31 March 2024

ముస్లిం సమాజాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో పనిచేస్తున్న జకాత్ సెంటర్ ఇండియా Zakat Center India on a mission to financially empower the Muslim community

 

న్యూఢిల్లీ:

జకాత్ సెంటర్ ఇండియా (ZCI) ప్రకారం భారతదేశంలోని వివిధ సామాజిక మరియు మత సమూహాల మధ్య శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు (LFPR) మరియు కార్మికుల జనాభా నిష్పత్తి (WPR)లో అట్టడుగున ఉన్న ముస్లింల కోసం నైపుణ్యాభివృద్ధి మరియు జీవనోపాధి కల్పన కార్యక్రమాల కోసం జకాత్ సేకరణలను ఉపయోగించాల్సిన అవసర౦ ఉంది..

జూలై 2022 నుండి జూన్ 2023 వరకు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) డేటా యొక్క విశ్లేషణ ప్రకారం ముస్లింల WPR జాతీయ సగటు 42 శాతానికి బిన్నo౦గా 31.7 శాతంగా ఉంది.

PLFS డేటా ప్రకారం, ముస్లింల WPR 2020-21లో 35.5 నుండి 2022-23లో 31.7 శాతానికి పడిపోయింది.

LFPR మరియు WPR సామాజిక మరియు మత సమూహాల మధ్య ఉద్యోగ స్థితిని కొలుస్తుంది.

ఈ డేటా ఆధారంగా 15 శాతం కంటే ఎక్కువ వయస్సు ఉన్న ముస్లింలలో కేవలం 30 శాతం మంది మాత్రమే సాధారణ జీతం పొందుతున్నారు మరియు ముస్లిం జనాభాలో అత్యధికంగా 70 శాతం మందికి ఎటువంటి పని లేడు అని తెలుస్తుంది. . భారతదేశంలోని ముస్లింలలో సామూహిక పేదరికానికి ఇది ఒక ప్రాథమిక కారణం.

ఆర్థికశాస్త్రవేత్తల  ప్రకారం ప్రధాన మత సమూహాలలో, ముస్లింల శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు (LFPR) మరియు WPR క్షీణించాయి. (LFPR అనేది పని కోసం వెతుకుతున్న జనాభాలో వాటా, మరియు WPR అనేది పని చేసే వయస్సు గల జనాభాలో వాటా).

కానీ ఎవరూ పేదరికంలో జీవించాలని కోరుకోరు. ప్రతి ఒక్కరికీ తన ఆదాయాన్ని పెంచుకోవాలనే కోరిక ఉంటుంది.కానీ ముస్లింలు జాబ్ మార్కెట్‌లో లీనమయ్యే మార్గంలో కొన్ని అడ్డంకులు ఉన్నాయి.

ముస్లింలు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ వారికి అవసరమైన నైపుణ్యాలు మరియు మూలధనం మరియు జాబ్ మార్కెట్‌లో లీనమయ్యేలా అవసరమైన జ్ఞానం కూడా లేదు. ముస్లిములలో ఒకరికి జ్ఞానం మరియు నైపుణ్యం ఉన్నప్పటికీ, ఒకరి స్వంత వ్యాపారం మరియు వాణిజ్యాన్ని ప్రారంభించడానికి వర్కింగ్ క్యాపిటల్ అవసరం.

పేద ముస్లింలు తమ సొంత వ్యాపారాలను స్థాపించుకోవడానికి మరియు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటానికి మూలధనాన్ని అందించడంలో జకాత్ కీలక పాత్ర పోషిస్తుంది.

జకాత్ డబ్బును పేద ముస్లింలకు నైపుణ్యం మరియు జీవనోపాధి కార్యకలాపాలను అభివృద్ధి చేయడంలో ఉపయోగించుకోవచ్చు. జకాత్ సొమ్మును సక్రమంగా వినియోగించినట్లయితే, ఉదాహరణకు, క్రమమైన ఆదాయ వనరులు లేని ముస్లిం జనాభాలో కనీసం 80 శాతం మందికి పని కల్పించడానికి, జాతీయ ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం మరియు  ముస్లిం సంఘం సానుకూల పాత్ర పోషిస్తుంది మరియు దేశ స్థూల దేశీయోత్పత్తి (GDP)కి తోడ్పడటమే కాకుండా.సమాజానికి ఆనందాన్ని అందించగలదు

జకాత్ సెంటర్ ఇండియా, పేదరికం లేని ముస్లిం సమాజాన్ని రూపొందించడానికి ఏర్పాటు చేయబడింది.

2022లో దేశవ్యాప్తంగా కార్యకలాపాలు ప్రారంభించిన ZCI ఇప్పటివరకు 6,000 మంది జీవితాలను ప్రభావితం చేసింది. అప్పటి నుండి అది ఖర్చు చేసిన మొత్తం డబ్బులో, 69.4 శాతం జీవనోపాధి ప్రాజెక్టులకు ఖర్చు చేసింది, 1,058 మంది వ్యక్తులను ఆర్థికంగా స్వావలంబన చేసింది. మిగిలిన డబ్బును నైపుణ్యాలను పెంపొందించడానికి మరియు పేద ప్రజలకు విద్య మరియు రేషన్ అందించడానికి ఖర్చు చేశారు. 

ZCIకి విరాళాలు దాని బ్యాంక్ ఖాతాలో ఇవ్వవచ్చు:

 

జకాత్ ద్వారా రంజాన్ లో జైలు ఖైదీలను విడిపించటం Zakaat, the Islamic form of charity, frees jail inmates during Ramzan

 

రంజాన్ మాసంలో చాలా మంది ముస్లింలు జకాత్‌ ఇస్తారు. జకాత్ అనేది ఇస్లాంలో దాతృత్వానికి సంబంధించిన ప్రముఖ అభివ్యక్తి. వార్షిక ఆదాయం లో 2.5% ఒక వ్యక్తి ఇవ్వవలసిన జకాత్ గా లెక్కించబడుతుంది. సాధారణంగా పేదరికంలో ఉన్నవారికి, అభాగ్యులకు  ఇవ్వబడే జకాత్ నిధులు గత కొన్ని సంవత్సరాలుగా, జరిమానాలు చెల్లించడానికి డబ్బులేక జైలు శిక్షలు అనుభవవించే  ఖైదీలను విడిపించడానికి ఉపయోగించబడుతున్నాయి, 

లాభాపేక్ష లేని కొన్ని ఇస్లామిక్ స్వచ్చంద సంస్థలు, దాతల నుండి జకాత్‌ను సేకరిస్తున్నవి  మరియు ఖైదీల విడుదలను పొందేందుకు ఈ నిధులను అందిస్తున్నవి.. ఒక స్వచ్చంద సంస్థ ప్రకారం  గత సంవత్సరం నుండి జైలు శిక్షలకు సంబంధించిన 130 జరిమానాలు చెల్లించబడినవి.. అదనంగా, 35 మంది ఖైదీలకు బెయిల్ డబ్బు చెల్లించాము మరియు వారందరు విడుదల చేయబడినారు.

స్వచ్చంద సంస్థలు , ప్రధమంగా చిన్న నేరాలకు పాల్పడిన మొదటిసారి నేరస్థులు మరియు బెయిల్ లేదా జరిమానాలు చెల్లించడానికి కుటుంబం లేదా స్నేహితులు లేని ఖైదీలను గుర్తించును.. సంస్థ లక్ష్యం అందరికీ సహాయం చేయడమే. ఖైదీల విడుదలకు ఫెసిలిటేటర్లుగా కూడా పని చేస్తుంది.

కొందరు పారిశ్రామిక వేత్తలు కూడా జకాత్ నిధులలో కొంత భాగాన్ని ఖైదీల విడుదలకు  కేటాయించారు. ఖైదీలను విడుదల చేయడ౦ కూడా ఇస్లాం లో ఒక ముఖ్యమైన చర్యగా పరిగణించబడుతుంది.  సాధారణంగా, ప్రజలు మదర్సాలకు మరియు అవసరమైన వారికి, ముఖ్యంగా పేద బంధువులకు జకాత్ ఇస్తారు. కానీ ఖైదీల విడుదల కు జకాత్ నిధులు ఇవ్వడం లో మంచితనం రెండు రెట్లు ఉంది: ఒకటి  మతపరమైన ఆదేశం నెరవేరుతోంది మరియు చాలా అవసరమైన కుటుంబానికి సహాయం చేయబడుతుంది.

ఒక సామాజిక-మత సంస్థ , గత సంవత్సరం నుండి హైదరాబాద్ మరియు చుట్టుపక్కల జైళ్లలో ఉన్న 68 మంది ఖైదీలను విడుదల చేసినది. ఇస్లామిక్ న్యాయశాస్త్ర దృక్కోణం నుండి సమస్యను వివరిస్తూ, "బానిసత్వం అంతం కాకముందు, బానిసలను విడిపించడానికి జకాత్ డబ్బు ఉపయోగించబడింది. లేఖనాలలో దీని వ్యక్తీకరణ ఉంది.  

సురక్షిత విడుదలలకు చెల్లించిన జరిమానాలు ₹500 మరియు ₹5,000 మధ్య ఉన్నాయి. "ఇది చిన్న మొత్తంలా అనిపించవచ్చు, కానీ పేదలకు, దురదృష్టవశాత్తు చేల్లి౦చలేనివారికి అది చాలా పెద్ద మొత్తం."

 

30 March 2024

లైలతుల్ ఖద్ర్ రాత్రి వేయి నెలల కంటే శ్రేష్ఠమైనదిగా ఎందుకు పరిగణించబడుతుంది Why is Lay’latul Qadr considered the night that is better than thousand months

 

లైలతుల్ ఖద్ర్, లేదా నైట్ ఆఫ్ డిక్రీ లేదా పవర్ ఇస్లాంలో అపారమైన ప్రాముఖ్యత ఉంది. లైలతుల్ ఖద్ర్ రాత్రి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగి, వెయ్యి నెలల రాత్రుల  కంటే మెరుగైనదని నమ్ముతారు.

దివ్య ఖురాన్‌లో లైలతుల్ ఖద్రీస్ ప్రస్తావించబడింది, ప్రత్యేకంగా సూరా అల్-ఖద్ర్ (అధ్యాయం 97), ఇక్కడ లైలతుల్ ఖద్ర్ రాత్రి  "వెయ్యి నెలల కంటే మెరుగైన రాత్రి"గా వర్ణించబడింది. లైలతుల్ ఖద్ర్ రాత్రి, ప్రవక్త ముహమ్మద్‌(స)కు జిబ్రాయేల్ దేవదూత ద్వారా దివ్య ఖురాన్ యొక్క ద్యోతకాన్ని సూచిస్తుంది.

ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం, లైలతుల్ ఖద్ర్ రాత్రి రంజాన్ చివరి పది రాత్రులలో వస్తుంది, 21, 23, 25, 27, లేదా 29వ రాత్రి వంటి బేసి-సంఖ్యల రాత్రులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది.

లైలతుల్ ఖద్ర్ యొక్క ప్రాముఖ్యత ఇస్లామిక్ వేదాంతశాస్త్రంలో కలదు. విశ్వాసులు ఈ రాత్రికి  దైవిక ఆశీర్వాదాలు మరియు దయ పుష్కలంగా ఉంటాయని  మరియు తమ ప్రార్థనలకు సమాధానం లభిస్తుందని నమ్ముతారు. రాబోయే సంవత్సరానికి వ్యక్తులు మరియు సమాజాల విధి అల్లాహ్  చే  నిర్ణయించబడిన సమయం. ముస్లింలు ఈ పవిత్రమైన రాత్రి సమయంలో క్షమాపణ, మార్గదర్శకత్వం మరియు ఆశీర్వాదాలను కోరుకుంటారు, తమ ఆరాధన మరియు భక్తి చర్యలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు.

లైలతుల్ ఖద్రీ ఆధ్యాత్మిక ప్రతిబింబం, ప్రార్థనలకు సమయం. ముస్లింలు దివ్య ఖురాన్ పఠనం, అదనపు ప్రార్థనలు (తహజ్జుద్), దువా (ప్రార్థన) చేయడం మరియు గత పాపాలకు క్షమాపణ కోరడం వంటి వివిధ ఆరాధనలలో పాల్గొంటారు.

లైలతుల్ ఖద్ర్ రాత్రి విశ్వాసులకు అల్లాహ్‌కు దగ్గరగా ఉండటానికి మరియు అల్లాహ్ దయ మరియు మార్గదర్శకత్వం కోసం ఒక అవకాశాన్ని అందిస్తుంది. లైలతుల్ ఖద్ర్ ముస్లిం జీవితంలో విశ్వాసం, వినయం మరియు భక్తి యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది.

ముహమ్మద్ ప్రవక్త(స) యొక్క అనేక హదీసులలో లైలతుల్ ఖద్ర్ యొక్క సద్గుణాలు వివరించబడ్డాయి. ప్రవక్త(స)తన అనుచరులను ఈ ఆశీర్వాద రాత్రిని కోరుకోమని మరియు దానిని పాటించేటప్పుడు ఆరాధనలో పాల్గొనమని  ప్రోత్సహించారు. లైలతుల్ ఖద్ర్‌లో నిర్వహించే ఆరాధనలకు ప్రతిఫలాలు అనేక రెట్లు పెరుగుతాయి, లైలతుల్ ఖద్ర్ ఆధ్యాత్మిక అభివృద్ధికి మరియు విముక్తికి గొప్ప అవకాశంగా మారుతుంది.

లైలతుల్ ఖద్ర్ రాత్రి ముస్లిములు వ్యక్తిగత ఆరాధన తో పాటు ప్రత్యేక రాత్రి ప్రార్థనలు (తరావీహ్) మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం మసీదులలో సమావేశమై ఐక్యత మరియు సోదర భావాన్ని పెంపొందించుకుంటారు. కమ్యూనిటీలు ఆరాధన మరియు ప్రతిబింబాన్ని సులభతరం చేయడానికి ఈవెంట్‌లు మరియు కార్యకలాపాలను నిర్వహిస్తాయి, లైలతుల్ ఖద్ర్ పవిత్ర రాత్రి విశ్వాసులకు సహాయక వాతావరణాన్ని సృష్టిస్తుంది..

లైలతుల్ ఖద్ర్ ఇస్లాంలో ఆధ్యాత్మికంగా అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. లైలతుల్ ఖద్ర్ దైవిక శాసనం, దయ మరియు ఆశీర్వాదాల రాత్రి, వెయ్యి నెలల కంటే మెరుగైనది. ముస్లింలు ఆరాధనలో పాల్గొనడానికి, క్షమాపణ, మార్గదర్శకత్వం మరియు అల్లాహ్ నుండి ఆశీర్వాదాలు పొందటానికి ప్రయత్నిస్తారు. లైలతుల్ ఖద్ర్ విశ్వాసి జీవితంలో విశ్వాసం, భక్తి మరియు సంఘం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. లైలతుల్ ఖద్ర్‌ పవిత్రమైన రాత్రిలో విశ్వాసుల ప్రార్థనలు అంగీకరించబడతాయి మరియు వారు అశ్విరదింపబడతారు. .

 

27 March 2024

భారతీయ ముస్లింలకు మేధావి వర్గం ఎందుకు లేదు? Why do Indian Muslims lack an intellectual class?

 


భారతీయ ముస్లింలలో మేధావి వర్గం ఉందా? ఉంటె,  వామపక్ష-ఉదారవాదులు బహిరంగ చర్చలలో ముస్లిములకు ఎందుకు ప్రాతినిధ్యం వహించాలి? ముస్లింలకు  తమకు తాము ప్రాతినిధ్యం వహించే సామర్థ్యం ఉన్నట్లయితే వామపక్ష-ఉదారవాదులు ఈ పనిచేయవలసిన అవసరం ఉంటుందా?

విచారకరమైన వాస్తవమేమిటంటే, ప్రజా చర్చకు అవసరమైన సామర్థ్యం, నైపుణ్యం మరియు హుందాతనంతో ముస్లిం సమాజానికి ప్రాతినిధ్యం వహించే ఒక్క ముస్లిం మేధావి కూడా లేకపోవడం. కారణం చదువు లేకపోవడం కాదు. 75 శాతానికి పైగా అక్షరాస్యత రేటుతో, భారతదేశంలోని ముస్లింలలో  తగినంత పెద్ద సంఖ్యలో ఉన్నత విద్యావంతులు ఉన్నారు కాని వారు చర్చలలో పాల్గొనారు.

పాత్రికేయుడు, సామాజిక సంస్కర్త  హమీద్ దల్వాయ్ మాటలలో, “‘ముస్లిం మేధావిపదం నిజమైన అర్థంలో మేధావి కాదు. అతను కేవలం ముస్లిం మాత్రమే."

ముస్లిం సమాజం కు మౌల్వీలు - మత నిపుణులు ప్రాతినిధ్యం వహించడం చాలా సహజం. తరచుగా టీవీ ప్యానెల్ చర్చలలో ఆధునిక ముస్లింలకు బదులు  మౌల్వీలు కనిపిస్తారు.

సామాజిక సంస్కర్త దల్వాయి ప్రకారం ఒక సమాజం యొక్క మేధో తరగతి ఆ సమాజం యొక్క పురోగతిని కొలుస్తుంది. మేధావుల వర్గం అనేది అనేక క్లిష్టమైన చారిత్రక, సామాజిక, రాజకీయ మరియు ఇతర ప్రక్రియల ఉత్పత్తి. భారతదేశంలోని ముస్లిం సమాజం అటువంటి పరివర్తన ప్రక్రియను పొందలేదు. అందువల్ల, ఒక ముస్లిం,  ముస్లిం సమాజం వైపు, ముఖ్యంగా దాని చరిత్ర మరియు రాజకీయాలపై, విమర్శనాత్మక దృష్టిని మళ్లించిన క్షణం, వారు మతం నుంచి బహిష్కరించబడతారు. దళవాయికి అదే గతి పట్టింది.

1960 నుండి 80 వరకు, ఉర్దూ ప్రెస్‌లో అత్యంత దూషించబడిన వ్యక్తులు  బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన MC చాగ్లా మరియు హమీద్ దల్వాయ్.

దాల్వాయి తన పుస్తకం Muslim Politics in India లో ఎక్కడా ఇస్లాం మతం గురించి ప్రస్తావించలేదు మతాన్ని రిమోట్‌గా విమర్శించటం లేదా దాని సూత్రాలు మరియు అభ్యాసాలను ప్రశ్నించలేదు. అలాంటప్పుడు దాల్వాయి ను ఇస్లాంకు శత్రువుగా పరిగణించేందుకు ముస్లిం అభిప్రాయాలను రూపొందించే వర్గం ఎందుకు ముందుకు వచ్చింది? దాల్వాయి ఆలోచనల విధ్వంసక సామర్థ్యాన్ని వారు గుర్తించినందున వారు అలా చేశారు. దాల్వాయి వారి అధికారాన్ని, మతపరమైన భావజాలం ను  అణగదొక్కాడు.

ముస్లిం మత వర్గ౦ యొక్క  రాజకీయ అధికారాన్ని ప్రశ్నించడం వారి దృష్టిలో క్షమించరాని నేరం. వారి దృష్టిలో మతం కన్నా  రాజకీయాలు మరియు పాలించే హక్కు నిజంగా ముఖ్యమైనది.

సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ యొక్క మతపరమైన ఆలోచనలు ముస్లింలకు ఎంతమాత్రం ఆమోదయోగ్యంగా లేవు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్వంత సంస్థ అయిన అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం ఖురాన్‌పై సర్ సయ్యద్ వ్యాఖ్యానాన్ని ప్రచురించడానికి నిరాకరించింది. సర్ సయ్యద్ గౌరవనీయమైన వ్యక్తి, ముస్లింలకు ఒక  సొంత కళాశాలను నిర్మించాడు.

అదేవిధంగా, ముహమ్మద్ అలీ జిన్నా వేర్పాటువాద రాజకీయాలకు విజయవంతమైన నాయకత్వాన్ని అందించినందున ముస్లిములకు జిన్నా  క్వాయిడ్-ఇ ఆజం అయ్యాడు. దీనికి విరుద్ధంగా, మత రాజకీయాలను వ్యతిరేకిస్తే, జిన్నా ముస్లిం సమాజం నుండి చెడు మాటలను తప్పించుకోలేడు.

రాజకీయ ఇస్లాం యొక్క మౌదూదియన్ థీసిస్‌ మతాన్ని రాజకీయ భావజాలంగా మార్చే విధంగా వ్యాఖ్యానిస్తుంది మరియు ప్రపంచాన్ని పాలించే ముస్లింలకు ఒక ఛార్టర్. ఇస్లాం యొక్క వేదాంతశాస్త్రం మరియు మతతత్వం నిస్సందేహంగా ఆధిపత్యవాదం వైపు దృష్టి సారించాయి.

దల్వాయి ప్రకారం, ముస్లింలలో సంస్కరణలు  అసంభవం మరియు ముస్లిం సమాజం విమర్శనాత్మక ఆలోచనాపరుల తరగతిని సృష్టించలేకపోవడం పెద్ద  సైద్ధాంతిక లోపం.

భారతీయ ముస్లింలలో విమర్శనాత్మక ఆలోచనాపరుల గురించి ఆలోచించినప్పుడు, సర్ సయ్యద్ కాకుండా మరొక పేరు గురించి ఆలోచించడం చాలా కష్టం. సాంఘిక సంస్కర్తగా సర్ సయ్యద్ కు జనాదరణ పొందిన ఇమేజ్ ఉన్నప్పటికీ, సర్ సయ్యద్ ముస్లిం సమాజాన్ని దాని దుష్ప్రవర్తన గురించి విమర్శించలేదు.

విమర్శనాత్మక ఆలోచనాపరుడు అయిన అల్లామా ఇక్బాల్‌ తన అభిమానులచే కవి-తత్వవేత్తగా గుర్తించబడినాడు.  అల్లామా ఇక్బాల్‌ ఉలేమాలను "ముల్లా" అని ధిక్కరిస్తూ వారి పట్ల అసహ్యాన్ని సాధారణీకరించాడని గమనించాలి. అల్లామా ఇక్బాల్‌ ముల్లాలను మరియు వారి ఇస్లాం సంస్కరణను ముస్లిం పాలన పతనానికి కారణమని నిందించాడు. అల్లామా ఇక్బాల్‌ కు అనుగుణంగా, నేటి "ఆధునిక-ప్రగతిశీల-మితవాద ముస్లింలు" కూడా అదే కారణంతో ఉలేమాలను మరియు వారి పురాతన వేదాంతాన్ని విమర్శిస్తున్నారు.

దల్వాయ్‌తో పాటు, ముస్లింలలో నిజమైన మేధావి లేదా విమర్శనాత్మక ఆలోచనాపరుడి పేరు చెప్పడం కష్టం. ముస్లిం ఆధునికీకరణపై దల్వాయ్‌తన ఆశలు పెట్టుకున్నాడు.

ముస్లిములు తమ స్వంత గాంధీ/నాయకుడు ని తయారు చేయలేకపోవడం ముస్లింల అతిపెద్ద వైఫల్యం. ఒక ముస్లిం గాంధీ ఆవిర్భావాన్ని దల్వాయి చూడలేదు.

దల్వాయ్ ప్రకారం ముస్లిములు తమ బాధలన్నింటికీ హిందువులను నిందించారు మరియు వారి స్వంత స్థితికి ఎటువంటి బాధ్యత వహించకుండా చేతులు కడుగుకొన్నారు.. ఎందుకంటే వారు మేధో పక్షవాతంతో బాధపడుతున్నారు మరియు తమ అసంతృప్త స్థితి వెనుక కారణాలను విమర్శనాత్మకంగా పరిశీలించలేరు.

దాల్వాయి ఒక ప్రశ్న అడిగారు: ఆధునిక విద్యకు ముస్లింల ప్రతిఘటనకు హిందువులు ఎలా కారణమయ్యారు?

దల్వాయ్‌ హిందూ-ముస్లిం సంబంధాలపై ఒక వివేచనాత్మక అంశాన్ని చెప్పాడు, “హిందువులు తగినంతగా చైతన్యవంతంగా ఉంటే, హిందూ-ముస్లిం సమస్య పరిష్కారమవుతుందని నేను నమ్ముతున్నాను.

మూలం: The Print, 26 March, 2024 

26 March 2024

ఉగ్రదాడిలో 100 మంది ప్రాణాలను కాపాడిన మాస్కో వాసి ఇస్లాంను గౌరవించిన రష్యా Moscow’s Islam who saved 100 lives during terrorist attack is honoured by Russia

 



ఇటీవల మాస్కో శివారులో ఓ సంగీత కార్యక్రమంపై జరిగిన ఉగ్రదాడిలో 100 మందికి పైగా ప్రజలను రక్షించడంలో సహాయం చేసిన 15 ఏళ్ల ఇస్లాంను రియల్ హీరో అవార్డుతో రష్యా ప్రభుత్వం సత్కరించారు.

ఉగ్రవాద సంస్థ ISIS జరిపిన  దాడిలో 133 మంది మరణించారు మరియు 180 మంది గాయపడ్డారు. నలుగురు అనుమానిత ఉగ్రవాదులు క్రోకస్ హాల్‌లోని సంగీత కచేరీపై దాడి చేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు మరియు కత్తులు మరియు పదునైన ఆయుధాలతో వ్యక్తులపై దాడి కూడా చేశారు.రష్యా తజికిస్థాన్‌కు చెందిన నలుగురు అనుమానితులను అరెస్టు చేసింది మరియు వారు దాడికి పాల్పడినట్లు అభియోగాలు మోపింది 

15 ఏళ్ల ఇస్లాం ఇలా అన్నాడు:: ఇతరులను చావనివ్వడం కంటే నేను యుద్ధంలో చనిపోవడం మేలు.” Xలో షేర్ చేయబడిన వీడియోలో, 15 ఏళ్ల ఇస్లాం మాస్కో సంగీత కచేరీ హాల్‌లోని ఒక మార్గం గుండా భయపడిన ప్రజలను తప్పించి నిష్క్రమణ ద్వారంExit Gate  వద్దకు తీసుకువెళ్ళాడు. దాదాపు వంద మంది ప్రజలు నిష్క్రమణ ద్వారం వద్దకు వెళ్లేందుకు ఆ మార్గం గుండా పరిగెత్తి తమ ప్రాణాలను కాపాడుకున్నారని అంచనా.

15 ఏళ్ల ఇస్లాం నేలమాళిగలో పని చేస్తున్న సమయంలో తుపాకీ కాల్పులు, అరుపులు వినిపించాయి. 15 ఏళ్ల ఇస్లాం తన ముందు అనేక మంది ప్రజలు కాల్చి చంపబడటం, నేలపై కృంగిపోవడం చూశాడు. 15 ఏళ్ల ఇస్లాం ధైర్యంగా భయభ్రాంతులకు గురైన వ్యక్తులకు తనను అనుసరించమని మరియు తన సూచనలను పాటించమని చెప్పాడు మరియు వారు ఇస్లాం వెనుక పరిగెత్తినప్పుడు, ఇస్లాం వారందరినీ నిష్క్రమణ ద్వారం వద్దకు నడిపించాడు.

తనపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపించడంపై 15 ఏళ్ల ఇస్లాం స్పందిస్తూ, “నేను హీరోని కాదు, నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నానుఅని అన్నాడు. ఇస్లాం శాంతియుతమైన మరియు రక్షిత మతం అని 15 ఏళ్ల ఇస్లాం. నిరూపించాడు!

"15 ఏళ్ల ఇస్లాం యొక్క ధైర్యసాహసాలు మరియు నిస్వార్థత నిజంగా స్ఫూర్తిదాయకం" అని ప్రజలు చాలా మంది  ప్రశంసించారు.

15 ఏళ్ల ఇస్లాం మానవత్వం యొక్క ఉత్తమమైన ఉదాహరణ. అని పేర్కొన్నారు. 15 ఏళ్ల ఇస్లాం వంటి స్పూర్తిదాయకమైన కథలు మానవాళిలో మళ్లీ ఆశలు నింపుతాయి.

 

హైదరాబాద్ లో ఓ చిన్న యెమెన్ A little Yemen in Hyderabad

 


హైదరాబాద్‌లోని బార్కాస్ ప్రాంతంలో యెమెన్ నుండి వచ్చిన అరబ్-మూలాల ప్రజలు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు. నేడు ఈ యెమెన్ తెగ స్థానిక జనాభాలో కలిసిపోయింది మరియు ఇప్పటికీ దాని జాతి విలక్షణమైన సంస్కృతిని కలిగి ఉంది.

బార్కాస్ అనే ఆంగ్ల పదం బారక్స్నుండి వచ్చింది నిజాం పాలనలో, బార్కాస్ మిలటరీలో పనిచేశారు మరియు బ్యారక్స్‌లో నివసించారు. చౌష్‌లు యెమెన్‌ నుంచి హైదరాబాద్‌లోని నిజాం సంస్థానంలో సైనికాధికారులుగా పనిచేయడానికి తీసుకురాబడ్డారు.. 7వ నిజాంకు అరబ్బులపై పూర్తి విశ్వాసం ఉందని చెబుతారు. బర్కాస్‌లోని ప్రజలు అరబిక్ మాట్లాడనప్పటికీ, వారు రంజాన్ సమయంలో హరీస్‌ను, గహ్వా (అరబిక్ కాఫీ)అతిథులకు అందించడం కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం బార్కాస్ ప్రాంతం ఆహార ప్రియుల స్వర్గధామం. ఇది రుచికరమైన కబాబ్‌లు, బిస్కెట్లు, చాయ్ మరియు ప్రసిద్ధ మండిని విక్రయించే రెస్టారెంట్‌లతో నిండి ఉంది.

బార్కాస్ నుండి హైదరాబాద్ దక్షిణ కొనలోని బాబా షర్ఫుద్దీన్ మందిరం వైపు ఉన్న అసంఖ్యాక మండి రెస్టారెంట్లలో మండి మరియు కబాబ్‌లు దొరుకుతాయి. ఇక్కడ అరబ్ మరియు ముఖ్యంగా యెమెన్ డయాస్పోరా ఎక్కువుగా ఉన్నారు. .

హైదరాబాద్ ను  'షెహర్-ఇ-మండి' అందురు. రంజాన్ సమయంలో, ఇక్కడి రాత్రంతా తెరిచి ఉంచే ప్రసిద్ధ మండి లు దేశీయ బిర్యానీ మరియు డక్కిని వంటకాలను అందిస్తాయి.  

ఇక్కడి రెస్టారెంట్ మాతామ్ అల్-అరబి అరబిక్ వంటకాలను కోరుకునే వారికి గమ్యస్థానంగా మారింది.

మండి యెమెన్ బియ్యం మరియు మాంసం వంటకం, ప్రజలు ఎక్కువుగా కోరుకొంటారు. మండి మసాలా దినుసులతో కూడిన చికెన్, మెరిసే సువాసనగల అన్నం పైన వేయించిన ఉల్లిపాయలు, బాదం మరియు ఎండుద్రాక్షలతో అలంకరించబడి ఉంటుంది. బియ్యం మరియు మాంసం నుండి గొప్ప సువాసనను కలిగి ఉంటుంది.

బార్కాస్‌లోని రెస్టారెంట్లు హరీస్, కబ్సా, మజ్బూస్ వంటి వివిధ రకాల అరబిక్ వంటకాలను అందిస్తాయి

Maqluba Quzi అన్నం, కూరగాయలు మరియు మాంసాన్ని కలిగి ఉంటుంది, ఇది పొరలుగా మరియు ఒక కుండలో వండుతారు మరియు తర్వాత సర్వ్ చేయబడుతుంది. కాల్చిన చికెన్ మరియు షావర్మా, ఫలాఫెల్ మరియు ముతాబ్క్ వంటి స్నాక్స్‌ కూడా లబిస్తాయి. ఖహ్వా అనే అరబిక్ కాఫీ కూడా  లబిస్తుంది.

 

23 March 2024

భగత్ సింగ్ జపాన్‌లో ఎందుకు సైనిక శిక్షణ పొందలేదు? Why Bhagat Singh didn’t receive military training in Japan?

 

 

బ్రిటిష్ వారి నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడిన భగత్ సింగ్ ను 1931 మార్చి 23న లాహోర్ జైలులో సుఖ్‌దేవ్ మరియు రాజ్‌గురుతో కలిసి ఉరిశిక్ష అమలు పరిచినప్పుడు భగత్ సింగ్‌కు కేవలం 23 ఏళ్లు.

భగత్ సింగ్ తండ్రి కిషన్ సింగ్ మరియు మామ అజిత్ సింగ్ 1900ల ప్రారంభంలో పంజాబ్ లో ముఖ్యమైన విప్లవకారులు. అజిత్ సింగ్ బ్రిటీష్ వ్యతిరేక కార్యకలాపాలకు మాండలే జైలుకు పంపబడ్డాడు మరియు భారతదేశం నుండి బహిష్కరించబడ్డాడు.

మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో, అజిత్ సింగ్ బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి శ్యామ్‌జీ కృష్ణ వర్మ, భికాజీ కామా, సయ్యద్ జియా ఉద్ దిన్ (ఇరాన్‌కి చెందిన), చెంపకరామన్ పిళ్లై మొదలైన వారి సహాయంతో భారతీయ విప్లవకారులతో కలసి  పోరాడాడు.. అజిత్ సింగ్ ఇరాన్, బ్రెజిల్, ఇటలీ, జర్మనీలలో 1946 వరకు మీర్జా హసన్ ఖాన్ గా ఉంటూ గదర్ పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, అజిత్ సింగ్ ఇక్బాల్ షైదాయ్ సహాయంతో ఇటలీలో ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించాడు. దశాబ్దాలుగా అజిత్ సింగ్ బ్రిటిష్ సామ్రాజ్యానికి మోస్ట్ వాంటెడ్ భారతీయుడు మరియు బ్రెజిల్‌లో నివసిస్తున్న హసన్ ఖాన్ అజిత్ సింగ్ అని సీనియర్ విప్లవకారులకు మాత్రమే తెలుసు.

భగత్ సింగ్, తన  మామయ్య అజిత్ సింగ్ నుండి సలహా కోరాడు. అజిత్ సింగ్ అజ్ఞాతంలో జీవిస్తున్నాడు. అజిత్ సింగ్ ప్రకారం భగత్ సింగ్ నన్ను భారతదేశానికి తిరిగి రావాలని నేను భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ప్రభుత్వం నాపై ఎటువంటి కేసు ప్రారంభించబడదని ప్రభుత్వం సమాధానం ఇచ్చింది అని తెలిపాడు..కాని సీనియర్ విప్లవకారుడు, అజిత్ సింగ్ బ్రిటిష్ సామ్రాజ్యం మాట ప్రకారం నడవదని అర్థం చేసుకున్నాడు.

భగత్ సింగ్ స్థాయి ఉన్న వ్యక్తి విప్లవ రాజకీయాల కోసం ఐరోపాలో శిక్షణ పొందాలని అజిత్ సింగ్ నమ్మాడు.

అజిత్ సింగ్, భగత్ సింగ్  జపాన్ రావాలని ఇక్కడికి వస్తే ఇతర దేశాలలో విప్లవాత్మక ఉద్యమాలు ఎలా నిర్వహించబడుతున్నాయో అధ్యయనం చేయడానికి వీలు కల్పిస్తుందని లేఖ రాసాడు.  

భగత్ సింగ్ కు రాష్ బిహారీ బోస్‌తో పరిచయం ఉన్నదని అజిత్ సింగ్ అన్నాడు. అజిత్ సింగ్ 1915 లాహోర్ కుట్ర కేసు నాయకులలో ఒకడు మరియు జపాన్‌లో నివసించాడు. రాష్ బిహారీ బోస్ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్‌లో ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించారు, తరువాత దానిని సుభాస్ చంద్రబోస్‌కు అప్పగించారు. సుభాస్ రాష్ బిహారీ బోస్ ను ఆజాద్ హింద్ ఫౌజ్ సలహాదారునిగా నియమించాడు.

అజిత్ సింగ్ ఇలా పేర్కొన్నాడు, “భగత్ సింగ్,  రాష్ బిహారీ బోస్‌తో కూడా టచ్‌లో ఉన్నాడు, భగత్ సింగ్,   రాష్ బిహారీ బోస్‌తో  సన్నిహితంగా ఉండాలని, భగత్ సింగ్ విదేశాలలో చేరడం ద్వారా సైనిక శిక్షణ పొందాలని రాష్ బిహారీ బోస్‌ అన్నాడు.. జపాన్ ప్రభుత్వం నమ్మకమైన భారతీయులను కోరుకుంటుంది, మరియు భగత్ సింగ్ జపాన్ కు వస్తే తను  సైనిక శిక్షణ కోసం ఏర్పాట్లు చేయగలనని రాస్  బిహారి బోస్ అన్నాడు.

భగత్ సింగ్‌కి పాస్‌పోర్ట్ లభించింది కాని భగత్ సింగ్ పార్లమెంట్ లో బాంబు విసరటం తో   ప్లాన్ తో  మొత్తం తలకిందులు అయ్యింది.

భగత్ సింగ్ జపాన్ వెళ్లి సైనిక శిక్షణ పొందలేడు లేకుంటే చరిత్ర గమనం చాలా భిన్నంగా ఉండేది. జపాన్ సహాయంతో ఏర్పడిన ఆజాద్ హింద్ ఫౌజ్‌కు నాయకత్వం వహించడానికి సుభాష్ చంద్రబోస్‌తో పాటు మరో ధైర్యవంతమైన తెలివైన నాయకుడిని భారతీయులు పొందగలిగేవారు.