22 May 2026

పవిత్ర కాబా యొక్క మొదటి చిత్రాన్ని ఎవరు తీశారు? Who clicked the first picture of Holy Kabba?

 


న్యూఢిల్లీ:

ముస్లింలకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రమైన కాబా యొక్క మొదటి చిత్రాన్ని ఎవరు తీశారు? అల్-అరబియా ప్రకారం, కాబా యొక్క అత్యంత పురాతన ఫోటోను 1881లో ముహమ్మద్ సాదిక్ బే తీశారు.

ముహమ్మద్ సాదిక్ బే ఒట్టోమన్ సామ్రాజ్యం క్రింద ఈజిప్టు సైన్యంలో ఒక ఇంజనీర్. ముహమ్మద్ సాదిక్ బే ఈజిప్టు నుండి హజ్ యాత్రకు వచ్చే యాత్రికులతో పాటు కోశాధికారిగా వెళ్ళేవారు. ఈ యాత్రలో, ముహమ్మద్ సాదిక్ బే ఇస్లామిక్ పవిత్ర స్థలాల వివరాలను సేకరించి, వాటిని ఫోటోలతో నమోదు చేసేవారు.

ఆ కాలంలో ఫోటోగ్రఫీ ఈనాటిలా అంత సులభం కాదు. పరిమిత సౌకర్యాలు ఉన్నప్పటికీ, ముహమ్మద్ సాదిక్ బే కాబా చారిత్రాత్మక ఫోటోను తీశారు.

ముహమ్మద్ సాదిక్ బే కేవలం ఒక సైనిక అధికారి మాత్రమే కాదు, ఆయనకు సైన్స్, పరిశోధన మరియు కళల పట్ల కూడా తీవ్రమైన ఆసక్తి ఉండేది. ముహమ్మద్ సాదిక్ బే కు తన కాలంలోని అత్యంత అధునాతన కెమెరాలు మరియు ఫోటోగ్రాఫిక్ పరికరాలు అందుబాటులో ఉండేవి.

మదీనా నుండి మక్కాకు యాత్రికుల బృందంతో బయలుదేరినప్పుడు, ముహమ్మద్ సాదిక్ బే మనసులో ఒక నిర్దిష్ట లక్ష్యం ఉండేది. భవిష్యత్ తరాలు ఈ చారిత్రక దృశ్యాలను చూడగలిగేలా, ఆ పవిత్ర యాత్ర మరియు ఇస్లామిక్ ప్రదేశాల ఛాయాచిత్రాల రికార్డును భద్రపరచాలని ముహమ్మద్ సాదిక్ బే కోరుకున్నారు.

 

1881లో, ముహమ్మద్ సాదిక్ బే కాబా యొక్క ఒక చారిత్రక ఛాయాచిత్రాన్ని తీశారు, అందులో దాని నల్లని తేరా/కవర్ కనిపిస్తుంది. ఈ కవర్ పై ఖురాన్‌లోని ఆయతులు  బంగారు అక్షరాలతో చెక్కబడి ఉన్నాయి. సౌదీ అరేబియాలో తీసిన మొట్టమొదటి ఛాయాచిత్రం ఇదే కాబట్టి, ఈ ఛాయాచిత్రాన్ని ఛాయాచిత్ర చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా పరిగణిస్తారు.

ముహమ్మద్ సాదిఖ్ బే కైరోలో జన్మించారు. ముహమ్మద్ సాదిక్ బే ఛాయాచిత్రాలు ఇస్లామిక్ చరిత్ర మరియు ఛాయాచిత్ర రంగంలో ఇప్పటికీ ఒక విలువైన వారసత్వంగా నిలిచి ఉన్నాయి.

 కాబా  ఛాయాచిత్రం చరిత్రకు సంబంధించిన ఒక అమూల్యమైన నిధి. ఇస్లాంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశాన్ని ప్రపంచం మొదటిసారిగా ఒక ఛాయాచిత్రంలో చూసింది.కాబా ఛాయాచిత్రం ఇస్లామిక్ చరిత్రలోనే కాకుండా ఛాయాచిత్ర ప్రపంచంలో కూడా ఒక మైలురాయిగా నిలిచింది.మహ్మద్ సాదిక్ బే చేసిన ఈ కృషి భవిష్యత్ తరాలకు ఒక విలువైన వారసత్వంగా నిలిచింది.

కాబా చారిత్రక ఛాయాచిత్రాన్ని చూసినప్పుడు, 160 ఏళ్ల క్రితం నాటి దృశ్యం వారి కళ్ల ముందు సజీవంగా నిలిచినట్లుగా అనిపిస్తుంది.

 

 

21 May 2026

జాఫర్ అన్సారీ మ్యూజియం-ఇండోర్ Zafar Ansari Museum-Indore

 

Zafar Ansari Museum Of in Ashirwad SBI Colony, Indore - Best Interior  Decorators For Art Gallery in Indore - Justdial

ఇండోర్, మధ్యప్రదేశ్:

ప్రపంచవ్యాప్తంగా మే 18న జరుపుకునే అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా, 2026 కోసం ప్రకటించిన ఇతివృత్తం, “విడిపోయిన ప్రపంచాన్ని ఏకం చేయడం మ్యూజియంల పాత్ర గురించి తెలియజేస్తుంది. మ్యూజియంలు జ్ఞాపకాలు, వారసత్వం మరియు గుర్తింపు ద్వారా తరతరాలను కలుపుతూనే ఉన్నాయి.

చరిత్రకారుడు జాఫర్ అన్సారీ, ఇండోర్‌లో, 1992లో ఒక చిన్న వ్యక్తిగత సేకరణ నేడు ఇండోర్ నగరం యొక్క అతిపెద్ద ఆర్కైవ్‌లలో ఒకటిగా మారింది. ఇది ఇండోర్ మరియు హోల్కర్ రాజవంశానికి సంబంధించిన 15,000కు పైగా అరుదైన వస్తువులను భద్రపరుస్తోంది.

ఒకప్పుడు ఇండోర్‌లో కృష్ణపురలో దాని మొదటి మ్యూజియం ఉండేది.ఆధునిక మ్యూజియంలు స్థాపించబడటానికి చాలా కాలం ముందే, ఇండోర్‌లో మ్యూజియం ఒకటి స్థాపించబడింది.

1923లో, మహారాజా తుకోజీరావు హోల్కర్ III కృష్ణపురలో నర రత్న మందిరాన్ని ఇండోర్ నగరపు మొదటి మ్యూజియంగా స్థాపించారు. స్వాతంత్ర్యం తర్వాత, అక్కడ ఉన్న చారిత్రక వస్తువులను జంతుప్రదర్శనశాల సమీపంలోని సెంట్రల్ మ్యూజియంకు తరలించారు, మరియు ఆ పాత భవనాన్ని తరువాత ప్రఖ్యాత కళాకారుడు డి.డి. దేవాలికర్‌కు అంకితం చేస్తూ దేవాలికర్ కళా వితికగా మార్చారు.

చరిత్రకారుడు జాఫర్ అన్సారీ 1992 జనవరి 12న చారిత్రక సామగ్రిని సేకరించడం ప్రారంభించారు.పాత నాణేలు, రాజరిక పత్రాలు, పటాలు మరియు ఛాయాచిత్రాలను అనేక కుటుంబాలు నిరుపయోగమైనవిగా భావిస్తున్న సమయంలో, ఇండోర్ యొక్క మరచిపోయిన గతాన్ని కాపాడటానికి జాఫర్ అన్సారీ నగరాల అంతటా పర్యటించడం, సేకర్తలు, చరిత్రకారులు మరియు పురాతన వస్తువుల వ్యాపారులను కలవడం ప్రారంభించారు.

దశాబ్దాలుగా, అన్సారీ సేకరణ ఇండోర్ నగరం యొక్క దాదాపు 300 సంవత్సరాల ప్రయాణాన్ని కవర్ చేసే ఒక భారీ ఆర్కైవ్‌గా విస్తరించింది. నేడు, అన్సారీ ఆర్కైవ్ మ్యూజియం, ఆర్కైవ్స్ మరియు లైబ్రరీ అనే మూడు విభాగాలుగా విభజించబడింది.

అన్సారీ మ్యూజియంను 20 నేపథ్య గ్యాలరీలుగా రూపొందించారు, వీటిలో ప్రతి ఒక్కటీ ఇండోర్ యొక్క సామాజిక, సాంస్కృతిక మరియు రాజకీయ పరిణామంలోని ఒక విభిన్న అధ్యాయాన్ని వివరిస్తుంది.

ఆర్కైవ్ కేవలం రాజరిక చరిత్రకు మాత్రమే పరిమితం కాదు. అన్సారీ 19వ మరియు 20వ శతాబ్దాలలో ఇండోర్‌లో ప్రచురించబడిన అరుదైన వార్తాపత్రికలు మరియు పత్రికలను కూడా భద్రపరిచారు. ఇవి ఇండోర్ నగరం సామాజికంగా మరియు రాజకీయంగా ఎలా పరిణామం చెందిందో తెలిపే ఒక కాలక్రమాన్నివివరిస్తున్నాయి..

జాఫర్ అన్సారీ సేకరణలో 1918 మరియు 1935లో మహాత్మా గాంధీ ఇండోర్ పర్యటనలకు సంబంధించిన ఛాయాచిత్రాలు, పత్రాలతో పాటు, ఇండోర్ ఘరానాతో సంబంధం ఉన్న సంగీత దిగ్గజాల అరుదైన 78 RPM రికార్డులు కూడా ఉన్నాయి. ఇండోర్‌తో గాఢంగా అనుబంధం ఉన్న లతా మంగేష్కర్ మరియు కిషోర్ కుమార్‌లకు సంబంధించిన జ్ఞాపకాలు కూడా ఆర్కైవ్‌లో భాగంగా ఉన్నాయి.

వేలాది హోల్కర్ స్టేట్ గెజెట్‌లు, ఇండోర్‌పై పుస్తకాలు, నగరం యొక్క పత్తి మరియు నల్లమందు వ్యాపార రికార్డులు, మరియు వారసత్వ భవనాల నమూనాలను కూడా అన్సారీ జాగ్రత్తగా భద్రపరిచారు.

ఇండోర్ నగర చరిత్రను పరిరక్షించడం కోసం అపారమైన వ్యక్తిగత త్యాగం చేయాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో, ఆర్కైవ్‌ను నిలబెట్టడం కోసం జాఫర్ అన్సారీ తన సొంత ఇంటిని కూడా అమ్ముకున్నారు.

ఇండోర్‌లోని జాఫర్ అన్సారీ మ్యూజియం సేకరణ లో , సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ పర్యటన కోసం యశ్వంతరావు హోల్కర్ పంపిన మే 7, 1949 నాటి అరుదైన ఆహ్వాన పత్రిక కూడా కలదు.  ఇక్కడ ప్రదర్శించారు. జాఫర్ అన్సారీ తన సంపాదనలో దాదాపు 70 శాతాన్ని చారిత్రక వస్తువులను సేకరించడం, పునరుద్ధరించడం మరియు భద్రపరచడం కోసమే ఖర్చు చేస్తున్నారు. జాఫర్ అన్సారీ తన మ్యూజియంను 'ఇండోర్ ప్రజలకు చెందిన ఒక ప్రజా సేకరణ'గా అభివర్ణిస్తారు.

వస్తువులను సేకరించడమే కాకుండా, నగర వారసత్వంతో ప్రజలను అనుసంధానించడానికి అన్సారీ నిరంతరం కృషి చేశారు. దశాబ్దాలుగా, జాఫర్ అన్సారీ ఇండోర్ అంతటా హెరిటేజ్ వాక్స్ నిర్వహిస్తూ, విద్యార్థులకు మరియు నివాసితులకు మరుగునపడిన భవనాలు, పాత మార్కెట్లు మరియు హోల్కర్-యుగం వాస్తుశిల్పాన్ని పరిచయం చేస్తున్నారు.

ఇండోర్‌లో హెరిటేజ్ వాక్ కోసం అంతర్జాతీయ ప్రతినిధి బృందం పర్యటన సందర్భంగా అన్సారీ అరుదైన కళాఖండాలను ప్రదర్శిoచారు. జాఫర్ అన్సారీ ఇండోర్ చరిత్ర మరియు సాంస్కృతిక వారసత్వంపై 300కి పైగా ఉపన్యాసాలు కూడా ఇచ్చారు.

నగరంలో జరిగిన జీ20 సదస్సు మరియు ప్రవాసి భారతీయ దివస్ వంటి అనేక ప్రధాన అంతర్జాతీయ కార్యక్రమాలలో జాఫర్ అన్సారీ సేకరణను ప్రదర్శించారు. ఉషా దేవి హోల్కర్ కూడా ఇండోర్ చారిత్రక వారసత్వాన్ని జాతీయ మరియు అంతర్జాతీయ వేదికలకు తీసుకువెళ్లడంలో ఆయన చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ ఒక లేఖ పంపారు.

చరిత్రకారుడు జాఫర్ అన్సారీ, G20 సదస్సు సందర్భంగా అర్జెంటీనా, జపాన్ మంత్రులతో సహా అంతర్జాతీయ ప్రతినిధుల ముందు, మరియు ఇండోర్‌లోని కృష్ణపుర ఛత్రిలో జరిగిన ప్రవాసి భారతీయ దివస్ కార్యక్రమంలో విదేశీ అతిథుల ముందు, తన వ్యక్తిగత సేకరణలోని హోల్కర్-యుగం నాటి అరుదైన చిత్రపటాలను, కళాఖండాలను ప్రదర్శించారు.

వారసత్వ ప్రియులు మరియు పరిశోధకులకు అన్సారీ, ఇండోర్ ‘టైమ్ మెషిన్’గా ప్రసిద్ధి చెందారు.అన్సారీ, భాండాగారంలోని ప్రతి పాత నాణెం, ఛాయాచిత్రం, చేతివ్రాత లేఖ, వార్తాపత్రిక క్లిప్పింగ్ అన్నీ ఇండోర్‌ను నిర్మించిన ప్రజల కథను తెలియజేస్తున్నాయి జాఫర్ అన్సారీ సేకరణ ఒక మ్యూజియంలా కాకుండా, ఇండోర్ తనను తాను గుర్తుచేసుకునేలా చేసే ఒక సజీవ కాలయంత్రంలా అనిపిస్తుంది.

 

మహమ్మద్ హాజీ సబూ సిద్ధిఖీ ముసాఫిర్‌ఖానా-ముంబై Mohammed Haji Saboo Siddique Musafirkhana-Mumbai

 


కచ్, గుజరాత్ / ముంబై, మహారాష్ట్ర :

 

20వ శతాబ్దం ప్రారంభంలో, బొంబాయి నగరానికి హజ్ యాత్ర కోసం స్త్రీపురుషులు వచ్చే వారు. 1909 ప్రాంతంలో – బొంబాయి భారతీయ హజ్ యాత్రికులకు ఒక ప్రధాన బయలుదేరే కేంద్రంగా మారింది. బ్రిటిష్ ఇండియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ నడిపే ఆవిరి నౌకలు హజ్ యాత్రికులను బొంబాయి నుండి జెడ్డాకు క్రమం తప్పకుండా తీసుకువెళ్లేవి. యాత్రికులు తరచుగా ప్రయాణం మొదలయ్యే వరకు నగరంలో రోజులు లేదా వారాల తరబడి వేచి ఉండవలసి వచ్చేది, బొంబాయి ఒక పవిత్ర యాత్రకు ముందు ఆత్రుతతో ఎదురుచూసే ప్రదేశంగా మారింది.

హజ్  యాత్రికులను ضیوف الرحمٰن — అంటే అల్లాహ్ అతిథులు అని పిలిచేవారు. వారికి సేవ చేయడం ఒక గౌరవంగా, ఆధ్యాత్మిక మరియు సామాజిక అర్థం ఉన్న ఒక గొప్ప కార్యం అని భావించేవారు. ఇస్లాం నైతిక చట్రంలో, ప్రజలకు సేవ చేయడం అనేది ఒక ఐచ్ఛిక సద్గుణంగా కాకుండా, ఒక బాధ్యతగా పరిగణించబడుతుంది. ప్రవక్త ముహమ్మద్ ఇలా అన్నారని చెప్పబడింది, "ఇతరులకు అత్యంత మేలు చేసేవారే ఉత్తమ ప్రజలు."

కచ్ ప్రాంతానికి చెందిన  గుజరాతీ మెమన్ వ్యాపారి  మహమ్మద్ హాజీ సబూ సిద్ధిఖీ  ప్రకారం హజ్ యాత్రికులకు సేవచేయడం ఒక నైతిక పిలుపు. హజ్ యాత్రికులు ضیوف الرحمٰن (దైవదూతలు)  కు  సేవచేయడం కోసం ఒక ముసాఫిర్ ఖనా నిర్మించాలని నిర్ణయించుకున్నారు.  మహమ్మద్ హాజీ సబూ సిద్ధిఖీ వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువగా తెలుసు.

మహమ్మద్ హాజీ సబూ సిద్ధిఖీ ఐదు లక్షల రూపాయల భారీ మొత్తo క్రాఫోర్డ్ మార్కెట్ సమీపంలో, రైలు మార్గాలకు దగ్గరగా, బొంబాయి పోర్టుకు అందుబాటులో బొంబాయి లో ఒక ముసాఫిర్‌ఖానా నిర్మించడానికి పూనుకొన్నారు. మహమ్మద్ హాజీ సబూ సిద్ధిఖీ నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించారు – అదే మహమ్మద్ సబూ సిద్ధిఖీ ముసాఫిర్‌ఖానా. అది వైభవం కోసం నిర్మించబడలేదు. ఒక ప్రయోజనం కోసం నిర్మించబడింది. ముసాఫిర్‌ఖానాలో గదులు, ప్రాథమిక సౌకర్యాలు, మరియు ప్రార్థన చేసుకోవడానికి ఒక స్థలం ఉండేవి.

మహమ్మద్ హాజీ సబూ సిద్ధిఖీ ముసాఫిర్‌ఖానా, ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి యాత్రికులకు సేవ చేస్తూనే ఉంది. ముసాఫిర్‌ఖానా వ్యవస్థాపకుడు మహమ్మద్ హాజీ సబూ సిద్ధిఖీ కన్నుమూసిన తర్వాత కూడా, అది ఒక సంరక్షణ కేంద్రంగా నిలిచింది.

మహమ్మద్ హాజీ సబూ సిద్ధిఖీ ఆశ్రయంతో పాటు, విద్యలో కూడా పెట్టుబడి పెట్టారు –ఎం.హెచ్. సబూ సిద్ధిఖీ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌ స్థాపించారు, ఇక్కడ యువత నైపుణ్యాలను సంపాదించి తమ భవిష్యత్తును నిర్మించుకోవచ్చు.

మహమ్మద్ హాజీ సబూ సిద్ధిఖీ ఆరోగ్య సంరక్షణ వైపు కూడా దృష్టి సారించారు. వైద్య సంరక్షణ అందుబాటు తక్కువగా ఉన్న పేద మహిళల కోసం సబూ సిద్ధిఖీ బొంబాయి అంతటా ఆరు ప్రసూతి గృహాలను నిర్మించారు. కాలక్రమేణా, ఈ ప్రసూతి గృహాలు నగర ప్రజారోగ్య వ్యవస్థలో భాగమయ్యాయి, వాటిని బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ స్వాధీనం చేసుకుని నిర్వహించింది మరియు అటువంటి సంస్థలలో ఒకటైన మహమ్మద్ హాజీ సబూ సిద్ధిఖీ ప్రసూతి గృహం, ప్రభాదేవిలోని మున్సిపల్ రికార్డులలో ఇప్పటికీ నమోదై ఉంది. ఇమామ్‌వాడలోని మరొకటి, తరువాత ఎం.హెచ్. సబూ సిద్ధిఖీ ప్రసూతి & జనరల్ ఆసుపత్రిగా అభివృద్ధి చెంది, ప్రజలకు సేవలు అందిస్తూనే ఉంది.

మహమ్మద్ హాజీ సబూ సిద్ధిఖీ సంవత్సరాలు గడిచేకొద్దీ, ప్రయాణ స్వరూపం మారింది. ఓడల స్థానంలో విమానాలు వచ్చాయి., ఒకప్పుడు యాత్రికులకు ఆశ్రయం ఇచ్చిన ముసాఫిర్‌ఖానా ఇప్పుడు, విద్యాన్వేషణలో నగరానికి వచ్చిన యువకులకు ఆతిథ్యం ఇవ్వడం ప్రారంభించింది

 

20 May 2026

బాలీవుడ్‌కు ముందు, భారతదేశపు మొట్టమొదటి సినిమా హాల్‌ను కోల్‌కతా నగరం నిర్మించింది Before Bollywood, Kolkata city-built India’s first cinema hall

 

India 


దేశంలోనే మొట్టమొదటి సినిమా హాల్ 100 సంవత్సరాల క్రితం కోల్‌కతాలో ప్రారంభమైంది.భారతదేశపు మొట్టమొదటి సినిమా హాల్ వాస్తవానికి 1907లో కోల్‌కతాలో నిర్మించబడింది. ఆ థియేటర్‌ను చాప్లిన్ సినిమా అని పిలిచేవారు, దీని అసలు పేరు ఎల్ఫిన్‌స్టోన్ పిక్చర్ ప్యాలెస్.ఇది కోల్‌కతాలోని 5/1 చౌరింగీ ప్లేస్‌లో ఉండేది

జంషెడ్జీ ఫ్రామ్జీ మదన్ చాప్లిన్ సినిమా థియేటర్‌ను స్థాపించారు. జంషెడ్జీ ఫ్రామ్జీ మదన్ ను భారతదేశంలో సినిమా నిర్మాణ పితామహుడిగా పిలుస్తారు.

వినోద రంగంలోకి ప్రవేశించడానికి ముందు మదన్ ఒక డ్రామా క్లబ్‌లో సహాయకుడిగా తన వృత్తిని ప్రారంభించారు. 1902లో, జంషెడ్జీ ఫ్రామ్జీ మదన్ కలకత్తా చుట్టుపక్కల ఉన్న బహిరంగ ప్రదేశాలలో బయోస్కోప్ చిత్రాలను ప్రదర్శించడం ప్రారంభించారు. 1907లో జంషెడ్జీ ఫ్రామ్జీ మదన్ ఎల్ఫిన్‌స్టోన్ పిక్చర్ ప్యాలెస్‌ను ప్రారంభించారు.

తరువాత, జంషెడ్జీ ఫ్రామ్జీ మదన్ భారతదేశపు మొట్టమొదటి ప్రధాన సినిమా చైన్ అయిన మదన్ థియేటర్స్‌ను కూడా స్థాపించారు. మదన్ థియేటర్స్‌ సంస్థ దేశవ్యాప్తంగా 100కు పైగా థియేటర్లను కలిగి ఉoడేది.

సంవత్సరాలు గడిచేకొద్దీ, ఎల్ఫిన్‌స్టోన్ పిక్చర్ ప్యాలెస్‌ ను పునరుద్ధరించి, మినర్వా సినిమాగా పేరు మార్చారు. ఇది ముఖ్యంగా హాలీవుడ్ చిత్రాలను ప్రదర్శించడంలో ప్రసిద్ధి చెందింది మరియు కోల్‌కతాలో పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించింది. 1980వ దశకంలో, దిగ్గజ నటుడు చార్లీ చాప్లిన్ గౌరవార్థం ఈ థియేటర్‌కు చాప్లిన్ సినిమా అని పేరు మార్చారు.

చాప్లిన్ సినిమా థియేటర్ అనేక సంవత్సరాల పాటు మనుగడ కోసం పోరాడింది. చివరకు, 2013లో చాప్లిన్ సినిమా భవనాన్ని కూల్చివేశారు. నేడు, భారతదేశపు మొట్టమొదటి సినిమా హాలు వెలసిన ప్రదేశంలో 'చార్లీ చాప్లిన్ స్క్వేర్' కొలువై ఉంది.