1 May 2026

ఖాలిద్ ఇబ్న్ యజీద్ ఇబ్న్ ముఆవియా668–704 or 709 Khalid ibn Yazid ibn Muawiya 668–704 or 709

 

Scientica Islamica 

 

ఖాలిద్ ఇబ్న్ యాజిద్ (పూర్తి పేరు అబూ హాషిమ్ ఖాలిద్ ఇబ్న్ యాజిద్ ఇబ్న్ ముయావియా ఇబ్న్ అబీ సుఫ్యాన్, అరబిక్: أبو هاشم خالد بن يزيد بن معاوية), 668-704 లేదా 709, ఉమయ్యద్ యువరాజు మరియు రసవాది.

ఖాలిద్ ఇబ్న్ యజీద్ ఇబ్న్ ముఆవియా వాక్చాతుర్యం, మేధస్సు కలవారు. ఇస్లామిక్ చరిత్ర ఖాలిద్ నాయకత్వ, పాండిత్య సామర్థ్యాలకు సాక్ష్యంగా నిలుస్తుంది. తన జీవిత చరమాంకంలో, ఖాలిద్ ఇబ్న్ యజీద్ ఇబ్న్ ముఆవియా ప్రతి వారం మూడు రోజులు ఉపవాసం ఉండేవారు.

ఖాలిద్ లెవంట్‌లోని ప్రసిద్ధ హోమ్స్ మసీదును కూడా నిర్మించారు. దాని నిర్మాణంలో నాలుగు వందల మంది బానిసలు పనిచేశారు. మసీదు నిర్మాణం పూర్తయ్యాక, ఖాలిద్ ఇబ్న్ యజీద్ ఇబ్న్ ముఆవియా అల్లాహ్ కోసం వారందరికి స్వేఛ్చ కల్పించినాడు. తన జీవిత చరమాంకంలో, ఖాలిద్ ప్రజా జీవితం నుండి వైదొలిగి, చదవడం, రాయడంపై దృష్టి సారించారు.

అరబ్ మరియు ఇస్లామిక్ ప్రపంచంలో ప్రకృతి శాస్త్రాలకు పునాదులు వేసిన వారిలో ఖాలిద్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. చాలా మంది చరిత్రకారులు ఖాలిద్ ఇస్లామిక్ నాగరికత మేధావులలో ఒకరిగా, మరియు వైద్య, రసాయన శాస్త్ర రంగాలలో ముఖ్యమైన సిద్ధాంతాలు, ఆవిష్కరణలను ప్రవేశపెట్టిన వారిలో ఒకరిగా పరిగణిస్తారు.

 గొప్ప గ్రీకు మరియు కాప్టిక్ పండితులతో నిండి ఉన్న ఈజిప్టులోని అలెగ్జాండ్రియా పాఠశాల నుండి ముస్లిమేతర పండితులను తీసుకువచ్చిన మొదటి వ్యక్తిగా ఖాలిద్ పరిగణించబడ్డాడు. ఖాలిద్ తనకూ వారికీ మధ్య విశ్వాస భేదాలను అడ్డురానివ్వలేదు; దానికి బదులుగా, వారిని దగ్గర చేసుకుని, వివిధ భాషల నుండి అరబిక్‌లోకి అనువదించడంలో వారికున్న అపారమైన నైపుణ్యం నుండి ప్రయోజనం పొందాడు.

ఖాలిద్ ఈ అనువాద గ్రంథాల నుండి అధ్యయనం చేశారు. ఖాలిద్ కు విదేశీ భాషలు తెలియకపోయినప్పటికీ, ఆయన అరబిక్‌లో అత్యంత వాక్చాతుర్యం మరియు అద్భుతమైన వక్త. ఖాలిద్, రసాయన శాస్త్రాన్ని వివిధ పరిశ్రమలకు, ముఖ్యంగా ఔషధ పరిశ్రమకు ఒక ముఖ్యమైన వనరుగా అభివృద్ధి చేశాడు.

ఫలితంగా, ఇస్లామిక్ ప్రపంచంలోని అనేక మంది పండితులు రసాయన రంగం పట్ల ఉత్సాహం కనబరిచారు, మరియు రసాయన రంగం ప్రయోగాత్మక విజ్ఞానానికి మూలంగా పరిణామం చెందింది. అరబ్ మరియు ముస్లిం పండితుల చేతుల్లో సరైన శాస్త్రీయ పద్ధతి వర్ధిల్లింది, వారిలో ముఖ్యుడు ఖాలిద్ ఇబ్న్ యజీద్ ఇబ్న్ ముఆవియా, ఖాలిద్ రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు ఖగోళ శాస్త్రం పై గొప్ప శ్రద్ధ చూపారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్ర చరిత్రకారులు ఖాలిద్ ఇబ్న్ యజీద్ ఒక వివేకవంతుడు, రసాయన శాస్త్రవేత్త, ఉత్తమ శీలం మరియు అద్భుతమైన దూరదృష్టి గలవాడని ఏకీభవించారు. ఖాలిద్ ముస్లింలలో శాస్త్రీయ ఉద్యమాన్ని ప్రారంభించిన మొదటి వ్యక్తి. ఖాలిద్ ఇబ్న్ యజీద్‌ను అరబ్ మరియు ఇస్లామిక్ రసాయన శాస్త్ర మార్గదర్శకుడిగా ఏకగ్రీవంగా పరిగణిస్తాయి. ఫాదిల్ అహ్మద్ అల్-తాయీ తన "రసాయన శాస్త్రంలో ప్రముఖ అరబ్బులు" అనే పుస్తకంలో ఖాలిద్ ఇబ్న్ యజీద్‌ను ప్రముఖంగా పేర్కొన్నారు. గ్రీకు వారసత్వాన్ని అరబిక్‌లోకి అనువదించాలని, అలాగే గ్రీకు నుండి కాప్టిక్‌లోకి అనువదించబడిన రచనలను అరబీకరణ చేయాలని ఆదేశించిన మొదటి వ్యక్తి ఖాలిద్ ఇబ్న్ యజీద్‌.

జ్ఞానాన్ని అరబిక్ భాషలోకి బదిలీ చేసి, దానిని అరబ్బులు మరియు ముస్లింలకు అందుబాటులోకి తీసుకురావడంలో ఖాలిద్ ఇబ్న్ యజీద్‌ అగ్రగామి మార్గదర్శకుడిగా సరిగ్గా పరిగణించబడ్డారు. జ్ఞానాన్ని లోతుగా అధ్యయనం చేసిన తర్వాత, ఖాలిద్ ఇబ్న్ యజీద్‌కు రసాయన శాస్త్రంపై మరియు సాధారణంగా శాస్త్రాలపై ఒక ప్రత్యేకమైన అభిరుచి ఏర్పడింది.

రసవాదంపై అనేక అరబిక్ గ్రంథాలు మరియు రసవాద కవితలు ఖాలిద్‌కు ఆపాదించబడ్డాయి

ఖాలిద్‌కు ఆపాదించబడిన కొన్ని అరబిక్ రసవాద రచనలు తరువాత 'కాలిద్' అనే లాటిన్ నామంతో లాటిన్‌లోకి అనువదించబడ్డాయి. ఈ రచనలలో ఒకటైన 'లిబర్ డి కంపోజిషన్ ఆల్కెమియా' ("రసవాద కూర్పుపై పుస్తకం"), రసవాదంపై లాటిన్‌లోకి అనువదించబడిన మొట్టమొదటి అరబిక్ రచన. దీనిని 1144లో రాబర్ట్ ఆఫ్ చెస్టర్ అనువదించారు.

ఖాలిద్‌-రసవాద రచనలు -అరబిక్ రచనలు

ఖాలిద్‌కు ఆపాదించబడిన రసవాద రచనలలో అత్యధిక భాగం పెద్ద సంఖ్యలో అరబిక్ రచనలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి.

 లాటిన్‌లో భద్రపరచబడిన కొన్ని రచనలు కూడా ఉన్నాయి.

అరబిక్ రచనలు:

• దివాన్ అల్-నుజుమ్ వా-ఫిర్దవ్స్ అల్-హిక్మా Dīwān al-nujūm wa-firdaws al-ḥikma  ("దివాన్ ఆఫ్ ది స్టార్స్ అండ్ ది పారడైజ్ ఆఫ్ విజ్డమ్",

• కితాబ్ అల్-ఉస్కుస్ Kitāb al-Usṭuqus ("The Book of the Element ("ది బుక్ ఆఫ్ ది ఎలిమెంట్")

*కితాబ్ వషియతిహి ఇలా ఇబ్నిహి ఫి అల్-షనా Kitāb Waṣiyyatihi ilā ibnihi fī al-ṣanʿa ("The Book of his Testament to his Son on the Art")[26]

Masāʾil Khālid li-Maryānus al-rāhib లేదా దాని లాటిన్ అనువాదంలో లిబర్ డి కంపోజిషన్ ఆల్కెమియే ("బుక్ ఆన్ ది కంపోజిషన్ ఆఫ్ ఆల్కెమీ") లేదా టెస్టమెంటమ్ మోరీని ("టెస్టమెంట్ ఆఫ్ మోరియనస్"),[27] బహుశా 10వ శతాబ్దం చివరి నాటిది.

• అల్-కవ్ల్ అల్-ముఫీద్ ఫి అల్-షనా అల్-ఇలాహియా ("ది ఇన్‌స్ట్రక్టివ్ వర్డ్ ఆన్ ది డివైన్ ఆర్ట్") al-Qawl al-mufīd fī al-ṣanʿa al-ilāhiyya ("The Instructive Word on the Divine Art")

Risāla fī al-Shanʿa al-sharifa wa-khawāṣṣihā ("ఉత్తమ కళ మరియు దాని లక్షణాలపై ఉపదేశం")

• పేరులేని వివిధ రసవాద గ్రంథాలు, పద్యాలు మరియు లేఖనాలు.

• కితాబ్ అల్-హరారత్ Kitāb al-Ḥarārāt

• కితాబ్ అల్-సహీఫా అల్-కబీర్ Kitāb al-Ṣaḥīfa al-kabīr

• కితాబ్ అల్-సహీఫా అల్-షగీర్ Kitāb al-Ṣaḥīfa al-ṣaghīr

లాటిన్ రచనలుLatin works

ఖలీద్‌కు ఆపాదించబడిన అనేక లాటిన్ రసవాద రచనలు కూడా ఉన్నాయి, ఈ రచనలలో అతని పేరు కాలిడ్ ఫిలియస్ జాజిడిగా లాటిన్ చేయబడింది.

·         వీటిలో ఒకటి  *Liber de compositione alchemiae* ("రసవాద కూర్పుపై గ్రంథం"Liber de compositione alchemiae ("Book on the Composition of Alchemy",—పైన పేర్కొన్న *Masāʾil Khālid li-Maryānus al-rāhib* గ్రంథానికి అనువాదం),.రెండోది  Risāla ("Epistle) 

·         ఇతర లాటిన్ రచనలు:

·         Liber secretorum alchemiae ("The Book of the Secrets of Alchemy")

·         Liber trium verborum ("The Book of the Three Words")

 

 

 

.

భారతదేశంలో తపాలా సేవ ప్రారంబించినది అలావుద్దీన్ ఖిల్జీ postal service in India started by Alauddin Khilji

 

'भारतीय डाक 00 00OO India Post ALAUDDIN KHILJI STARTED THE POSTAL SERVICES -IN IN INDIA- भारठीव भारतीयडाक डाक NDIA POST' అని చెప్తున్న వచనం చిత్రం కావచ్చు


భారతదేశంలో తపాలా సేవ గురించి మొట్టమొదటిసారిగా నమోదు చేయబడిన ప్రస్తావన మొఘల్ చరిత్రకారుడు జియావుద్దీన్ బరానీ ద్వారా చేయబడింది. జియావుద్దీన్ బరానీ రాసిన దాని ప్రకారం, అలావుద్దీన్ ఖిల్జీ (పాలన 1296-1316) 1296 నాటికే 'హర్కారా' అని పిలువబడే ఒక క్రమబద్ధమైన పాదచారి సేవను ఏర్పాటు చేశాడు. ఈ హర్కారాలు,  గంటలు ఉన్న ఒక దండాన్ని baton with bells పట్టుకుని, కేటాయించిన భూభాగం అంతటా పరుగెత్తేవారు. ప్రతి మైలుకు పరుగెత్తేవారు మారుతూ, రిలే పద్ధతిలో వారు ఉత్తరాలను చేరవేసేవారు.

ఇండియన్ పోస్ట్ యొక్క అధికారిక వెబ్‌సైట్, అలాగే ఢిల్లీలోని దాని మ్యూజియం లో కూడా అలావుద్దీన్ ఖిల్జీ ప్రస్తావన కలదు..

29 April 2026

ఖాన్ బహదూర్ నవాబ్జాదా సయ్యద్ అష్రఫుద్దీన్ అహ్మద్ 1855-1929 ख़ान बहादुर नवाबज़ादा सैयद अशरफ़ुद्दीन अहमद 1855-1929

 


ఖాన్ బహదూర్ నవాబ్జాదా సయ్యద్ అష్రఫుద్దీన్ అహ్మద్ బీహార్‌లోని పాట్నా జిల్లా, బర్హ్ నివాసి. సయ్యద్ అష్రఫుద్దీన్ అహ్మద్ 1855 జనవరిలో జన్మించారు. సయ్యద్ అష్రఫుద్దీన్ అహ్మద్ తండ్రి, నవాబ్ సయ్యద్ అమీర్ అలీ ఖాన్ బహదూర్, అవధ్ నవాబులకు దివాన్‌గా ఉండేవారు. 1857 విప్లవ సమయంలో, నవాబ్ సయ్యద్ అమీర్ అలీ ఖాన్ బహదూర్ ను ఒక అధికారిగా పాట్నాకు పంపారు మరియు ఉరిశిక్ష నుండి చాలా మంది విప్లవకారులను కాపాడారని విలియం టేలర్ తన పుస్తకంలో వివరించారు.

సయ్యద్ అష్రఫుద్దీన్ అహ్మద్ తన ప్రాథమిక విద్యను కలకత్తా మదర్సాలో అభ్యసించి, ఆ తర్వాత డోవెటన్ కళాశాలలో చేరారు. సయ్యద్ అష్రఫుద్దీన్ అహ్మద్ చిన్న వయసులోనే 1875 నుండి 1908 వరకు హుగ్లీ ఇమాంబారాకు ముతవల్లీగా పనిచేస్తూ, రాణించారు. సయ్యద్ అష్రఫుద్దీన్ అహ్మద్ ఉర్దూ మరియు పర్షియన్ భాషలలో అనేక పుస్తకాలను రచించారు, వాటిలో 1883లో 'నవరత్న' మరియు 1889లో 'దుర్ద్నా-ఎ-ఖయాల్, తబకాత్-ఎ-మొహ్సినియా' तबाक़ात मोहसिनिया ఉన్నాయి.

సయ్యద్ అష్రఫుద్దీన్ అహ్మద్ 1890లో కలకత్తా విశ్వవిద్యాలయంలో ఫెలో అయ్యారు. సయ్యద్ అష్రఫుద్దీన్ అహ్మద్ ఢాకా విశ్వవిద్యాలయం వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. మరియు అలీగఢ్ కళాశాలకు ట్రస్టీగా ఉన్నారు. 1922లో ఓరియంటల్ కాన్ఫరెన్స్ నిర్వహణ స్వాగత కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. సయ్యద్ అష్రఫుద్దీన్ అహ్మద్ హుగ్లీ మహమ్మదీయ సంఘానికి కార్యదర్శిగా మరియు హుగ్లీ మునిసిపాలిటీకి కౌన్సిలర్‌గా కూడా ఉన్నారు. సయ్యద్ అష్రఫుద్దీన్ అహ్మద్ కు 1893లో ఖాన్ బహదూర్ బిరుదు లభించింది. ఆయనకు 1903లో గౌరవ పత్రం (సర్టిఫికెట్ ఆఫ్ ఆనర్) ప్రదానం చేయబడింది.

1923లో సయ్యద్ అష్రఫుద్దీన్ అహ్మద్ బీహార్ మరియు ఒరిస్సా హజ్ కమిటీకి అధ్యక్షుడయ్యారు. 1924లో సయ్యద్ అష్రఫుద్దీన్ అహ్మద్ బీహార్ మరియు ఒరిస్సా శాసన మండలి సభ్యునిగా నామినేట్ అయ్యారు మరియు ఏప్రిల్ 1926లో బీహార్ మరియు ఒరిస్సా నుండి కేంద్ర శాసనసభకు అనధికార సభ్యునిగా నామినేట్ అయ్యారు. జూలై 1929లో, సర్ ఉమర్ హయత్ ఖాన్ స్థానంలో సయ్యద్ అష్రఫుద్దీన్ అహ్మద్ రాజ్య మండలి సభ్యునిగా నామినేట్ అయ్యారు, మరియు అక్టోబర్ 1929లో ఖాన్ బహదూర్ నవాబ్జాదా సయ్యద్ అష్రఫుద్దీన్ అహ్మద్ కన్నుమూశారు. సయ్యద్ అష్రఫుద్దీన్ అహ్మద్ ఏకైక కుమారుడైన సయ్యద్ అలీ నవాబ్, ఆ తర్వాత హుగ్లీ ఇమాంబారాకు ముతవల్లీ అయ్యారు.

 

 

సయ్యద్ మహమ్మద్ జమీన్ అలీ నఖ్వీ/జమీన్ అలీ1893-1955 Syed Mohammed Zamin Ali Naqvi/Zamin Ali1893-1955

 



జమీన్ అలీగా ప్రసిద్ధి చెందిన సయ్యద్ మొహమ్మద్ జమీన్ అలీ నఖ్వీ (1893-1955) ఉర్దూ కవి, రచయిత మరియు విద్యావేత్త. ఫిరాక్ గోరఖ్‌పురి మరియు ఇతరులు జమీన్ అలీని "బాబా-ఎ-ఉర్దూ" లేదా ఉర్దూ తండ్రి అని పిలుస్తారు.

విద్యావేత్తగా, జమీన్ అలీ 1924లో అలహాబాద్ విశ్వవిద్యాలయంలో అవిభాజ్య భారతదేశంలో మొదటి ఉర్దూ విభాగాన్ని స్థాపించాడు, భారతదేశం అంతటా ప్రాథమిక స్థాయి నుండి పీహెచ్‌డీ స్థాయిల వరకు ఉర్దూ విద్యను క్రమబద్ధీకరించాడు.

కవిగా, "జమీన్" అనే కలం పేరుతో, జమీన్ అలీ రచించిన కవితా సంకలనాలలో గజలియత్-ఎ-జమీన్, కలామ్-ఎ-జమీన్, మరియు మజ్మూఆ-ఎ-ఖసైద్-ఓ-సలామ్ ఉన్నాయి.

జమీన్ అలీ 1893 జూన్ 25న యునైటెడ్ ప్రావిన్సెస్‌లోని రాయ్‌బరేలీ జిల్లాలోని ముస్తఫాబాద్ గ్రామంలో, షియా సయ్యద్ జమీందార్ మజీద్ సయ్యద్ వాజిద్ అలీ యొక్క చిన్న కుమారుడు. జమీన్ అలీ తాత సయ్యద్ నౌరోజ్ అలీ, అమ్మమ్మ ఉస్తాద్ మీర్ అలీ ఒబైద్ "నైసా", మరియు అన్నయ్య సయ్యద్ హమీద్ అలీ ప్రసిద్ధ ఉర్దూ కవులు. జమీన్ అలీ 13 సంవత్సరాల వయస్సులో, లక్నో కవిత్వ సంప్రదాయాలను అనుసరించి "నైసా" మార్గదర్శకత్వంలో నజ్మ్‌లు మరియు గజల్స్ రచించడం ప్రారంభించాడు.

జమీన్ అలీ ఆగ్రాలోని సెయింట్ జాన్స్ కళాశాల నుండి జమీన్ అలీ (10వ తరగతి) మరియు 1910లో ఇంటర్మీడియట్ (12వ తరగతి) డిగ్రీని పొందాడు. ఆ తర్వాత జమీన్ అలీ 1916లో అలహాబాద్‌లోని ఇవింగ్ క్రిస్టియన్ కళాశాల నుండి బి.ఏ., మరియు 1922లో అలహాబాద్‌లోని ముయిర్ కళాశాల నుండి పర్షియన్‌లో ఎం.ఏ. పట్టాలను పొందాడు.

జమీన్ అలీ 1922లో పర్షియన్ బోధించడానికి ఇవింగ్ క్రిస్టియన్ కళాశాల అధ్యాపక బృందంలో చేరాడు మరియు 1924లో అలహాబాద్ విశ్వవిద్యాలయం యొక్క పర్షియన్ విభాగంలో లెక్చరర్‌గా నియమితుడయ్యాడు.

జమీన్ అలీ ఉర్దూ భాష, సాహిత్యంపై తనకున్న ప్రేమ కారణంగా, అలహాబాద్ (ప్రస్తుతం ప్రయాగ్రాజ్)లో నివసించాలని నిర్ణయించుకున్నాడు మరియు తన జమీందారీ ఆస్తులకు దూరంగా ఉన్నాడు.

1922లో, అలహాబాద్ విశ్వవిద్యాలయంలోని పర్షియన్ విభాగంలో అధ్యాపకుడిగా చేరిన జమీన్ అలీ, ఉర్దూతో పాటు హిందీకి కూడా ప్రత్యేక విభాగాలు ఉండాలని ప్రతిపాదించారు. ఆ సమయంలో, అవిభక్త భారతదేశంలోని ఏ విశ్వవిద్యాలయంలోనూ ఉర్దూ విభాగం ఉండేది కాదు మరియు ఉర్దూ తరచుగా ఓరియంటల్ స్టడీస్ లేదా పర్షియన్ వంటి విభాగాలలో భాగంగా ఉండేది.

జమిన్ అలీ ప్రతిపాదనను ఉపకులపతి సర్ గంగానాథ్ ఝా ఆమోదించడంతో, 1924లో ఉర్దూ శాఖ స్థాపించబడింది. జమీన్ అలీ ఉర్దూ శాఖకు అధిపతిగా నియమితులయ్యారు; 1955లో తన మరణం వరకు జమీన్ అలీ ఆ పదవిలో కొనసాగారు. 1932లో జమీన్ అలీ 'రీడర్'గా, 1945లో 'ప్రొఫెసర్'గా నియమితులయ్యారు.

జమిన్ అలీ ఉర్దూలో M.A. మరియు Ph.D. కోర్సులను రూపొందించారు. సాహిత్య రంగంలో విశేష కీర్తి గడించిన జమీన్ అలీ ప్రముఖ శిష్యులలో సయ్యద్ ఇజాజ్ హుస్సేన్, నవాబ్ హుస్సేన్, సయ్యద్ వకార్ అజీమ్, రఫీక్ హుస్సేన్, జ్ఞాన్ చంద్ జైన్, మసీహుజ్జమాన్ మరియు ఫాతిమా అక్తర్  ఉన్నారు.

జమీన్ అలీ "నైసా"  అనే ఒక ప్రచురణను ప్రారంభించారు; ఇది ఉర్దూ శాఖ యొక్క ప్రధాన వార్షిక పత్రికగా వెలువడేది. అంతేకాకుండా, అలహాబాద్ విశ్వవిద్యాలయ వార్షిక పత్రికలోని ఉర్దూ విభాగానికి కూడా జమీన్ అలీ సంపాదకత్వం వహించారు

భారత జాతీయ భాషగా హిందుస్తానీని (నాగరి మరియు ఉర్దూ లిపులు రెండింటిలోనూ రాసే విధంగా) తీర్చిదిద్దాలన్న మహాత్మా గాంధీ ఆశయాన్ని సాకారం చేసేందుకు 1927లో స్థాపించబడిన 'హిందుస్తానీ అకాడమీ'లో జామిన్ వ్యవస్థాపక సభ్యుడిగా మరియు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు

1927 మార్చి 30న లక్నోలో జరిగిన అకాడమీ మొదటి సమావేశంలో, ఉర్దూ మరియు హిందీ సర్వే కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. జామిన్ ఉర్దూ సర్వే కమిటీకి నాయకత్వం వహించి, 'ఉర్దూ జబాన్-ఓ-అదబ్'  అనే నివేదికను రూపొందించారు. ఈ గ్రంథం ఉర్దూ భాషాశాస్త్రాన్ని క్లుప్తంగా వివరిస్తుంది;

1928 నవంబర్ 17న మహాత్మా గాంధీ అలహాబాద్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి, జామిన్ మరియు అకాడమీ చేస్తున్న కృషిని ఎంతగానో ప్రశంసించారు.

1931లో హిందుస్తానీ అకాడమీ స్థాపించబడినప్పటి నుండి 1945 వరకు హిందుస్తానీ పత్రిక యొక్క ఉర్దూ సంచికను రూపొందించడానికి జమీన్ బాధ్యత వహించారు.

ఒక విశ్వవిద్యాలయంలో మొట్టమొదటి ఉర్దూ విభాగాన్ని స్థాపించిన తర్వాత, జమీన్ అలీ అవిభక్త భారతదేశం అంతటా అన్ని స్థాయిల ఉర్దూ విద్య కోసం, అలాగే ఇతర సబ్జెక్టులలో ఉర్దూ మాధ్యమ విద్య కోసం పాఠ్య ప్రణాళికల రూపకల్పన మరియు పాఠ్యపుస్తకాల రచనకు నాయకత్వం వహించారు.

లబించిన బిరుదులు:

ఫిరాక్ గోరఖ్‌పురి మరియు ఇతరులు నాలుగు దశాబ్దాల పాటు జమీన్ అలీ ను బాబా-ఎ-ఉర్దూ (ఉర్దూ పితామహుడు) మరియు ఖిజర్-ఎ-రాహ్ ఉర్దూ (ఉర్దూ మార్గదర్శి) అని పిలిచారు.

ఉర్దూ విద్యకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా, భారత ప్రభుత్వం 1980 జూన్ 25న జమీన్ అలీ గౌరవార్థం ఒక తపాలా బిళ్లను జారీ చేసింది.

ఉర్దూకు జమీన్ అలీ చేసిన సేవలకు గుర్తింపుగా, బ్రిటిష్ ప్రభుత్వం 1946లో జమీన్ అలీ కు M.B.E పతకం (మెంబర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్) యొక్క పౌర పురస్కారాన్ని ప్రదానం చేసింది.

జామిన్, యునైటెడ్ ప్రావిన్సెస్ బోర్డ్ ఆఫ్ హై స్కూల్ & ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మరియు రాజపుతానా, మధ్య భారతదేశంతో పాటు ప్రస్తుత మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్‌లను పరిధిలోకి తీసుకున్న రాజపుతానా బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌తో సహా వివిధ విద్యా బోర్డులకు ఛైర్మన్‌గా లేదా సభ్యుడిగా పనిచేశారు. జమీన్ అలీ ఆగ్రా విశ్వవిద్యాలయం మరియు అలహాబాద్ విశ్వవిద్యాలయంతో సహా అనేక విశ్వవిద్యాలయాలలో ఉర్దూ అధ్యయన బోర్డులలో కూడా పనిచేశారు.

ఉర్దూలో పాఠ్యపుస్తకాలు రాయమని ఇతరులను ప్రోత్సహించడమే కాకుండా, జమీన్ అలీ స్వయంగా అనేక పాఠ్యపుస్తకాలను రచించారు. వాటిలో గత 3 శతాబ్దాలుగాని ముఖ్యమైన కవుల రచనల నుండి ఎంపిక చేసిన ఉర్దూ షాయరీ (4 సంపుటాలు), ప్రాథమిక విద్యలో ఉపయోగించేందుకు వీలుగా 'గౌహర్-ఎ-సిలోన్' వంటి పఠనీయ గ్రంథాలు ఉన్నాయి. ప్రస్తావించదగిన ఇతర పాఠ్యపుస్తకాలు 'ఖత్-ఎ-షికస్ట్' మరియు 'ఇంతీఖాబ్-ఎ-మైరాజ్'. ఆంగ్ల భాష ఆధిపత్యం నానాటికీ పెరుగుతున్న సమయంలో, జమీన్ అలీ 'ఫర్యాద్-ఎ-ఉర్దూ' (Faryaad-e-Urdu) అనే నజ్మ్‌ను రచించారు

.జమిన్ కృషి ఫలితంగా, ఉర్దూ కేవలం రచయితలు మరియు సాధారణ ప్రజలు ఉపయోగించే భాష నుండి, ఉర్దూ సాహిత్యం మరియు భాష వ్యవస్థీకృతమై, అధికారికంగా బోధించబడే స్థాయికి ఎదిగింది. 55 భారతీయ విశ్వవిద్యాలయాలలో ఏర్పడిన ఉర్దూ విభాగాలు మరియు భారతదేశం అంతటా వేలాది పాఠశాలల్లో ఉర్దూ బోధించడం ప్రారంభించారు.

జమీన్ కవితా రచనలలో గజాలియాత్-ఎ-జమీన్, కలాం-ఎ-జమిన్, కుల్లియత్-ఎ-హజ్రత్ జమీన్ మరియు మజ్మువా కసైద్-ఓ-సలామ్ ఉన్నాయి. జమీన్ పుస్తకం, గజలియత్-ఎ-జైన్‌ అతని కాలంలోని అత్యున్నత శ్రేణి కవిత్వానికి ఒక ప్రామాణిక ఉదాహరణ.

జామిన్ అలహాబాద్‌లోని తన నివాసమైన కాషన్-ఎ-అదాబ్‌లో నెలవారీ ముషాయిరాను నిర్వహించేవాడు. ఇందులో పాల్గొనడానికి ప్రసిద్ధ కవులు హఫీజ్ జలంధరి, రూష్ సిద్ధిఖీ, సాయిల్ దెహ్ల్వీ, కైఫీ అజ్మీ, హదీ మచ్లిషహ్రీ, సఫీ లఖ్నవీ, బేఖుద్ మొహానీ, మహషర్ లఖ్నవీ, జిగర్ మొరాదాబాదీ, ఫిరాఖ్ గోరఖ్‌పురి, మరియు జోష్ మలిహాబాదీ వంటి వారు ఉన్నారు.

ఫిరాక్ గోరఖ్‌పురి సహకారంతో, 1937లో అలహాబాద్ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని జమీన్ ఒక 'అఖిల భారత ముషాయిరా'ను నిర్వహించారు; ఇందులో భారతదేశం నలుమూలల నుండి కవులు పాల్గొన్నారు.

 

జమీన్‌కు లభించిన ప్రశంసలు

Ø జమీన్ అలీ తన జీవితకాల కృషికి గాను జాతీయ నాయకుల నుండి, అలాగే ఇతర కవుల నుండి అనేక సానుకూల ప్రశంసలను అందుకున్నారు.

Ø "ఆయన సాన్నిహిత్యంలో గడిపిన సమయం ఎంతో ఆనందదాయకం. తన మెరుపులాంటి మేధస్సుతో ఉర్దూ భాషాభివృద్ధి కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తూ ఆయన ఎప్పుడూ అగ్రభాగాన నిలిచారు."— జవహర్‌లాల్ నెహ్రూ, భారత ప్రధానమంత్రి (1955)

Ø "ఆయన ఒక విజయవంతమైన ఉపాధ్యాయుడు, గొప్ప పండితుడు మరియు అత్యంత సంస్కారవంతుడు. ఆయన ప్రవర్తన, ఔదార్యం ఆయనతో పరిచయం ఏర్పడిన వారిపై చెరగని ముద్ర వేశాయి."— డాక్టర్ జాకీర్ హుస్సేన్, భారత రాష్ట్రపతి, 1955

Ø "ప్రొఫెసర్ అలీ ఒక ప్రఖ్యాత ఉర్దూ పండితుడు; భారతదేశంలో ఉర్దూ భాషాభివృద్ధికి ఆయన విశేష సేవలు అందించారు. ఆయన తన కాలంలో ఒక ప్రముఖ వ్యక్తిగా వెలుగొందారు."— ఇందిరా గాంధీ, భారత ప్రధానమంత్రి, 1974

Ø "దేశంలో ఉర్దూ భాషా సాహిత్యాల అభివృద్ధికి ఎంతో కృషి చేసిన తొలితరం మహామహులలో ప్రొఫెసర్ అలీ ఒకరు."— ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, భారత రాష్ట్రపతి, 1974

Ø "భారతదేశంలో ఉర్దూ భాషాభివృద్ధికి మార్గదర్శకుడిగా ఆయన ప్రకాశిస్తారు. ఆయన ప్రతిభ బహుముఖమైనది; ఆయన జ్ఞానం విశ్వకోశం (encyclopedia) అంత విస్తృతమైనది, అగాధమైన లోతు కలిగినది మరియు అద్భుతమైన కచ్చితత్వం కలిగినది."— రఘుపతి సహాయ్ "ఫిరాక్ గోరఖ్‌పురి", భారతీయ కవి, 1974

Ø "షాజహాన్ తన ప్రేమకు చిహ్నంగా తాజ్ మహల్‌ను నిర్మించినట్లే, జమీన్ తన దేశం, ప్రజలు మరియు భావి తరాల కోసం ఉర్దూను ఒక పరిపూర్ణమైన అధ్యయన శాస్త్రంగా, ఒక ప్రత్యేక విభాగాన్నిగా తీర్చిదిద్దారు."— కైఫీ ఆజ్మీ, భారతీయ కవి మరియు గేయ రచయిత, 1974

Ø "ప్రొఫెసర్ జమీన్ అలీ పాండిత్యానికి, మానవీయ విలువలకు ఒక మూర్తీభవించిన రూపం. ఆయన ఉన్నతమైన సద్గుణాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు; భారతదేశంలో ఉర్దూ భాషాభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారు." — హరివంశరాయ్ బచ్చన్, భారతీయ కవి మరియు రచయిత, 1974

Ø "ప్రొఫెసర్ అలీ పాండిత్య లోకంలో ఒక తేజోవంతమైన తార; ఆయన జ్ఞాన గాంభీర్యం ఎందరినో ఆకట్టుకుంది, ప్రభావితం చేసింది. ఆయన కుల, మత లేదా వర్ణ వివక్షలకు అతీతులు."-సుమిత్రానందన్ పంత్, భారతీయ కవి, 1974