1 August 2026

ఖాన్కాహ్‌

 

 

ఈ రోజుల్లో, ఖాన్ఖా అనే పదం వినగానే, మనలో చాలామందికి వెంటనే పచ్చని వస్త్రాలతో కప్పబడిన ఒక పుణ్యాత్ముని సమాధి, వార్షిక ఉర్స్ ఉత్సవాలు, హృదయాన్ని కదిలించే ఖవ్వాలీ సంగీతం, మరియు భక్తిశ్రద్ధలతో వచ్చే భక్తుల సమూహాలు కళ్ళ ముందు మెదులుతాయి. కానీ, ఒక ఖాన్ఖా యొక్క నిజమైన గుర్తింపు ఈ దృశ్యాల కన్నా ఎంతో గొప్పది.

ఖాన్ఖా కేవలం ఒక పుణ్యాత్ముని విశ్రాంతి స్థలం మాత్రమే కాదు. మానవులను తీర్చిదిద్దే ప్రదేశం కూడా. అక్కడ జరిగే ఆరాధనల  ఉద్దేశ్యం శీలాన్ని పెంపొందించడం, ఆత్మను శుద్ధి చేయడం, మరియు ప్రజలు ఉత్తమ మానవులుగా ఎలా మారవచ్చో నేర్పించడం. ఖాన్ఖా, శీలానికి, వినయానికి, మరియు ఆత్మకు విలువనిచ్చింది.

ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం నాల్గవ శతాబ్దం నాటికి, ఖురాసాన్, పర్షియా మరియు మధ్య ఆసియా అంతటా అన్వేషకుల సమూహాలు ఆవిర్భవించడం ప్రారంభించాయి. సన్యాసులు, పండితులు మరియు సంచార డెర్విష్‌లు ఒకే గొడుగు కింద కలిసి జీవించారు. వారు కలిసి ప్రార్థనలు చేశారు, ఖురాన్ పఠించారు, దేవుడిని స్మరించుకున్నారు, అలసిపోయిన ప్రయాణికులకు స్వాగతం పలికారు, మరియు తమ అహం, గర్వంతో పోరాడారు. ఈ నిరాడంబరమైన కేంద్రాలు క్రమంగా ఖాన్ఖాలుగా ప్రసిద్ధి చెందాయి.

పర్షియన్ పదం ఖాన్ఖా,  'ఖానా' (ఇల్లు) మరియు 'గాహ్' (ప్రదేశం)ల కలయిక, ఖాన్ఖా నేటి భాషలో చెప్పాలంటే, ఒక ఆధ్యాత్మిక ఆశ్రమం, ఒక పాఠశాల, ఒక సామూహిక వంటశాల, ఒక అతిథి గృహం, ఒక గ్రంథాలయం, ఒక సలహా కేంద్రం, మరియు ముఖ్యంగా, అహంకారం, అసూయ, దురాశ మరియు స్వార్థానికి చికిత్స చేసే ప్రదేశం.ఖాన్ఖాలోని మొట్టమొదటి పాఠం దేవుని ముందు మానవులందరూ సమానులే.

గొప్ప సూఫీ గురువులు భారత ఉపఖండానికి వచ్చినప్పుడు, వారు కేవలం ఒక కొత్త మత ప్రచారకులుగా రాలేదు. వారు ఒక నాగరికతను నిర్మించేవారిగా వచ్చారు.

లాహోర్‌లోని దాతా గంజ్ బక్ష్, అజ్మీర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి, ఢిల్లీలోని నిజాముద్దీన్ ఔలియా, ముల్తాన్‌లోని బహావుద్దీన్ జకరియా మరియు గుల్బర్గాలోని బందా నవాజ్ గెసు దరాజ్ స్థాపించిన ఖాన్ఖాల తలుపులు మతం, కులం, భాష లేదా సామాజిక హోదాతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరికీ తెరిచి ఉండేవి. ఈ సంస్థలు ఇస్లాంను వ్యాప్తి చేయడానికే పరిమితం కాలేదు, అంతకంటే ఎంతో ఎక్కువ చేశాయి.

ఖాన్ఖాలు  ఉపఖండం యొక్క ఉమ్మడి సంస్కృతిని తీర్చిదిద్దడంలో సహాయపడ్డాయి. ఖాన్ఖాలు,  పర్షియన్ భాష స్థానిక భాషలతో కలిసిన ప్రదేశాలుగా, సాహిత్యం వర్ధిల్లిన చోటుగా, సంగీతం కొత్త ఆధ్యాత్మిక వ్యక్తీకరణను కనుగొన్న చోటుగా, మరియు అమీర్ ఖుస్రూ వంటి కవులు తమ ముర్షిద్ మార్గదర్శకత్వంలో భక్తిని శాశ్వతమైన కళగా మలిచిన ప్రదేశాలుగా మారాయి.

మదరసాలు పండితులను తయారు చేస్తే, ఖాన్ఖాలు మానవులను తయారు చేయడానికి ప్రయత్నించాయని చెప్పడం అతిశయోక్తి కాకపోవచ్చు.

క్రమంగా, ఖాన్ఖా అనేది ఒక సాధువు సమాధి చుట్టూ నిర్మించిన పుణ్యక్షేత్రమైన దర్గాతో ముడిపడిపోయింది. మొదట్లో, ఆ రెండింటి మధ్య ఎలాంటి వైరుధ్యం లేదు. ఖాన్ఖా జీవించి ఉన్న గురువు యొక్క పాఠశాలగా ఉండేది; దర్గా ప్రజలు ఆయన వారసత్వాన్ని స్మరించుకునే ప్రదేశంగా మారింది.ఖాన్ఖా ఎప్పుడూ కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు. అది సమాజపు హృదయ స్పందన.

ఈ రోజు గుల్బర్గా, అజ్మీర్, ఢిల్లీ, కళ్యార్ లేదా ఖుల్దాబాద్‌లోని ఖాన్ఖాలు మరియు దర్గాలలో నడిస్తే, పక్కపక్కనే ఉన్న రెండు విభిన్న ప్రపంచాలను మీరు చూస్తారు.ఒకటి శతాబ్దాల నాటి సంప్రదాయానికి చెందినది. లంగర్ ఇప్పటికీ ఆకలితో ఉన్నవారికి అన్నం పెడుతుంది. ప్రయాణికులు ఇప్పటికీ ఆశ్రయం పొందుతారు. ఖురాన్ ఇప్పటికీ పఠించబడుతుంది. చాలా మంది ఇప్పటికీ శాంతిని వెతుకుతూ వస్తారు.

మరొకటి ఆధునిక యుగానికి చెందినది.పర్యాటకం, వాణిజ్యం, రాజకీయ ప్రభావం, సామాజిక మాధ్యమాలు, మరియు మతపరమైన ఆర్థిక వ్యవస్థ కొన్ని పవిత్ర స్థలాల వాతావరణాన్ని మార్చివేశాయి. జనసమూహాలు మునుపెన్నడూ లేనంత పెద్దవిగా మారాయి. ధార్మిక భక్తి, వాణిజ్య సంస్థలు తరచుగా ఒకదానికొకటి పోటీ పడుతూ ఉంటాయి.

ఖాన్ఖా ఒక వైఖరి మరియు ఒక నాగరికత.ఖన్ఖా ఉద్దేశ్యం కేవలం మత పండితులను తయారు చేయడం కాదు. దాని ఉద్దేశ్యం మంచి మానవులను తయారు చేయడం.అనేక ఖాన్ఖాలు విజ్ఞాన, దానధర్మాల, మరియు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వానికి శక్తివంతమైన కేంద్రాలుగా కొనసాగుతున్నాయి.

తీవ్రంగా విభజించబడిన ఈ ప్రపంచంలో, మనకు ఖాన్ఖా ఒక కట్టడంగానే కాక, ఒక భావనగా అవసరం. జ్ఞానంతో వినయం, విశ్వాసంతో కరుణ, సేవతో చిత్తశుద్ధి కలిసే ఒక ప్రదేశం అది.ఖాన్ఖాల ఉద్దేశ్యం ఎన్నడూ అనుచరులను సృష్టించడం కాదు, ఆలోచనాపరులైన, కరుణామయ మానవులను తయారుచేయడం.

అందుకే ఖాన్ఖా వారసత్వం రాజ్యాల కంటే ఎక్కువ కాలం నిలిచింది. సామ్రాజ్యాలు కనుమరుగయ్యాయి, పాలకులు మర్చిపోబడ్డారు, కానీ ఖాన్ఖా ఎప్పుడూ కేవలం ఒక ప్రదేశం మాత్రమే కాదు. అది మానవుడిగా మారే ఒక మార్గం, ఇప్పటికీ అలాగే ఉంది.

 

 

 

 

30 July 2026

భారత అణు జీవశాస్త్ర/మాలిక్యులర్ బయాలజీ పితామహుడిగా మారిన AMU విద్యార్థి ప్రస్థానం Journey of an AMU Student who became the Father of Indian molecular biology

 



 

1949లో, అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి చెందిన ఒక యువ విద్యార్థి, విద్యార్థి నిరసనలలో పాల్గొన్నందుకు జైలు పాలయ్యాడు. పదేళ్ల తర్వాత, అదే వ్యక్తి భారతదేశంలో అణు జీవశాస్త్రానికి molecular biology పునాదులు వేశాడు. మేధోపరమైన విజయం, పౌర బాధ్యత రెండూ కలిసి ఉండగలవని, అవి ఒకదానికొకటి బలాన్ని చేకూర్చుకోగలవని ఒబైద్ సిద్ధిఖీ జీవితం మనకు గుర్తు చేస్తుంది.

ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR)లో మాలిక్యులర్ బయాలజీ యూనిట్‌ను స్థాపించి, ఆ తర్వాత బెంగళూరులో నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ (NCBS)ను సహ-స్థాపించిన మార్గదర్శక అణు జీవశాస్త్రవేత్తగా ఒబైద్ సిద్ధిఖీ కీర్తి పొందాడు

అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయ విద్యార్థి అయిన  ఒబైద్ సిద్ధిఖీ వామపక్ష రాజకీయాల వైపు మరియు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) వైపు మరియు దాని విద్యార్ధి విభాగం ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF) మొగ్గు చూపారు

ఒబైద్ సిద్ధిఖీ భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని  బస్తీలో 7 జనవరి 1932న జన్మించారు. ఒబైద్ సిద్ధిఖీ కుటుంబం తరువాత 1948లో అలీగఢ్‌లో స్థిరపడింది. ఒబైద్ సిద్ధిఖీ అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (AMU)లో చేరి, 1951లో వృక్షశాస్త్రం మరియు జంతుశాస్త్రంలో బి.ఎస్.సి. పట్టా పొందారు. ఆ కాలంలో ప్రబలంగా ఉన్న ప్రగతిశీల మార్క్సిస్ట్ భావజాలం ఒబైద్ సిద్ధిఖీ పై తీవ్ర ప్రభావం చూపింది.

1949లో, ఉత్తర ప్రదేశ్ వ్యాప్తంగా ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల ఉపాధ్యాయులు న్యాయమైన వేతనాలు, తమ సంఘాలకు అధికారిక గుర్తింపు కోరుతూ సమ్మె చేశారు. లక్నోలో జరిగిన ఒక శాంతియుత ప్రదర్శన సందర్భంగా, రాష్ట్ర పోలీసులు లాఠీచార్జికి పాల్పడ్డారు. ఈ ఘటనలో డజన్ల కొద్దీ ఉపాధ్యాయులు, వారికి మద్దతుగా నిలిచిన విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రభుత్వం యొక్క హింసాత్మక అణచివేత వార్త, రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలలో ప్రభుత్వ వ్యతిరేక విద్యార్థి నిరసనల వెల్లువను ప్రేరేపించింది. ఈ పరిణామాలు AMUకి చేరడంతో, మహిళా కళాశాల విద్యార్థినులు సమ్మె చేస్తున్న ఉపాధ్యాయులకు మద్దతుగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. మహిళా కళాశాల ప్రిన్సిపాల్ ఈ రాజకీయ సమీకరణను వ్యతిరేకించారు, ఈ ప్రదర్శనను సంస్థాగత క్రమశిక్షణ ఉల్లంఘనగా భావించారు. కళాశాల యాజమాన్యం పాల్గొన్న విద్యార్థులను శిక్షించడం ద్వారా స్పందించింది. ఇది విస్తృత విద్యార్థి వర్గానికి తీవ్ర ఆగ్రహం తెప్పించి, క్యాంపస్‌లోని వామపక్ష విద్యార్థి కార్యకర్తలు జోక్యం చేసుకునేలా ప్రేరేపించింది.

ఒబైద్ సిద్ధిఖీ మరియు అతని మిత్రులు విశ్వవిద్యాలయం అంతటా ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు ఒబైద్ సిద్ధిఖీ తో పాటు, ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఖలీల్ రెహమాన్, SFIఅధ్యక్షుడు మీర్జా ముంతాజ్ హుస్సేన్, ఎస్.ఎం. టోంకీ వంటి పలువురు విద్యార్థి కార్యకర్తలు మరియు ఒక మద్దతుదారు అధ్యాపకుడిని అరెస్టు చేశారు.

భారతదేశపు మొదటి పార్లమెంటరీ ఎన్నికల తరువాత, అప్పుడు AMUలో యువ భూగోళశాస్త్ర అధ్యాపకుడిగా, ప్రముఖ వామపక్ష మేధావిగా ఉన్న మూనిస్ రజా, విద్యార్థులు మరియు పండితుల బృందాన్ని సమీకరించి ఢిల్లీకి తీసుకువెళ్ళారు. వారు ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూను ఆయన కార్యాలయంలో కలుసుకునే అవకాశం పొందారు. ఒబైద్ సిద్ధిఖీ వంటి ప్రతిభావంతులైన యువకులను జైలులో ఉంచడం, తద్వారా వారి చదువులను కొనసాగించే అవకాశాన్ని నిరాకరించడం అనవసరంగా క్రూరమైన చర్య అని మూనిస్ రజా మరియు ఆ బృందం వాదించారు. ఈ వినతిపత్రానికి AMU వైస్-ఛాన్సలర్ డాక్టర్ జాకిర్ హుస్సేన్ మద్దతు లభించింది.

ప్రధాని నెహ్రూ మూనిస్ రజా విజ్ఞప్తిని ఆలకించి, నేరుగా జోక్యం చేసుకోవడానికి అంగీకరించారు. ఆ తరువాత ఈ విషయాన్ని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి గోవింద్ బల్లభ్ పంత్ దృష్టికి తీసుకువచ్చారు, ఇది చివరికి ఒబైద్ సిద్ధిఖీ విడుదలకు దారితీసింది.

ఒబైద్ సిద్ధిఖీ ప్రస్థానం త్వరలోనే రాజకీయ విద్యార్థి జీవితం నుండి ప్రయోగశాల ఆధారిత శాస్త్రీయ పరిశోధన వైపు మళ్లింది.

అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో వృక్షశాస్త్రంలో ఎం.ఎస్.సి. పూర్తి చేసిన తర్వాత, 1953 నవంబర్‌లో అదే విశ్వవిద్యాలయం యొక్క వృక్షశాస్త్ర విభాగంలో లెక్చరర్‌గా నియమితులయ్యారు. అక్కడే ఒబైద్ సిద్ధిఖీ గురువు, డాక్టర్ రియాసత్ ఖాన్, గోధుమ జన్యుశాస్త్రం wheat genetics లో ఉన్నత విద్యను అభ్యసించమని ఒబైద్ సిద్ధిఖీ ను ప్రోత్సహించారు. ఆ సూచనే 1957లో ఒబైద్ సిద్ధిఖీ ని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IARI)లో చేరేలా చేసింది.

ఒబైద్ సిద్ధిఖీ ప్రారంభ పరిశోధన గోధుమ తుప్పు తెగులు నిరోధకత wheat rust resistance పై కేంద్రీకృతమై ఉండేది. కానీ, ఊహించని వడగళ్ల వాన ఒక సంవత్సరం పాటు చేసిన ప్రయోగాత్మక సామగ్రిని నాశనం చేయడంతో, ఒబైద్ సిద్ధిఖీ ను వ్యవసాయ జన్యుశాస్త్రం నుండి అభివృద్ధి చెందుతున్న సూక్ష్మజీవ జన్యుశాస్త్రం microbial genetics మరియు అణు జీవశాస్త్రం molecular biology రంగాల వైపు మళ్లించింది.

ఆ తర్వాత ఒబైద్ సిద్ధిఖీ గ్లాస్గో విశ్వవిద్యాలయంలో (1958–1961) చేరారు, అక్కడ ఒబైద్ సిద్ధిఖీ ప్రఖ్యాత జన్యు శాస్త్రవేత్త గైడో పోంటెకోర్వో Guido Pontecorvo వద్ద పనిచేశారు. గ్లాస్గోలో ఒబైద్ సిద్ధిఖీ చేసిన కృషి, ఆ కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సూక్ష్మజీవ జన్యుశాస్త్రం రంగంలోకి ఒబైద్ సిద్ధిఖీ ప్రవేశానికి నాంది పలికింది.

అమెరికాలో ఉజ్వలమైన శాస్త్రీయ వృత్తి జీవితం ఒబైద్ సిద్ధిఖీ ముందు ఉన్నప్పటికీ, ఒబైద్ సిద్ధిఖీ భారతదేశం మరియు దాని యువత పట్ల ఉన్న బాధ్యతా భావంతో, హోమీ భాభా ఆహ్వానం మేరకు 1956లో ఒబైద్ సిద్ధిఖీ భారత దేశం తిరిగి వచ్చారు. కేవలం పరిశోధనలు చేయడానికే కాకుండా, కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశం కోసం సంస్థలను మరియు శాస్త్రీయ సంస్కృతిని నిర్మించాలని ఒబైద్ సిద్ధిఖీ నిశ్చయించుకున్నారు.

1962లో, ఒబైద్ సిద్ధిఖీ టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR)లో మాలిక్యులర్ బయాలజీ విభాగాన్ని స్థాపించి, భారతదేశంలో జీవశాస్త్ర పరిశోధనకు ఒక కొత్త దిశను పరిచయం చేశారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత, 1980వ దశకంలో, ఒబైద్ సిద్ధిఖీ బెంగళూరులో నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ (NCBS) స్థాపనలో కీలక పాత్ర పోషించారు. ఈ సంస్థ దేశంలోని ప్రముఖ జీవశాస్త్ర పరిశోధనా కేంద్రాలలో ఒకటిగా ఆవిర్భవించింది.

ఒబైద్ సిద్ధిఖీ తన మేధస్సును ఒకే విభాగానికి పరిమితం చేసుకున్న వ్యక్తి కాదు. ఒబైద్ సిద్ధిఖీ శాస్త్రీయ కృషి వృక్ష జీవశాస్త్రం, డ్రోసోఫిలా, బాక్టీరియా, జన్యుశాస్త్రం plant biology, Drosophila, bacteria, and genetics వంటి విభిన్న రంగాలను విస్తరించింది. అయినప్పటికీ, ఆయన జిజ్ఞాస ఎప్పుడూ కేవలం పరిశోధనకు మాత్రమే పరిమితం కాలేదు.

ఒబైద్ సిద్ధిఖీ తన విద్యార్థి దశలో క్రీడాకారుడు మరియు ఫోటోగ్రాఫర్ కూడా.  1940వ దశకంలో బెంగాల్ కరువుకు సంబంధించిన ఒబైద్ సిద్ధిఖీ శక్తివంతమైన చిత్రాలు ఆ విషాదానికి సంబంధించిన అత్యంత శాశ్వతమైన దృశ్య ఆధారాలలో ఒకటిగా నిలిచిపోయాయి.

ఒబైద్ సిద్ధిఖీ తన కుమార్తె, ఫోటోగ్రాఫర్ దీబా సిద్ధిఖీతో కలిసి 'రూహ్: ది ఎండ్యూరింగ్ స్పిరిట్' అనే ప్రాజెక్టుపై పనిచేసినప్పుడు ఒక కొత్త వ్యక్తీకరణను కనుగొన్నారు. ఒబైద్ సిద్ధిఖీ దృష్టిలో, పండ్ల ఈగల నాడీ మార్గాలను మ్యాపింగ్ చేయడం neural pathways of fruit flies or decoding genes లేదా జన్యువులను డీకోడ్ చేయడం అనేది ప్రకృతిలోని నిగూఢ నిర్మాణాలను ఆవిష్కరించే మరో పద్ధతి మాత్రమే.

ఒబైద్ సిద్ధిఖీ కు ఉర్దూ సాహిత్య ప్రపంచంలో కూడా ప్రవేశం కలదు. ఒబైద్ సిద్ధిఖీ మీర్, గాలిబ్, సౌదా మరియు ఇక్బాల్‌ల కవిత్వాన్ని పదే పదే చదివేవారు.

ఒబైద్ సిద్ధిఖీ ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం మరియు కొద్దిగా పర్షియన్‌తో సహా అనేక భాషలలో సమానంగా అనర్గళంగా మాట్లాడేవారు. నిజమైన జ్ఞానం సామాన్య ప్రజలకు చేరాలని నమ్ముతూ, శాస్త్రీయ ఆలోచనలు కేవలం విద్యాసంబంధమైన పరిభాషలోనే బందీగా ఉండటానికి ఆయన నిరాకరించారు. ఒబైద్ సిద్ధిఖీ గ్రామీణ ఉపాధ్యాయులకు విజ్ఞాన శాస్త్రాన్ని మరియు దాని సామాజిక పరిణామాలను సరళమైన హిందీలో సులభంగా వివరించేవారు.

26 జూలై 2013న కన్నుమూసినప్పటికీ, ఒబైద్ సిద్ధిఖీ శిక్షణ ఇచ్చిన వందలాది మంది యువ శాస్త్రవేత్తల ద్వారా, మరియు ఆయన స్ఫూర్తినిచ్చిన వేలాది మంది ద్వారా ఆయన దార్శనికత ఇప్పటికీ జీవిస్తూనే ఉంది.