1916లో, మౌలానా మహమూద్ హసన్ మరియు మౌలానా
ఉబైదుల్లా సింధీ, మౌలానా హుస్సేన్ అహ్మద్ మదానీ బ్రిటిష్
ప్రభుత్వం కు వ్యతిరేకం గా పన్నిన ఒక కుట్రను బ్రిటిష్ ప్రభుత్వం వెలికితీసింది.
టర్కీ మరియు జర్మనీల సహాయంతో ఒక సైన్యాన్ని సమీకరించి, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు నుండి బ్రిటిష్
ఇండియాపై దాడి చేసి, భారతదేశం నుండి ఆంగ్ల సైన్యాన్ని
తరిమివేయడమే ఆ ప్రణాళిక. నిఘా నివేదికల ప్రకారం, ఈ పథకం ప్రకారం ఏర్పడే ప్రభుత్వానికి 'అధ్యక్షుడు'
ఆర్. మహేంద్ర ప్రతాప్" కావలసి
ఉంది..
'సిల్క్
లెటర్ కుట్ర'గా ప్రసిద్ధి చెందిన ఈ కుతంత్రం
వెలుగులోకి వచ్చినప్పుడు,
మౌలానా మహమూద్ హసన్ హిజాజ్లో
(ప్రస్తుతం సౌదీ అరేబియాలో) ఉన్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డాలో బ్రిటిష్
అధికారులు మౌలానా మహమూద్ హసన్ ను, మౌలానా
హుస్సేన్ అహ్మద్ మదానీ, అంజర్ గుల్, వాహిద్ అహ్మద్, హకీం నస్రత్ హుస్సేన్ మరియు
మరికొందరితో పాటు అరెస్టు చేశారు.
వారిని కోర్టు విచారణ కోసం భారతదేశానికి అప్పగించాలని నిర్ణయించారు. కానీ బ్రిటిష్ అధికారులు మౌలానా మహమూద్ హసన్ భారత గడ్డపై ఉండటానికి భయపడ్డారు. మహమూద్ను కోర్టులో విచారిస్తే అది సాధారణ భారత ప్రజలలో కూడా తిరుగుబాటును ప్రేరేపించగలదని వారు భావించారు. వైస్రాయ్ 1916 డిసెంబర్ 21న ఇలా రాశారు: "మౌలానా మహమూద్ హసన్ వయస్సు మరియు భారతదేశంలో ఆయనకున్న ప్రత్యేకమైన మతపరమైన హోదా దృష్ట్యా, ఆయనను (భారతదేశానికి) మన వద్దకు పంపడం అవాంఛనీయం."
ఈ లేఖకు రెండు వారాల ముందు, భారతదేశంలోని ఇంటెలిజెన్స్ విభాగం
అధిపతి సి.ఆర్. క్లీవ్ల్యాండ్ ఢిల్లీ నుండి ఇలా రాశారు: మహమూద్ హసన్ను
భారతదేశానికి తిరిగి పంపకపోవడమే మంచిదని నా అభిప్రాయం."
మహమూద్ను హెజాజ్ నుండి కూడా తరలించాలని ఆ
నివేదిక సూచించింది. "ఒకవేళ వారిని హెజాజ్లో ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచితే, భారతదేశం మరియు ఆఫ్ఘనిస్తాన్లోని
అనేకమంది మతోన్మాద ముస్లింలకు వారు ఆకర్షణీయమైన మరియు ఉద్వేగభరితమైన తీర్థయాత్ర
కేంద్రాలుగా లేదా సహాయం లేదా విముక్తి కల్పించే ప్రయత్నాలకు కేంద్రబిందువులుగా
మారవచ్చు" అని నివేదికలో పేర్కొన్నారు. ఫలితంగా, మౌలానా మహమూద్ హసన్, మౌలానా హుస్సేన్ అహ్మద్ మదనీ, అంజర్ గుల్, వహీద్ అహ్మద్ మరియు నస్రత్ హుస్సేన్లను
యుద్ధ ఖైదీలుగా మాల్టాకు తరలించారు.
ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత యుద్ధ ఖైదీల
శిబిరం మూసివేయబడటంతో, మౌలానా 1920 జూన్లో భారతదేశానికి తిరిగి వచ్చారు. మహాత్మా గాంధీతో సహా జాతీయవాద
నాయకులు ముంబై ఓడరేవు వద్ద మౌలానా మహమూద్ హసన్ కు స్వాగతం పలికారు. దీర్ఘకాలిక
కారాగారవాసం తర్వాత బలహీనంగా, అనారోగ్యంతో
ఉన్నప్పటికీ, మౌలానా తిరిగి స్వాతంత్ర్యోద్యమంలో
పాల్గొన్నారు; సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా 'జామియా మిలియా ఇస్లామియా' స్థాపనలో మౌలానా మహమూద్ హసన్ కీలక
పాత్ర పోషించారు. భారతదేశానికి తిరిగి వచ్చిన ఆరు నెలలకే, 1920 నవంబర్ 30న మహమూద్ హసన్ కన్నుమూశారు.