19 August 2026

హైదరాబాద్ నిజాం మరియు మదీనాలో విద్యుదీకరణ The Nizam of Hyderabad & Electricity in Madinah

 

 

 

Nizam of Hyderabad had electricity plant installed at Madinah in 1939 - The Siasat Daily – Archive

 

 


 

హైదరాబాద్ చివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (ఆసఫ్ జా VII) చరిత్రలో ఒక విశేషమైన ఘట్టం, మదీనాలోని ప్రవక్త(స) మసీదు (మస్జిద్-అన్-నబవి) విద్యుదీకరణతో ముడిపడి ఉంది.

1936లో, తన పాలన రజతోత్సవం సందర్భంగా, హైదరాబాద్ ఏడవ నిజాంమీర్ ఉస్మాన్ అలీ ఖాన్, మదీనాలోనిమస్జిద్ అల్-నబవి (ప్రవక్త మసీదు) కోసం ఒక కొత్త విద్యుత్ ప్లాంటు మరియు లైటింగ్ వ్యవస్థకు నిధులు సమకూర్చారు . అంతకుముందు ఒట్టోమన్లు ​​ఏర్పాటు చేసిన జనరేటర్ పాడైపోవడంతో, నిజాం ఆ ఆధునిక ప్రత్యామ్నాయానికి అధికారిక దానం (వక్ఫ్) రూపంలో నిధులు సమకూర్చారు, అలాగే దాని నిరంతర నిర్వహణ ఖర్చులను కూడా భరించారు.

ఈ ప్రాజెక్ట్ పర్యవేక్షణ కోసం హైదరాబాద్ ప్రజా పనుల శాఖ (PWD) చీఫ్ ఇంజనీర్ నవాబ్ అహ్‌సాన్ యార్ జంగ్‌ను పంపాలని కూడా నిజాం ప్రతిపాదించారు.

అవసరమైన అనుమతులు లభించిన తర్వాత, విద్యుత్ వ్యవస్థ మరియు లైటింగ్ ఏర్పాటు పనులు 1939 నాటికి పూర్తయ్యాయి. పవిత్ర నగరాలకు నిజాం అందించిన ఆర్థిక సహకారానికి ఇది ఒక ముఖ్యమైన ఉదాహరణగా చరిత్ర చెబుతోంది. 

1936లో ప్రవక్త(స) మసీదులో విద్యుత్ ఏర్పాటు కోసం నిజాం రూ. 50,000 విరాళంగా ఇచ్చారని మరొక చారిత్రక రికార్డు పేర్కొంటోంది.

మదీనాలోని జన్నతుల్బాకీ మరియు మక్కాలోని జన్నతుల్ మొఅల్లాJannatul Baqi in Madinah and Jannatul Moalla in Makkah.విభాగాలతో సహా పవిత్ర స్థలాల మరమ్మతులకు ఎండోమెంట్ అదనంగా నిధులు సమకూర్చింది

 

ఆధారం:[Siasat Archive]

విభజనను, ముస్లిం లీగ్‌ను వ్యతిరేకించిన బీహార్ ముస్లిం నాయకులు Bihari Muslims opposed the Partition & Muslim League

 

 

Bihari Muslims opposed the Partition & Muslim League


స్వాతంత్ర్య పోరాట సమయంలో బీహార్‌కు చెందిన ముస్లిం రాజకీయ నాయకులు, పండితులు, ఉలేమాలు, విద్యార్థులు మరియు సామాజిక సంస్థలలోని ఒక ముఖ్యమైన వర్గం, పాకిస్తాన్ కోసం ముస్లిం లీగ్ చేసిన డిమాండ్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు, ద్విజాతి సిద్ధాంతాన్ని తిరస్కరించారు మరియు ఐక్య, స్వతంత్ర భారతదేశం కోసం కృషి చేశారు.

ఆల్ ఇండియా మోమిన్ కాన్ఫరెన్స్,  యొక్క బీహార్ నాయకులు, ముఖ్యంగా అబ్దుల్ ఖయ్యూమ్ అన్సారీ మరియు అహద్ ముహమ్మద్ నూర్, జాతీయవాద ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు మరియు భారతదేశంలోని ముస్లింలందరికీ తామే ప్రాతినిధ్యం వహిస్తున్నామన్న ముస్లిం లీగ్ వాదనను వ్యతిరేకించారు. జిన్నా యొక్క ద్విజాతి సిద్ధాంతానికి వ్యతిరేకంగా సింధీ జాతీయవాద నాయకుడు అల్లా బక్ష్ సూమ్రో ఏర్పాటు చేసిన ఆజాద్ ముస్లిం కాన్ఫరెన్స్‌లో వారు పాల్గొన్నారు. 1946 ఎన్నికల సమయంలో, జాతీయవాద ముస్లిం సంస్థలు మరియు వాటి నాయకులు కూడా, తరచుగా కాంగ్రెస్ సహకారంతో, ముస్లిం లీగ్ అభ్యర్థులకు వ్యతిరేకంగా తమ అబ్యర్ధులను   బరిలోకి దింపారు.

ముజఫర్‌పూర్‌కు చెందిన మఘ్‌ఫూర్ అహ్మద్ అజాజీMaghfoor Ahmad Ajazi  మరో ప్రముఖ జాతీయవాద ముస్లిం నాయకుడు. మఘ్‌ఫూర్ అహ్మద్ అజాజీ, అఖిల భారత జమ్హూర్ ముస్లిం లీగ్‌ All India Jamhur Muslim League ను స్థాపించారు. ఈ సంస్థ పాకిస్తాన్ ఉద్యమానికి వ్యతిరేకంగా ప్రచారం చేసింది మరియు ఐక్య భారతదేశం అనే ఆలోచన చుట్టూ ముస్లింలను సమీకరించడానికి ప్రయత్నించింది. ఇది తరువాత భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనమైంది.

బీహార్ జాతీయవాద ముస్లిం ఉద్యమంతో సంబంధం ఉన్న ప్రముఖ ఇస్లామిక్ పండితుడు మౌలానా అబుల్ మొహసిన్ ముహమ్మద్ సజ్జాద్, భారతదేశాన్ని విభజించాల్సిన అవసరం ఉందని చెప్పే ఆలోచనను విమర్శిస్తు  ఒక వివరణాత్మక ఖండనను జారీ చేశారు.

ఖాజీ అహ్మద్ హుస్సేన్ మరియు మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి ఇతర ప్రముఖ పండితులు మరియు జాతీయవాద ముస్లింలతో కలిసి, మౌలానా సజ్జాద్ పాట్నాలో ఇమారత్-ఎ-షరియా స్థాపనలో కూడా పాలుపంచుకున్నారు 

మౌలానా అబుల్ మొహసిన్ ముహమ్మద్ సజ్జాద్ మరియు బారిస్టర్ ముహమ్మద్ యూనస్‌లతో సంబంధం ఉన్న ముస్లిం ఇండిపెండెంట్ పార్టీ, బీహార్‌ లో ముస్లిం లీగ్‌కు వ్యతిరేకం గా ముస్లిం రాజకీయాలలోని మరో విభాగానికి ప్రాతినిధ్యం వహించింది.

మౌలానా అబ్దుస్ సమద్ రహ్మానీ, బారిస్టర్ ముహమ్మద్ యూనస్, మరియు మౌలానా ఉస్మాన్ ఘనీ వంటి వారు  ఆజాద్ ముస్లిం కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. 1946 ఎన్నికలలో, కాంగ్రెస్ మరియు ఇతర లీగ్ వ్యతిరేక శక్తుల మద్దతుతో జాతీయవాద ముస్లిం అభ్యర్థులు ముస్లిం లీగ్‌ను సవాలు చేశారు.

జమియత్ ఉలమా-ఎ-హింద్ కూడా భారతదేశ విభజనను మరియు ద్విజాతి సిద్ధాంతాన్ని గట్టిగా వ్యతిరేకించింది. బీహార్‌లో, సయ్యద్ జలాలూద్దీన్ షా మరియు నూరుల్లా రహ్మానీ వంటి నాయకులు ముస్లిం లీగ్‌కు వ్యతిరేకంగా జరిగిన రాజకీయ పోరాటంలో పాల్గొన్నారు మరియు విస్తృత లీగ్ వ్యతిరేక కూటమిలో భాగంగా 1946 ఎన్నికలలో పోటీ చేశారు.

బీహార్‌లో ముస్లిం లీగ్ కు వ్యతిరేకంగా స్థాపించబడిన ఆజాద్ ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక సభ్యులలో అర్రాకు చెందిన చౌదరి మహమ్మద్ అబుల్ హస్నత్ ఒకరు.

పాట్నాలో జన్మించి, మజ్లిస్-ఎ-అహ్రార్-ఎ-ఇస్లాం ప్రముఖులలో ఒకరైన మౌలానా అటౌల్లా షా బుఖారీ కూడా భారత ముస్లిం రాజకీయాల్లోని బలమైన విభజన వ్యతిరేక సంప్రదాయానికి చెందినవారే. అహ్రార్ ఉద్యమం ముస్లిం లీగ్ యొక్క వేర్పాటువాద రాజకీయాలను వ్యతిరేకించి, ఐక్య భారతదేశాన్ని సమర్థించింది.

బీహార్‌లోని అర్వాల్ కు చెందిన షా మహమ్మద్ ఉమైర్, ముస్లిం లీగ్ మరియు దాని నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా యొక్క విభజనవాద రాజకీయాలను ఎదుర్కోవడానికి జాతీయవాద ముస్లింల ప్రగతిశీల కూటమిని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.

 డాక్టర్ సయ్యద్ మహమూద్, ప్రొఫెసర్ అబ్దుల్ బారి, అబ్దుస్ సమీ నద్వి, షా ఒజైర్ మునెమి, సయీద్ ఉల్ హక్, అహ్మద్ గఫూర్, అబుల్ హయత్ చంద్, మంజూర్ అహ్మద్ అజాజీ తదితరులు ముస్లిం లీగ్‌ను వ్యతిరేకించిన ప్రముఖ కాంగ్రెస్ నాయకులు.

షా వహీదుద్దీన్ మిన్హాజీ, ఖయ్యూమ్ ఖిజర్, మరియు రఫిక్ ఆలం హిందుస్తానీ ముస్లిం లీగ్ ప్రచారాన్ని ఎదుర్కోవడానికి తమ సొంత సంస్థను ఏర్పాటు చేసుకున్నారు.

అందువల్ల బీహార్‌లోని జాతీయవాద ముస్లిం ఉద్యమం ముస్లిం లీగ్‌కు ఒక ముఖ్యమైన ప్రత్యామ్నాయంగా నిలిచింది

స్వాతంత్ర్యానికి ముందు చివరి దశాబ్దంలో మోమిన్ కాన్ఫరెన్స్ మరియు ముస్లిం ఇండిపెండెంట్ పార్టీ నుండి జమియత్ ఉలమా-ఎ-హింద్, మజ్లిస్-ఎ-అహ్రార్, ఆజాద్ ముస్లిం కాన్ఫరెన్స్, విద్యార్థి సంఘాలు మరియు స్వతంత్ర జాతీయవాద నాయకుల వరకు, ఎందరో ముస్లింలు పాకిస్తాన్ ఉద్యమాన్ని చురుకుగా వ్యతిరేకించారు.

పాకిస్తాన్ డిమాండ్ భారత ముస్లిం సమాజంలోనే వ్యతిరేకించబడిందని వారి పోరాటం నిరూపిస్తుంది. ముఖ్యంగా బీహార్, ద్విజాతి సిద్ధాంతాన్ని తిరస్కరించి, వలస వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని, ముస్లిం లీగ్‌ను ఎన్నికల పరంగా మరియు రాజకీయంగా సవాలు చేసి, ఐక్య భారతదేశం కోసం వాదించిన ఒక శక్తివంతమైన జాతీయవాద ముస్లిం రాజకీయ సంప్రదాయాన్ని సృష్టించింది.

 

18 August 2026

ఒమర్ మసీదు మరియు మత సహనంలో మరచిపోయిన ఒక పాఠం Mosque of Omar and a forgotten lesson in religious tolerance

 

 

 

మధ్యప్రాచ్యానికి ఎప్పుడూ వార్తల్లో ఉండే అలవాటు ఉంది. ఆ ప్రదేశం నుండే అత్యంత స్ఫూర్తిదాయకమైన మరియు విజ్ఞానాన్ని అందించే కొన్ని కథలు, గాథలు వెలువడ్డాయి.

జెరూసలేం మూడు వేర్వేరు మతాలకు పవిత్రమైనది, మరియు దీని పేరు "శాంతి" (సలేం) అనే పదం నుండి వచ్చింది.జెరూసలేం నగరం ఏసుక్రీస్తు జీవితంతో పెనవేసుకుపోయింది. ఇది జుడాయిజంలో అత్యంత పవిత్రమైన ప్రదేశం కూడా, ఎందుకంటే ఇక్కడే మొదటి యూదు దేవాలయం నిర్మించబడింది. ఆ దేవాలయానికి మిగిలింది వెస్ట్రన్ వాల్ మాత్రమే, ఇప్పుడు యూదులు ప్రార్థన చేయడానికి అక్కడికి వెళ్తారు.

అరబిక్‌లో, యూదు దేవాలయం కూడా గౌరవించబడుతుంది, దీనిని "బైత్ అల్ మఖ్దిస్" అని పిలుస్తారు. నిజానికి, జుడాయిజం మరియు క్రైస్తవ మతాలలో జెరూసలేంకు ఉన్న ప్రాముఖ్యత, దానిని ఇస్లాంలో కూడా పవిత్రమైనదిగా చేసింది. ఆ తర్వాత అక్కడ నిర్మించిన అల్ అక్సా మసీదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు మూడవ అత్యంత పవిత్రమైన ప్రదేశంగా మిగిలిపోయింది

జెరూసలేంలోని చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్చర్‌ బహుశా క్రైస్తవ ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన ప్రదేశం. యేసును శిలువ వేసి, ఆ తర్వాత సమాధి చేశారని నమ్మే గొల్గొతా Golgotha ప్రదేశంపై దీనిని నిర్మించారు. ఈ చర్చికి సమాధి Sepulchre కేంద్ర బిందువుగా ఉంది.

జెరూసలేం నగరo లోని మరొక చూడదగిన స్థలం ఒమర్ మసీదు. " రెండవ ఖలీఫా ఒమర్ జెరూసలంను జయించాడు మరియు ఖలీఫా ఒమర్,  ఒమర్ మసీదు ను నిర్మించాడు."


ఒమర్ మసీదు చరిత్ర:

అది 637 లేదా 638వ సంవత్సరం. జెరూసలేం క్రైస్తవ రాజ్యంగా ఉండేది మరియు సోఫ్రోనియస్ పాట్రియార్క్‌ Sophronius was the Patriarch గా ఉండేవారు. ఇస్లాంలో రెండవ ఖలీఫా అయిన ఒమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ యొక్క ముస్లిం సైన్యం పవిత్ర భూమిపై దాడి చేసి, ఆపై జెరూసలేంను ముట్టడించింది. ముస్లిం కమాండర్’/సైన్యాధిపతి సోఫ్రోనియస్‌తో షరతులపై చర్చలు జరపాలనుకున్నాడు. కానీ సోఫ్రోనియస్‌ ముస్లిం కమాండర్/సేనాధిపతితో చర్చలు జరపడానికి నిరాకరించి, తాను ఖలీఫాతోనే చర్చలు జరుపుతానని పట్టుబట్టాడు.చివరకు, ఖలిఫా ఒమర్ ఆ డిమాండ్‌కు అంగీకరించి, పాట్రియార్క్‌ను కలవడానికి జెరూసలేంలోకి ప్రవేశించాడు.

ఒమర్‌ను పరిశీలించిన తరువాత, పాట్రియార్క్, ఒమర్  ప్రార్థన సమయం సమీపిస్తున్నందున, ప్రార్థన చేయడానికి ఒమర్ ను హోలీ సెపల్చర్ చర్చికి ఆహ్వానించాడు. ఒమర్ దానికి నిరాకరించాడు. బదులుగా, ఒమర్ చర్చి బయటకు వెళ్లి దాని పక్కనే ఉన్న నేలపై ప్రార్థన చేశాడు. తన ప్రార్థనలు ముగిశాక, అయోమయంలో ఉన్న సోఫ్రోనియస్‌కు ఒమర్  తన చర్యను వివరించాడు.ఒకవేళ తాను చర్చి లోపల ప్రార్థన చేసి ఉంటే, తన అనుచరులు ఆ చర్చిని మసీదుగా మార్చేసేవారని ఒమర్ వివరించాడు. ఒమర్ దానిని నివారించాలనుకున్నాడు; చర్చి, చర్చిగానే ఉండాలని కోరుకుంటూ, దానికి బదులుగా ఖాళీ స్థలంలో ప్రార్థన చేయడానికి ఎంచుకున్నాడు.

ఇదే వివేకానికి, మత బహుళత్వానికి అసలైన నిదర్శనం! ఆ గొప్ప విజేత ఖలీఫా ఒమర్, పాట్రియార్క్ తనకు ప్రార్ధనకు చర్చిని ఇవ్వజూపినప్పటికీ, దానిని తన అనుచరులు ఎక్కడ మసీదుగా మార్చేస్తారనే భయంతో అక్కడ ప్రార్థన చేయడానికి నిరాకరించాడు. ఏడవ శతాబ్దానికి చెందిన ఈ సరళమైన సందేశం, 21వ శతాబ్దంలో బహుశా మునుపెన్నడూ లేనంతగా నేటికీ ఎంతో సందర్భోచితంగా ఉంది!

సుమారు 13 శతాబ్దాల క్రితం ఒమర్ ప్రార్థన చేసిన ఈ ప్రదేశంలోనే, హోలీ సెపల్చర్ చర్చికి సరిగ్గా పక్కన, నేడు ఒమర్ మసీదు ఉంది. ఇది జెరూసలేంలోని క్రైస్తవ ప్రాంతాలలో ఉన్న ఏకైక మసీదు మరియు ఇస్లాంలోని తొలి మసీదులలో ఒకటి. ప్రస్తుత భవనం 11వ శతాబ్దంలో నిర్మించబడింది.

ఒమర్ మసీదు వంపు ఆకారంలో ఉన్న ఒక మండపం, నిరాడంబరంగా, ప్రశాంతంగా ఉంది, అంతా దట్టంగా ఎర్ర తివాచీలతో కప్పబడి ఉంది. గోడలు సున్నపు పూతతో ఖాళీగా ఉన్నాయి; కొన్ని సాధారణ షాండిలియర్ల మృదువైన కాంతిలో ఆ గది నిండి ఉంది. అక్కడ అలంకరించిన మింబర్లు గానీ, మెహ్రాబ్‌లు గానీ లేవు.

అది కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే. ఆ మసీదును జయఘోష, విజయ సందేశాలు తెలియజేయడానికి నిర్మించలేదు. మసీదు, విశ్వాసి తన దేవుడిని శాంతి, ప్రశాంతతతో ప్రార్థించుకోవడానికి నిర్మించిన ఒక నిరాడంబరమైన, గౌరవప్రదమైన నివాసం.

జెరూసలేం నివాసుల మత జీవితంలో, ఆరాధనలో ఎలాంటి జోక్యం ఉండదని, వారి మత హక్కులు పరిరక్షించబడతాయని వాగ్దానం చేస్తూ ఒమర్ ఒక శాసనాన్ని రూపొందించారు.  ఆపత్రం లోపల తగిలించి ఉంది. కాని ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆ మసీదులోకి పర్యాటకులకు ప్రవేశం కల్పించలేదు 

ఈ సందర్భం లో ఒక విషయం  గుర్తుకు వస్తుంది. కొంతకాలం క్రితం క్రితమే, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, హగియా సోఫియా చర్చిని మ్యూజియం నుండి మసీదుగా మార్చిన  ఆరవ వార్షికోత్సవాన్ని అట్టహాసంగా జరుపుకున్నారు. టర్కీ నేత ముస్తఫా కెమల్ అటాటర్క్, హగియా సోఫియా మసీదు, మసీదుగా మార్చక ముందు అది ఒక చర్చిగా ఉండేదని తెలుసుకొని, దానిని ఒక మ్యూజియంగా మార్చాలని శాసించారు.

హగియా సోఫియాకు అంత దూరంలో లేని ఒమర్ మసీదు, మరియు నా మనసులో ప్రతిధ్వనిస్తున్న ఒమర్ సందేశం వెంటనే గుర్తుకువచ్చాయి. ఒమర్ ఒక 'రాషిదున్' - అంటే ఇస్లాం ధర్మ మార్గంలో నడిచిన నలుగురు ఖలీఫాలలో ఒకరు. ఆధునిక కాలంలో తమంతట తామే ఖలీఫాలుగా ప్రకటించుకున్న వారికి, ఆయనకు మధ్య ఉన్న ఏకైక తేడా ఇదే!