చరిత్రకారులు నూర్ జహాన్, గుల్బదన్ బేగం వంటి మొఘల్ మహిళల గురించి తమ రచనలలో విస్తారంగా ప్రస్తావించారు. కాని 15వ శతాబ్దంలో బహమనీ సుల్తానేట్ను పాలించిన ఆఘా నర్గీస్ బాను గురించి; మధ్య ఆసియా నుండి వచ్చి సుల్తాన్ హుస్సేన్ నిజాం షాతో కలిసి పోరాడిన ఖుంజా హుమాయున్ గురించి; అక్బర్ సైన్యాల నుండి అహ్మద్నగర్ కోటను రక్షించిన చాంద్ బీబీ గురించి; గ్రంథాలను రాయించి, హజ్ యాత్ర చేసిన బీజాపూర్ ఖదీజా సుల్తానా గురించి; లేదా ఔరంగజేబుతో సంప్రదింపులు జరిపిన గోల్కొండ హయత్ బక్షి బేగం గురించి మనలో ఎంతమందికి తెలుసు?
చరిత్రను పరిశీలించిన దక్కన్ చాలా కాలం పాటు మొఘల్ సామ్రాజ్యo లో విలీనం కావడాన్ని
ప్రతిఘటించింది. దక్కన్ సుల్తానేట్లు గొప్ప మేధో, కళాత్మక మరియు నిర్మాణ విజయాలకు కేంద్రాలుగా ఉండేవి.
మూడు శతాబ్దాలకు పైగా, దక్కన్ తొలి ఆధునిక ప్రపంచపు
గొప్ప రాజకీయ శక్తి కేంద్రాలలో ఒకటిగా నిలిచింది.
దక్కన్ రాజ్యాలు, భారత ఉపఖండంలో దాదాపు ఐదవ
వంతు భూభాగాన్ని పరిపాలించాయి; ఆ రాజ్యాలు ఫ్రాన్స్ లేదా
ఇటలీతో పోల్చదగినవి. వారిది పర్షియన్ మరియు హిందూ మహాసముద్ర ప్రపంచాల సంగమ స్థలం, మరియు వారి సంపద వ్యవసాయం, వస్త్ర పరిశ్రమ, వజ్రాల గనులు, అశ్వ వ్యాపారం మరియు సముద్ర వాణిజ్యం నుండి వచ్చింది
– సరిగ్గా ఈ కారణంగానే అక్బర్ నుండి ఔరంగజేబు వరకు మొఘల్ చక్రవర్తులు అక్కడ సైనిక
దండయాత్రలకు ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చారు.
దక్కన్ ముస్లిం రాజవంశాలు ఒకరితో ఒకరు పోరాడుకున్నాయి, హిందూ శక్తులతో పొత్తు పెట్టుకున్నాయి, ఆఫ్రికన్, పర్షియన్, టర్కిక్, దక్కనీ, మరాఠా మరియు తెలుగు ఉన్నత వర్గాలను నియమించుకున్నాయి, మరియు మతపరమైన సంకుచితత్వాన్ని ప్రతిఘటించే రాజకీయ
సంస్కృతులను నిర్మించాయి.
దక్కన్ మొదటి ముస్లిం రాణి:ఆఘా
నర్గీస్ బాను
ఆఘా నర్గీస్ బాను, దక్కన్ మొదటి ముస్లిం రాణి, ఒక దశాబ్దానికి పైగా బహమనీ సుల్తానేట్ను
పరిపాలించింది. ఆఘా నర్గీస్ బాను భర్త హుమాయున్ షా తన మరణశయ్యపై ఉన్నప్పుడు 1461లో "రాజ్యం యొక్క మొత్తం పరిపాలనను ఆఘా నర్గీస్
బాను కు అప్పగించాడు". మంత్రులు ఆఘా నర్గీస్ బాను సలహా తీసుకోని విధానాలను
రూపొందించారు, ఆఘా నర్గీస్ బాను అధికారులనునియమించారు, జప్తు చేయబడిన ఆస్తులను పునరుద్ధరించారు, ఖైదీలను విడుదల చేశారు, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారు మరియు సంక్షోభాలతో
కుదిపిన సుల్తానేట్ను స్థిరపరిచారు.
అఘా నర్గీస్ బాను రాజప్రతినిధిత్వం regency వెంటనే యుద్ధం ద్వారా పరీక్షించబడింది. ఒరిస్సాకు
చెందిన రాజమంద్రి Rajamundhry బహమనీ భూభాగంపై దండెత్తినప్పుడు, అఘా నర్గీస్ రాజ్యమంతటా అశ్విక దళాన్ని సమీకరించారు.
మాల్వాకు చెందిన మహమూద్ ఖల్జీ దక్కన్ పై దండెత్తి, బహమనీ సైన్యాలు ఓటమి
పాలైనప్పుడు, అఘా నర్గీస్ బాను ప్రభుత్వాన్ని
ఫిరుజాబాద్ Firuzabad కు మార్చి, తన బంధువులను, మంత్రులను సమీకరించి, ప్రతిఘటన ప్రారంభించినది. ఫిరుజాబాద్ నుండి అఘా నర్గీస్ బాను దౌత్యం వైపు
దృష్టి సారించి, గుజరాత్కు చెందిన మహమూద్
బెగడాకు లేఖ రాసి, పాత మైత్రిని
ప్రస్తావించింది. మహమూద్ బెగడా మద్దతుతో మాల్వా వెనక్కి తగ్గింది..
ఆఘా నర్గీస్ బాను శక్తివంతమైన వ్యక్తులను తయారు
చేసింది, బహమనీ సుల్తానేట్ను పాలించిన
మహమూద్ గవాన్ను ఉన్నత స్థాయికి చేర్చింది, , గవాన్ తన ఉన్నత స్థానానికి ఆఘా
నర్గీస్ బాను మద్దత్తు వలెనే "పూర్తిగా" చేరుకున్నాడు: "దక్కన్
రాజకీయాలలో గవాన్ పోషించిన పాత్రకు ఆఘా నర్గీస్ బాను శిక్షణ ప్రధానం మరియు రాజ్యం
లో అత్యున్నత పదవికి గవాన్ ను ప్రోత్సహించి, పదోన్నతి కల్పించింది."
గోవాలో గవాన్ విజయం తర్వాత, ఆఘా నర్గీస్ బాను గవాను ను తన
సోదరుడిగా పిలిచి గౌరవించింది, అది "ఒక అద్వితీయమైన
గౌరవం."
ఆఘా నర్గీస్, గవాన్ ఎదుగుదలను సాధ్యం చేయడం వల్లే
మహమూద్ గవాన్ దక్కన్ చరిత్రలోని గొప్ప వ్యక్తులలో ఒకరిగా నిలిచాడు. 1472లో, ఆఘా నర్గీస్ బెల్గాంలోని ఒక
సైనిక శిబిరంలో మరణించింది. ఆఘా నర్గీస్ మరణించే నాటికి, ఆఘా నర్గీస్ పాలించిన బహమనీ రాజ్యం పశ్చిమాన కొంకణ్
నుండి తూర్పున ఆంధ్ర, ఉత్తరాన బేరార్ మరియు
దక్షిణాన కాంచీపురం వరకు విస్తరించి ఉన్న విశాలమైన భూభాగాలను కలిగి ఉంది.
ఖుంజా హుమాయున్ Khunza Humayun
చాంద్ బీబీ తల్లి అయిన ఖుంజా హుమాయున్ తుర్కో-మంగోల్
ప్రపంచం నుండి వచ్చింది, అక్కడ ఉన్నత వర్గ మహిళలు
పరిపాలనా మండళ్ల governing councils లో పాల్గొనడం సర్వసాధారణం. సుల్తాన్ హుస్సేన్ నిజాం
షా మరణానంతరం, వారి కుమారుడు ముర్తజా
సింహాసనాన్ని అధిష్టించాడు, కానీ అహ్మద్నగర్లో అసలైన
అధికారం ఖుంజా హుమాయున్ చేతిలోనే ఉండేది. ఆస్థాన చరిత్రకారుడు తాబా తాబాయి కూడా, ఖుంజా తనను తాను రాజ్య పరిపాలనకు అంకితం చేసుకుందని, మరియు ప్రభువులు ఖుంజా హుమాయున్ ను రాజుగా భావించి
విధేయత చూపారని అంగీకరించారు.
1567లో అహ్మద్నగర్పై దాడి
జరిగినప్పుడు, ఖుంజా హుమాయున్ ఒక సైనిక
సమాఖ్యను ఏర్పాటు చేసి బీజాపూర్ సుల్తాన్ను ఎదుర్కోవడానికి దండెత్తింది. అలీ
ఆదిల్ షా కొత్త శాంతి ఒప్పందానికి అంగీకరించాడు.
ఖుంజా హుమాయున్ రాజకీయ జీవితం ఖుంజా హుమాయున్ కుమారుడి చేతిలో
ముగిసింది. 1569లో, ముర్తజా తన తల్లి రాజ్య వ్యవహారాల నుండి వైదొలగాలని
డిమాండ్ చేశాడు. ఖుంజా ఒక విల్లు, కత్తి, మరియు బాకుతో సాయుధురాలై గుర్రంపై రాజభవనం నుండి
బయటకు దూసుకెళ్లింది. ఆమె పట్టుబడింది, మరియు కొన్ని కథనాల ప్రకారం, చివరికి జైలులోనే మరణించింది.
చాంద్ బీబీ
చాంద్ బీబీ 1590లలో అహ్మద్నగర్పై దాడి
చేయడానికి వచ్చిన మొఘల్ సైన్యాలను ఎదిరించినది. చాంద్ బీబీ ఒక ముస్లిం చక్రవర్తిని
ఎదిరించిన ముస్లిం రాణి. చాంద్ బీబీ దక్కన్ అహ్మద్నగర్ కు చెందినది.
చాంద్ బీబీ ఖుంజా హుమాయున్ కుమార్తె. అహ్మద్నగర్లోని నిజాం షాహీ కుమార్తెగా
జన్మించి, బీజాపూర్లోని ఆదిల్ షాహీ వివాహం
చేసుకున్నది.,దక్కన్ రాజకీయాలలో కుమార్తెగా, భార్యగా, సోదరిగా, అత్తగా, రాజప్రతినిధిగా మరియు
పాలకురాలిగా వ్యవహరించారు. చాంద్ బీబీ బీజాపూర్కు, ఆ తర్వాత అహ్మద్నగర్కు
రాణి-రాజప్రతినిధిగా ఉన్నారు. 1594లో చాంద్ బీబీ తన సైన్యానికి
నాయకత్వం వహించి మొఘల్ బలగాలను ఓడించారు. 1596 నాటికి, చాంద్ బీబీ మొఘల్ యువరాజు మురాద్తో శాంతి ఒప్పందం కుదుర్చుకొని
మొఘల్ సైన్యాలకు వ్యతిరేకంగా దక్కన్ పాలకులను ఏకం చేసింది.
ప్రజల జ్ఞాపకాలలో చాంద్ బీబీ, ముసుగు ధరించి, కవచాలు కప్పుకుని, చేతిలో కత్తి పట్టుకుని, అక్బర్ సైన్యాలను ఎదుర్కొంటున్న ఒక ధైర్యవంతురాలైన యోధురాలిగా నిలిచిపోయింది. కానీ చాంద్ బీబీ ఒక సైనిక వ్యూహకర్త మరియు దౌత్యవేత్త. ప్రతిఘటన అంటే ఎల్లప్పుడూ తిరస్కరించడం కాదు. కొన్నిసార్లు, దాని అర్థం చర్చలు జరపడం, సమయం సంపాదించడం, వర్గాలను కలిపి ఉంచడం, మరియు బంధుత్వ సంబంధాలను సామ్రాజ్య వ్యతిరేక కూటములుగా బలోపేతం చేయడం. చాంద్ బీబీ ముస్లిం మహిళలు పాలించిన, ప్రయాణించిన, పోరాడిన మరియు పరిపాలించిన ప్రపంచానికి చెందినది.
ఖదీజా సుల్తానా Khadija Sultana
బీజాపూర్కు చెందిన ఖదీజా సుల్తానా, ఇమామ్ అలీ యొక్క వీరోచిత కార్యాలను వివరించే 'ఖవార్నామా' లేదా 'తూర్పు గ్రంథం'ను
రాయించింది. దక్కనీ భాషలో ఒక సాహిత్య రచనను పోషించిన మొదటి మహిళ ఖదీజా సుల్తానా, మరియు 'హష్త్ బిహిష్త్', 'యూసుఫ్ జులైఖా' Hasht
Bihisht and Yousuf Zulaikha వంటి రచనలను కూడా రాయించింది. ఉన్నత విద్యావంతురాలు
మరియు ఆర్థికంగా శక్తివంతమైన ఖదీజా సుల్తానా, వెంగుర్ల Vengurlaలో డచ్ వారిచే నడపబడుతున్న ఒక కర్మాగారాన్ని కలిగి
ఉన్న తీరప్రాంతం నుండి ఆదాయాన్ని పొందింది.
ఖదీజా సుల్తానా 1661లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఓడలో హజ్ యాత్రకు వెళ్లారు. ఒక డచ్ పరిశీలకుడు ఖదీజా సుల్తానా విస్తృతమైన పరివారాన్ని మరియు అనేక భాషలలో ఉత్తరాలను చెప్పగల ఖదీజా సుల్తానా సామర్థ్యాన్ని వర్ణించాడు. సాహిత్య పోషణ, తీర్థయాత్ర మరియు రాజకీయ సంబంధాల ద్వారా మహిళల శక్తి ఎలా రూపుదిద్దుకుందో ఖదీజా సుల్తానా తెలియజేస్తుంది.
హయత్ బక్షి బేగం Hayat Bakshi Begum
దక్కన్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన మహిళల్లో ఒకరైన
గోల్కొండ హయత్ బక్షి బేగం, చాంద్ బీబీ అహ్మద్నగర్ను పాలిస్తున్న కాలంలో, 1591లో జన్మించినది. హయత్ బక్షి బేగం హైదరాబాద్కు చెందిన వరుసగా
ముగ్గురు కుతుబ్ షాహీ పాలకులకు సలహాదారుగా పనిచేశారు. హయత్ బక్షి బేగం, చాంద్ బీబీ లాగే, మొఘల్ అధికారాన్ని నేరుగా ఎదుర్కొన్నారు. 1656లో, హయత్ బక్షి బేగం తన కుమారుడి
తరపున ఔరంగజేబుతో వ్యక్తిగతంగా సంధి కుదిర్చారు.
దక్కన్లోని ఇతర ముస్లిం రాణుల వలె, హయత్ బక్షి బేగం కూడా ప్రజా నిర్మాణ ప్రాజెక్టులను
ప్రారంభించారు. హైదరాబాద్లోని మసబ్ ట్యాంక్ వాస్తవానికి ఒక ఉన్నత వంశానికి చెందిన
మహిళ పేరు మీద పెట్టబడిన జలాశయం. ఇది 'మా-సాహిబా' నుండి ఉద్భవించింది, అంటే తల్లి మరియు యజమానురాలు; ఇక్కడ ఇది హయత్ బక్షి బేగంను సూచిస్తుంది.
తన తల్లి వలె, హయత్ బక్షి బేగం కూడా మసీదులు, సత్రాలు మరియు బావులను నిర్మించారు. కుతుబ్ షాహీ
సమాధి మందిరంలోని హయత్ బక్షి బేగం సమాధి, పురుష సుల్తానుల సమాధులతో
సమానమైన ఏకైక మహిళా సమాధి. హయత్ బక్షి బేగం హుస్సేనీ ఆలం అషూర్-ఖానాలో లంగర్ను
కూడా ప్రారంభించారు; ఇది నేటికీ హైదరాబాద్ మొహర్రం
ఊరేగింపులలో కీలకమైన ఒక షియా సంస్థ.
ముగింపు:
ఆఘా నర్గీస్ బాను, ఖుంజా హుమాయున్, చాంద్ బీబీ, ఖదీజా సుల్తానా, మరియు హయత్ బక్షి బేగం వంటి ఎందరో ప్రముఖులు కలిసి, మధ్యయుగ మరియు తొలి ఆధునిక భారతదేశ కథను కేవలం
చక్రవర్తులు మరియు మొఘల్ దర్బారుకు చెందినదిగా చెప్పడాన్ని అసాధ్యం చేస్తారు.