27 March 2023

సెహ్రీ ఖాన్‌లు, రంజాన్ సందర్భంగా ముస్లింలను నిద్రలేపే ఇస్లామిక్ సంప్రదాయాన్ని సజీవంగా ఉంచారు Sehri Khans keep alive Islamic tradition of waking up Muslims during Ramazan

 

మిడిల్ ఈస్ట్ మరియు అరబ్ ప్రాంతాలలో మాసహారతి Masaharatis అని పిలువబడే సెహ్రీ ఖాన్‌లు, రంజాన్ సెహ్రీ కోసం ముస్లింలను మేల్కొలపడం చేస్తారు.

మాసహారతి అంటే పవిత్ర మాసం రంజాన్ లో ఉపవాసం ఉన్నవారిని మేల్కొల్పేవారు. భారతదేశం మరియు దక్షిణాసియా ప్రాంతంలో, వారిని సెహ్రీ ఖాన్ అని పిలుస్తారు.

ఆధునిక సాంకేతికత యుగం లో కూడా ఈ సంప్రదాయం సజీవంగా కొనసాగుతోంది. ముస్లిం సంప్రదాయాలు మరియు సంస్కృతిని కాపాడటం మరియు చరిత్రను స్మరించుకోవడంలో భాగంగా ప్రజలు దీనిని చూస్తారు మరియు ఇష్టపడతారు.

రంజాన్ సందర్భంగా, సెహ్రీ ఖాన్‌లు తెల్లవారుజామున ఉపవాసం ఉన్నవారు నిద్ర నుండి లేచి, సెహ్రీని సిద్ధం చేసేందుకు తమ డ్రమ్‌ల బీట్‌కు అనుగుణంగా  స్థానిక పాటలు పాడతారు. ఇప్పటికీ చాలా మంది పాత కాలపు వారు షెరీ ఖాన్‌ల పిలుపు “నిద్ర నుండి లేవండి” కోసం  వేచి ఉంటారు,

అయితే, మాసహారతి Masaharatis లేదా సెహ్రీ ఖాన్‌ సంప్రదాయానికి మధ్యప్రాచ్యంలో మరియు టర్కీ మరియు ఈజిప్ట్ వంటి దేశాలలో ప్రాముఖ్యత ఇవ్వబడింది; రంజాన్ సందర్భంగా ఉదయం వేకప్ కాల్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మాసహారతి Masaharatis లేదా సెహ్రీ ఖాన్‌ సంప్రదాయo అరబ్  దేశాలలో:

మదీనాలో:

ఇస్లామిక్ ప్రపంచంలో, రంజాన్ నెలలో ఉపవాసం ఉన్నవారిని తెల్లవారుజామున నిద్రలేపే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. హిజ్రీ 2వ సంవత్సరంలో ఉపవాసం తప్పనిసరి అయిన తరువాత, మదీనాలోని ప్రజలు తెల్లవారుజామున ప్రజలను ఎలా మేల్కొలపాలి అని తెలుసుకోవాలని భావించారు.

చారిత్రాత్మకంగా, మొదటి మాసహారతి Masaharatis లేదా సెహ్రీ ఖాన్‌ హజ్రత్ బిలాల్ హబాషి అని అందరికి తెలుసు. ఇస్లాం యొక్క మొదటి మ్యూజిన్ muezzin అయిన హజ్రత్ బిలాల్‌కు తెల్లవారుజామున ప్రార్థనల కోసం ముస్లింలను మేల్కొలిపే పనిని అప్పగించారు. ఉపవాస దీక్ష కోసం తెల్లవారుజామున మదీనా వీధుల్లో ఆధ్యాత్మిక స్వరం వినిపించిన తొలి వ్యక్తి హజ్రత్ బిలాల్.

సెహ్రీ కోసం ప్రజలను మేల్కొలపడానికి మాసహారతి Masaharatis లేదా సెహ్రీ ఖాన్‌ వారు పట్టణాలు మరియు నగరాల చుట్టూ తిరిగేటప్పుడు మండే కట్టెలను burning sticks మోసుకెళ్లేవారు. ఈ పద్ధతి మదీనాలో ప్రాచుర్యం పొందింది మరియు కాలక్రమేణా చాలా మంది ప్రజలు కూడా దీనిని అనుసరించారు.

మదీనా తర్వాత, మాసహారతి Masaharatis లేదా సెహ్రీ ఖాన్‌ బృందం అరేబియాలోని ఇతర నగరాల్లోని ప్రజలను కూడా మేల్కొల్పింది. ప్రజలు ఈ సంప్రదాయాన్ని అనుసరించడం ప్రారంభించారు మరియు ఇది ఇస్లామిక్ ప్రపంచం అంతటా వ్యాపించింది. మక్కాలో మాసహారతిని జంజామి Zamzami అంటారు. జంజామి Zamzami ఒక లాంతరు తీసుకొని నగరం చుట్టూ తిరుగుతాడు, తద్వారా వ్యక్తి శబ్దానికి మేల్కొనకపోతే, జంజామి లాంతరు  కాంతికి మేల్కొంటాడు.


సుడాన్లో:

మాసహారతి తెల్లవారుజామున ప్రార్థనల సమయంలో పిలవాలనుకున్న వ్యక్తులందరి జాబితాను కలిగి ఉన్న ఒక పిల్లవానితో  కలిసి సుడాన్ వీధుల్లో తిరుగుతాడు. మాసహారతి-పిల్లవాని  ద్వయం ప్రతి ఇంటి ముందు నిలబడి ఉపవాసం కోసం ఆ ఇంటి వాసుల పేరును పిలుస్తుంది మరియు వారు వీధి మూలలో నిలబడి, డ్రమ్ యొక్క బీట్‌తో అల్లాను స్తుతిస్తారు. రంజాన్ మాసం చివరిలో, ప్రజలు వారికి బహుమతులు ఇస్తారు.


టర్కీ లో:

టర్కీలో, ఉపవాసం ఉన్న ముస్లింలను తెల్లవారుజామున డప్పులు వాయిస్తూ నిద్రలేపే సంప్రదాయం ఇప్పటికీ సజీవంగా ఉంది మరియు అది టర్కీ సంస్కృతిలో భాగమైంది. రంజాన్ చంద్రుడు కనిపించిన వెంటనే, డప్పులు వాయిస్తూ ఇతరులను నిద్రలేపే వాలంటీర్లు, పవిత్ర మాస ఆగమనాన్ని సూచించడానికి సాంప్రదాయ దుస్తులలో మసీదుల ప్రాంగణంలో గుమిగూడి డప్పులు వాయిస్తారు.

సెహ్రీలో డ్రమ్స్ వాయించే ఈ సంప్రదాయం ఒట్టోమన్ కాలిఫేట్ యుగంలో టర్కీకి వచ్చింది. ప్రస్తుత ఆధునిక టర్కీలో, ఈ సంప్రదాయాలు అధికారిక స్థాయిలో ఆదరించబడుతున్నాయి. దీంతో సెహ్రీకి డ్రమ్మర్‌ల సంఖ్య ఏటా పెరుగుతోంది. రంజాన్‌లో ఇతరులను మేల్కొలిపే టర్కీ కళాకారుల కు (నిద్రలేపే వాలంటీర్లు) అధికారిక జీతం లేదా వేతనాలు లభించవు, కానీ ప్రజలు డబ్బును బహుమతిగా ఇవ్వడానికి సంతోషిస్తారు మరియు వారు దానిని 'క్షమాపణ కోరే బహుమతి'గా భావిస్తారు. రంజాన్ ప్రారంభంలో, ఒట్టోమన్-యుగం దుస్తులలో టర్కిష్ డ్రమ్మర్లను  ఇస్తాంబుల్ చుట్టూ చూడవచ్చు. టర్కీలో తెల్లవారుజామున ముస్లింలను మేల్కొలపడంలో 2,000 కంటే ఎక్కువ డ్రమ్మర్ గ్రూపులు ఉన్నాయి.

మీకు ఆశ్చర్యం కలగవచ్చు కానీ ఈజిప్టులో ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు తెల్లవారుజామున తన ప్రజలను మేల్కొలపడానికి రాత్రిపూట బయటకు వెళ్లేవాడు. ఈ పాలకుని  చరిత్రలో ఉత్బా ఇబ్న్ ఇషాక్ అని పిలుస్తారు. 19వ శతాబ్ద కాలంలో ఉత్బా ఇబ్న్ ఇషాక్ కైరో వీధుల్లో తిరిగి "నిద్రపోతున్న వారు లేచి అల్లాను ఆరాధించండి" అంటూ ప్రజలను కవితాత్మకంగా మేల్కొలిపిన మొదటి వ్యక్తి.

భారతదేశం మరియు పాకిస్తాన్‌లో కొంతమంది షరాబ్‌లు Shahrabs ఉదయాన్నే నిద్రలేచి పాటలు మరియు కీర్తనలు పాడుతూ అందరిని లేపడం మన అందరికి తెలుసు. కాలక్రమేణా వారి సంఖ్య తగ్గింది.

తరావీహ్ ప్రార్థనలు గురించి తెలుసుకోవలసినది All you need to know about taraweeh prayers

 



తరావీహ్ ప్రార్థన రంజాన్ నెల రాత్రులలో జరిపే ప్రత్యేక ప్రార్ధనలలో ఒకటి.

పవిత్ర రంజాన్ మాసంలో, ముస్లింలు ప్రతి రోజు, ఇషా నమాజ్  తర్వాత తారావీహ్ అని పిలువబడే ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.రంజాన్ నెలలో, ముస్లింలు అనేక ఐచ్ఛిక రకాత్ ప్రార్థనలను చేయడానికి మరియు దివ్య ఖురాన్ పఠనాన్ని వినడానికి రాత్రిపూట ప్రార్ధన వరుసలో ఉంటారు.

తారావీహ్ అనేది అరబిక్ పదం నుండి ఉద్భవించింది, దీని అర్థం "విశ్రాంతి మరియు రిలాక్స్ “to rest and relax आराम और ठहरना ", ఇది ఇస్లామిక్ ధ్యానం యొక్క ప్రత్యేక రూపంగా పరిగణించబడుతుంది. 

తరావీహ్ మూలాలు:

తన జీవితపు చివరి సంవత్సరంలో, ప్రవక్త ముహమ్మద్ (స) ఒక రాత్రి బయటకు వచ్చి తరావీహ్ నమాజు చేసారు. ఆ రాత్రి, కొంతమంది ప్రవక్త(స)తో కలిసి ప్రార్థించారు. రెండవ రాత్రి సమయంలో, ఎక్కువ మంది ప్రజలు తరావీహ్‌లో చేరారు. మూడవ రాత్రి కూడా మరింత ఎక్కువ మంది హాజరయ్యారు. నాల్గవ రాత్రి, మసీదు నిండిపోయింది మరియు ప్రజలు ప్రవక్త(స) రాక కోసం వేచి ఉన్నారు.

అయితే ప్రవక్త(స)  మసీదు కు రాకుండా ఇంట్లో స్వయంగా ప్రార్థనలు చేశారు. మరుసటి రోజు ఫజ్ర్ తర్వాత, ప్రవక్త(స)ఇలా అన్నారు: "మీకు ఇది విధిగా చేయబడుతుందని నేను భయపడ్డాను తప్ప మీ వద్దకు బయటకు రాకుండా ఏదీ నన్ను నిరోధించలేదు." (ముస్లిం)

ఖలీఫా అబూ బకర్ కాలం నుండి ఖలీఫా ఉమర్  కాలం ప్రారంభం వరకు, ప్రజలు వ్యక్తిగతంగా లేదా చిన్న సమూహాలలో తరావీహ్ ప్రార్థనలు చేసేవారు. తరువాత, ఖలీఫ్ ఉమర్ ఒక ఇమామ్ వెనుక అందరినీ నిలబెట్టారు  వారు 8 రకాత్లు నమాజు చేశారు. చివరికి, అది 20 రకాత్‌లకు పెంచారు.

 రావీహ్-రకాత్‌ల సంఖ్య:

సహీహ్ అల్ బుఖారీ హదీసు ప్రకారం, తరావీహ్ నమాజు ఎనిమిది రకాతులు. ప్రవక్త (స) ఎనిమిది రకాతుల తరావీహ్ నమాజుకు నాయకత్వం వహించారు. తరావీహ్ ప్రార్థనలో  చిన్నది రెండు రకాత్‌లు మరియు పెద్దది 20 రకాత్‌లు.

ఖలీఫ్ ఒమర్ బిన్ అబ్దులాజీజ్ (క్రీ.శ. 717 నుండి 720) కాలంలో మదీనా ప్రజలు 36 రకాత్‌ల తరావీహ్ నమాజును పాటించారు.

తరావీహ్ యొక్క బహుమతులు:


తరావీహ్ నమాజు చేయడం వల్ల అనేక ప్రతిఫలాలు ఉన్నాయి. ప్రవక్త(స) ఇలా అన్నారు: "ఎవరైతే రంజాన్ సమయంలో ప్రార్థన (రాత్రి ప్రార్థన) కోసం ఈమాన్ (విశ్వాసం)తో, ప్రతిఫలం కోసం ఎదురు చూస్తాడో, అతని/ఆమె మునుపటి పాపాలన్నీ క్షమించబడతాయి." (బుఖారీ మరియు ముస్లిం)

రంజాన్ మాసంలో సత్కార్యాలకు ఎక్కువ ప్రతిఫలం లబించడం తో తరావీహ్ యొక్క ప్రతిఫలం మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రవక్త ఇలా అన్నారు: “(ఈ నెల)లో ఏదైనా (ఐచ్ఛిక) సత్కార్యాలు చేయడం ద్వారా ఎవరైనా (అల్లాహ్‌కు) చేరువ అవుతారో, వారు ఏ సమయంలోనైనా విధిగా(ఫర్జ్) చేసిన పనికి సమానమైన ప్రతిఫలాన్ని అందుకుంటారు మరియు విధిగా obligatory, విధిని నిర్వర్తించే obligatory deed వారు ( ఈ నెల) ఏ సమయంలోనైనా డెబ్బై బాధ్యతలను నిర్వర్తించినందుకు ప్రతిఫలాన్ని అందుకుంటారు.-ఇబ్న్ ఖుజమా ibnKhuzaymah)

 

మసీదు లేదా ఇంటి వద్ద తరావీహ్‌ప్రార్థనలు:

తరావీహ్‌ను మసీదులలో ప్రార్థన చేయడం వల్ల ఇంట్లో చేయడం కంటే ఎక్కువ రివార్డులు లభిస్తాయి. తరావీహ్‌ను ఇంట్లో, ఒంటరిగా లేదా కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ప్రార్థన చేయవచ్చు.


తరావిహ్-హదీసులు:

ప్రవక్త(స) రంజాన్లో తరావిహ్ ఆచరించారు మరియు తన సహచరులను కూడా దీనిని చేయమని ప్రోత్సహించారు.

·        "అల్లాహ్ రంజాన్ మాసo లో ఉపవాసం  మీపై విధిగా చేసాడు మరియు రాత్రులలో ప్రార్థనలో పాల్గోవటం  ఒక అభ్యాసం" అని ప్రవక్త (స) చెప్పారు అని అబ్దుల్-రౌమాన్ ఇబ్న్ -అఫ్ (ర) వివరించారు.

·        ప్రవక్త(స) తన సహచరులందరినీ రాత్రిపూట ప్రార్థనలో పాల్గొనమని ప్రోత్సహించారని అబూ హురైరా వివరించాడు.

·        ప్రవక్త (స) ఇంకా ఇలా అంటారు, "రంజాన్ సందర్భంగా రాత్రి ప్రార్థనలో ఎవరైతే విశ్వాసం మరియు ప్రతిఫలం ఆశించి పాల్గొంటారో, వారి మునుపటి పాపాలు క్షమించబడతాయి."

అల్లాహ్(SWT)  మనకు మార్గనిర్దేశం చేసి, ఈ ఆశీర్వాద నెల నుండి ఎక్కువ ప్రయోజనాలను పొందటానికి మరియు మన పాపాలన్నిటిని క్షమించి, మనకు సహాయo చేయుగాక.

 

-గల్ఫ్ న్యూస్ సౌజన్యం తో

 

25 March 2023

భెండీ బజార్ Bhendi Bazaar

 

 

"భేండీ బజార్‌” అనే పేరు ఎప్పుడైనా విన్నారా!

"భేండీ బజార్‌” అనగానే ముంబై లో అండర్ వరల్డ్ మరియు భయంకరమైన మాఫియాకు స్థావరం అని గుర్తుకు వస్తుంది. కాని  భేండీ బజార్,  ముంబై కు వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా  సందర్శించవలసిన ప్రదేశాలలో ఒకటి.  

"భేండీ బజార్‌” కవిత్వం మరియు సాహిత్య ప్రపంచంలో కొన్ని ఉన్నతమైన పేర్లతో పాటు హిందీ సినిమా రంగం లోని -ప్రముఖ కవి మరియు పాటల రచయిత షకీల్ బదయుని, మాంటో, కైఫీ అజ్మీ, మహ్మద్ రఫీ, మజ్రూహ్ సుల్తాన్‌పురి, జన్ నిసార్ అక్తర్, సాహిర్ లుధియాన్వి వంటి కొందరు ప్రముఖుల నివాస స్థలంగా ఉంది. "భేండీ బజార్‌” సాహిత్యం, సినిమా మరియు కళలకు అందించిన విశిష్ట సహకారo ముఖ్యమైనది కాని ఇది అంతగా తెలియని వాస్తవం.

భెండి బజార్‌లో మహమ్మద్ అలీ రోడ్, జకారియా మసీదు, డోంగ్రీ, నాగ్‌పడా, మదనపురా మరియు మోమిన్‌పురా ప్రాంతాలు ఉన్నాయి.భేండీ బజార్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో వివరించే రెండు సిద్ధాంతాలు కలవు. ఒక సిద్ధాంతం ప్రకారం మహారాష్ట్ర స్టేట్ గెజిట్‌లో డోంగ్రీ యొక్క వాయువ్యంలో 'స్పెసియా పాపుల్నియా' లేదా 'భెందీ'(బెండకాయ) తోటలు ఉన్నాయని పేర్కొనబడింది.

మరొక సిద్ధాంతం ఏమిటంటే, 1803లో బ్రిటీష్ ఫోర్ట్ ఏరియాలో అగ్నిప్రమాదం సంభవించింది మరియు నివాసితులు 'బజార్ వెనుక' ప్రాంతంలో పునరావాసం పొందారు. బిహైండ్ ది బజార్కాలక్రమంలో భేండీ బజార్‌గా మారిపోయింది. దశాబ్దాలుగా భేండీ బజార్ భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై లో కళాకారులు మరియు సాహితీవేత్తలతో పాటు  ముమ్మర ఆర్థిక మరియు వ్యాపార కేంద్రంగా కూడా ఉంది.

భేండి బజార్‌ లో హిందువులు, ముస్లింలు, పార్సీలు మరియు యూదులు నివసించేవారు. భేండి బజార్‌-ముంబైలో ఒకప్పుడు గణనీయమైన సంఖ్యలో యూదులకు నిలయంగా ఉంది. భేండి బజార్‌ లో 1940లు మరియు 1950ల వరకు యూదులు అధికంగా ఉండేవారు. ముంబై యొక్క సాంస్కృతిక సంపదకు యూదులు గణనీయమైన సహకారం అందించారు. నాగ్‌పడాలో పద్మాకర్ తుకారాం మనే గార్డెన్‌ అనే పార్క్ ఉంది. పద్మాకర్ తుకారాం మనే గార్డెన్‌ ఒకప్పుడు యూదుల శ్మశానవాటిక.

పద్మాకర్ తుకారాం మనే గార్డెన్‌ పక్కన మీర్జా గాలిబ్ యొక్క అందమైన కుడ్యచిత్రం ఉంది. ఒక సమయంలో, జాకబ్ సర్కిల్ నుండి మసీదు వరకు ఆరు ప్రార్థనా మందిరాలు విస్తరించి ఉన్నాయి. భేండి బజార్‌ లోని యూదులు, పార్సీలు, ముస్లింలు మరియు హిందువుల మధ్య సంబంధాలు చాలా స్నేహపూర్వకంగా ఉన్నాయి మరియు భేండి బజార్‌ ప్రాంతం మిశ్రమ సంస్కృతికి దారితీసింది.

భేండీ బజార్‌లో 1796లో షార్ హరహమిన్ Shaar Harahamin నిర్మించిన పురాతన బెనే ఇజ్రాయెలీ ప్రార్థనా మందిరం Bene Israeli synagogue ఉంది. దీనిని టిప్పు సుల్తాన్‌కు వ్యతిరేకంగా బ్రిటిష్ సైన్యంలో పనిచేసిన బెనే ఇజ్రాయెల్ Bene Israel అయిన శామ్యూల్ ఎజికిల్ దివేకర్ స్వయంగా నిర్మించారు. సినాగోగ్(యూదుల ప్రార్ధన మందిరం) Synagogue ఉన్న వీధికి శామ్యూల్ స్ట్రీట్ అని పేరు పెట్టారు. స్థానిక బెనే ఇజ్రాయెల్ భాషలో 'మషిద్' అని పిలువబడే  ప్రార్థనా మందిరం పేరుమీద మస్జిద్ బందర్ స్టేషన్‌కు పేరు పెట్టారు. మరాఠీ మాట్లాడే బెనే ఇజ్రాయిలీలు వందల సంవత్సరాలుగా కొంకణ్ తీరంలోని గ్రామాలు మరియు పట్టణాలలో నివసించారు. దాదాపు 2,200 సంవత్సరాల క్రితం నవ్‌గావ్ వద్ద కొంకణ్ తీరంలో ధ్వంసమైన  ఓడలో ఏడు జంటలు ఉన్నట్లు చరిత్రను గుర్తించింది, యూదులు పాలస్తీనాలోని సెల్యూసిడ్‌ Seleucids లచే హింసను ఎదుర్కొన్నారు. కొంకణ్ తీరంలోని గ్రామాలలోని బెనే ఇజ్రాయిలీలకు వారు నివసించే గ్రామల  పేర్లకు చివరలో'కర్' ప్రత్యయం జోడించడం ద్వారా వారి నివాస స్థలాలను సూచించటం జరిగినది..

హిందీ సినిమాకు యూదుల సహకారం గుర్తించదగినది. బాలీవుడ్ భెండీ బజార్‌లో  “నాదిరా” వంటి కొంతమంది ప్రముఖ యూదు నటీమణులు నివసించారు. అదేవిధంగా, 'మేరా నామ్ చిన్ చిన్ చు' వంటి ప్రసిద్ధ పాటలలో, చాలా మంది నృత్యకారులు కూడా యూదులే. రూబీ మైయర్స్ అకా సులోచన, ఎజ్రా మీర్, ఎస్తేర్ విక్టోరియా అబ్రహం అకా ప్రమీల, రాచెల్ హయామ్ కోహెన్ అకా రమోలా, డేవిడ్ అబ్రహం చెయుల్కర్ వంటి ప్రముఖ యూదు నటి-నటులు,  రచయిత జోసెఫ్ డేవిడ్ పెంకర్ మరియు దర్శకుడు హన్నాక్ ఐజాక్ సామ్కార్ వంటివారు ఇతర యూదు  ప్రముఖులు.

చారిత్రాత్మకంగా బాలీవుడ్‌తో పాటు, యూదు  కమ్యూనిటీ బొంబాయి అభివృద్ధికి దోహదపడింది. సాసూన్ కుటుంబం Sassoon family ముఖ్యమైన సంస్థలను  నిర్మించటం ద్వారా బొంబాయిలో పేరు పొందారు. సాసూన్ కుటుంబం దక్షిణ ముంబైలోని యూదు ప్రసిద్ధ ప్రార్థనా మందిరమైన కెనెస్ట్ ఎలియాహూ Kenesth Eliyahoo ను నిర్మించారు. సాసూన్ కుటుంబం 1875లో పెద్ద ఓపెన్-ఎయిర్ చేపల మార్కెట్ ఉన్న సాసూన్ డాక్స్‌ Sassoon Docks ను మరియు ముంబై యొక్క మొట్టమొదటి పబ్లిక్ లైబ్రరీ అయిన సాసూన్ లైబ్రరీ Sassoon Libraryని కూడా నిర్మించారు. సాసూన్ లైబ్రరీ 1847లో ప్రారంభించబడిన ఒక అందమైన వెనీషియన్ గోతిక్-శైలి భవనం. సాసూన్ డాక్స్‌లో ఆదివారాలు యూదుల వారసత్వ/హెరిటేజ్  నడక జరుగుతుంది.. సాసూన్‌లు బాగ్దాదీ యూదులు, వీరి వంశపిత patriarch డేవిడ్ సాసూన్ 1828లో ఇరాక్ నుండి ఇరాన్ ద్వారా భారతదేశానికి వచ్చి వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు.

మొఘల్ మసీదు లేదా నీలి మసీదు, భేండీ బజార్‌ ప్రసిద్ద కట్టడాలలో ఒకటి. భేండీ బజార్ నడిబొడ్డున ఉన్న మొఘల్ మసీదు మరియు దాని ప్రాంగణంలో నీలిరంగు పలకలు కలిగి ఇరానియన్ ప్రభావం కలిగి ఉంది. మొఘల్ మసీదు సుమారు 172 సంవత్సరాల నాటిది. మసీదు ప్రాంగణంలోకి ప్రవేశించిన తర్వాత, మరొక యుగానికి మరియు ప్రదేశానికి వెళ్ళినట్లు అనిపిస్తుంది. రద్దీతో నిండిన వీధిలో ఉన్నప్పటికీ, మొఘల్ మసీదు ప్రశాంతత యొక్క ఒయాసిస్‌ లాగా ఉంటుంది. మెరిసే కొలను  మరియు ఆవరణలో ఉన్న మెనిక్యూర్డ్ గార్డెన్‌లు చుట్టూ బ్లూ కలర్ టైల్స్‌తో కూడిన మొజాయిక్‌తో క్లిష్టమైన డిజైన్‌లను రూపొందించడం చూడదగ్గ దృశ్యం. మొఘల్ మసీదు బహుశా మహారాష్ట్రలోని ఏకైక ఇరానియన్ మసీదు.

బ్లూ మసీదు పక్కనే, ఇరానియన్ హమామ్ ఉంది. హమామ్, పబ్లిక్ బాత్, చాలా సంవత్సరాలు పనిచేసింది అయితే, ఇప్పుడు దురదృష్టవశాత్తు, హమామ్ పనిచేయడం లేదు. అయినప్పటికీ ఇరానియన్ హమామ్ సాంస్కృతిక మరియు నిర్మాణ ఆకర్షణలలో ఒకటిగా మిగిలిపోయింది.

భేండీ బజార్, సాహిత్యం మరియు సంగీత సహకారానికి ప్రసిద్ధి చెందినది. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి మరియు విభిన్న మత వర్గాల కళాకారులు బొంబాయికి రావడం, అందరూ ఏదో ఒక సమయంలో, భేండి బజార్‌ను తమ నివాసంగా మార్చుకున్నారు. భెండీ బజార్‌లోని రెండు ప్రదేశాలు ప్రత్యేకించి ముఖ్యమైనవి. ఒకటి పూర్వపు వజీర్ హోటల్ మరియు మరొకటి నాగ్‌పడా కార్నర్ లో ఉన్న సర్వి రెస్టారెంట్ Sarvi restaurant. హోటల్ వజీర్-మహమ్మద్ రఫీ వంటి కొంతమంది ప్రముఖ కళాకారులకు ఆతిథ్యం ఇచ్చింది. మహమ్మద్ రఫీ అభిమాని అయిన మహేంద్ర కపూర్ రఫీని కలవడానికి హోటల్‌ వజీర్  కి వచ్చారని నమ్ముతారు.

సర్వి రెస్టారెంట్ కు ప్రముఖ కళాకారుడు సాదత్ హసన్ మాంటో తరచూ వచ్చే వారు. సాదత్ హసన్ మాంటో బొంబాయిలో బస చేస్తున్నప్పుడు సర్వి రెస్టారెంట్‌లో చాలా సమయం గడిపాడు. వాస్తవానికి సాదత్ హసన్ మాంటో నాటకాలలోని కొన్ని పాత్రలు మాంటో రెస్టారెంట్‌లో కలుసుకున్న మరియు చూసిన నిజ జీవితంలో వ్యక్తుల నుండి ప్రేరణ పొందాయి. మంటో తన కెరీర్‌లో గణనీయమైన భాగాన్ని బొంబాయిలో గడిపాడు, అక్కడ మంటో హిందీ చిత్ర పరిశ్రమకు రచయితగా పనిచేశాడు. మంటో బొంబాయిలో గడిపిన సమయం మంటో రచనపై తీవ్ర ప్రభావాన్ని చూపింది మరియు మంటో అత్యంత ప్రసిద్ధ కథలు ముంబై నగరంలో జన్మించాయి. వేగంగా మారుతున్న ముంబై నగరంలో జీవితంలోని వైరుధ్యాలు మరియు సంక్లిష్టతలను ప్రతిబింబిస్తూ ముంబై నగరం మరియు దాని ప్రజల గురించి మంటో చిత్రణ సూక్ష్మంగా మరియు సంక్లిష్టంగా ఉంది.

సాదత్ హసన్ మాంటో రచనలు  1947లో భారతదేశ విభజనతో దగ్గరి సంబంధం కలిగి ఉన్నవి. దేశ విభజన  ఫలితంగా మానవ చరిత్రలో అతిపెద్ద సామూహిక వలసలు మరియు వందల వేల మంది ప్రజలు మరణించారు. మంటో సొంత జీవితం విభజనతో తీవ్రంగా ప్రభావితమైంది. మంటో విభజన తర్వాత పాకిస్తాన్‌కు వెళ్లాలని ఎంచుకున్నాడు, అయితే మంటో విభజనతో పాటు హింస మరియు ద్వేషాన్నికూడా  తీవ్రంగా విమర్శించాడు. ఈ కాలంలో మంటో రచనలు విభజన వల్ల నష్టపోయిన ప్రజలు అనుభవించిన బాధలు మరియు బాధలను ప్రతిబింబిస్తాయి.

దేశ విభజన కాలానికి చెందిన మాంటో కథలు పూర్తి వాస్తవికతతో గుర్తించబడ్డాయి. విభజన హింసాకాండను, భయానక పరిస్థితులను చిత్రీకరించడానికి దానికి కారణమైన రాజకీయ నాయకులను, నాయకులను విమర్శించడానికి కూడా మాంటో  వెనుకాడలేదు. విభజన గురించి మాంటో యొక్క అత్యంత శక్తివంతమైన కథలలో ఒకటి "తోబా టెక్ సింగ్". ఇది తన మానసిక చికిత్స సంస్థను విడిచిపెట్టడానికి నిరాకరించిన వ్యక్తి యొక్క కథ ద్వారా విభజన యొక్క గందరగోళం మరియు అసంబద్ధతను వర్ణిస్తుంది విభజన సమయంలో జరిగిన హింసాకాండలో అపహరణకు గురైన యువతి కథను "మొజెల్" చెబుతుంది.. విభజన గురించి మాంటో యొక్క రచనలు  దక్షిణాసియా చరిత్రలో ముఖ్యమైన సాహిత్యంగా పరిగణించబడుతుంది. మాంటో కృషి ప్రపంచవ్యాప్తంగా పాఠకులు మరియు పండితులచే అధ్యయనం చేయబడుతోంది మరియు ప్రశంసించబడుతోంది

ఉర్దూ మరియు దాని వారసత్వం భేండీ బజార్‌కు చాలా రుణపడి ఉన్నాయి. 'మక్తబా జామియా' అనేది భేండీ బజార్‌లో ఉన్న జామియా మిలియా ఇస్లామియా యొక్క ఉర్దూ పుస్తకాల దుకాణం. అరుదైన ఉర్దూ సేకరణల కోసం ఉర్దూ ప్రేమికులకు ఇది మక్కా. ఉర్దూ పండితులు మరియు అభిమానులు ఈ స్టోర్‌లో ఉన్న సంపదను చదవడానికి మరియు ప్రస్తావించడానికి తరచుగా ఈ దుకాణానికి వస్తుంటారు. మంటో వంటి కళాకారులతో పాటు పుస్తకాల దుకాణం కూడా ఉర్దూ సుసంపన్నమైన భాషను పెంపొందించడానికి దోహదపడింది. సంస్కృతిని మరియు వారసత్వాన్ని మెచ్చుకునే వ్యక్తులు ఉర్దూ భాషను సంరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తారు. అజ్మీ చేపట్టిన కార్యక్రమాల్లో ఒకటి భేండీ బజార్ పండుగనిర్వహించడం. భేండీ బజార్’ మొదటి ఉత్సవం 2014లో నిర్వహించబడింది, రెండవది 2016లో మరియు తాజాది 2023లో నిర్వహించబడింది. ఈ ఉత్సవం ఉర్దూ భాష విశిష్టత ను చాటడం మరియు యువ ఉర్దూ కవులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఒక వేదికను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2023లో, ‘భేండీ బజార్’ ఉత్సవాన్ని ప్రారంభించిన ప్రముఖ కళాకారులలో జావేద్ అక్తర్ ఒకరు. ఉర్దూ ప్రేమికులకు మరియు సంస్కృతిని అభినందిస్తున్న వారికి భేండీ బజార్ ఉత్సవం సాహిత్య విందు.

విబిన్న కమ్యూనిటీలు, సంస్కృతి, చరిత్ర యొక్క కాలిడోస్కోప్ అయిన ముంబై లోని భేండీ బజార్,  ముంబైకి అందించిన గొప్ప చరిత్ర మరియు గణనీయమైన సహకారాo  తిరుగులేనిది. భేండీ బజార్ యొక్క గొప్ప సాంస్కృతిక మరియు చారిత్రక వారసత్వo మర్చిపోలేనిది. భేండి బజార్, సాహిత్యం, కవిత్వం, సినిమా మరియు కళల కేంద్రంగా ఉంది మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక మరియు వ్యాపార కేంద్రంగా ఉంది. భేండీ బజార్‌ను తమ నివాసంగా మార్చుకున్న విభిన్న వర్గాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఈ ప్రాంతం యొక్క గుర్తింపు యొక్క ప్రత్యేక అంశం అయిన మిశ్రమ సంస్కృతికి దారితీశాయి.