26 July 2024

ఉన్నత విద్యలో రాణించిన కొందరు ప్రసిద్ద భారతీయ మహిళలు Women who paved the path in higher education

 



AISHE 2020-2021 ప్రకారం, ఉన్నత విద్యలో మహిళల మొత్తం నమోదు దాదాపు 49%, దాదాపు పురుషులతో సమానంగా ఉంది. 2017-18 నుండి స్త్రీల స్థూల నమోదు నిష్పత్తి (GER) పురుషుల GERని అధిగమించిందని విద్యా మంత్రిత్వ శాఖ డేటా సూచిస్తుంది. దాదాపు ఒక శతాబ్దం క్రితం చాలా ఉన్నత విద్యాసంస్థల్లో మహిళలకు ప్రవేశం కల్పించబడలేని పరిస్థితులలో ఈ సంఖ్యలు సంతోషపరుస్తాయి.

19వ శతాబ్దంలో సంఘ సంస్కర్తలు మరియు బ్రిటీష్ ప్రభుత్వం దృష్టి సారించిన ప్రధాన రంగాలలో బాలికల విద్య ఒకటి.  ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే మహిళలు మహిళా కళాశాలల్లో చదవాలని భావించారు, మరియు చాలా ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలు మహిళా విద్యార్థులను చేర్చుకోలేదు. అక్కడ చదువుకోవాలనుకునే మహిళల సంపూర్ణ సంకల్పం వల్లనే ఈ సంస్థలలో నేడు మహిళలకు ప్రవేశం లబించినది..

1901లో స్థాపించబడిన శాంతినికేతన్‌లో ఠాగూర్ రెసిడెన్షియల్ పాఠశాల విజయవంతం అయిన తరువాత 1921లో విశ్వభారతి విశ్వవిద్యాలయం స్థాపించబడినది.  విశ్వభారతి విశ్వవిద్యాలయం లో మొదట్లో  మహిళా విద్యార్థులకు ప్రవేశం కల్పించబడలేదు.  ప్రసిద్ధ సామాజిక కార్యకర్త, మాలతీ చౌదరి, అక్కడ చదువుకోవాలనుకుంది.

విశ్వభారతి విశ్వవిద్యాలయం లో అడ్మిషన్‌ను కోరుతూ మాలతీ చౌదరి నేరుగా కుటుంబ స్నేహితుడు ఠాగూర్‌కి లేఖ రాసింది. ఈ అపూర్వమైన విజ్ఞప్తి ఠాగూర్‌ని ఆలోచింపజేసింది. ఠాగూర్‌ విద్యార్థినులకు వసతి కల్పించడానికి బాలికల హాస్టల్‌ను తెరవాలని నిర్ణయించుకున్నాడు మరియు హాస్టల్‌కు సూపరింటెండెంట్‌గా మాలతి తల్లిని నియమించారు. మాలతి తల్లి ఈ ప్రతిపాదనను అంగీకరించింది మరియు శాంతినికేతన్‌లో చదువుకోవాలనే మాలతి కోరిక 1921-22లో మొదటి బాలికల బ్యాచ్‌లోకి ప్రవేశించడానికి దారితీసింది.

ప్రముఖ మహిళా విప్లవకారిణి, లీలా రాయ్ జూలై 1921లో స్థాపించబడిన ఢాకా విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీని అభ్యసించాలనుకున్నారు, అయితే అది మగ విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉండేది. అడ్మిషన్ పొందాలని నిశ్చయించుకున్న లీలా రాయ్ యూనివర్సిటీ అధికారులకు విజ్ఞప్తి చేసింది. అయితే . లీలా రాయ్ అభ్యర్థనను అధికారులు తిరస్కరించారు. లీలా రాయ్,  వైస్-ఛాన్సలర్ పీజే హార్టోగ్ వద్దకు వెళ్లి కో-ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయమని కోరింది. లీలా పట్టుదలకు ముగ్ధుడై, వైస్-ఛాన్సలర్ ఆమెకు మరియు ఇలాంటి అభ్యర్థనలు చేసిన మరో ముగ్గురు యువతులకు సాయంత్రం తరగతులు ఏర్పాటు చేశాడు.

పశ్చిమ భారతదేశంలో, 1913 మరియు 1917 మధ్యకాలంలో బరోడా కళాశాలలో (ప్రస్తుతం మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం) చేరిన మొదటి మహిళల్లో హన్సా మెహతా ఒకరు. హన్సా మెహతా తండ్రి అక్కడ బోధించే ఒక ప్రొఫెసర్, హంసా మరియు మరో ఇద్దరు మహిళా విద్యార్థులు  మొదటిసారి బరోడా కళాశాలలో ప్రవేశం పొందారు.  

ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చదువుతున్న సమయంలో ఉత్తరప్రదేశ్ మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేతా కృప్లానీ మాస్టర్స్ విద్యార్థుల తరగతిలో ఉన్న ఏకైక మహిళ. సుచేతా కృప్లానీ క్లాస్ లోని మగ సహవిద్యార్థుల కన్నా ఒక పేపర్‌లో తప్ప మిగతా వాటిలో ఎక్కువ  స్కోర్ చేయడంతో  సుచేతా కృప్లానీ పేరు ప్రఖ్యాతి పొందినది.

అత్యంత పురుష మరియు పితృస్వామ్య సమాజం లో అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలు కాలేజి విద్యనుపొండడం సులభ విషయం  కాదు.  కొచ్చిన్‌లో కాలేజీకి వెళ్ళిన మొదటి దళిత మహిళల్లో ఒకరైన దాక్షాయణి వేలాయుధన్ తన తోటివారి నుండి మాత్రమే కాకుండా ఉపాధ్యాయుల నుండి కూడా వివక్షను ఎదుర్కొంది. దాక్షాయణి వేలాయుధన్ BSc కెమిస్ట్రీ విద్యార్థి, అగ్రవర్ణ ఉపాధ్యాయుల ప్రవర్తన వలన దాక్షాయణి వేలాయుధన్ చాలా ముఖ్యమైన ప్రాక్టికల్ ప్రయోగాలను దూరం నుండి నేర్చుకోవాల్సి వచ్చింది. దాక్షాయణి వేలాయుధన్ 1935లో రెండవ విభాగంలో పట్టభద్రురాలైంది.

 

 

సమాజ అవసరాల దృష్ట్యా కాలానుగుణంగా మారుతున్న ఉర్దూ లైబ్రరీలు

 


దేశంలో ఉర్దూ భాష యొక్క ప్రస్తుత స్థితి, తరచుగా మాట్లాడే భాషగా మాత్రమే కాకుండా, ముస్లింలతో మాత్రమే అనుబంధించబడిన భాషగా భావించబడుతుంది.  ఉర్దూ చదివే తక్కువ మంది పాఠకుల హాజరు ఉర్దూ లైబ్రరీల స్థితి పై ప్రభావం చూపింది. క్రమేపి ఉర్దూ లైబ్రరీలు పోటీ పరీక్షల పుస్తకాలను అందించడం ప్రారంభించినవి.

దేశంలోని వివిధ ప్రాంతాలలోని ఉర్దూ లైబ్రరీలు చదివే పాఠకుల సంఖ్య క్షీణిస్తున్నందున, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను జోడించడం ద్వారా ప్రస్తుతం అనేక ఉర్దూ లైబ్రరీలు మనుగడ సాగిస్తున్నవి.

1978లో స్థాపించబడిన అలంబజార్ ఉర్దూ లైబ్రరీ ప్రధానంగా రాష్ట్రంలోని ఉర్దూ మాట్లాడే ముస్లిం సమాజం అవసరాల నిమిత్తం ఏర్పాటు చేయబడినది. సమీపం లోని స్థానిక ఉర్దూ మీడియం హయ్యర్ సెకండరీ పాఠశాల విద్యార్థులకు అవసరాలను తీర్చడానికి లైబ్రరీ స్థాపించబడింది. అలంబజార్ ఉర్దూ లైబ్రరీ లో పెద్ద సంఖ్య లో ఉర్దూ నవలలు మరియు ఉర్దూ పుస్తకాల యొక్క పెద్ద సేకరణ కలదు.

కాలక్రమేణా muslim మారుతున్న సమాజ అవసరాలకు తగినట్లుగా అలంబజార్ ఉర్దూ లైబ్రరీ లో పాఠకులను ఆకర్షించేందుకు అకడమిక్ యూనిట్‌ను ఏర్పాటు చేయబడినది.. మెడికల్ మరియు ఇంజినీరింగ్ కోర్సులలో ప్రవేశం కోసం ITI, NEET మరియు ఇతర సారూప్య పరీక్షలతో సహా అనేక రకాల ప్రవేశ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు కలవు. కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వ పోటీ పరీక్షలు మరియు బ్యాంకులు, రైల్వేలు మరియు ఇతర పరీక్షల కోసం సిద్ధమయ్యే పుస్తకాలను అందించడం జరుగుతుంది.

అక్టోబర్ 1891లో బీహార్‌కు చెందిన ప్రముఖ వ్యక్తి ఖాన్ బహదూర్ ఖుదా బక్ష్ చే ఖుదా బక్ష్ ఓరియంటల్ పబ్లిక్ లైబ్రరీ, ప్రజల ఉపయోగం కోసం ప్రారంభించబడింది, ప్రారంభంలో లైబ్రరీ లో 4,000 మాన్యుస్క్రిప్ట్‌లు ఉన్నాయి, వాటిలో 1,400 అతని తండ్రి నుండి వారసత్వంగా పొందబడ్డాయి. భారత ప్రభుత్వం ఖుదా బక్ష్ ఓరియంటల్ పబ్లిక్ లైబ్రరీని 1969లో పార్లమెంటరీ చట్టం ద్వారా జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా గుర్తించింది.

పాట్నాలో గల, ఖుదా బక్ష్ ఓరియంటల్ పబ్లిక్ లైబ్రరీ ని భారతదేశం మరియు వెలుపల నుండి పండితులు సందర్శించి దాని యొక్క విస్తారమైన మాన్యుస్క్రిప్ట్‌ల సేకరణ-సూఫీ సాహిత్యం, కవిత్వం, పర్షియన్ సాహిత్యం, చరిత్ర మరియు సూక్ష్మ చిత్రాలను అధ్యయనం చేస్తారు. ఖుదా బక్ష్ ఓరియంటల్ పబ్లిక్ లైబ్రరీ లో మానవీయ శాస్త్రాలు మరియు సాంఘిక శాస్త్రాల పుస్తకాలు 1600 మరియు 1700సవత్సరాల నాటివి కలవు..

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సివిల్ సర్వీసెస్ పరీక్షల తయారీపై ఖుదా బక్ష్ ఓరియంటల్ పబ్లిక్ లైబ్రరీ దృష్టి సారించింది. ఖుదా బక్ష్ ఓరియంటల్ పబ్లిక్ లైబ్రరీ, మెడికల్ మరియు ఇంజినీరింగ్ రంగాలకు సంబంధించిన పోటీ పరీక్షల మెటీరియల్‌లను విద్యార్థులకు అందుబాటులో ఉంచింది మరియు దీని కోసం ఒక విభాగాన్ని కేటాయించింది. లైబ్రరీలోని  ది కర్జన్ రీడింగ్ రూమ్ ను పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇష్టపడతారు.

రాంపూర్ రజా లైబ్రరీ, 1774లో నవాబ్ ఫైజుల్లా ఖాన్ చే స్థాపించబడినది. నవాబ్ మరియు అతని వారసులు విద్వాంసులు, ఉలేమాలు, కవులు, చిత్రకారులు, కాలిగ్రాఫర్లు మరియు సంగీత విద్వాంసులను ఆదరించారు. . లైబ్రరీలో అరబిక్, పర్షియన్, పాష్టో, సంస్కృతం, ఉర్దూ, హిందీ మరియు టర్కిష్‌తో సహా వివిధ భాషలలో మాన్యుస్క్రిప్ట్‌లు ఉన్నాయి.

ఖుదా బక్ష్ ఓరియంటల్ పబ్లిక్ లైబ్రరీ మరియు రాంపూర్ రజా లైబ్రరీ రెండూ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కింద కేంద్ర నిధులు పొందుతున్నాయి.

1939లో స్థాపించబడిన, భోపాల్‌లోని ఇక్బాల్ లైబ్రరీ లో పుస్తకాలను డిజిటలైజ్ చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. యువ తరంలో ఉర్దూ పట్ల క్షీణిస్తున్న ఆసక్తిని పెంచడమే లక్ష్యంగా మరియు  ఉర్దూ పరిరక్షణ కోసం ఇక్బాల్ లైబ్రరీ పనిచేస్తుంది.

ఇక్బాల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ లో వార్తాపత్రికలు మరియు మ్యాగజైన్‌లను అందుబాటులోకి తేవడం జరిగింది. పోటీ పరీక్షలకు సంబంధించి లక్షకు పైగా పుస్తకాలను సేకరించడం ద్వారా ఇక్బాల్ లైబ్రరీ తన పాఠకుల సంఖ్యను పెంపొందించుకునే ప్రయత్నం చేస్తోంది.

హైదరాబాద్‌లో ఉర్దూను ప్రోత్సహించడానికి ఇదారా-ఎ-అదబియాత్-ఎ-ఉర్దూ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. 1930లలో ఇదారా-ఎ-అదబియాత్-ఎ-ఉర్దూ (ఉర్దూ సాహిత్య సంస్థ) డక్కాని సాహిత్యవేత్త మరియు సాహిత్య చరిత్రకారుడు ముహియుద్దీన్ ఖాద్రీ జోరేచే స్థాపించబడింది..  తరువాత దాని వ్యవస్థాపకులు దానిని లైబ్రరీగా మార్చి  కొన్ని కోర్సులను ప్రారంభించారు.  

ఇదారా-ఎ-అదబియాత్-ఎ-ఉర్దూ సంస్థలో చారిత్రక ఉర్దూ వార్తాపత్రికల సేకరణతో పాటు పురాతన ఉర్దూ, అరబిక్ మరియు పర్షియన్ మాన్యుస్క్రిప్ట్‌లు ఉన్నాయి. ఇదారా-ఎ-అదబియాత్-ఎ-ఉర్దూ లైబ్రరీలో అరుదైన ఉర్దూ పుస్తకాలు, మాన్యుస్క్రిప్ట్‌ల భారీ సేకరణ మరియు డక్కని ఉర్దూ మాన్యుస్క్రిప్ట్‌ల తొలి సేకరణలు  ఉన్నాయి మరియు ఇది దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల నుండి పరిశోధకులను ఆకర్షిస్తుంది. రేఖతా ఫౌండేషన్ ద్వారా ఇదారా పుస్తకాలను డిజిటలైజ్ చేయబడినవి.

ఉర్దూ లైబ్రరీలు కొన్ని నిర్మాణ సమస్యలను ఎదుర్కొంటున్నవి.  ఉన్నాయి. ఉర్దూ లైబ్రరీలను సామాన్య  ప్రజలు సాధారణంగా సందర్శించరు. పరిశోధకులు మరియు పండితులు మాత్రమే ఈ లైబ్రరీలను సందర్శిస్తారు పాఠకుల సంఖ్యను పెంచే సాంకేతికతలు, పోటీ పరీక్షల కోసం చదివే గదులు మరియు పోటీ పరీక్షల గురించి పుస్తకాలు అందుబాటులోనికి తీసుకు రావలసి ఉన్నది. "లైబ్రరీలకు ప్రజలను ఆకర్షించడానికి మరియు పుస్తకాలను అందించడానికి మార్గాలను కనుగొనాలి. ఈ లైబ్రరీలు తమ మౌలిక సదుపాయాలను విస్తరించి  మరియు డిజిటలైజేషన్‌పై దృష్టి పెట్టాలి.

 

 

 

 

.  

25 July 2024

అత్యధిక ముస్లిం జనాభా కలిగిన భారతీయ రాష్ట్రాలు Indian states with the highest Muslim population

 


విభిన్న సాంస్కృతిక మరియు మతపరమైన గుర్తింపుకు  ప్రసిద్ధి చెందిన భారతదేశం, గణనీయమైన ముస్లిం జనాభాను కలిగి ఉంది. ఇస్లాం భారత దేశంలో రెండవ అతిపెద్ద మతం. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో ముస్లింలు 14.2% ఉన్నారు.

 

అత్యధిక ముస్లిం జనాభా కలిగి ఉన్న భారతీయ రాష్ట్రాలు:


1.ఉత్తర ప్రదేశ్ Uttar Pradesh:

భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో గణనీయమైన ముస్లిం జనాభా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, ముస్లింలు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర జనాభాలో దాదాపు 19.26% ఉన్నారు అనగా  38 మిలియన్లకు పైగా ముస్లిములను కలిగి ఉన్నారు. లక్నో, అలీఘర్ మరియు వారణాసి వంటి నగరాల్లో గణనీయమైన ముస్లిం జనాభా కలదు.. ఆగ్రాలోని తాజ్ మహల్ మరియు లక్నోలోని బారా ఇమాంబరా వంటి చారిత్రిక ప్రదేశాలతో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఇస్లామిక్ సంస్కృతికి గొప్ప చరిత్రను కలిగి ఉంది. ముస్లిం పాలకుల ప్రభావం, ముఖ్యంగా మొఘల్ కాలంలో, వాస్తుశిల్పం, వంటకాలు మరియు సంప్రదాయాలలో స్పష్టంగా కనిపిస్తుంది.

2.పశ్చిమ బెంగాల్ West Bengal:

తూర్పు భారతదేశంలో ఉన్న పశ్చిమ బెంగాల్, రాష్ట్ర మొత్తం జనాభాలో 27% మంది ఉన్నారు. పశ్చిమ బెంగాల్ 2011 జనాభా లెక్కల ప్రకారం 24 మిలియన్లకు పైగా ముస్లింలను కలిగి ఉంది. ముర్షిదాబాద్, మాల్దా మరియు నార్త్ 24 పరగణాల జిల్లాల్లో ముఖ్యంగా ముస్లింలు అధికంగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతా సాంస్కృతిక వైవిధ్యం మరియు చారిత్రక ప్రాధాన్యతకు ప్రసిద్ధి చెందింది. ఈద్ వంటి పండుగలు గొప్ప ఉత్సాహంతో జరుపుకొంటారు

3.బీహార్ Bihar:

తూర్పు భారతదేశంలో ఉన్న బీహార్‌లో దాదాపు 16.87% ముస్లిం జనాభా ఉంది, 2011 జనాభా లెక్కల ప్రకారం బీహార్‌17 మిలియన్లకు పైగా ముస్లిం ప్రజలనుకలిగి ఉంది.  కిషన్‌గంజ్, అరారియా మరియు పూర్నియా జిల్లాల్లో ముస్లింలు అత్యధికంగా ఉన్నారు. బీహార్‌లో గొప్ప ఇస్లామిక్ వారసత్వం ఉంది, పురాతన నగరం ససారం మరియు షేర్ షా సూరి సమాధి వంటి చారిత్రక ప్రదేశాలు బిహార్ లో ఉన్నాయి. బీహార్ లోని ముస్లిం సమాజం సామాజిక-ఆర్థిక విద్య, రాజకీయాలు మరియు వ్యాపారం వంటి వివిధ రంగాలలో పేరు గాంచినది.  

4.మహారాష్ట్ర Maharashtra:

మహారాష్ట్రలో గణనీయమైన ముస్లిం జనాభా ఉంది, మహా రాష్ట్ర మొత్తం జనాభాలో ముస్లిములు దాదాపు 11.54% ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం  మహారాష్ట్రలో 12 మిలియన్లకు పైగా ముస్లింలు కలరు. మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబయి, పెద్ద ముస్లిం సమాజానికి నిలయం మరియు విభిన్న సాంస్కృతిక పరిసరాలకు ప్రసిద్ధి చెందింది. ముంబై నగరంలో హాజీ అలీ దర్గా మరియు జామా మసీదుతో సహా అనేక ప్రముఖ మసీదులు ఉన్నాయి. మహారాష్ట్రలోని ముస్లిం జనాభా చలనచిత్రం, వ్యాపారం మరియు రాజకీయాలతో సహా వివిధ రంగాలలో చురుకుగా పాల్గొంటుంది.

5.అస్సాంAssam:

ఈశాన్య భారతదేశంలో ఉన్న అస్సాంలో దాదాపు 34.22% ముస్లిం జనాభా ఉంది, 2011 జనాభా లెక్కల ప్రకారం అస్సాం లో 10 మిలియన్లకు పైగా ముస్లిములు కలరు. ధుబ్రి, బార్‌పేట మరియు గోల్‌పరా జిల్లాల్లో ముస్లింలు అత్యధికంగా ఉన్నారు. అస్సాం యొక్క ముస్లిం సమాజానికి ప్రత్యేకమైన సాంస్కృతిక గుర్తింపు కలిగి ఉంది, ఇది స్థానిక అస్సామీ మరియు బెంగాలీ సంప్రదాయాలచే ప్రభావితమైంది. సాంప్రదాయ సంగీతం, నృత్యం మరియు వంటకాలతో సహా గొప్ప సాంస్కృతిక వారసత్వానికి అస్సాం ప్రసిద్ధి చెందింది. ముస్లిం సమాజం అస్సాం సాంస్కృతిక ప్రకృతి దృశ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

6.కేరళ Kerala:

దక్షిణ భారత రాష్ట్రమైన కేరళలో దాదాపు 26.56% ముస్లిం జనాభా ఉంది, 2011 జనాభా లెక్కల ప్రకారం కేరళలో 8 మిలియన్లకు పైగా ముస్లిం జనాభా ఉన్నారు. మలప్పురం, కోజికోడ్ మరియు కన్నూర్ జిల్లాల్లో ముఖ్యంగా ముస్లింలు అధికంగా ఉన్నారు. కేరళ యొక్క ముస్లిం సమాజం విద్యాపరంగా అభివృద్ది చెందినది  మరియు కేరళ రాష్ట్ర సామాజిక-ఆర్థిక అభివృద్ధిలో క్రియాశీల భాగస్వామ్యానికి ప్రసిద్ధి చెందింది. కేరళకు వాణిజ్యం మరియు సాంస్కృతిక మార్పిడి యొక్క గొప్ప చరిత్ర ఉంది, కేరళ ముస్లిం సమాజం కేరళ యొక్క విభిన్న సాంస్కృతిక వారసత్వానికి గణనీయంగా తోడ్పడింది

7.జమ్మూ కాశ్మీర్Jammu and Kashmir:

ఉత్తర భారతదేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్ దేశంలో అత్యధిక శాతం ముస్లింలను కలిగి ఉంది.  జమ్మూ మరియు కాశ్మీర్ జనాభాలో 68.31% మంది ముస్లిములు. 2011 జనాభా లెక్కల ప్రకారం జమ్మూ మరియు కాశ్మీర్ 8.5 మిలియన్లకు పైగా ముస్లింలను కలిగి ఉంది.  కాశ్మీర్ లోయ, దాల్ సరస్సు మరియు హిమాలయ పర్వతాలతో సహా అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. జమ్మూ మరియు కాశ్మీర్‌లోని ముస్లిం సమాజం సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది, సంప్రదాయ కళలు, సంగీతం మరియు వంటకాలు జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క గుర్తింపులో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.

8.లక్షద్వీప్Lakshadweep:

అరేబియా సముద్రంలో ద్వీపాల సమూహంతో కూడిన భారత దేశం లోని కేంద్రపాలిత ప్రాంతం, అయిన లక్షద్వీప్ లో అత్యధిక సంఖ్యలో ముస్లింలు ఉన్నారు. లక్షద్వీప్ జనాభాలో 96.58% మంది ముస్లిములు.. 2011 జనాభా లెక్కల ప్రకారం లక్షద్వీప్ లో 60,000 మంది ముస్లింలు కలరు.  లక్షద్వీప్ లోని ద్వీపాలు వాటి సహజమైన బీచ్‌లు, పగడపు దిబ్బలు మరియు ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందాయి. లక్షద్వీప్‌లోని ముస్లిం సమాజం భారతీయ మరియు అరబ్ సంప్రదాయాలచే ప్రభావితమైన ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపును కలిగి ఉంది. లక్షద్వీప్ యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా చేపలు పట్టడం, కొబ్బరి పెంపకం మరియు పర్యాటకంపై ఆధారపడి ఉంటుంది, ఈ కార్యకలాపాలలో ముస్లిం సమాజం ప్రధాన పాత్ర పోషిస్తుంది.

కేంద్ర బడ్జెట్ 2024-25 లో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు 3,183.24 కోట్ల రూపాయల కేటాయింపు జరిగింది.

 




 

Ø కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు 2024-25లో  బడ్జెట్ కేటాయింపులు రూ.3,183.24 కోట్లు.

Ø MoMA బడ్జెట్ కేవలం రూ.3183.24 కోట్లు, ఇది మొత్తం బడ్జెట్‌లో దాదాపు 0.0660%.

Ø 2023-24లో కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపు రూ. 3,097.60.

Ø కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదించిన కేటాయింపుల్లో రూ.1,575.72 కోట్లు విద్యా సాధికారత కోసం.

Ø మైనారిటీలకు ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ కోసం రూ.326.16 కోట్లు, మైనారిటీలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ కోసం రూ.1,145.38 కోట్లు కేటాయించారు.

Ø కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన పథకాలు/ప్రాజెక్టుల కోసం మొత్తం రూ.2,120.72 కోట్లు కేటాయించబడ్డాయి.

Ø కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన కార్యక్రమాలలో ఒకటైన ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమంకోసం ఈసారి 910.90 కోట్ల రూపాయల కేటాయింపు జరిగింది.

Ø అయితే, మైనారిటీలకు నైపుణ్యాభివృద్ధి మరియు జీవనోపాధి విషయానికి వస్తే, 2023-2024 64 కోట్లు కేటాయించగా, నైపుణ్యాభివృద్ధి మరియు జీవనోపాధి కేటగిరీలో 3 కోట్లు మాత్రమే కేటాయించారు.


·       మొత్తం బడ్జెట్‌లో కేంద్రం స్థాపన వ్యయం కోసం 132.62 కోట్లు, విద్యా సాధికారత కోసం 1575.72 కోట్లు, మైనారిటీల ప్రత్యేక కార్యక్రమాలకు 26 కోట్లు, PM-VIKAS కమిటెడ్ లయబిలిటీలకు 500 కోట్లు, 17 కోట్లు చట్టబద్ధమైన మరియు నియంత్రణా సంస్థలు, ఇతర కేంద్ర రంగ వ్యయానికి 17 కోట్లు మరియు మైనారిటీల అభివృద్ధి కోసం గొడుగు కార్యక్రమానికి 912 కోట్లు ఈ సంవత్సరం కేటాయించబడ్డాయి.


'UPSC, SSC, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ మొదలైనవారు నిర్వహించే ప్రిలిమ్స్ క్లియర్ చేసే సపోర్ట్ స్టూడెంట్స్', 'స్కిల్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్స్ (USTAD)', 'అప్‌గ్రేడ్ స్కిల్స్', 'స్కీమ్ ఫర్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీ', 'ఈక్విటీ కంట్రిబ్యూషన్ కోసం ఎటువంటి మొత్తం కేటాయించబడలేదు.

 

క్రింది విధంగా ఉన్న ముఖ్యమైన పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను తగ్గించింది.

*ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకంలో 106.84 కోట్ల తగ్గింపు, పోస్ట్ మెట్రిక్ పథకంలో 80.38 కోట్ల పెంపు, మెరిట్-కమ్-మీన్స్ పథకంలో 10.2 కోట్ల తగ్గింపు, మౌలానా ఆజాద్ ఫెలోషిప్ పథకంలో 50.92 కోట్ల తగ్గింపు. కోచింగ్ స్కీమ్‌లో 40 కోట్లు, వడ్డీ రాయితీలో 5.70 కోట్ల తగ్గింపు, UPSC ప్రిపరేషన్ స్కీమ్‌లో జీరో ప్రొవిజన్ జరిగింది..

 

*కౌమీ వక్ఫ్ బోర్డు తారక్కియాతి స్కీమ్ బడ్జెట్‌లో కోటి తగ్గింపు, స్కిల్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్ స్కీమ్‌లో ఎటువంటి కేటాయింపులు లేవు, నయీ మంజిల్ స్కీమ్‌లో కేటాయింపులు లేవు, మైనారిటీ మహిళా నాయకత్వ అభివృద్ధి పథకంలో కేటాయింపులు లేవు, ఉస్తాద్ పథకంలో కేటాయింపులు లేవు, హమారీ ధరోహర్ పథకంలో కేటాయింపులు లేవు, ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ పథకంలో 40 కోట్ల తగ్గింపు, నేషనల్ మైనారిటీ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో సెంట్రల్ వాటాలో కేటాయింపు లేదు, మైనారిటీలు మరియు మద్రాసాలకు విద్యా పథకంలో 8 కోట్లు తగ్గింపు, జాతీయ మైనారిటీ కమిషన్ బడ్జెట్‌లో కోటి తగ్గింపు, భాషాపరమైన మైనారిటీల బడ్జెట్‌లో కోటి తగ్గింపు, మౌలానా ఆజాద్ ఫౌండేషన్‌కు ఎలాంటి కేటాయింపులు లేవు, PMJVKలో 310.90 కోట్ల పెంపుదల ప్రతిపాదించబడింది.

 

పై గణాంకాలు గత సంవత్సరం మరియు ఈ సంవత్సరం బడ్జెట్ అంచనాల మధ్య వ్యత్యాసాన్ని చూపుతున్నాయి.

 

ప్రస్తుత బడ్జెట్ మైనారిటీలను ఆకట్టుకోలేకపోయింది. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ దీనిని "లాలీపాప్" బడ్జెట్ అని పిలిచారు.

 

మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2024-25 బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని మైనారిటీ కోఆర్డినేషన్ కమిటీ (MCC) కన్వీనర్ ముజాహిద్ నఫీస్  అన్నారు. మైనారిటీ కోఆర్డినేషన్ కమిటీ (MCC) కన్వీనర్ ముజాహిద్ నఫీస్  . వెనుకబడిన కమ్యూనిటీల అభ్యున్నతి కోసం కేంద్ర బడ్జెట్‌లో లక్ష కోట్లు కేటాయించాలిఅని పేర్కొన్నారు.

 

జమాతే ఇస్లామీ హింద్ (JIH) వైస్ ప్రెసిడెంట్ ప్రొ. సలీం ఇంజనీర్ కేంద్ర బడ్జెట్ పేదలు, అట్టడుగు వర్గాలు, షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST) మరియు భారతదేశంలోని మతపరమైన మైనారిటీలు అవసరాలను తీర్చడంలో విఫలమైందని పేర్కొంటూ నిరాశను వ్యక్తం చేశారు..

23 July 2024

నవాబ్ వాలిదాద్ ఖాన్ అఫ్ బులంద్‌షహర్, ఉత్తరప్రదేశ్ Nawab Walidad Khan Bulandshahr, Uttar Pradesh

 



1857 మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో, ప్రస్తుత ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా ఢిల్లీ మరియు మీరట్‌లకు వ్యూహాత్మకంగా సామీప్యత కారణంగా ముఖ్యమైన పాత్ర పోషించింది. బులంద్‌షహర్‌లో, తిరుగుబాటు ప్రధానంగా స్థానిక గుజ్జర్ మరియు రాజ్‌పుత్ కమ్యూనిటీలచే ప్రారంబి౦ప బడినది. మలగూర్ నవాబ్ మరియు బులంద్‌షాదర్ సుబేదార్ నవాబ్ వాలిదాద్ ఖాన్ వలస ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తిరుగుబాటు ఉద్యమానికి నాయకుడిగా ఎంపికయ్యారు.

నవాబ్ వాలిదాద్ ఖాన్ మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ యొక్క బావ. 11 జూన్ 1857, నవాబ్ వాలిదాద్ ఖాన్ దళాలు బులంద్‌షహర్‌పై నియంత్రణ సాధించేందుకు బ్రిటిష్ వారిని ఓడించాయి. నవాబ్ వాలిదాద్ ఖాన్ చే ప్రభుత్వ భవనాలు, రికార్డులు ధ్వంసం చేయబడి, కొత్త రెవెన్యూ పరిపాలన ప్రారంభించి, ఆ ఆదాయాన్ని ఢిల్లీకి పంపించారు. త్వరలోనే, ఎగువ దోయాబ్ ప్రాంతం (ఆధునిక పశ్చిమ యుపి) పాలనను నవాబ్‌ వాలిదాద్ ఖాన్ కు అప్పగించారు. నవాబ్ వాలిదాద్ ఖాన్ వలన వలస ప్రభుత్వ నియంత్రణను పూర్తిగా స్తంభించినది. .

బ్రిటీష్ వారు జిల్లాను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి బలగాలతో తిరిగి వచ్చినప్పుడు, బ్రిటిష్ వారు మళ్లీ ఓడిపోయారు. వాలిదాద్ ఖాన్ యొక్క ప్రజాదరణను విచ్ఛిన్నం చేయడానికి, ఆంగ్లేయులు నవాబ్‌ వాలిదాద్ ఖాన్ కు వ్యతిరేకంగా స్థానిక జాట్‌లను ప్రేరేపించారు మరియు నవాబ్‌ వాలిదాద్ ఖాన్ ని ఓడించడానికి స్థానిక జాట్‌ల సహాయం కోరారు. చివరకి భితోరాలో నవాబ్‌ వాలిదాద్ ఖాన్ దళాల ఓటమికి దారితీసింది. నవాబ్ నవాబ్‌ వాలిదాద్ ఖాన్ మొఘల్ చక్రవర్తి నుండి అదనపు బలగాలను కోరాడు మరియు సెప్టెంబరు 28న ఇరు పక్షాల మద్య భీకర యుద్ధం జరిగింది. పలితంగా యుద్ధం లో నవాబ్ నవాబ్‌ వాలిదాద్ ఖాన్ ఓటమి పొందినాడు. బ్రిటీష్ వారు నవాబ్ నవాబ్‌ వాలిదాద్ ఖాన్ ని పట్టుకుని, బులంద్‌షహర్‌లోని కాలా ఆమ్‌లో బహిరంగంగా ఉరితీశారు