. రెస్క్యూతో పాటు, బాధితులు తిరిగి ప్రధాన స్రవంతి సమాజంలో కలిసిపోవడానికి 'సొసైటీ ఫర్ వీకర్ కమ్యూనిటీ' SWC సంస్థ విద్య మరియు మానసిక మద్దతును కూడా అందిస్తుంది.

తన ప్రాణాలను పణంగా పెట్టి చేపట్టిన సాహసోపేతమైన రెస్క్యూ మిషన్లకు గాను, సోఫియా షేక్ కు గాడ్ఫ్రే ఫిలిప్స్ జాతీయ ధైర్యసాహసాల పురస్కారం లభించింది.

భద్రక్ ప్రాంతంలో, దాదాపు 6,000 ముస్లిం కుటుంబాలు బీడీల తయారీపై ఆధారపడి జీవించేవి. ఇక్కడి మహిళలు తమ ఇళ్ల నుండే పనిచేస్తూ అత్యంత తక్కువ వేతనాలు సంపాదించేవారు. వ్యాపారులు మరియు మధ్యవర్తులు తరచుగా వారిని ఆర్థికంగా దోపిడీ చేసేవారు. సోఫియా షేక్ ఈ మహిళలను సంఘటితం చేసి, న్యాయమైన వేతనాల కోసం ప్రచారాలు నడిపించి, వారి శ్రమకు సరైన ప్రతిఫలం అందేలా పోరాడారు.

సోఫియా షేక్ అణగారిన, పేద వర్గాల బాలికలను ప్రమాదకరమైన బాల కార్మిక వ్యవస్థ నుండి తొలగించి, వారిని అధికారిక పాఠశాలల్లో చేర్పించడానికి అవిశ్రాంతంగా కృషి చేశారు.

నిరంతరం పొగాకుకు గురికావడం వల్ల బీడీ కార్మికులు క్షయ (టీబీ), ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు, మరియు దృష్టి లోపం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు. మహిళలను ఈ హానికరమైన వృత్తి నుండి దూరం చేయడానికి, సోఫియా షేక్ నైపుణ్యాభివృద్ధి మరియు జీవన నైపుణ్యాల విద్యా కార్యక్రమాలను ప్రవేశపెట్టారు.

మహిళలకు కుట్టుపని, ఎంబ్రాయిడరీ, చేతివృత్తులు, మరియు చిన్న వ్యాపార నిర్వహణలో శిక్షణ ఇవ్వబడింది, తద్వారా వారు మరింత ఉత్పాదక మరియు గౌరవప్రదమైన మార్గాల ద్వారా జీవనోపాధి పొందగలిగారు.

సోఫియా షేక్ జిల్లా స్థాయిలో బాల కార్మిక వ్యవస్థను ఎదుర్కోవడానికి, పనిచేస్తున్న పిల్లలను రక్షించడానికి మరియు వారిని పాఠశాలల్లో చేర్పించడానికి కూడా కృషి చేస్తున్నారు. పేద మరియు అనాథ పిల్లలకు ఉచిత ట్యూషన్, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మరియు పోషకాహార మద్దతు అందించడం 'సొసైటీ ఫర్ వీకర్ కమ్యూనిటీ' SWC సంస్థ యొక్క ప్రధాన కార్యకలాపాలలో ఒకటిగా కొనసాగుతోంది.

సోఫియా షేక్ చేసిన విశేషమైన సేవలకు గుర్తింపుగా, సోఫియా షేక్‌కు 2022లో జమ్నాలాల్ బజాజ్ అవార్డును ప్రదానం చేశారు.

సోఫియా షేక్ సామాజిక సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తూనే ఉన్నారు. సంవత్సరాలుగా, సోఫియా షేక్ లెక్కలేనంత మంది మహిళల జీవితాలను మార్చారు, మరియు భద్రక్ జిల్లాలో మహిళల సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడంలో ప్రధాన పాత్ర వహించారు.

హలీమా ఖాతున్ - ఉత్తర 24 పరగణాల సుందర్‌బన్స్ ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్త Halima Khatun- A social Worker from Sundarbans of North 24 Parganas

 

 

ఉత్తర 24 పరగణాల సుందర్‌బన్స్ లోని 'ఉత్తర మహమూద్‌పూర్' ప్రాంతంలో, హలీమా ఖాతున్ వేలాది మంది మహిళల విముక్తికి ఒక ఆశాకిరణంగా ప్రతీకగా నిలిచారు.నిరుపేద బీడీ కార్మికుల కుటుంబంలో జన్మించిన హలీమా, మహిళల నిస్సహాయత—బాల్య వివాహాలు, విద్య లేకపోవడం మరియు కనీస హక్కులకు కూడా నోచుకోని జీవితాలను గమనించారు.

కోల్‌కతాలో చదువుకొన్న హలీమా 2009లో ‘యాక్షన్ ఎయిడ్ ఇండియా' (ActionAid India) సంస్థలో చేరి, గ్రామాలలో పర్యటిస్తూ  మహిళల సమస్యలను అర్ధo చేసుకొని గ్రామీణ మహిళల కు తమ హక్కుల పై అవగాహన కల్పించారు.

బాల్య వివాహాలకు వ్యతిరేకంగా హలీమ అవిశ్రాంత పోరాటం జరిపారు, పోలిసుల సహాయం తో అనేక బాల్య వివాహాలను అరికట్టారు. హలీమ జరిపిన సామాజిక సేవ పలితంగా ఎంతోమంది బాలికలు తిరిగి పాఠశాలకు వెళ్లగలిగారు మరియు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే అవకాశాన్ని పొందగలిగారు.

హలీమా ఖాతున్ కృషి ఫలితంగా 'హస్నాబాద్-హింగల్‌గంజ్ ముస్లిం మహిళా సంఘం' ఏర్పాటైంది; అక్కడ వేలాది మంది మహిళలు తమ హక్కుల గురించి చర్చించడానికి ఒకచోట చేరుతున్నారు,  ఓటరు గుర్తింపు కార్డులు, రేషన్ కార్డులు, విద్య మరియు ఆరోగ్య సేవలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

హలీమా ప్రయాణం ఎప్పుడూ సులభంగా సాగలేదు. కొన్నిసార్లు ప్రాణహానిని కూడా ఎదుర్కొన్నారు. అయిన ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. పైగా, ప్రతి అడ్డంకిని తన బలంగా మార్చుకున్నారు.

నేడు, సుందర్‌బన్స్ ప్రాంతంలోని అనేక గ్రామాల్లో మార్పు గాలులు వీస్తున్నాయి. మహిళలు  నిరసన తెలపడం, సొంత నిర్ణయాలు తీసుకోవడం మరియు తమకు దక్కాల్సిన స్థానాన్ని దక్కించుకోవడం నేర్చుకున్నారు. ఈ మార్పులో కీలక పాత్ర పోషించిన వ్యక్తి హలీమా ఖాతున్; తన జీవితాన్ని మాత్రమే కాకుండా, వేలాది మంది ఇతరుల జీవిత గమనాన్ని కూడా హలీమా ఖాతున్ మార్చివేసింది.



 

13 July 2026

గూఢచారి నుండి ఇస్లాం దాయి వరకు: ఒక జపనీస్ యువకుడి కథ!

 

 

కొన్నిసార్లు, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మానవ ఊహకు అందని మార్గాలను ఎంచుకుంటాడు.శత్రు గడ్డపై గూఢచర్యానికి వెళ్లిన ఒక యువకుడు, పరమ ఇస్లాం భక్తుడిగా మారి, తన జీవితాంతం ఇస్లాం మతానికే సేవ చేస్తాడని ఎవరు ఊహించగలరు?

ఇది మిత్సుటారో యమయోకా కథ. ఆ జపనీస్ యువకుడిని ప్రపంచం తరువాత ఒమర్ యమయోకాగా తెలుసుకుంది.

అది 1909వ సంవత్సరం, ఒక చల్లని ఉదయం. ముంబై ఓడరేవులో, రష్యా నుండి వచ్చిన టాటార్ ముస్లింలు హజ్ యాత్రకు సిద్ధమవుతున్నారు. ఆ యాత్రికుల మధ్య, రష్యన్ భాషలో అనర్గళంగా మాట్లాడే ఒక  జపనీస్ యువకుడు నిలబడి ఉన్నాడు. జపనీస్ యువకుడు ఒక సాధారణ యాత్రికుడిలా కనిపించాడు, కానీ అతని అసలు గుర్తింపు వేరే.

జపనీస్ యువకుడు జపాన్ రహస్య సంస్థ అయిన 'బ్లాక్ డ్రాగన్ సొసైటీ'కి గూఢచారి. ప్రఖ్యాత ముస్లిం నాయకుడైన అబ్దుర్ రషీద్ ఇబ్రహీంతో కలిసి మక్కాకు ప్రయాణించి, అబ్దుర్ రషీద్ ఇబ్రహీం నమ్మకాన్ని సంపాదించి, ఆయన గురించి సమాచారం సేకరించే ముఖ్యమైన బాధ్యత అతనికి అప్పగించబడింది.

కానీ మానవుల ప్రణాళికల కంటే అల్లాహ్ ప్రణాళిక చాలా శ్రేష్ఠమైనది.

ప్రయాణం ప్రారంభమైంది. ఆ గూఢచారి ప్రశ్నలు అడిగాడు, కానీ అతనికి కేవలం సమాచారం మాత్రమే లభించలేదు. అబ్దుర్ రషీద్ ఇబ్రహీం అతనికి ఇస్లాం సౌందర్యాన్ని, ఏకేశ్వరోపాసన సత్యాన్ని, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవితాన్ని మరియు ఖురాన్ సందేశాన్ని పరిచయం చేయడం ప్రారంభించారు. ప్రయాణంలోని ప్రతి దశలోనూ, ఆ యువ జపనీయుడి హృదయంలో ఒక కొత్త వెలుగు వెలిగింది. తాను పరిశీలించడానికి వచ్చిన వ్యక్తి యొక్క మాటలే జపనీస్ యువకున  హృదయంలోని మూసుకుపోయిన తలుపులను తెరిచాయి.

చివరగా, జపనీస్ యువకుడు కలీమా పఠించి ఇస్లాంను స్వీకరించిన క్షణం వచ్చింది.మిత్సుటారో యమయోకా ఇప్పుడు ఒమర్ యమయోకాగా మారాడు.ఈ విధంగా, చరిత్ర ఒక అద్భుతమైన మలుపు తీసుకుంది. ఒక గూఢచారి ఇస్లాం అనుయాయి గా మారి, హజ్ గౌరవాన్ని పొందిన జపాన్ నుండి వచ్చిన మొదటి ముస్లిం అయ్యాడు.

ఈ వార్త హిజాజ్ అంతటా వేగంగా వ్యాపించింది. ఈ జపనీస్  నూతన ముస్లింను చూడటానికి ప్రజలు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. జపనీస్ ముస్లిం అదృష్టం ఎంత గొప్పదంటే, స్వయంగా మక్కా షరీఫ్ అతనికి ఆతిథ్యం ఇచ్చారు, అంతేకాక కాబాలోకి ప్రవేశించే గౌరవాన్ని కూడా అతనికి ప్రసాదించారు. ఇది అతను ఎన్నడూ ఊహించని గౌరవం.

హజ్ యాత్ర తర్వాత, ఒమర్ యమయోకా బీరుట్, డమాస్కస్ మరియు ఇస్తాంబుల్‌లకు చేరుకున్నప్పుడు, ప్రతి నగరంలోనూ అతనికి ఘనస్వాగతం లభించింది. ముస్లింలు అతన్ని ఒక సోదరుడిలా ఆలింగనం చేసుకున్నారు. తన జీవితంలో మరెక్కడా మక్కా మరియు ముస్లింల నుండి ఇంతటి గౌరవం, ప్రేమను పొందలేదని ఒమర్ యమయోకా తరువాత రాశారు.

ఒమర్ యమయోకా జపాన్‌కు తిరిగి వచ్చినప్పుడు, ఒకప్పుడు ఉన్న గూఢచారిగా లేడు. ఒమర్ యమయోకా తన హృదయంలో విశ్వాసమనే కాంతితో తిరిగి వచ్చాడు. ఒమర్ యమయోకా లక్ష్యం ఇకపై సమాచారం సేకరించడం కాదు, ఇస్లాం సందేశాన్ని వ్యాప్తి చేయడం.

ఈ మార్గం సులభం కాదు. ప్రభుత్వ సంస్థలు ఒమర్ యమయోకాపై నిఘా ఉంచాయి, సైనిక అధికారులు ఒమర్ యమయోకాపై అనుమానం వ్యక్తం చేశారు, మరియు ఒమర్ యమయోకా వ్యతిరేకతను, ఒత్తిడిని ఎదుర్కొన్నాడు, కానీ ధైర్యంగా నిలిచాడు.

1912లో, ఒమర్ యమయోకా తన హజ్ యాత్రా గ్రంథాన్ని జపనీస్ భాషలో ప్రచురించాడు. ఆ తర్వాత ఒమర్ యమయోకా ఇస్లాంపై పుస్తకాలు, వ్యాసాలు, మరియు దవా సాహిత్యం రాయడం ప్రారంభించారు. తన జీవితాన్ని మార్చివేసిన ఆ మతాన్ని తన ప్రజలకు పరిచయం చేస్తూనే ఉన్నారు.

ఆ తర్వాత, 1938లో, ఆ కాలంలో దాదాపు అసాధ్యంగా భావించిన ఒక కార్యాన్ని ఒమర్ యమయోకా సాధించారు. ఒమర్ యమయోకా ఇస్లామిక్ కల్చర్ అసోసియేషన్‌ను స్థాపించారు, జపాన్‌లో నివసిస్తున్న టాటార్ ముస్లింలను సంఘటితం చేశారు, మరియు ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ, టోక్యో యొక్క మొదటి మసీదు స్థాపనలో కీలక పాత్ర పోషించారు. 

చరిత్రలో ఆ క్షణం ఎంత అద్భుతంగా ఉండి ఉంటుందో కదా! ఆ మసీదులో మొదటిసారిగా ప్రార్థన పిలుపు ప్రతిధ్వనించినప్పుడు, కొన్నేళ్ల క్రితం ఒక జపనీస్ గూఢచారి హృదయంలో విశ్వాస దీపాన్ని వెలిగించిన అదే అబ్దుర్ రషీద్ ఇబ్రహీం, దానికి ముందు వరుసలో నిలబడ్డారు.

ఒమర్ యమయోకా ప్రభావం కేవలం ఒక మసీదుకే పరిమితం కాలేదు. ఒమర్ యమయోకా దవా స్ఫూర్తితో, మరో యువ జపనీయుడు ఇస్లాం మతంలోకి మారి, ఒమర్ మిటా అనే ఇస్లామిక్ పేరును స్వీకరించాడు. ఆ తర్వాత, ఇదే ఒమర్ మిటా ఖురాన్‌ను పూర్తిగా జపనీస్ భాషలోకి అనువదించిన మొదటి ముస్లిం అయ్యాడు.

ఈ విధంగా, ఒక వ్యక్తి యొక్క మార్గదర్శకత్వం జపాన్ అంతటా ఇస్లాం చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది.

1959 సెప్టెంబర్ 23న, 79 ఏళ్ల వయసులో, ఉమర్ యమయోకా ఈ లోకాన్ని విడిచిపెట్టారు. కానీ ఉమర్ యమయోకా కేవలం ఒక పేరును మాత్రమే కాదు, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఒక హృదయానికి మార్గనిర్దేశం చేయాలనుకున్నప్పుడు, సరిహద్దులు, భాష, కులం, వృత్తి, లేదా గతం ఏవీ అడ్డంకులు కావు అనే సత్యాన్ని కూడా వదిలివెళ్లారు.

రహస్యాలను దొంగిలించడానికి బయలుదేరిన ఒక గూఢచారి, ఖురాన్ సందేశ ప్రేమికుడిగా మారాడు.

ఒమర్ యమయోకా సమాచారం కోసం బయలుదేరి, విశ్వాసంతో తిరిగి వచ్చారు మరియు ఈ విశ్వాసమే ఒమర్ యమయోకాను జపాన్ ఇస్లామిక్ చరిత్రలో అత్యంత ప్రముఖ వ్యక్తులలో ఒకరిగా నిలబెట్టింది.

 

 పేస్ బుక్ సౌజన్యం తో

12 July 2026

యోగేంద్ర శుక్లా 1896-1960-బీహార్ లో 'కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ' నాయకుడు Yogendra Shukla 1896-1960- A Leader of Congress Socialist Party in Bihar

 

 'Yogendra Shukla ran for 2 days with Jayprakash Narayan on his shoulders after breaking the jail.' అని చెప్తున్న వచనం చిత్రం కావచ్చు


యోగేంద్ర శుక్లా (1896–1960) ఒక భారతీయ జాతీయవాది, విప్లవకారుడు మరియు స్వాతంత్ర్య సమరయోధుడు; వలస పాలనకు వ్యతిరేకంగా సాగించిన కార్యకలాపాల కారణంగా యోగేంద్ర శుక్లా 'కాలా పాని' అని పిలువబడే అండమాన్  సెల్యులార్ జైలు(1932 మరియు 1937 మధ్య) తో సహా  తన జీవితం లోని ¼ వంతు కాలం దాదాపు 17 ఏళ్లపాటు బ్రిటిష్ జైళ్లలో గడిపారు

"షేర్-ఎ-బీహార్" (బీహార్ సింహం)గా ప్రసిద్ధి చెందిన యోగేంద్ర శుక్లా 'హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్' (HSRA) వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. బసవన్ సింగ్ (సిన్హా)తో కలిసి, బీహార్‌లో 'కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ'ని స్థాపించడంలో కూడా యోగేంద్ర శుక్లా కీలక పాత్ర పోషించారు.

యోగేంద్ర శుక్లా మరియు ఆయన మేనల్లుడు బైకుంఠ శుక్లా (15 మే 1907 – 14 మే 1934) బెంగాల్ ప్రెసిడెన్సీలోని ముజఫర్‌పూర్ జిల్లా (ప్రస్తుతం బీహార్‌లోని వైశాలి జిల్లా) జలాల్‌పూర్ గ్రామానికి చెందినవారు. యోగేంద్ర శుక్లా భూమిహార్ కుటుంబంలో జన్మించారు.

బీహార్ మరియు ఉత్తర ప్రదేశ్‌లలో విప్లవోద్యమ ప్రముఖ నాయకుడిగా ఉన్న యోగేంద్ర శుక్లా తన సాహసోపేత చర్యలకు ప్రసిద్ధి చెందారు మరియు విప్లవకారులు సర్దార్ భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్‌లకు సన్నిహిత సహచరుడిగా ఉంటూ, వారి శిక్షణలో కూడా పాలుపంచుకున్నారు. తన జీవితకాలంలో, విప్లవాత్మక కార్యకలాపాలలో పాల్గొన్నందుకు యోగేంద్ర శుక్లా పదహారున్నర సంవత్సరాలకు పైగా జైలు శిక్ష అనుభవించారు. భారతదేశంలోని వివిధ జైళ్లలో అనుభవించిన తీవ్రమైన హింస కారణంగా యోగేంద్ర శుక్లా ఆరోగ్యం గణనీయంగా క్షీణించింది. మరణించే సమయానికి, యోగేంద్ర శుక్లా అనారోగ్యంతో బాధపడుతూ, తన దృష్టిని (చూపును) కోల్పోయి ఉన్నారు.

అండమాన్ (కాలా పాని) దీవులలోని సెల్యులార్ జైలుకు తరలించే ఉద్దేశంతో అక్టోబర్ 1932లో, గవర్నర్-ఇన్-కౌన్సిల్ ఆదేశాల మేరకు, జ్యుడీషియల్ సెక్రటరీ ఎ.సి. డేవిస్, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (DIG)ని విప్లవకారులైన ఖైదీల జాబితాను రూపొందించమని కోరారు. యోగేంద్ర శుక్లా, బసావన్ సింగ్ (సిన్హా), శ్యామ్‌దేవ్ నారాయణ్ అలియాస్ రామ్ సింగ్, ఈశ్వర్ దయాళ్ సింగ్, కేదార్ మణి శుక్లా, మోహిత్ చంద్ర అధికారి మరియు రామ్ ప్రతాప్ సింగ్ వంటి పలువురి పేర్లను DIG (CID) సూచించారు.

యోగేంద్ర శుక్లా, కేదార్ మణి శుక్లా మరియు శ్యామ్‌దేవ్ నారాయణ్‌లను 1932 డిసెంబర్‌లో అండమాన్ దీవులకు తరలించారు. యోగేంద్ర శుక్లా చేసిన 46 రోజుల నిరాహార దీక్ష పలితంగా యోగేంద్ర శుక్లా ను కాలాపానీ సెల్యులార్ జైలు నుండి  హజారీబాగ్ సెంట్రల్ జైలుకు మార్చడం జరిగింది. 1937లో బీహార్‌లో శ్రీ కృష్ణ సిన్హా మొదటి కాంగ్రెస్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు, ఆయన రాజకీయ ఖైదీల సమస్యపై గట్టిగా నిలబడ్డారు. పలితంగా 1938 మార్చిలో యోగేంద్ర శుక్లా మరియు ఇతర రాజకీయ ఖైదీలు, జైలు నుండి విడుదలయ్యారు

విడుదలైన తర్వాత యోగేంద్ర శుక్లా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో చేరారు మరియు ముజఫర్‌పూర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. యోగేంద్ర శుక్లా 1938లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు, కానీ తరువాత జయప్రకాష్ నారాయణ్ సూచన మేరకు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో చేరారు. స్వామి సహజానంద సరస్వతి స్థానంలో ఆల్ ఇండియా కిసాన్ సభ కేంద్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన కొద్దికాలానికే, 1940లో అరెస్టు అయ్యారు.

1942 ఆగస్టులో మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు, స్వాతంత్ర్యం కోసం రహస్య ఉద్యమాన్ని చేపట్టే ఉద్దేశంతో యోగేంద్ర శుక్లా, జయప్రకాష్ నారాయణ్, సూరజ్ నారాయణ్ సింగ్, గులాబ్ చంద్ గుప్తా, రామనందన్ మిశ్రా మరియు శాలిగ్రామ్ సింగ్‌లతో కలిసి హజారీబాగ్ సెంట్రల్ జైలు గోడను ఎక్కి తప్పించుకున్నారు. అప్పుడు జయప్రకాష్ నారాయణ్ అనారోగ్యంతో ఉండటంతో, యోగేంద్ర శుక్లా,  జయప్రకాష్ నారాయణ్ ను తన భుజాలపై మోసుకుంటూ సుమారు 124 కిలోమీటర్ల దూరంలో ఉన్న గయ వరకు నడిచారు.

యోగేంద్ర శుక్లా ను అరెస్టు చేసిన వారికి రూ. 5000 బహుమతిని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. యోగేంద్ర శుక్లా 1942 డిసెంబర్ 7న ముజఫర్‌పూర్‌లో అరెస్టు అయ్యారు. శుక్లా తన అరెస్టుకు ఒక రోజు ముందు ముజఫర్‌పూర్ జైలు నుండి నలుగురు ఖైదీలు తప్పించుకోవడంలో సహాయపడ్డారని ప్రభుత్వం భావించింది.వారు సూరజ్‌దేవ్ సింగ్, రామ్ బాబు కల్వార్, బ్రహ్మానంద గుప్తా మరియు గణేష్ రాయ్.

యోగేంద్ర శుక్లాను బక్సర్ జైలులో ఉంచారు, అక్కడ యోగేంద్ర శుక్లా కు మూడేళ్లపాటు కాళ్లకు సంకెళ్లు (బార్ ఫెట్టర్స్) వేసి ఉంచారు. 1944 మార్చిలో, యోగేంద్ర శుక్లా బక్సర్ జైలులో నిరాహార దీక్షను ప్రారంభించారు.

యోగేంద్ర శుక్లా 1946 ఏప్రిల్‌లో విడుదలయ్యారు. 1958లో, ప్రజా సోషలిస్ట్ పార్టీ తరపున బీహార్ శాసనమండలి సభ్యుడిగా నామినేట్ అయ్యారు మరియు 1960 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1960లో, సుదీర్ఘకాలం పాటు జైలు జీవితం గడపడం వల్ల ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. యోగేంద్ర శుక్లా 1960 నవంబర్ 19న మరణించారు.

భారత ప్రభుత్వం యోగేంద్ర శుక్లా గౌరవార్థం ఒక స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది.