5 June 2026

2026 FIFA ప్రపంచ కప్‌లో ఆడనున్న భారతీయ మూలాలున్న ఫుట్‌బాల్ క్రీడాకారులు తహసీన్, నిషాన్ Tahsin, Nishan, Indian origin footballers, to play in 2026 FIFA World Cup

 


2026 FIFA ప్రపంచ కప్ జూన్ 11, 2026న ప్రారంభం కానుంది 2026 FIFA ప్రపంచ కప్‌కు భారత్ అర్హత సాధించనప్పటికీ, భారతీయ మూలాలున్న తహసీన్ మహమ్మద్ జంషీద్ మరియు నిషాన్ వేలుపిల్లై అనే ఇద్దరు ఫుట్‌బాల్ క్రీడాకారులు 2026 ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లో ఆడబోతున్నారు; అయితే వీరు భారత్ తరపున కాకుండా, ప్రస్తుతం తాము నివసిస్తున్న దేశాల తరపున ఆడనున్నారు.

తహసీన్ మహమ్మద్ జంషీద్

19 ఏళ్ల తహసీన్ మహమ్మద్ జంషీద్, 2026 FIFA ప్రపంచ కప్ కోసం ఖతార్ జట్టులో ఎంపికైన భారతీయ మూలాలున్న మొదటి ఫుట్‌బాల్ క్రీడాకారుడు.

తహసీన్ తల్లిదండ్రులు జంషీద్ మరియు షైమా 1996లో కేరళలోని కన్నూర్ నుండి ఖతార్‌లోని దోహాకు వలస వెళ్లారు. తహసీన్ జూన్ 16, 2006న దోహాలో జన్మించాడు.

వింగర్ winger అయిన తహసీన్ ఖతార్‌లోని 'ఆస్పైర్ అకాడమీ' ద్వారా ఎదిగాడు మరియు ప్రస్తుతం 'అల్ దుహైల్ స్పోర్ట్స్ క్లబ్' తరపున ఆడుతున్నాడు.

ఖతార్ తరపున సీనియర్, U23, U20 మరియు ఇతర యువ స్థాయి జట్లకు ప్రాతినిధ్యం వహించిన తహసీన్, ఆ దేశపు అత్యుత్తమ యువ ప్రతిభావంతులలో ఒకరిగా పరిగణించబడుతున్నాడు. తహసీన్ ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఖతార్ తరపున సీనియర్ జట్టులో ఆడి అరంగేట్రం చేశాడు.

అకౌంటెంట్‌గా పనిచేస్తున్న తహసీన్ తండ్రి జంషీద్ కూడా ఒక ఫుట్‌బాల్ క్రీడాకారుడు; జంషీద్ గతంలో కేరళలోని కాలికట్ యూనివర్సిటీ తరపున ఆడారు.

నిషాన్ వేలుపిల్లై

2026 ఫుట్‌బాల్ ప్రపంచ కప్ కోసం ప్రకటించిన 26 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టులో నిషాన్ వేలుపిల్లై (25) స్థానం ఖరారైంది.

'మెల్బోర్న్ విక్టరీ' క్లబ్ వింగర్ అయిన నిషాన్, మే 7, 2001న ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో జన్మించాడు. నిషాన్ వేలుపిల్లై తండ్రి ససినాథ్ వేలుపిళ్లై శ్రీలంక తమిళ మూలాలున్న మలేషియా దేశస్థుడు కాగా, తల్లి గిలియన్ ఆంగ్లో-ఇండియన్.

నిషాన్ 2024లో ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేశాడు మరియు చైనాతో జరిగిన ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో తన తొలి ప్రదర్శనలోనే గోల్ సాధించాడు. అప్పటి నుండి, నిషాన్ ఆస్ట్రేలియా జాతీయ ఫుట్‌బాల్ జట్టులో కీలక సభ్యుడిగా మారాడు.

ప్రపంచ కప్‌కు ఎంపికవడంతో, ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లో ఆడే తమిళ మూలాలున్న మొదటి ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా వేలుపిళ్లై నిలవనున్నాడు.

కాంగ్రెస్ నాయకుడు మరియు, ఎంపీ శశి థరూర్ ఖతార్ మరియు ఆస్ట్రేలియా జాతీయ జట్లలో తహసీన్ మహమ్మద్ జంషీద్ మరియు నిషాన్ వేలుపిల్లై ఎంపిక భారత్‌కు కూడా గర్వకారణమని పేర్కొన్నారు.

"వీరు వికాష్ ధోరాసూ Vikash Dhorasoo అడుగుజాడల్లో నడుస్తున్నారు. అద్భుతమైన నైపుణ్యం కలిగిన మిడ్‌ఫీల్డర్ అయిన ధోరాసూ పూర్వీకులు ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం ప్రాంతానికి చెందినవారు (వారు మొదట మారిషస్‌కు, ఆ తర్వాత ఫ్రాన్స్‌కు వలస వెళ్లారు). ధోరాసూ 2006లో జర్మనీలో జరిగిన ఫిఫా ప్రపంచ కప్‌లో ఫ్రాన్స్ జాతీయ జట్టు తరపున ఆడి, రన్నరప్ పతకాన్ని గెలుచుకున్నారు" అని థరూర్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

2026 ఫిఫా ప్రపంచ కప్ జూన్ 11, 2026న ప్రారంభం కానుండగా, దీని ఫైనల్ మ్యాచ్ జూలై 19, 2026న జరగనుంది.

4 June 2026

బారిస్టర్ మహమ్మద్ యాసీన్ నూరీ(1895-1971). Barrister Mohammed Yaseen Nurie(1895-1971).

 

 

ఎం.వై. నూరీగా ప్రసిద్ధికెక్కిన  బారిస్టర్ మహమ్మద్ యాసీన్ నూరీ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, కార్మిక సంఘ నాయకుడు మరియు భారతదేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన ఒక ప్రముఖ ముస్లిం నాయకుడు.

 "పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నాను నేరుగా ఎదుర్కొన్న, గుర్తింపులేని వీరుడు, మరచిపోయిన స్వాతంత్ర్య సమరయోధుడు" బారిస్టర్ మహమ్మద్ యాసీన్ (ఎం వై) నూరీ (1895-1971).

మహమ్మద్ యాసీన్ (ఎం వై) నూరీ మహమ్మదన్ ఆంగ్లో-ఓరియంటల్ కళాశాలలో (1920 నుండి అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం) విద్యాభ్యాసం చేసి, ఇంగ్లాండ్ నుండి బారిస్టర్ పట్టా పొంది, క్విట్ ఇండియా ఉద్యమం (1942) సమయంలో రెండు సంవత్సరాలు జైలులో ఉన్నారు.  

నూరీ, మహమ్మద్ అలీ జిన్నాకు మరియు ముస్లిం లీగ్ యొక్క విభజనవాద తత్వానికి తీవ్ర వ్యతిరేకి. జిన్నాను ఎంతగా వ్యతిరేకించారంటే జిన్నా నూరీని "నా అత్యంత తీవ్రమైన పోటీదారుడు" అని పిలిచారు;

 గుజరాత్‌తో సహా బొంబాయి రాష్ట్రానికి చెందిన 1937 ప్రాంతీయ ఎన్నికలలో అహ్మదాబాద్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, 1937 నుండి 1939 వరకు ప్రీమియర్ బి.జి. ఖేర్ మంత్రివర్గంలో నూరీ, ప్రజా పనుల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. నూరీ తన పదవీకాలంలో, మెరైన్ డ్రైవ్ ("క్వీన్స్ నెక్లెస్") వంటి ముంబైలోని ప్రసిద్ధ ప్రదేశాల ప్రారంభ అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల పర్యవేక్షణలో కీలక పాత్ర పోషించారు.

జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్, సయ్యద్ మహమూద్ (విదేశీ వ్యవహారాల మంత్రి), వి.కె. కృష్ణ మీనన్ (రక్షణ మంత్రి), ఎస్.కె. పాటిల్ (రవాణా మరియు సమాచార శాఖ మంత్రి) వంటి ప్రముఖులు నూరీ కు రాసిన లేఖలు, జాతీయ మరియు మహారాష్ట్ర రాజకీయాలలో నూరీ ప్రాముఖ్యతకు నిదర్శనంగా నిలుస్తాయి.

తన చేతివ్రాత లేఖలో (నవంబర్ 17, 1956), నెహ్రూ తన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు నూరీకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.

నూరీ పత్రాలలో, బైకుల్లాలోని చారిత్రాత్మక ఖిలాఫత్ హౌస్‌ను హజ్ యాత్రికుల కోసం ముసాఫిర్‌ఖానాగా మార్చాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా నూరీ దాఖలు చేసిన ఒక వివరణాత్మక నిరసన లేఖ కూడా ఉంది. " నూరీ నిరసన కారణంగానే ఖిలాఫత్ హౌస్, హజ్ హౌస్‌గా మారలేదు (అది చాలా కాలం తర్వాత క్రాఫోర్డ్ మార్కెట్ సమీపంలో నిర్మించబడింది). నూరీ సాహెబ్ ఖిలాఫత్ ఉద్యమానికి సేవ చేశారు అని ప్రస్తుతం ఖిలాఫత్ హౌస్ పునరాభివృద్ధిలో నిమగ్నమై ఉన్న ఖిలాఫత్ హౌస్ ట్రస్టీ రౌఫ్ పఠాన్ పేర్కొన్నారు.

నూరి  ఖిలాఫత్ ఉద్యమానికి చురుకుగా సేవ చేశారు మరియు సమ్మిళిత జాతీయవాదం, లౌకిక ఐక్యత కోసం ఒక కీలక స్వరంగా నిలిచారు.

 

 

1 June 2026

బేగం హజ్రత్ మహల్ జాతీయ స్కాలర్‌షిప్ పథకం Begum Hazrat Mahal National Scholarship Scheme

 

 


కేంద్ర ప్రభుత్వ బేగం హజ్రత్ మహల్ జాతీయ స్కాలర్‌షిప్ పథకం కింద ప్రభుత్వం భారతదేశంలోని మతపరమైన మైనారిటీలకు చెందిన యువతుల విద్యా ఖర్చులను భరిస్తుంది మరియు వారు చదువు మానేయకుండా చూస్తుంది.

బేగం హజ్రత్ మహల్ జాతీయ స్కాలర్‌షిప్ పథకం సిక్కులు, జైనులు, పార్సీలు, బౌద్ధులు మరియు క్రైస్తవులతో సహా ఆరు మతాలకు చెందిన బాలికల కోసం ఉద్దేశించినప్పటికీ, ఇది ప్రధానంగా ముస్లిం బాలికలలో అధిక సంఖ్యలో ఉన్న డ్రాపౌట్ రేటును పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

గతంలో 'మౌలానా ఆజాద్ నేషనల్ స్కాలర్‌షిప్ ఫర్ మెరిటోరియస్ గర్ల్స్'గా పిలువబడిన ఈ పథకం, దాని కొత్త రూపంలో, విద్యాపరంగా రాణించినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా పురోగతికి ఆటంకం ఎదుర్కొంటున్న విద్యార్థినులకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తుంది.

బేగం హజ్రత్ మహల్ జాతీయ స్కాలర్‌షిప్ పథకాన్ని 2003లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయ్ ప్రారంభించారు.ఈ పథకం కింద, 9 మరియు 10 తరగతులలో చదువుతున్న లబ్ధిదారులు ₹5,000 స్కాలర్‌షిప్‌కు అర్హులు. 11, 12 తరగతులలోని వారికి ₹6,000 లభిస్తాయి.

ఈ మొత్తం నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేయబడుతుంది. ఈ స్కాలర్‌షిప్ నిధులను పాఠశాల లేదా కళాశాల ఫీజులు చెల్లించడానికి, పాఠ్యపుస్తకాలు కొనడానికి, స్టేషనరీని సమకూర్చుకోవడానికి, మరియు హాస్టల్ వసతి లేదా జీవన వ్యయాలకు సంబంధించిన ఖర్చులను భరించడానికి ఉపయోగించుకోవచ్చు.

విద్యార్థిని  గత విద్యా తరగతిలో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. అంతేకాకుండా, ఆమె తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వార్షిక ఆదాయం ₹2,00,000 మించకూడదు. ఆదాయ ధృవీకరణ పత్రం సంబంధిత ప్రభుత్వ అధికార సంస్థచే జారీ చేయబడటం తప్పనిసరి.

బేగం హజ్రత్ మహల్ జాతీయ స్కాలర్‌షిప్ పథకం యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణం దాని పారదర్శక ఆన్‌లైన్ ప్రక్రియ. దరఖాస్తులు ప్రత్యేకంగా నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి. విద్యార్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది.

స్కాలర్‌షిప్ కోసం ఎంపిక ప్రతిభ మరియు ఆదాయం ఆధారంగా జరుగుతుంది. రాష్ట్రాల వారీగా మరియు వర్గాల వారీగా కోటాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి.ఈ కేటాయింపు విధానం 2011 జనాభా లెక్కలలో నమోదైన మైనారిటీ జనాభా ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఒక నిర్దిష్ట రాష్ట్రం లేదా వర్గం నుండి తగినన్ని దరఖాస్తులు రాకపోతే, మిగిలిన స్కాలర్‌షిప్‌లను ఇతర రాష్ట్రాలకు చెందిన అర్హులైన బాలికా విద్యార్థులకు కేటాయించవచ్చు.

ఇలాంటి పథకాలకు గణనీయమైన సామాజిక ప్రభావం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. బేగం హజ్రత్ మహల్ జాతీయ స్కాలర్‌షిప్ పధకం బాలికల విద్యను ప్రోత్సహిస్తుంది మరియు వారు బడి మానేసే అవకాశాలను తగ్గిస్తుంది.

 

31 May 2026

ఈద్ పండుగ సందర్భంగా ఖుర్బానీకి కొత్త అర్థాన్ని ఇస్తున్న మహారాష్ట్ర ముస్లిం యువత Maharashtra Muslim youth give Qurbani a new meaning on Eid

 

మహారాష్ట్రలో ఈద్-ఉల్-అధా వేడుకలలో యువత చేపట్టిన ఒక ఉద్యమం, రక్తదానాన్ని ఒక శాశ్వత కార్యక్రమం గా మార్చింది. తద్వారా, త్యాగానికి  రూపమైన ఖుర్బానీకి కొత్త అర్థాన్ని ఇచ్చింది.

దానం చేసిన ఒక్క యూనిట్ రక్తం మూడు ప్రాణాలను కాపాడగలదని వైద్యులు చెబుతున్నారు. రక్తదాన ఆవశ్యకతను గుర్తించి, ముస్లిం సత్యశోధక్ మండల్ గత 16 సంవత్సరాలుగా మహారాష్ట్ర వ్యాప్తంగా ఈద్-ఉల్-అధా సందర్భంగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తోంది.

సమాజం కోసం త్యాగం చేయడానికి, మానవత్వానికి సేవ చేయడానికి ప్రజలను ప్రోత్సహించడం ద్వారా ఈ రక్తదాన కార్యక్రమం ఖుర్బానీ స్ఫూర్తిని విస్తృతం చేస్తుందని ముస్లిం సత్యశోధక్ మండల్  సంస్థ చెబుతోంది.రక్తదాన  శిబిరాలకు ముస్లింలే కాకుండా అన్ని మతాల ప్రజలు హాజరవుతున్నారు.

ముస్లిం సత్యశోధక్ మండల్ అధ్యక్షుడు షమ్సుద్దీన్ తంబోలి మాట్లాడుతూ, రక్తదాన ఆలోచన 2011లో రూపుదిద్దుకుందని తెలిపారు."బక్రీ ఈద్ సందర్భంగా రక్తదానం చేయాలనే భావన 2011లో ఖరారైంది, ఈ కార్యక్రమానికి డాక్టర్ బాబా అధవ్, డాక్టర్ నరేంద్ర దభోల్కర్ వంటి సంఘ సంస్కర్తలు, ఇంకా పలువురు ప్రముఖులు అండగా నిలిచారు," అని తంబోలి అన్నారు.

కోవిడ్-19 మహమ్మారి సమయంలో కూడా ముస్లిం సత్యశోధక్ మండల్ తన కార్యకలాపాలను కొనసాగించిందని తంబోలి పేర్కొన్నారు."మహమ్మారి కాలంలో కూడా ముస్లిం సత్యశోధక్ మండల్ రక్తదానంతో పాటు, ప్లాస్మా దాన శిబిరాలను కూడా నిర్వహించినది.. రాష్ట్రంలో వరదలు, తుఫానులు సంభవించినప్పుడల్లా సహాయక చర్యలు చేపట్టాము. దృష్టి లోపం ఉన్నవారికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు, పలు మానవతా కార్యక్రమాలను చేపట్టాము," అని తంబోలి తెలిపారు.

ముస్లిం సత్యశోధక్ మండల్ రక్తదాన్ ఉద్యమ  కార్యక్రమం 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి మరియు అనేక సంస్థలు ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరిస్తున్నాయి. ఇటీవలి సంవత్సరాలలో, ముస్లిం సత్యశోధక్ మండల్ అవయవ దానం, శరీర దానం మరియు కంటి దానాన్ని ప్రోత్సహక కార్యక్రమాలలో  పాల్గొనేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నది.."

షమ్సుద్దీన్ తంబోలి ఇంకా ఇలా అన్నారు, "ఖుర్బానీ అంటే త్యాగం మరియు అంకితభావం. ఒక వ్యక్తి నిజంగా త్యాగం చేయాలనుకుంటే, రక్తదానం ద్వారా మరొక మానవ ప్రాణాన్ని కాపాడటం కంటే గొప్ప కార్యం మరొకటి ఉండదు."

మహారాష్ట్ర మాజీ డీజీపీ, అశోక్ ధివారే రక్తదాన కార్యక్రమాన్ని బహిరంగంగా ప్రశంసించారు.ప్రతి సంవత్సరం తాను రక్తదానం  కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటానని ధివారే తెలిపారు.

రక్తదాన కార్యక్రమం ఇస్లామిక్ విలువలను సమకాలీన మానవతా అవసరాలతో అనుసంధానించడానికి ప్రయత్నిస్తోందని ముస్లిం సత్యశోధక్ మండల్ కార్యనిర్వాహక సభ్యురాలు డాక్టర్ సమీనా పఠాన్ అన్నారు.

మతపరమైన పండుగలు సమాజ అవసరాలకు అనుగుణంగా మారాలని చెబుతూ, రచయిత ప్రదీప్ అవటే కూడా రక్తదాన కార్యక్రమం ను ప్రశంసించారు.

బక్రీద్ పండుగ సమయంలో రక్తదానం చేయడం నిజంగా ఒక మానవతా చర్య," అని ముస్లిం సత్యశోధక్ మండల్ యొక్క ఒక నిర్వాహకుడు పేర్కొన్నారు.

పూణేలో ఒక స్థానిక చొరవగా ప్రారంభమైన రక్తదాన కార్యక్రమం  ఇప్పుడు సమాజానికి ఒక ఆదర్శంగా నిలిచింది. త్యాగం అనే పవిత్ర స్ఫూర్తిని విజ్ఞానం, కరుణ, ప్రజా సేవతో మేళవించడం ద్వారా, మతపరమైన విలువలను సమాజ శ్రేయస్సు కోసం ఎలా ఉపయోగించుకోవచ్చో రక్తదాన ప్రచార కార్యక్రమం  నిరూపించింది.


సోషలిస్ట్ జ్ఞాపకాలు – లోహియా-చంపారన్

 

  

 

 

1917లో మహాత్మా గాంధీ చేసిన సత్యాగ్రహంతో చంపారన్ ఆగలేదు, తరువాత అది స్వతంత్ర భారతదేశంలో రైతాంగ ఉద్యమానికి, భూ సంస్కరణలకు నాయకత్వం వహించింది

భారత స్వాతంత్ర్య పోరాటం ఒక ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందిన ప్రదేశంగా చంపారన్‌కు ఘనత దక్కుతుంది. కానీ, జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలోని స్వతంత్ర భారత ప్రభుత్వానికి చంపారన్ మొట్టమొదటి సవాలును విసిరిందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కొన్ని నెలల్లోనే భారత రాజ్యాంగానికి మొదటి సవరణ తీసుకురావాల్సిన ఒత్తిడిని చంపారన్ నెహ్రు పై  మోపింది.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు, రామ్ మనోహర్ లోహియా నేతృత్వంలోని సోషలిస్టులు,కమ్యూనిస్టులు మరియు హిందూ మహాసభతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదటి ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేశారు. మహాత్మా గాంధీ వలె సమస్యల చుట్టూ భారత ప్రజలను సమీకరించాలని లోహియా భావించారు. ఇందుకోసం, గాంధీ తన ఉద్యమాన్ని ప్రారంభించిన ప్రదేశమైన చంపారన్‌ను లోహియా ఎంచుకున్నారు, 1947లో, లోహియా నేతృత్వంలోని సోషలిస్ట్ పార్టీ జాతీయ కార్యవర్గం ‘చంపారన్ జిల్లాలో భూసేకరణ ప్రక్రియ process of land accumulation, రైతుల నిరంతర భూమి హరణం continual dispossession of farmers, పెద్ద వ్యవసాయ క్షేత్రాలు మరియు భూస్వాముల ఆవిర్భావంపై విచారణ జరపాలని’ నిర్ణయించింది.

 భారతదేశంలో భూసేకరణ గరిష్ట స్థాయి accumulation of holdings కి చేరిన ఏకైక ప్రదేశం బహుశా’ చంపారన్‌ కావడంతో, ఈ విచారణ కోసం చంపారన్‌ను ఎంపిక చేశారు. కానీ, మే 1950 వరకు ఈ విచారణ కమిషన్ కాగితాలకే పరిమితమైంది. ఆ తర్వాత భారత రాజ్యాంగం ఆమోదం పొందడంతో, నెహ్రూ ప్రభుత్వం వాగ్దానం చేసిన భూ సంస్కరణలను (జమీందారీ రద్దు) నెరవేర్చలేదని స్పష్టమైంది. మరో రెండు సంవత్సరాలలో సార్వత్రిక ఎన్నికలు కూడా జరగనున్నాయి, మరియు నెహ్రూ చేసిన భూసంస్కరణల వాగ్ధనం నెరవేర్చడం కష్టమని సోషలిస్టులు భావించారు.

కాబట్టి, లోహియా, ఖుర్షెద్‌బెన్ నౌరోజీ మరియు రామానందన్ మిశ్రాలతో కలిసి మే 29న చంపారన్‌లో పర్యటన ప్రారంభించి, జూన్ 8, 1950న తమ నివేదికను సమర్పించారు. 4,000 లిఖితపూర్వక విజ్ఞప్తులను స్వీకరించి, 400 మంది సాక్షులను విచారించి, 1,000 మంది రైతుల వాంగ్మూలాలను నమోదు చేసిన తర్వాత, లోహియా నేతృత్వంలోని కమిషన్ ఇలా పేర్కొంది: "1867 నుండి 1917 వరకు చంపారన్ రైతాంగం ఎవరిపై అయితే తీవ్ర పోరాటం సాగించిందో, ఆ బ్రిటిష్ తోటల యజమానులు రైతులను ఆర్థికంగా పూర్తిగా చిన్నాభిన్నం చేశారు. 1918తో ముగిసిన దశాబ్ద కాలంలో, రైతాంగం తాకట్టుల రూపంలో రూ. 84 లక్షలు అప్పు చేసి, 1,04,000 ఎకరాల భూమిని వడ్డీ వ్యాపారులకు అప్పగించాల్సి వచ్చింది. రైతులు కాస్త ఊపిరి పీల్చుకునేలోపే, 1930 నాటి ఆర్థిక మాంద్యం వారిని తీవ్రంగా దెబ్బతీసింది. దానికి తోడు 1931లో వడగళ్ల తుఫాను మరియు 1934 నాటి భూకంపం రైతుల విధ్వంసక ప్రక్రియను పూర్తి చేసింది. వీటన్నింటి ఫలితంగా, రైతులు పెద్ద స్థాయిలో తమ భూములను కోల్పోవాల్సి వచ్చింది." మహాత్మా గాంధీ ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టిన తర్వాత, కనీసం 40,000 ఎకరాల భూమిని చక్కెర మిల్లు యజమానులు అత్యంత తక్కువ ధరలకు చేజిక్కించుకున్నారని కమిషన్ గుర్తించింది

జూన్ 9, పాట్నాలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో లోహియా మాట్లాడుతూ, ప్రతి కుటుంబానికి ఉండవలసిన గరిష్ట భూ పరిమితిని 30 ఎకరాలకు తగ్గించాలని సూచించారు. లోహియా సూచించిన ఇతర మార్పులు ఇవి: (a) వ్యక్తిగత భూ యజమానుల తరపున జరిగే అన్ని భూ కేటాయింపులను నిలిపివేసి, ఒక 'ఆహార సైన్యం' (Food Army) ద్వారా సాగు చేయించే ఉద్దేశంతో, సాగుకు యోగ్యమైన బంజరు భూములన్నింటినీ భారత మరియు బీహార్ ప్రభుత్వాలు సంయుక్తంగా స్వాధీనం చేసుకోవాలి; (b) పశుగ్రాస భూములు, రహదారులు, పచ్చిక బయళ్లు, శ్మశాన వాటికల వంటి ఉమ్మడి భూములను తిరిగి గ్రామ పంచాయతీలకు అప్పగించాలి మరియు వాటిపై జరిగే తదుపరి ఆక్రమణలన్నింటినీ నిలిపివేయాలి; మరియు (c) సాగు భూముల విషయంలో గానీ, పట్టణ ప్రాంతాల్లో గానీ భూ కేటాయింపులు లేదా వాటి సవరణలు సంబంధిత గ్రామం లేదా పట్టణ పంచాయతీ ద్వారా మాత్రమే జరగాలి. ఈ మార్పులకు ఆధారమైన సూత్రాలను భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు వర్తింపజేయాలని డాక్టర్ లోహియా ఆకాంక్షించారు. అయితే, ప్రాథమిక దశలో మొదట్లో  ఈ మార్పులను చంపారన్‌లో తక్షణమే అమలు చేయాలని లోహియా కోరారు. ఒకవేళ నెహ్రూ ప్రభుత్వం నెల రోజుల్లోపు ఈ సూచనలను అంగీకరిస్తే, తమ పూర్తి నివేదికను ప్రచురించబోమని లోహియా పేర్కొన్నారు.

అదే సమయంలో, జమీందారీ వ్యవస్థ రద్దును సులభతరం చేసే ఉద్దేశంతో, భారతదేశ శాసనసభ (మొదటి సార్వత్రిక ఎన్నికలు అప్పటికి ఇంకా జరగాల్సి ఉంది) మొదటి రాజ్యాంగ సవరణపై చర్చలు జరుపుతోందని గమనించాలి. జూన్ 18, ఈ మొదటి సవరణ ఆమోదించబడింది; తద్వారా ఇది భూ సంస్కరణలకు మార్గం సుగమం చేసింది.

 

source: SaSaquib Salim wall 

 

 

 

 

 

.