2026 FIFA ప్రపంచ కప్ జూన్ 11, 2026న ప్రారంభం కానుంది 2026 FIFA ప్రపంచ కప్కు భారత్ అర్హత సాధించనప్పటికీ, భారతీయ మూలాలున్న తహసీన్ మహమ్మద్ జంషీద్ మరియు నిషాన్ వేలుపిల్లై అనే ఇద్దరు ఫుట్బాల్ క్రీడాకారులు 2026 ఫుట్బాల్ ప్రపంచ కప్లో ఆడబోతున్నారు; అయితే వీరు భారత్ తరపున కాకుండా, ప్రస్తుతం తాము నివసిస్తున్న దేశాల తరపున ఆడనున్నారు.
తహసీన్
మహమ్మద్ జంషీద్
19 ఏళ్ల తహసీన్ మహమ్మద్ జంషీద్, 2026 FIFA ప్రపంచ కప్
కోసం ఖతార్ జట్టులో ఎంపికైన భారతీయ మూలాలున్న మొదటి ఫుట్బాల్ క్రీడాకారుడు.
తహసీన్
తల్లిదండ్రులు జంషీద్ మరియు షైమా 1996లో కేరళలోని కన్నూర్ నుండి ఖతార్లోని దోహాకు వలస వెళ్లారు. తహసీన్ జూన్ 16,
2006న దోహాలో జన్మించాడు.
వింగర్ winger అయిన తహసీన్ ఖతార్లోని 'ఆస్పైర్ అకాడమీ' ద్వారా ఎదిగాడు
మరియు ప్రస్తుతం 'అల్ దుహైల్ స్పోర్ట్స్ క్లబ్' తరపున ఆడుతున్నాడు.
ఖతార్
తరపున సీనియర్, U23, U20 మరియు ఇతర యువ స్థాయి
జట్లకు ప్రాతినిధ్యం వహించిన తహసీన్, ఆ దేశపు అత్యుత్తమ యువ
ప్రతిభావంతులలో ఒకరిగా పరిగణించబడుతున్నాడు. తహసీన్ ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ప్రపంచ
కప్ క్వాలిఫైయర్ మ్యాచ్లో ఖతార్ తరపున సీనియర్ జట్టులో ఆడి అరంగేట్రం చేశాడు.
అకౌంటెంట్గా
పనిచేస్తున్న తహసీన్ తండ్రి జంషీద్ కూడా ఒక ఫుట్బాల్ క్రీడాకారుడు; జంషీద్ గతంలో కేరళలోని కాలికట్ యూనివర్సిటీ తరపున
ఆడారు.
నిషాన్
వేలుపిల్లై
2026 ఫుట్బాల్ ప్రపంచ కప్ కోసం ప్రకటించిన 26 మంది
సభ్యుల ఆస్ట్రేలియా జట్టులో నిషాన్ వేలుపిల్లై (25) స్థానం
ఖరారైంది.
'మెల్బోర్న్
విక్టరీ' క్లబ్ వింగర్ అయిన నిషాన్, మే
7, 2001న ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జన్మించాడు. నిషాన్
వేలుపిల్లై తండ్రి ససినాథ్ వేలుపిళ్లై శ్రీలంక తమిళ మూలాలున్న మలేషియా దేశస్థుడు
కాగా, తల్లి గిలియన్ ఆంగ్లో-ఇండియన్.
నిషాన్
2024లో ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేశాడు మరియు
చైనాతో జరిగిన ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్లో తన తొలి ప్రదర్శనలోనే గోల్
సాధించాడు. అప్పటి నుండి, నిషాన్ ఆస్ట్రేలియా జాతీయ ఫుట్బాల్
జట్టులో కీలక సభ్యుడిగా మారాడు.
ప్రపంచ కప్కు ఎంపికవడంతో, ఫుట్బాల్ ప్రపంచ కప్లో ఆడే తమిళ మూలాలున్న మొదటి ఫుట్బాల్ క్రీడాకారుడిగా వేలుపిళ్లై నిలవనున్నాడు.
కాంగ్రెస్
నాయకుడు మరియు, ఎంపీ శశి థరూర్ ఖతార్ మరియు
ఆస్ట్రేలియా జాతీయ జట్లలో తహసీన్ మహమ్మద్ జంషీద్ మరియు నిషాన్ వేలుపిల్లై ఎంపిక
భారత్కు కూడా గర్వకారణమని పేర్కొన్నారు.
"వీరు వికాష్ ధోరాసూ Vikash Dhorasoo అడుగుజాడల్లో నడుస్తున్నారు. అద్భుతమైన నైపుణ్యం కలిగిన మిడ్ఫీల్డర్ అయిన ధోరాసూ పూర్వీకులు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం ప్రాంతానికి చెందినవారు (వారు మొదట మారిషస్కు, ఆ తర్వాత ఫ్రాన్స్కు వలస వెళ్లారు). ధోరాసూ 2006లో జర్మనీలో జరిగిన ఫిఫా ప్రపంచ కప్లో ఫ్రాన్స్ జాతీయ జట్టు తరపున ఆడి, రన్నరప్ పతకాన్ని గెలుచుకున్నారు" అని థరూర్ తన పోస్ట్లో పేర్కొన్నారు.
2026 ఫిఫా ప్రపంచ కప్ జూన్ 11, 2026న ప్రారంభం కానుండగా,
దీని ఫైనల్ మ్యాచ్ జూలై 19, 2026న జరగనుంది.