31 May 2026

ఈద్ పండుగ సందర్భంగా ఖుర్బానీకి కొత్త అర్థాన్ని ఇస్తున్న మహారాష్ట్ర ముస్లిం యువత Maharashtra Muslim youth give Qurbani a new meaning on Eid

 

మహారాష్ట్రలో ఈద్-ఉల్-అధా వేడుకలలో యువత చేపట్టిన ఒక ఉద్యమం, రక్తదానాన్ని ఒక శాశ్వత కార్యక్రమం గా మార్చింది. తద్వారా, త్యాగానికి  రూపమైన ఖుర్బానీకి కొత్త అర్థాన్ని ఇచ్చింది.

దానం చేసిన ఒక్క యూనిట్ రక్తం మూడు ప్రాణాలను కాపాడగలదని వైద్యులు చెబుతున్నారు. రక్తదాన ఆవశ్యకతను గుర్తించి, ముస్లిం సత్యశోధక్ మండల్ గత 16 సంవత్సరాలుగా మహారాష్ట్ర వ్యాప్తంగా ఈద్-ఉల్-అధా సందర్భంగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తోంది.

సమాజం కోసం త్యాగం చేయడానికి, మానవత్వానికి సేవ చేయడానికి ప్రజలను ప్రోత్సహించడం ద్వారా ఈ రక్తదాన కార్యక్రమం ఖుర్బానీ స్ఫూర్తిని విస్తృతం చేస్తుందని ముస్లిం సత్యశోధక్ మండల్  సంస్థ చెబుతోంది.రక్తదాన  శిబిరాలకు ముస్లింలే కాకుండా అన్ని మతాల ప్రజలు హాజరవుతున్నారు.

ముస్లిం సత్యశోధక్ మండల్ అధ్యక్షుడు షమ్సుద్దీన్ తంబోలి మాట్లాడుతూ, రక్తదాన ఆలోచన 2011లో రూపుదిద్దుకుందని తెలిపారు."బక్రీ ఈద్ సందర్భంగా రక్తదానం చేయాలనే భావన 2011లో ఖరారైంది, ఈ కార్యక్రమానికి డాక్టర్ బాబా అధవ్, డాక్టర్ నరేంద్ర దభోల్కర్ వంటి సంఘ సంస్కర్తలు, ఇంకా పలువురు ప్రముఖులు అండగా నిలిచారు," అని తంబోలి అన్నారు.

కోవిడ్-19 మహమ్మారి సమయంలో కూడా ముస్లిం సత్యశోధక్ మండల్ తన కార్యకలాపాలను కొనసాగించిందని తంబోలి పేర్కొన్నారు."మహమ్మారి కాలంలో కూడా ముస్లిం సత్యశోధక్ మండల్ రక్తదానంతో పాటు, ప్లాస్మా దాన శిబిరాలను కూడా నిర్వహించినది.. రాష్ట్రంలో వరదలు, తుఫానులు సంభవించినప్పుడల్లా సహాయక చర్యలు చేపట్టాము. దృష్టి లోపం ఉన్నవారికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు, పలు మానవతా కార్యక్రమాలను చేపట్టాము," అని తంబోలి తెలిపారు.

ముస్లిం సత్యశోధక్ మండల్ రక్తదాన్ ఉద్యమ  కార్యక్రమం 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి మరియు అనేక సంస్థలు ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరిస్తున్నాయి. ఇటీవలి సంవత్సరాలలో, ముస్లిం సత్యశోధక్ మండల్ అవయవ దానం, శరీర దానం మరియు కంటి దానాన్ని ప్రోత్సహక కార్యక్రమాలలో  పాల్గొనేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నది.."

షమ్సుద్దీన్ తంబోలి ఇంకా ఇలా అన్నారు, "ఖుర్బానీ అంటే త్యాగం మరియు అంకితభావం. ఒక వ్యక్తి నిజంగా త్యాగం చేయాలనుకుంటే, రక్తదానం ద్వారా మరొక మానవ ప్రాణాన్ని కాపాడటం కంటే గొప్ప కార్యం మరొకటి ఉండదు."

మహారాష్ట్ర మాజీ డీజీపీ, అశోక్ ధివారే రక్తదాన కార్యక్రమాన్ని బహిరంగంగా ప్రశంసించారు.ప్రతి సంవత్సరం తాను రక్తదానం  కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటానని ధివారే తెలిపారు.

రక్తదాన కార్యక్రమం ఇస్లామిక్ విలువలను సమకాలీన మానవతా అవసరాలతో అనుసంధానించడానికి ప్రయత్నిస్తోందని ముస్లిం సత్యశోధక్ మండల్ కార్యనిర్వాహక సభ్యురాలు డాక్టర్ సమీనా పఠాన్ అన్నారు.

మతపరమైన పండుగలు సమాజ అవసరాలకు అనుగుణంగా మారాలని చెబుతూ, రచయిత ప్రదీప్ అవటే కూడా రక్తదాన కార్యక్రమం ను ప్రశంసించారు.

బక్రీద్ పండుగ సమయంలో రక్తదానం చేయడం నిజంగా ఒక మానవతా చర్య," అని ముస్లిం సత్యశోధక్ మండల్ యొక్క ఒక నిర్వాహకుడు పేర్కొన్నారు.

పూణేలో ఒక స్థానిక చొరవగా ప్రారంభమైన రక్తదాన కార్యక్రమం  ఇప్పుడు సమాజానికి ఒక ఆదర్శంగా నిలిచింది. త్యాగం అనే పవిత్ర స్ఫూర్తిని విజ్ఞానం, కరుణ, ప్రజా సేవతో మేళవించడం ద్వారా, మతపరమైన విలువలను సమాజ శ్రేయస్సు కోసం ఎలా ఉపయోగించుకోవచ్చో రక్తదాన ప్రచార కార్యక్రమం  నిరూపించింది.


సోషలిస్ట్ జ్ఞాపకాలు – లోహియా-చంపారన్

 

  

 

 

1917లో మహాత్మా గాంధీ చేసిన సత్యాగ్రహంతో చంపారన్ ఆగలేదు, తరువాత అది స్వతంత్ర భారతదేశంలో రైతాంగ ఉద్యమానికి, భూ సంస్కరణలకు నాయకత్వం వహించింది

భారత స్వాతంత్ర్య పోరాటం ఒక ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందిన ప్రదేశంగా చంపారన్‌కు ఘనత దక్కుతుంది. కానీ, జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలోని స్వతంత్ర భారత ప్రభుత్వానికి చంపారన్ మొట్టమొదటి సవాలును విసిరిందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కొన్ని నెలల్లోనే భారత రాజ్యాంగానికి మొదటి సవరణ తీసుకురావాల్సిన ఒత్తిడిని చంపారన్ నెహ్రు పై  మోపింది.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు, రామ్ మనోహర్ లోహియా నేతృత్వంలోని సోషలిస్టులు,కమ్యూనిస్టులు మరియు హిందూ మహాసభతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదటి ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేశారు. మహాత్మా గాంధీ వలె సమస్యల చుట్టూ భారత ప్రజలను సమీకరించాలని లోహియా భావించారు. ఇందుకోసం, గాంధీ తన ఉద్యమాన్ని ప్రారంభించిన ప్రదేశమైన చంపారన్‌ను లోహియా ఎంచుకున్నారు, 1947లో, లోహియా నేతృత్వంలోని సోషలిస్ట్ పార్టీ జాతీయ కార్యవర్గం ‘చంపారన్ జిల్లాలో భూసేకరణ ప్రక్రియ process of land accumulation, రైతుల నిరంతర భూమి హరణం continual dispossession of farmers, పెద్ద వ్యవసాయ క్షేత్రాలు మరియు భూస్వాముల ఆవిర్భావంపై విచారణ జరపాలని’ నిర్ణయించింది.

 భారతదేశంలో భూసేకరణ గరిష్ట స్థాయి accumulation of holdings కి చేరిన ఏకైక ప్రదేశం బహుశా’ చంపారన్‌ కావడంతో, ఈ విచారణ కోసం చంపారన్‌ను ఎంపిక చేశారు. కానీ, మే 1950 వరకు ఈ విచారణ కమిషన్ కాగితాలకే పరిమితమైంది. ఆ తర్వాత భారత రాజ్యాంగం ఆమోదం పొందడంతో, నెహ్రూ ప్రభుత్వం వాగ్దానం చేసిన భూ సంస్కరణలను (జమీందారీ రద్దు) నెరవేర్చలేదని స్పష్టమైంది. మరో రెండు సంవత్సరాలలో సార్వత్రిక ఎన్నికలు కూడా జరగనున్నాయి, మరియు నెహ్రూ చేసిన భూసంస్కరణల వాగ్ధనం నెరవేర్చడం కష్టమని సోషలిస్టులు భావించారు.

కాబట్టి, లోహియా, ఖుర్షెద్‌బెన్ నౌరోజీ మరియు రామానందన్ మిశ్రాలతో కలిసి మే 29న చంపారన్‌లో పర్యటన ప్రారంభించి, జూన్ 8, 1950న తమ నివేదికను సమర్పించారు. 4,000 లిఖితపూర్వక విజ్ఞప్తులను స్వీకరించి, 400 మంది సాక్షులను విచారించి, 1,000 మంది రైతుల వాంగ్మూలాలను నమోదు చేసిన తర్వాత, లోహియా నేతృత్వంలోని కమిషన్ ఇలా పేర్కొంది: "1867 నుండి 1917 వరకు చంపారన్ రైతాంగం ఎవరిపై అయితే తీవ్ర పోరాటం సాగించిందో, ఆ బ్రిటిష్ తోటల యజమానులు రైతులను ఆర్థికంగా పూర్తిగా చిన్నాభిన్నం చేశారు. 1918తో ముగిసిన దశాబ్ద కాలంలో, రైతాంగం తాకట్టుల రూపంలో రూ. 84 లక్షలు అప్పు చేసి, 1,04,000 ఎకరాల భూమిని వడ్డీ వ్యాపారులకు అప్పగించాల్సి వచ్చింది. రైతులు కాస్త ఊపిరి పీల్చుకునేలోపే, 1930 నాటి ఆర్థిక మాంద్యం వారిని తీవ్రంగా దెబ్బతీసింది. దానికి తోడు 1931లో వడగళ్ల తుఫాను మరియు 1934 నాటి భూకంపం రైతుల విధ్వంసక ప్రక్రియను పూర్తి చేసింది. వీటన్నింటి ఫలితంగా, రైతులు పెద్ద స్థాయిలో తమ భూములను కోల్పోవాల్సి వచ్చింది." మహాత్మా గాంధీ ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టిన తర్వాత, కనీసం 40,000 ఎకరాల భూమిని చక్కెర మిల్లు యజమానులు అత్యంత తక్కువ ధరలకు చేజిక్కించుకున్నారని కమిషన్ గుర్తించింది

జూన్ 9, పాట్నాలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో లోహియా మాట్లాడుతూ, ప్రతి కుటుంబానికి ఉండవలసిన గరిష్ట భూ పరిమితిని 30 ఎకరాలకు తగ్గించాలని సూచించారు. లోహియా సూచించిన ఇతర మార్పులు ఇవి: (a) వ్యక్తిగత భూ యజమానుల తరపున జరిగే అన్ని భూ కేటాయింపులను నిలిపివేసి, ఒక 'ఆహార సైన్యం' (Food Army) ద్వారా సాగు చేయించే ఉద్దేశంతో, సాగుకు యోగ్యమైన బంజరు భూములన్నింటినీ భారత మరియు బీహార్ ప్రభుత్వాలు సంయుక్తంగా స్వాధీనం చేసుకోవాలి; (b) పశుగ్రాస భూములు, రహదారులు, పచ్చిక బయళ్లు, శ్మశాన వాటికల వంటి ఉమ్మడి భూములను తిరిగి గ్రామ పంచాయతీలకు అప్పగించాలి మరియు వాటిపై జరిగే తదుపరి ఆక్రమణలన్నింటినీ నిలిపివేయాలి; మరియు (c) సాగు భూముల విషయంలో గానీ, పట్టణ ప్రాంతాల్లో గానీ భూ కేటాయింపులు లేదా వాటి సవరణలు సంబంధిత గ్రామం లేదా పట్టణ పంచాయతీ ద్వారా మాత్రమే జరగాలి. ఈ మార్పులకు ఆధారమైన సూత్రాలను భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు వర్తింపజేయాలని డాక్టర్ లోహియా ఆకాంక్షించారు. అయితే, ప్రాథమిక దశలో మొదట్లో  ఈ మార్పులను చంపారన్‌లో తక్షణమే అమలు చేయాలని లోహియా కోరారు. ఒకవేళ నెహ్రూ ప్రభుత్వం నెల రోజుల్లోపు ఈ సూచనలను అంగీకరిస్తే, తమ పూర్తి నివేదికను ప్రచురించబోమని లోహియా పేర్కొన్నారు.

అదే సమయంలో, జమీందారీ వ్యవస్థ రద్దును సులభతరం చేసే ఉద్దేశంతో, భారతదేశ శాసనసభ (మొదటి సార్వత్రిక ఎన్నికలు అప్పటికి ఇంకా జరగాల్సి ఉంది) మొదటి రాజ్యాంగ సవరణపై చర్చలు జరుపుతోందని గమనించాలి. జూన్ 18, ఈ మొదటి సవరణ ఆమోదించబడింది; తద్వారా ఇది భూ సంస్కరణలకు మార్గం సుగమం చేసింది.

 

source: SaSaquib Salim wall 

 

 

 

 

 

.

 

30 May 2026

అత్యంత అద్భుతమైన ఇండో-బ్రిటిష్ ప్రేమకథ-జేమ్స్ అకిల్స్ కిర్క్‌పాట్రిక్ మరియు ఖైర్-ఉన్-నిస్సా బేగంల ప్రేమకథ Most extraordinary and forgotten love story of James Achilles Kirkpatrick and Khair-un-Nissa Begum.

 

 

18వ శతాబ్దం చివరినాటికి  భారతదేశం లో మొఘల్ సామ్రాజ్యం క్షీణిస్తోంది, సంస్థానాలు తమ అధికారాన్ని కాపాడుకోవడానికి పోరాడుతున్నాయి, మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారత ఉపఖండంపై తన పట్టును క్రమంగా బిగిస్తోంది. ఈ అల్లకల్లోల రాజకీయ వాతావరణం మధ్య, వలస భారతదేశపు అత్యంత అసాధారణమైన మరియు విస్మరించబడిన ప్రేమకథలలో ఒకటి  జేమ్స్ అకిల్స్ కిర్క్‌పాట్రిక్ మరియు ఖైర్-ఉన్-నిస్సా బేగంల ప్రేమకథ.

జేమ్స్ అకిల్స్ కిర్క్‌పాట్రిక్ హైదరాబాద్‌లో బ్రిటిష్ రెసిడెంట్‌గా, నిజాం ఆస్థానంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఒక శక్తివంతమైన ప్రతినిధిగా ఉండేవారు. తన కాలంలోని చాలా మంది బ్రిటిష్ అధికారుల వలె కాకుండా, కిర్క్‌పాట్రిక్ భారతీయ సంస్కృతి పట్ల తీవ్రంగా ఆకర్షితులయ్యారు. కిర్క్‌పాట్రిక్ పర్షియన్ మరియు ఉర్దూ భాషలను నేర్చుకున్నారు, మొఘల్ శైలి దుస్తులను ధరించారు, స్థానిక ఆచారాలను అనుసరించ సాగాడు..

ఒక సామాజిక వేడుకలో కిర్క్‌పాట్రిక్ నిజాం ప్రధానమంత్రి మనవరాలైన, ప్రముఖ హైదరాబాదీ ముస్లిం కుటుంబానికి చెందిన యువ రాకుమార్తె ఖైర్-ఉన్-నిస్సా బేగంను కలిశారు. వారి మొదటి కలయిక త్వరలోనే ఒక గాఢమైన ప్రేమగా మారింది. కానీ వారి సంబంధం అన్ని విధాలుగా అపఖ్యాతి పాలైంది. వారు పూర్తిగా భిన్నమైన ప్రపంచాల నుండి, భిన్నమైన మతాల నుండి, భిన్నమైన సంస్కృతుల నుండి, భిన్నమైన సామ్రాజ్యాల నుండి వచ్చారు. ఆ కాలంలో, అటువంటి కలయిక ఆమోదయోగ్యం కానిదిగా పరిగణించబడింది.అయినప్పటికీ, ఆ ఇద్దరూ సంప్రదాయాల కన్నా ప్రేమనే ఎంచుకున్నారు.

అనేక చారిత్రక కథనాల ప్రకారం, కిర్క్‌పాట్రిక్ చివరికి ఇస్లాంను స్వీకరించి, సాంప్రదాయ ముస్లిం పద్ధతిలో ఖైర్-ఉన్-నిస్సాను వివాహం చేసుకునే ముందు "హస్మత్ జంగ్" అనే పేరును స్వీకరించారు. కిర్క్‌పాట్రిక్-ఖైర్-ఉన్-నిస్సా వివాహం బ్రిటిష్ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈస్ట్ ఇండియా కంపెనీలోని చాలా మంది అధికారులు కిర్క్‌పాట్రిక్ "స్థానిక సంస్కృతిలో కలిసిపోయారని" నమ్మారు; పాలకుడు, పాలితుల మధ్య గీతను ఇది చెరిపివేస్తుందని వలస పాలకవర్గం తీవ్రంగా భయపడింది.

అయితే, వారి ప్రేమ ముందు రాజకీయాలు, సామ్రాజ్యం, పక్షపాతం శక్తిహీనంగా అనిపించాయి. కిర్క్‌పాట్రిక్-ఖైర్-ఉన్-నిస్సా ఇద్దరు పిల్లలు కలిగారు 1805లో, కిర్క్‌పాట్రిక్ కేవలం 41 ఏళ్ల వయసులో మరణించాడు. ఖైర్-ఉన్-నిస్సా అప్పటికింకా కౌమారదశలోనే ఉంది. కిర్క్‌పాట్రిక్ మరణం తర్వాత, పిల్లలను ఇంగ్లాండ్‌కు తీసుకువెళ్లారు, దాంతో వారు తమ తల్లికి శాశ్వతంగా దూరమయ్యారు. ఖైర్-ఉన్-నిస్సా తన మిగిలిన జీవితంలో ఎక్కువ భాగాన్ని ఒంటరితనంలో, దుఃఖంలో గడిపింది.

నేడు, వారి కథ కేవలం ఒక ప్రేమకథగా మాత్రమే కాకుండా అంతకంటే ఎక్కువగా నిలిచి ఉంది. మానవ భావోద్వేగాలు మతం, జాతి, అధికారం మరియు రాజకీయాల సరిహద్దులను దాటగలవని ఇది గుర్తుచేస్తుంది. కిర్క్‌పాట్రిక్ మరియు ఖైర్-ఉన్-నిస్సా ప్రేమకథ, చరిత్ర దాదాపుగా మరచిపోయిన అత్యంత అద్భుతమైన ఇండో-బ్రిటిష్ ప్రేమకథలలో ఒకటిగా నిలిచిపోయింది.

29 May 2026

హజ్రత్ హజర్ త్యాగం ఈద్ అల్-అధా గాథలో ఒక భాగం. Hazrat Hajar's sacrifice is part of Eid al-Adha's fable

ప్రవక్త ఇబ్రహీం భార్య మరియు ప్రవక్త ఇస్మాయిల్ తల్లి అయిన హజర్ (హాగర్ అని కూడా పిలుస్తారు) ను 'హజ్ మహిళ'గా పరిగణిస్తారు. హజర్ (హాగర్) కథ హజ్ ఆచారాలతో మరియు ఈద్ అల్-అధా స్ఫూర్తితో ముడిపడి ఉంది.

సఫా మరియు మర్వా కొండల మధ్య నడిచే 'సాయి' అనే ఆచారం, తన పసికందు కోసం నీటి కోసం హజర్ పడిన తీవ్రమైన శ్రమకు గుర్తుగా జరుపుకుంటారు. హజర్ (హాగర్) పడిన కష్టాల సమయంలో అల్లాహ్ దయతో జమ్జమ్ బావి ఉద్భవించింది, దీని నుండి ఇప్పటికీ లక్షలాది యాత్రికులు నీరు తాగుతున్నారు. హోదా లేదా జాతీయతతో సంబంధం లేకుండా ప్రతి యాత్రికుడు, కష్టాల నడుమ అల్లాహ్‌ను విశ్వసించిన ఒక తల్లి-హజర్‌ నడిచిన మార్గాన్ని అనుసరిస్తాడు.

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అనుసరించే  హజ్ ఆచారాలు అనేక విధాలుగా, హజర్ అనే ఒక తల్లి కథే. హజర్‌ను, వారి చిన్న కుమారుడు ఇస్మాయిల్‌ను మక్కాలోని నిర్జన లోయలో విడిచిపెట్టమని అల్లాహ్ ప్రవక్త ఇబ్రహీంను ఆజ్ఞాపించినప్పుడు, అది విశ్వాసానికి ఒక అపూర్వమైన పరీక్ష. అక్కడ జీవపు ఆనవాళ్లు లేవు, నీరు లేదు, నివాసాలు లేవు. అయినప్పటికీ, హజర్ భయానికి లొంగిపోలేదు. "ఇలా చేయమని అల్లాహ్ మిమ్మల్ని ఆజ్ఞాపించాడా?" అని ఆమె ఇబ్రహీంను ప్రశ్నించింది. ఇబ్రహీం "అవును" అని చెప్పినప్పుడు, ఆమె ప్రతిస్పందన చరిత్రలోనే గొప్ప విశ్వాస ప్రకటనలలో ఒకటిగా నిలిచింది: "అప్పుడు అల్లాహ్ మమ్మల్ని విడిచిపెట్టడు."

బాలుడు ఇస్మాయిల్ దాహంతో ఏడుస్తున్నప్పుడు, హజర్ నీటి కోసం సఫా మరియు మర్వా కొండల మధ్య పరుగెత్తింది. హజర్ సఫా మరియు మర్వా కొండల మధ్య ప్రయాణాన్ని ఏడుసార్లు పునరావృతం చేసింది. అప్పుడు అల్లాహ్ కరుణ కురిసింది. ఇస్మాయిల్ పాదాల వద్ద జమ్జమ్ బావి ఉబికివచ్చి, నిర్జీవమైన ఎడారిని భవిష్యత్ నాగరికతకు కేంద్రంగా మార్చింది. ఈనాటికీ, లక్షలాది యాత్రికులు సయీ సమయంలో హజర్ అడుగుజాడలను అనుసరిస్తారు.

ఇబ్రహీం త్యాగం వెనుక హజర్ యొక్క నిశ్శబ్ద త్యాగం కూడా ఉంది.ప్రజలు తరచుగా ప్రవక్త ఇబ్రహీం తన కుమారుడిని త్యాగం చేయడానికి సిద్ధపడటంపై దృష్టి పెడతారు, కానీ ఆ పరీక్షను ఎదుర్కొన్న తల్లి యొక్క మానసిక బలాన్ని విస్మరిస్తారు. హజర్ ఒంటరితనం, అనిశ్చితి మరియు కష్టాలను సహించింది. ఈద్ రోజు రాకముందే హాజర్ అల్లాహ్ కోసం తన సుఖాన్ని, భద్రతను త్యాగం చేసింది.

హజ్ ఆచారాలు, హజర్ జరిపిన పోరాటంతో ముడిపడి ఉన్నాయి. హజర్ కథ-తన బిడ్డ కోసం ఎడారిలో పరుగెత్తే తల్లి కధ. హజర్ కథ నిశ్శబ్ద సహనం,ముందు మార్గం కనిపించనప్పుడు అల్లాహ్‌ను నమ్మడం యొక్క కధ.

ప్రతి సంవత్సరం, ముస్లింలు ఈద్ అల్-అధాను జరుపుకుంటున్నప్పుడు మరియు యాత్రికులు మక్కాలో గుమిగూడినప్పుడు, హజర్ వారసత్వం జీవిస్తూనే ఉంటుంది. హజర్ అడుగుజాడలు ఆరాధనగా మారాయి. హజర్ పోరాటం ఒక ఆచారంగా మారింది. హజర్ త్యాగం చరిత్రగా నిలిచింది.

 

28 May 2026

గోరక్షణ ఉద్యమం యొక్క మూలాలు The origins of the Cow Protection Movement

 



ఆర్య సమాజ్ నేతృత్వంలోని గోరక్షణ ఉద్యమం గురించి, 1893లో వైస్రాయ్ లాన్స్‌డౌన్‌కు రాసిన లేఖలో క్వీన్ విక్టోరియా క్రింది విధంగా పేర్కొన్నారు.ముహమ్మదీయుల గోవధను ఈ ఆందోళనకు సాకుగా చూపినప్పటికీ, వాస్తవానికి ఇది మాకు (బ్రిటిష్ వారికి) వ్యతిరేకంగానే సాగుతోంది. ఎందుకంటే, మహమ్మదీయుల కంటే మేమే మా సైన్యం కోసం ఎన్నో రెట్లు ఎక్కువ ఆవులను వధిస్తాము..

19వ శతాబ్దంలో ప్రారంభమైన గోరక్షణ ఉద్యమాలు, గోవధించే ముస్లింలకు వ్యతిరేకంగానే మొదలయ్యాయని మీరు నమ్ముతున్నారా? ఒకవేళ మీరు అలా నమ్మితే, భారతీయులను విభజించి ఉంచడానికి బ్రిటిష్ వారు వ్యాప్తి చేసిన అత్యంత హేయమైన అబద్ధాలలో ఒకదానిని మీరు నమ్మినట్లే.

వాస్తవం ఏమిటంటే, హిందువులు నివసించే ప్రాంతాలలో ముస్లింలు ఎన్నడూ గోవధకు పాల్పడలేదు. ఎంతమంది ముస్లిం పాలకులు గోవధను నిషేధించారో నేను మళ్ళీ చెప్పనవసరం లేదు.

క్వీన్ విక్టోరియా రాసిన పైన పేర్కొన్న లేఖ, గోరక్షణ ఉద్యమాల యొక్క వలస వ్యతిరేక స్వభావానికి తిరుగులేని సాక్ష్యం. ఆ లేఖ ఒక నిఘా నివేదిక ఫలితంగా వచ్చింది. ఆ నివేదికలో ఇలా పేర్కొనబడింది, “ప్రధాన ప్రమాదం ఏమిటంటే, గోరక్షణ సమస్య ఒక ఉమ్మడి వేదికను అందిస్తుంది. దానిపై ఏ వర్గానికి చెందిన హిందువులైనా, ఇతర విషయాలపై వారి మధ్య ఎంత భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఏకం కాగలరు మరియు అవుతున్నారు.”

నిజానికి, 1857లో విప్లవకారుల ఓటమి, ఆ తర్వాత పాట్నా వహాబీలు మరియు మహారాష్ట్రకు చెందిన బల్వంత్ ఫడ్కే ఎదుర్కొన్న పరాజయాలు, భారతీయులందరినీ ఏకం చేయగల ఒక ప్రజా ఉద్యమాన్ని రూపొందించేలా భారత నాయకులను బలవంతం చేశాయి. హిందువులు గోవులను పూజించేవారు మరియు ఐరోపావాసులకు అవి ప్రధాన ఆహారంగా ఉండేవి. త్వరలోనే, భారతదేశంలో గోవధను ఆపడానికి ఒక ఉద్యమం ప్రారంభించబడింది.

తమ కంటోన్మెంట్‌లలోని కసాయివాళ్లు butchers ముస్లింలు అనే సాకుతో బ్రిటిష్ వారు ఈ ఉద్యమాన్ని ముస్లింల వైపు మళ్లించడానికి ప్రయత్నించారు. హిందూ నాయకత్వం ఈ దుష్ట ప్రణాళికలను అర్థం చేసుకుంది. బారిస్టర్ పండిట్ బిషన్ నారాయణ్ దార్, తన ‘వాయువ్య ప్రదేశ్ మరియు ఔధ్‌లోని హిందువుల తరపున ఆంగ్ల ప్రజలకు విజ్ఞప్తి’ (1893)లో, గోవధ విషయంలో హిందూ-ముస్లింల మధ్య ఉద్రిక్తతలు బ్రిటిష్ వారి ‘విభజించి పాలించు’ విధానంలో ఒక భాగమని రాశారు. వలస పాలనకు ముందు హిందువులు, ముస్లింలు గోవధ విషయంలో ఎన్నడూ పోరాడుకోలేదని పండిట్ బిషన్ నారాయణ్ దార్ పేర్కొన్నారు. బ్రిటిష్ వారు తమ సైన్యానికి అవసరమైన గొడ్డు మాంసం కోసం, ఆవులను వధించడానికి ముస్లిం కసాయిలను ప్రోత్సహించారు. ముస్లింలు తమ స్వప్రయోజనాల కోసం ఆవులను చంపలేదు, కానీ బ్రిటిష్ వారు పేద ముస్లింలను గొడ్డు మాంసం beef తినేలా ప్రోత్సహించారు.

విద్యావంతులు, వలస వ్యతిరేక జాతీయవాద ముస్లింలు కూడా ఈ ఉద్యమంలో భాగమయ్యారు. 1893లో, ఢిల్లీ పోలీసులు సద్ది అనే ఒక ముస్లిం సూఫీ రాసిన 'గౌ పుకార్ పుష్వలి' (ఆవుకు విజ్ఞప్తి చేసే పద్యాలు) అనే తొమ్మిది పేజీల పుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నారు. గయాలో, 1889లో ఒక గోశాలను (ఆవుల ఆశ్రమం) స్థాపించడంలో మౌల్వి కమరుద్దీన్ అహ్మద్ ముఖ్య నాయకులలో ఒకరిగా నిలిచారు. 1880వ దశకం మరియు 1890వ దశకం ప్రారంభంలో వారణాసిలో జరిగిన ఉద్యమానికి ముస్లింలు హాజరై మద్దతు ప్రకటించడం కూడా గమనించబడింది. ఫార్సీ అఖ్బార్, అంజుమన్-ఇ-పంజాబ్, అఫ్తాబ్-ఇ-పంజాబ్ వంటి ముస్లింలు సంపాదకత్వం వహించిన లేదా ముస్లింలు రాసిన వార్తాపత్రికలు ఈ ఉద్యమానికి మద్దతుగా చురుకుగా ప్రచారం చేశాయి. బ్రిటిష్ వారి గోమాంసం తినే అలవాటు వల్లే హిందువులు, ముస్లింల మధ్య శత్రుత్వం ఏర్పడుతోందని ఫార్సీ అఖ్బార్ అభిప్రాయపడింది. కసాయివాళ్ళు butchers భారతీయ ముస్లింలే అయినప్పటికీ, రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టించాలనుకున్న బ్రిటిష్ అధికారుల ఆదేశాల మేరకు ఆవులను వధించారు.

బ్రిటిష్ వారికి విధేయులుగా ఉన్న ముస్లింలు, హిందువులు మరియు సిక్కులు దీనిని హిందూ-ముస్లిం సమస్యగా మార్చడానికి ప్రయత్నించి, ఆవులను వధించే హక్కు ముస్లింలకు ఉందని వాదించారు. ఆసక్తికరంగా, భారతదేశంలో దాదాపు ఉలేమాలందరూ గోవధకు వ్యతిరేకంగా బోధించారు. తమకు నచ్చిన ఆహారాన్ని ఎంచుకునే స్వేచ్ఛ గురించి మాట్లాడింది మాత్రం ఆంగ్ల విద్య అభ్యసించిన విధేయులే.

1880వ దశకం అంతటా మరియు 1890వ దశకం ప్రారంభంలో, కంటోన్మెంట్‌లలోని తమ సైనికుల కోసం గొడ్డు మాంసం సేకరించడంలో ఉన్న సమస్య గురించి బ్రిటిష్ అధికారులు నివేదిస్తూ వచ్చారు. 1891లో, దినాపూర్ కంటోన్మెంట్‌లో వధ కోసం ఆవులను తీసుకెళ్తున్న కసాయివాళ్ళను అడ్డుకుంటున్న గోరక్షణ కార్యకర్తలపై పోలీసులు కాల్పులు జరిపారు. ఇలాంటి ఘటనలే బెల్గాం, జబల్‌పూర్ మరియు నాగ్‌పూర్‌లలో కూడా నమోదయ్యాయి. ఐక్యంగా, బలంగా సాగే గోరక్షణ ఉద్యమం బ్రిటిష్ వారికి ఆహార సరఫరాను నిలిపివేస్తుందని అధికారులకు తెలుసు. అందుకే వారు కసాయివాళ్లను గోవధ వైపు ఆకర్షించడం మొదలుపెట్టారు.

గోరక్షణ ఉద్యమం ఎంతటి తీవ్రమైన ముప్పును కలిగించిందంటే, 1893 డిసెంబర్‌లో వైస్రాయ్, గోరక్షణ ఉద్యమం ‘1857 నాటి తిరుగుబాటు’ అంత ప్రమాదకరమైనదని వ్యాఖ్యానించారు. గోరక్షణ ఉద్యమం వలన జాతీయవాదులకు ప్రజాదరణ లభించిందని వైస్రాయ్ విశ్వసించారు. “భారతదేశంలో, కాంగ్రెస్ ఉద్యమం ద్వారా మరియు వారి రాజకీయ కూటముల ద్వారా వ్యక్తమవుతున్న అశాంతి, అసంతృప్తి—విద్యావంతులైన హిందువులు మరియు నిరక్షరాస్యులైన సామాన్య ప్రజలు తమ శక్తులను ఏకం చేయడానికి ఒక ఉమ్మడి వేదిక లభించినందువల్ల—ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉందని నేను భయపడుతున్నాను,” అని వైస్రాయ్ పేర్కొన్నారు.

వైస్రాయ్ చెప్పింది తప్పేమీ కాదు. 1919లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి, గోరక్షణ ఉద్యమం ఒక ప్రజా ఉద్యమంగా మారేలా మహాత్మా గాంధీ చూసుకున్నారు. బ్రిటిష్ వారు తమ వినియోగం కోసం ప్రతిరోజూ 30,000 కంటే ఎక్కువ ఆవులను వధిస్తున్నారని గాంధీ ఆరోపించారు. దేవబంద్ ఉలేమాలు మరియు ఇతర జాతీయవాదుల వంటి ముస్లింలు కూడా గోరక్షణ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు.

19వ శతాబ్దం చివరలో గోరక్షణ ఉద్యమం సవాలును ఎదుర్కొన్నప్పుడు, బ్రిటిష్ వారు ముస్లిం లీగ్ ఏర్పాటు మరియు బెంగాల్ విభజన రూపంలో హిందూ-ముస్లిం శత్రుత్వానికి బీజాలు వేశారు. ఈసారి 1920లలో, వారు మత అల్లర్ల కోసం చిన్న మత సమూహాలను ఉపయోగించుకున్నారు.

భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పరిస్థితి నిజంగా చాలా కష్టంగా ఉండేది. 1920లో, ప్రజాభిప్రాయం కారణంగా స్థానిక భారతీయ పాలకులు తమ అధికార పరిధిలోని బ్రిటిష్ కంటోన్మెంట్‌లలో ఆవులను వధించవద్దని కోరిన తరువాత, మధ్య భారతదేశంలోని బ్రిటిష్ ఏజెంట్ వైస్రాయ్‌కి ఇలా రాశారు, “బ్రిటిష్ సైనికులకు గొడ్డు మాంసం తప్పనిసరిగా కావాలి, ఒకవేళ స్థానికంగా అది లభించడంలో ఇబ్బందులు ఉంటే, బహుశా సుదూర ప్రాంతాల నుండి దిగుమతి ద్వారా తెప్పించుకోవడానికి ఏర్పాట్లు చేయడమే ఏకైక మార్గం”.

రైల్వేల ద్వారా గొడ్డు మాంసం దిగుమతికి ఏర్పాట్లు చేయమని సైన్యం కూడా ప్రభుత్వాన్ని కోరింది. ఫిబ్రవరి 1921లో సమర్పించిన ఒక నివేదికలో సైన్యం ఇలా పేర్కొంది, “అందరికీ తెలిసినట్లుగా, అన్ని యూరోపియన్ దేశాల, ముఖ్యంగా బ్రిటిష్ మరియు అమెరికన్ల ప్రధాన ఆహారం గొడ్డు మాంసమే. ఈ విషయంలో పరిష్కారం, వధించాల్సిన పశువులను రైలు మార్గం ద్వారా తీసుకురావడమే.”

రోడ్డు రవాణా ద్వారా ఆవుల దిగుమతిని ప్రజలు అడ్డుకుంటారేమోనని సైన్యం ఆందోళన చెందింది. రాజపుతానా మరియు ఇతర రాష్ట్రాలలోని చాలా ప్రాంతాలలో బ్రిటిష్ సైనికులు గొడ్డు మాంసం కోసం ఆకలితో అలమటిస్తున్నారు.

1921 మార్చిలో, మరో సైనిక నివేదిక ఇలా పేర్కొంది, “భారతదేశంలో పశువధను, ముఖ్యంగా బ్రిటిష్ దళాలకు ఆహారంగా అవసరమైన పశువుల వధను నిషేధించడానికి ఒక సంఘటిత ఉద్యమం నడుస్తోంది. హిందువుల మతపరమైన సున్నితత్వాలను తక్షణమే తాకే ఇటువంటి ఉద్యమం, తీవ్రమైన రాజకీయ సమస్యగా మారకుండా జాగ్రత్తగా గమనించాలి.”

సామాన్య ప్రజల ఒత్తిడితో స్థానిక పాలకులు గోవధపై ఆంక్షలను పెంచుతున్నారని బ్రిటిష్ ఏజెంట్ రాశారు. అనేక చోట్ల, వధ కోసం రాష్ట్రాల వెలుపల నుండి తీసుకువచ్చిన పశువులను కార్యకర్తలు అడ్డుకున్నారు. భోపాల్ వంటి ముస్లిం పాలకులు కూడా ఇలాంటి ఆంక్షలనే విధించారు.

దాదాపు అదే సమయంలో, బ్రిటిష్ వారికి విధేయులైన ముస్లింలు ఈద్ ఉల్-అజ్హా (బక్రీద్) నాడు గోవులను వధించాలనే ఉద్యమాన్ని ప్రారంభించడం యాదృచ్ఛికం కాదు. ఉలేమాల అభిప్రాయాలకు పూర్తిగా విరుద్ధంగా, గోవధ ఈద్‌లో ఒక అనివార్యమైన భాగమని వాదిస్తూ వారు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. తద్వారా ఈ ఉద్యమం యొక్క దృష్టిని హిందూ-ముస్లిం అల్లర్ల వైపు మళ్లించారు. అప్పటి నుండి భారతదేశంలో అనేక మత అల్లర్లకు గోవధే కారణమైంది. ఇతరుల మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం అనుమతించబడదని, ముస్లింలు ఇతర జంతువులను బలి ఇవ్వాలని ఉలేమాలు ఎల్లప్పుడూ వాదిస్తూ వచ్చారు.