4 July 2026

చెన్నై విద్యావేత్త నిఖత్ ఫాతిమా Nikhath Fatima, An Educator of Chennai

 


 

ముస్లిం సమాజంలో మార్పును బయటి నుండి రుద్దలేము; అది లోపలి నుండే రావాలి. మన అమ్మాయిలు ఉన్నత విద్యను అభ్యసించి, తమ హక్కుల కోసం నిలబడేంత వరకు, ఈ తిరోగమన మనస్తత్వం మారదు.”-నిఖత్ ఫాతిమా సుహైల్

నిఖత్ ఫాతిమా సుహైల్ ఒక విద్యావేత్త మరియు సాంఘిక సంస్కర్త. నిఖత్ ఫాతిమా బాలికల సాధికారతకు, డిస్లెక్సియాతో బాధపడుతున్న పిల్లలకు మద్దతు ఇవ్వడానికి, మరియు వితంతువులు, ఒంటరి తల్లులకు అవకాశాలు కల్పించడానికి అంకితమయ్యారు.

చెన్నైలోని ఒక ప్రముఖ ముస్లిం కుటుంబంలో జన్మించిన నిఖత్ ఫాతిమా, ఒక ఉపాధ్యాయురాలు మరియు  ఆమె పూర్వీకులు ఆర్కాట్ నవాబుల కుటుంబానికి చెందినవారు.

నిఖత్ ఫాతిమా ప్రత్యేకమైన విద్యా విధానం Special Education విభాగం లో శిక్షణ పొందడమే కాకుండా, చెన్నైలో ఐదు ప్రత్యేక అభ్యసన కేంద్రాలను కూడా స్థాపించారు నిఖత్ ఫాతిమా స్థాపించిన ఐదు ప్రత్యేక అభ్యసన కేంద్రాలలో, సాంప్రదాయ పద్ధతుల ద్వారా సమర్థవంతంగా నేర్చుకోలేని డిస్లెక్సియాతో బాధపడుతున్న పిల్లలను, ఆటల పద్ధతి మరియు ప్రత్యేక చికిత్స ద్వారా విద్య నేర్పి ప్రధాన స్రవంతి విద్యలో విలీనం చేస్తారు.

నిఖత్ ఫాతిమా ప్రత్యేక అభ్యసన కేంద్రాలలో విద్యావేత్తలుగా పనిచేయడానికి ఒంటరి తల్లులను మరియు వితంతువులను ఎంచుకున్నారు. వారికి ప్రత్యేక శిక్షణను అందించారు.

నిఖత్ ఫాతిమా సుహైల్ ముఖ్యంగా ముస్లిం బాలికలు మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థుల సాధికారతను లక్ష్యంగా చేసుకొని అనేక ముఖ్యమైన క్షేత్రస్థాయి కార్యక్రమాలను చేపట్టారు.

ప్రస్తుతం, నిఖత్ ఫాతిమా ఎం.డబ్ల్యూ.ఏ. మెట్రిక్యులేషన్ మరియు హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. ప్రిన్సిపాల్‌గా ఆమె 1,500 మందికి పైగా బాలికలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు.

బాలికలకు కేవలం మత విద్యే కాకుండా సైన్స్, కంప్యూటర్ విద్య, ఇతర ఆధునిక విషయాలపై కూడా అవగాహన కల్పించాలని, తద్వారా వారు స్వయం సమృద్ధి సాధించగలరని నిఖత్ ఫాతిమా నమ్ముతారు.

బాలికలు, మహిళలను ఆర్థికంగా స్వతంత్రులుగా చేయడం పై  నిఖత్ ఫాతిమా దృష్టి సారించారు.నిఖత్ ఫాతిమా ఆర్ధికంగా బలహీనమైన కుటుంబాలకు చెందిన యువతీ, మహిళలకు శిక్షణ ఇచ్చి, నెలకు ₹30,000 వరకు సంపాదించగల ఉద్యోగాలు పొందడంలో సహాయం చేస్తారు.”

నిఖత్ ఫాతిమా, అకాడమీ ఫర్ విమెన్ ద్వారా, కళాశాలకు వెళ్లే బాలికల కోసం, అలాగే బడి మానేసిన బాలికల కోసం ప్రత్యేక వృత్తి విద్యా శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వారికి కంప్యూటర్ కోడింగ్, టైలరింగ్, గ్రాఫిక్ డిజైన్ మరియు ఇతర వృత్తి నైపుణ్యాలలో శిక్షణ ఇస్తారు.

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల బాలికలు ఎలాంటి అంతరాయం లేకుండా తమ విద్యను కొనసాగించేలా చూసేందుకు, నిఖత్ ఫాతిమా ప్రత్యేక నిధులను మరియు స్కాలర్‌షిప్ సహాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

నిఖత్ ఫాతిమా తన పాఠశాలలో వితంతువులు మరియు ఒంటరి తల్లుల కుమార్తెలకు పాఠశాల ఫీజులు మరియు పాఠ్యపుస్తకాలలో ప్రత్యేక రాయితీలు లభిస్తాయి. తద్వారా వీరు విద్యకు దూరం కాకుండా చూస్తున్నారు.

నిఖత్ ఫాతిమా తల్లిదండ్రుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సులను నిర్వహిస్తారు, అక్కడ బాలికలకు ఉన్నత విద్య మరియు ఆర్థిక స్వాతంత్ర్యం ఎందుకు అవసరమో వివరిస్తారు.

సుమారు 2015లో, నిఖత్ ఫాతిమా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB) యొక్క చెన్నై శాఖలో సభ్యురాలిగా చేరారు. ఈ ప్రభావవంతమైన సంస్థలో ఉంటూ ఇస్లామిక్ న్యాయశాస్త్ర పరిధిలో ముస్లిం మహిళల సామాజిక మరియు చట్టపరమైన సమస్యలను (విడాకులు, భరణం, మరియు మహిళల హక్కులు వంటివి) లేవనెత్తడం మరియు వారికి అనుకూలంగా సంస్కరణల కోసం వాదించడం.అయితే 2016లో, సైద్ధాంతిక విభేదాల కారణంగా, నిఖత్ ఫాతిమా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB) యొక్క చెన్నై శాఖలో తన పదవికి రాజీనామా చేశారు.

నిఖత్ ఫాతిమా ఒక విశిష్ట సామాజిక కార్యకర్త మరియు తన సూత్రాలకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉండే ప్రభావవంతమైన మహిళ. తన అచంచలమైన నిబద్ధతతో, ముఖ్యంగా మహిళా సాధికారత మరియు సామాజిక అభ్యున్నతిని పెంపొందించడం ద్వారా సమాజానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారు.

 

అయతొల్లా ఖమేనీ: ప్రతిఘటన వారసత్వం మునుపటి కంటే సజీవంగా ఉంది Ayatollah Khamenei: Legacy of resistance more alive than before

 



జూలై 4 నుండి ప్రారంభమయ్యే అయతొల్లా సయ్యద్ అలీ హుస్సేనీ ఖమేనీ యొక్క ప్రభుత్వ అంత్యక్రియల కార్యక్రమాలకు ఇరాన్ సిద్ధమవుతున్న తరుణంలో, ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ తన అత్యంత కీలకమైన వ్యక్తులలో ఒకరి మరణానికి సంతాపం తెలుపుతోంది.

దాదాపు 37 సంవత్సరాల పాటు సర్వోన్నత నాయకుడిగా ఉన్న అయతొల్లా ఖమేనీ, ఫిబ్రవరి 28న టెహ్రాన్‌పై జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడిలో అమరులయ్యారు. ఈ దాడిలో అయతొల్లా ఖమేనీ  14 నెలల మనవరాలు, ఉన్నతాధికారులతో సహా పలువురు కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

ఇరాక్‌లోని టెహ్రాన్, ఖోమ్ మరియు ఇతర నగరాల్లో ఊరేగింపులు జరిగిన అనంతరం, జూలై 9న అయతొల్లా ఖమేనీ స్వస్థలమైన మషద్‌లోని ఇమామ్ రెజా (సల్లల్లాహు అలైహి వసల్లం) మందిరంలో అయతొల్లా ఖమేనీ ఖననం జరగనుంది.

1939లో మషద్‌లో ఒక మతపరమైన కుటుంబంలో జన్మించిన ఖమేనీ, షియా మత గురువుల శ్రేణిలో ఉన్నత స్థాయికి ఎదిగి, 1979 ఇస్లామిక్ విప్లవంలో కీలక పాత్ర పోషించారు. ఇమామ్ సయ్యద్ రుహొల్లా ఖొమేనీకి సన్నిహిత శిష్యుడైన అయతొల్లా ఖమేనీ 1980లలో ఇరాన్ అధ్యక్షుడిగా పనిచేసి, 1989లో రుహొల్లా ఖొమేనీ తర్వాత సర్వోన్నత నాయకుడిగా బాధ్యతలు స్వీకరించారు.

మూడు దశాబ్దాలకు పైగా తన ప్రస్థానంలో, జియోనిస్ట్ మరియు అమెరికా, ఇరాన్‌పై జరిపిన 12 రోజుల యుద్ధం (జూన్ 2025) వంటి అనేక కీలక మలుపుల గుండా అయతొల్లా ఖమేనీ ఇరాన్‌కు మార్గనిర్దేశం చేశారు. "అహంకార శక్తులు"గా పిలవబడే వాటికి వ్యతిరేకంగా ఇస్లామిక్ పరిపాలన, స్వాతంత్ర్యం మరియు ప్రతిఘటన సూత్రాలను అయతొల్లా ఖమేనీ దృఢంగా సమర్థించారు 

అయతొల్లా ఖమేనీ నాయకత్వం ఇరాన్‌ను ఒక ప్రాంతీయ శక్తిగా మార్చింది. అయతొల్లా ఖమేనీ దేశ క్షిపణి మరియు రక్షణ వ్యవస్థల అభివృద్ధికి, శాంతియుత అణు కార్యక్రమాలకు మద్దతు ఇచ్చారు. తన అణు కార్యక్రమం నుండి 70 రకాలకు పైగా వైద్య-శ్రేణి రేడియోఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తికి తోడ్పడ్డారు మరియు తీవ్రమైన అంతర్జాతీయ ఒత్తిడి మధ్య ఆత్మనిర్భరతను (ఆర్థిక ప్రతిఘటనను) నొక్కి చెప్పారు.

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ మద్య ఘర్షణలు తీవ్రమవుతున్న తరుణంలో అయతొల్లా ఖమేనీ అమరత్వం పొందారు. ఫిబ్రవరి 28 దాడులు ఇరాన్ నాయకత్వంలోని కీలక వ్యక్తులను హతమార్చాయి. అయినప్పటికీ, ఆ వ్యవస్థ అద్భుతమైన పునరుద్ధరణ శక్తిని ప్రదర్శించింది. ఇది వ్యక్తిగతమైనది కాదని, ప్రజాస్వామ్యంపై ఆధారపడినదని, ఇరాన్ జాతి సంకల్పమే ఇస్లామిక్ రిపబ్లిక్‌కు ఆత్మ అని నిరూపించింది. కొన్ని రోజుల తర్వాత, దేశం ఎన్నుకున్న ఉన్నత వర్గాల సభ అయతొల్లా ఖమేనీ వారసుడిని ఎంపిక చేసింది.

ఈ చారిత్రాత్మక కార్యక్రమాలకు ముందు రోజు — టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేనీ మొసల్లాలో వీడ్కోలు సభలు, రాజధాని నగరం టెహ్రాన్, ఇరాక్ (నజఫ్, కర్బలా), ఖోమ్‌లలో ఊరేగింపులు మరియు మషద్‌లో అంత్యక్రియలు — లక్షలాది మంది ఇరానియన్లు మరియు అయతొల్లా ఖమేనీ  అభిమానులు నివాళులర్పించడానికి వస్తారని అంచనా. నగరాలు నల్ల జెండాలతో అలంకరించబడ్డాయి మరియు విశ్వాసం, న్యాయం మరియు ధిక్కారానికి అంకితమైన అయతొల్లా ఖమేనీ జీవితాన్ని దేశం స్మరించుకుంటుంది.

అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు, అయతొల్లా ఖమేనీ మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యక్తుల ద్వారా కాదు, దాని ఆదర్శాల ద్వారా నిలుస్తుంది. ఇరాన్ తన రెండవ సర్వోన్నత నాయకుడికి వీడ్కోలు పలుకుతోంది, కానీ అయతొల్లా ఖమేనీ  నడిపించిన ప్రతిఘటన మార్గం కొనసాగుతూనే ఉంది.

 

మూలం-రాయిటర్స్ వార్తా సంస్థ సౌజన్యం తో

 

3 July 2026

జమీలా నిషాత్: ఒక కవయిత్రి, కార్యకర్త, మరియు మహిళా హక్కుల సమర్ధకురాలు Jamila Nishat: A poet, activist, and champion of women’s rights

 

 

హైదరాబాద్‌కు చెందిన జమీలా నిషాత్, కవయిత్రి. 'షాహీన్' అనే సామాజిక సంక్షేమ సంస్థకు నాయకత్వం వహిస్తున్నారు. జమీలా నిషాత్ తన జీవితాన్ని మహిళా హక్కుల సాధన కోసం అంకితం చేశారు.

జమీలా నిషాత్ ప్రకారం, మహిళల స్వాతంత్ర్యానికి విద్యే కీలకం. మహిళలు చదువు ద్వారా స్వయం సమృద్ధి సాధించాలి, అన్యాయం మరియు అణచివేతకు వ్యతిరేకంగా గళం విప్పాలి, మరియు ఆర్థికంగా, మానసికంగా, భావోద్వేగపరంగా తమను తాము బలోపేతం చేసుకోవాలి, తద్వారా వారు పురుషులతో సమానంగా నిలబడగలరు.

జమీలా నిషాత్ ప్రకారం, ఒక బాలిక విద్యావంతురాలు మరియు ఆర్థికంగా సమర్థురాలు అయినప్పుడు, ఆమె తన జీవితాన్ని మార్చుకోవడమే కాకుండా, తన మొత్తం కుటుంబ శ్రేయస్సును కూడా మెరుగుపరుస్తుంది జమీలా నిషాత్ ప్రకారం నేడు పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. బాలికలు ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఆర్థికంగా స్వతంత్రులుగా మారుతున్నారు.

జమీలా నిషాత్ స్థాపించిన 'షహీన్' అనే సంస్థ, హైదరాబాద్ పాత నగరంలోని సుల్తాన్ షాహి ప్రాంతంలో పనిచేస్తుంది. గృహ హింస మరియు లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్న మహిళలకు చట్టపరమైన మరియు సామాజిక మద్దతును అందించడం షహీన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం 'షహీన్'  సంస్థ అట్టడుగు వర్గాల మహిళలు, ముఖ్యంగా ముస్లిం మహిళలు, సామాజిక మరియు ఆర్థిక సవాళ్లను అధిగమించడంలో సహాయం చేయడంపై దృష్టి పెడుతుంది.

సాధికారత మరియు సామాజిక న్యాయానికి విద్యే మొదటి మెట్టు అని జమీలా నమ్ముతారు. ఓపెన్ స్కూలింగ్ కార్యక్రమాల ద్వారా బడి మానేసిన బాలికలు తిరిగి చదువు కొనసాగించేలా షహీన్ ప్రోత్సహిస్తుంది.విద్యతో పాటు, షహీన్ మహిళలకు వృత్తి శిక్షణను అందిస్తుంది.

.షహీన్ సంస్థ, ఒప్పంద వివాహాలకు వ్యతిరేకంగా చురుకుగా ప్రచారం చేయడంతో పాటు, బాల్య వివాహాల నివారణలో కీలక పాత్ర పోషించింది. దీని కార్యక్రమాల ద్వారా వేలాది మంది మహిళలు న్యాయ సహాయం, ఆర్థిక మద్దతు పొందారు.

హింసకు గురైన మహిళలకు తక్షణ సహాయం అందించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన “సఖి” కార్యక్రమాన్ని షాహీన్ నిర్వహిస్తున్నారని జమీలా వివరించారు.శారీరక, మానసిక, లేదా లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్న మహిళల కోసం సఖి వన్ స్టాప్ సెంటర్ ఒకే చోట సమగ్రమైన సేవలను అందిస్తుంది.ఈ సేవల్లో వైద్య సహాయం, న్యాయ సలహా, మానసిక మద్దతు, పోలీసు సహాయం, మరియు అత్యవసర పరిస్థితుల్లో తాత్కాలిక ఆశ్రయం వంటివి ఉన్నాయి.

జమీలా ప్రకారం, భయం, కళంకం, లేదా సామాజిక అడ్డంకుల కారణంగా ఏ మహిళ కూడా ఒంటరిగా భావించకుండా చూడటమే సఖి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

1955లో హైదరాబాద్‌లో జన్మించిన జమీలా నిషాత్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ మరియు థియేటర్ ఆర్ట్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పొందారు.

మహిళల అనుభవాలు, భావోద్వేగాలు, మరియు వారు ఎదుర్కొనే అన్యాయాలను అన్వేషించే జమీలా నిషాత్ కవిత్వానికి సాహిత్య వర్గాలలో మంచి ఆదరణ ఉంది.

మహిళల గుర్తింపులను, పోరాటాలను నిర్భయంగా వ్యక్తీకరించడమే జమీలా నిషాత్ రచనల ప్రత్యేకత. జమీలా నిషాత్ రచనలు సామాజిక స్తబ్దతకు, అసమానతలకు వ్యతిరేకంగా ఒక నిరసనగా నిలుస్తాయి.

జమీలా నిషాత్ కవితలు దఖ్నీ ఉర్దూ మాధుర్యాన్ని, హైదరాబాద్ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. సంక్షిప్తమైన, శక్తివంతమైన కవితల ద్వారా, జమీలా నిషాత్ సున్నితత్వంతో సామాజిక వేదనను చిత్రిస్తుంది.

జమీలా నిషాత్ యొక్క ప్రశంసలు పొందిన ప్రచురిత రచనలలో కొన్ని:

లవా (2000), ఇంకిషాఫ్ (2000), లమ్హే కి ఆంఖ్ (2002)

లమ్స్ కి సౌగత్ (2006), బటర్‌ఫ్లై క్యారెస్సెస్ (2015)

జమీలా నిషాత్ రాబోయే పుస్తకం, దహక్తే అంగారే (మండే నిప్పుకణికలు), ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైంది.

 సాహిత్య, సామాజిక సేవలకు గాను జమీలా నిషాత్ కు అనేక గౌరవాలు లభించాయి:

·       ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ నుండి మఖ్దూమ్ అవార్డు (1972).

·       అత్యుత్తమ సృజనాత్మక, సాహిత్య కృషికి గాను దేవి ప్రసాద్ రాయ్ చౌదరి అవార్డు (1990).

·       సాహిత్యం మరియు మీడియా ద్వారా లింగ సమస్యలు మరియు మహిళల ఆందోళనలను వెలుగులోకి తెచ్చినందుకు లాడ్లీ అవార్డు (2012).

·       'షాహీన్' ద్వారా లింగ సమానత్వం మరియు మహిళల హక్కుల కోసం చేసిన కృషికి గుర్తింపుగా మార్తా ఫారెల్ అవార్డు (2021).

·       తెలంగాణ ప్రభుత్వం నుండి ఒక ప్రత్యేక పురస్కారం (2019),

జమీలా నిషాత్ ఇంకా అనేక ఇతర స్థానిక మరియు జాతీయ గౌరవాలు అందుకున్నారు.

జమీలా నిషాత్ కేవలం తన రచనల ద్వారా మహిళలకు గొంతుకనిచ్చిన కవయిత్రి మాత్రమే కాదు; వేలాది మంది జీవితాలను మార్చిన ఒక క్షేత్రస్థాయి కార్యకర్త కూడా. తన కవిత్వం ద్వారా, జమీలా నిషాత్ కాలం చెల్లిన సామాజిక సంప్రదాయాలను సవాలు చేశారు. తన సామాజిక సేవ ద్వారా, పట్టుదల మరియు నిబద్ధత అణగారిన వర్గాలకు ఆశాదీపంగా మారగలవని జమీలా నిషాత్ నిరూపించారు.

సాహిత్యం, క్రియాశీలత కలిసి అర్థవంతమైన సామాజిక మార్పును ఎలా తీసుకురాగలవో చెప్పడానికి జమీలా నిషాత్ ప్రయాణం ఒక శక్తివంతమైన ఉదాహరణగా నిలుస్తుంది.

 

 

1 July 2026

ఇస్లాం మరియు సూఫీ తత్వం పట్ల స్వామి వివేకానంద యొక్క సానుకూల దృక్పథం Swami Vivekananda’s Warm View of Islam and Sufism

 

 

శ్రీ రామకృష్ణ పరమహంస ముఖ్య శిష్యుడు, ఆధునిక యుగంలో అద్వైత వేదాంతానికి ప్రముఖ వాణి అయిన స్వామి వివేకానంద (1863–1902), ఇస్లాంను మరియు సూఫీ తత్వమును  ప్రగాఢమైన ప్రశంసతో, నిబద్ధతతో ఆదరించారు.

స్వామి వివేకానంద, మతాలను ఒకే అంతర్లీన సత్యానికి చెందిన విభిన్న వ్యక్తీకరణలుగా చూశారు. 'స్వామి వివేకానంద సంపూర్ణ రచనలు' (The Complete Works of Swami Vivecananda) అనే గ్రంథంలో సంకలనం చేయబడిన ఆయన ఉపన్యాసాలు, లేఖలు మరియు ప్రసంగాలు, ఇస్లామును, ముఖ్యంగా సమానత్వం మరియు సోదరభావంపై దాని ప్రాధాన్యతను నొక్కి చెబుతూనే, భారతదేశ భవిష్యత్తు కోసం వేదాంత తత్వశాస్త్రంతో దాని సమ్మేళనాన్ని ఊహించాయి.

జాతి, భేదాలకు అతీతంగా సమానత్వం మరియు సోదరభావాన్ని ప్రోత్సహించినందుకు స్వామి వివేకానంద హజ్రత్ ప్రవక్త ముహమ్మద్‌(స)ను ప్రశంసించారు మానవ సమానత్వం మరియు విశ్వ సోదరభావం వంటి ఆదర్శాలను మూర్తీభవించి, ప్రోత్సహించిన సందేశహరుడిగా హజ్రత్ ప్రవక్త ముహమ్మద్(స) పట్ల స్వామి వివేకానందకు గొప్ప ఆరాధనాభావం ఉండేది. తన ఉపన్యాసాలలో, హజ్రత్ ప్రవక్త ముహమ్మద్(స) జీవితం జాతి, కులం, మతం, వర్ణం లేదా లింగ భేదాలకు అతీతంగా ముస్లింల మధ్య సంపూర్ణ సమానత్వాన్ని ప్రదర్శించిందని స్వామి వివేకానంద గమనించారు.

స్వామి వివేకానంద,  హజ్రత్ ప్రవక్త ముహమ్మద్‌ను “సమానత్వానికి, మానవ సౌభ్రాతృత్వానికి, సమస్త ముస్లింల (సోదరభావానికి) ప్రవక్త”గా అభివర్ణించారు. ఇస్లాం మనుగడ సాగించడమే దాని అంతర్గత మంచితనానికి నిదర్శనమని స్వామి వివేకానంద నొక్కిచెప్పారు: “మంచి లేకపోతే అది ఎలా జీవించగలదు? మంచి మాత్రమే జీవిస్తుంది, అది మాత్రమే మనుగడ సాగిస్తుంది.”

విశ్వాసాన్ని పంచుకునే వారందరి మధ్య సోదరభావం అనే ఆచరణాత్మక సందేశమే ఇస్లాం యొక్క ప్రధాన శ్రేష్ఠత అని స్వామి వివేకానంద గుర్తించారు. విశ్వాసులందరి మధ్య ఐక్యత మరియు ఆమోదం అనే ఇస్లాం యొక్క ఆచరణాత్మక సందేశాన్ని స్వామి వివేకానంద ప్రముఖంగా ప్రస్తావించారు.

నేపథ్య భేదం లేకుండా మతం మారిన వారిని ఇస్లాం పూర్తి సమానత్వంతో స్వాగతించే విధానాన్ని స్వామి వివేకానంద  ప్రశంసించారు. ఇదే ఇస్లాం మతం యొక్క సారాంశ స్ఫూర్తికి ప్రతీక అని స్వామి వివేకానంద భావించారు.

హిందూమతం మరియు ఇస్లాం మధ్య సంబంధంపై వివేకానంద చేసిన అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యాఖ్యలలో ఒకటి, 1898 జూన్ 10వ తేదీన అల్మోరా నుండి తన ముస్లిం మిత్రుడైన మహమ్మద్ సర్ఫరాజ్ హుస్సేన్‌కు రాసిన లేఖలో కనిపిస్తుంది. అద్వైతం (అద్వైతం) మతం యొక్క అత్యున్నత సాక్షాత్కారానికి ప్రతీక అని, ఇది అన్ని సంప్రదాయాలను ప్రేమతో చూడటానికి వీలు కల్పిస్తుందని స్వామి వివేకానంద తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇస్లాంలోనే ఆచరణాత్మక సమానత్వం మరింత సంపూర్ణంగా సాకారమైందని స్వామి వివేకానంద పేర్కొన్నారు.

భారతదేశ భవిష్యత్తు కోసం, వివేకానంద ఇలా అన్నారు: “మన మాతృభూమికి హిందూమతం మరియు ఇస్లాం అనే రెండు గొప్ప వ్యవస్థల సంగమమే ఏకైక ఆశ. వేదాంత మెదడు మరియు ఇస్లాం శరీరంతో, వైభవోపేతంగా, అజేయంగా, ఆవిర్భవించే భవిష్యత్ పరిపూర్ణ భారతదేశాన్ని నేను నా మనోనేత్రంలో చూస్తున్నాను.”

స్వామి వివేకానంద ఇస్లాం మరియు సూఫీ తత్వాన్ని సానుకూలంగా చూశారు, సమానత్వం, సోదరభావం మరియు ఆధ్యాత్మిక ఐక్యతకు అవి ఇచ్చే ప్రాధాన్యతను ప్రశంసించారు. భారతదేశానికి మరియు మానవాళికి సామరస్యపూర్వక భవిష్యత్తును నిర్మించడానికి ఈ బలాలను వేదాంతంతో మేళవించాలని స్వామి వివేకానంద ప్రతిపాదించారు. సూఫీ తత్వంలోని ఆధ్యాత్మిక లోతును మరియు ప్రేమ, ఏకత్వం వంటి వేదాంత భావనలతో దానికున్న సన్నిహిత అనుబంధాన్ని స్వామి వివేకానంద మెచ్చుకున్నారు.

ఇస్లాం యొక్క అంతర్గత, ఆధ్యాత్మిక కోణమైన సూఫీ తత్వం పట్ల వివేకానంద ప్రత్యేక ఆదరణను వ్యక్తం చేశారు. భారతదేశంలోని విద్యావంతులైన ముస్లింలు మరియు సూఫీలు ​​తరచుగా హిందూ సంస్కృతి మరియు ఆలోచనా విధానాలతో అద్భుతంగా కలిసిపోయేవారని స్వామి వివేకానంద గమనించారు:

విద్యావంతులైన మహమ్మదీయులైన సూఫీలను హిందువుల నుండి వేరుగా గుర్తించడం కష్టం; వారు గోమాంసం తినరు, మరియు ఇతర విషయాలలో మన ఆచారాలను పాటిస్తారు. వారి ఆలోచనా విధానం మన ఆలోచనలతో పూర్తిగా కలిసిపోయింది. ఈ సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక సమ్మేళనత, సూఫీ తత్వం యొక్క సామరస్య సామర్థ్యాన్ని మరియు భారతదేశపు బహుళత్వ సంప్రదాయాలతో దానికున్న అనుబంధాన్ని స్పష్టం చేసింది.

వివేకానంద తన ఉపన్యాసాలలో, విశ్వ ఆధ్యాత్మిక సత్యాలను వివరించడానికి సూఫీ ఉపమానాలను ఉపయోగించారు. వివేకానంద సూఫీ తత్వంలో త్యాగం, భక్తి, దైవ ప్రత్యక్ష అనుభవజ్ఞానం వంటి వేదాంత భావనలతో సారూప్యతలను చూశారు, ఇది మతాల మధ్య అవగాహనకు ఒక సహజ వారధిగా నిలుస్తుందని భావించారు.

తన రచనలన్నిటిలో, స్వామి వివేకానంద ప్రతి సంప్రదాయం యొక్క విశిష్టమైన తోడ్పాటును గౌరవిస్తూ ఒక సార్వత్రిక మతాన్ని ప్రతిపాదించారు. వేదాంతం యొక్క తాత్విక స్పష్టతతో పాటు ఇస్లాం యొక్క ఆచరణాత్మక సౌభ్రాతృత్వాన్ని, సూఫీ తత్వం యొక్క ఆధ్యాత్మిక లోతును ప్రముఖంగా చూపడం ద్వారా, స్వామి వివేకానంద పరస్పర సుసంపన్నత మరియు సామరస్యంతో కూడిన భవిష్యత్తును సూచించారు.  

విభిన్న ఆధ్యాత్మిక సంప్రదాయాల బలాలను కలపడం ద్వారా సామరస్యాన్ని సాధించాలని స్వామి వివేకానంద తన సందేశంలో పిలుపునిచ్చారు.ఇస్లాంకు కేంద్రమైన సమానత్వం, సోదరభావం, సూఫీ తత్వంలోని ఆధ్యాత్మిక అంతర్దృష్టులు, మరియు వేదాంత జ్ఞానంతో వాటి సంభావ్య సమ్మేళనాన్ని కీర్తించడం ద్వారా, స్వామి వివేకానంద మరింత ఐక్యమైన, ఆధ్యాత్మికంగా మేల్కొన్న ప్రపంచం వైపు ఒక ఆశాజనకమైన మార్గాన్ని అందించారు.