11 March 2024

భారతదేశ ముస్లిం సామాజిక మరియు మత సంస్కర్తలు Muslim Social and Religious Reformers of India

 

 


1857లో మొదటి భారత స్వాతంత్ర్య ఉద్యమం విఫలమైన తరువాత  ముస్లిములు  నిరాశాజనకమైన కాలాన్ని ఎదుర్కొన్నారు. ముస్లింలు తాము ఓడిపోయామని భావించారు. బ్రిటీష్ వారు ముస్లిం ఉలేమాలపై నిర్భందాలు విధించారు మరియు ముస్లిం సమాజాన్ని అన్ని విధాలుగా హింసించారు. విప్లవం ముగిసిన తరువాత ముస్లింలు క్రియాశీల రాజకీయాల నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారు మరియు ముస్లిం సమాజం యొక్క విద్యా అభ్యున్నతిపై దృష్టి పెట్టారు.

 



సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ (1817 -1898),

.Sir Syed Ahmad Khan (1817 –1898),

 

ముస్లింలలో  నిజమైన సంస్కర్తగా ఉద్భవించిన వ్యక్తి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ముస్లింలు ఆంగ్లేయులతో విరోధం పెట్టుకోవద్దని, ఆంగ్ల విద్యను అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగ రంగంలోకి రావాలని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అభిప్రాయపడ్డారు. ముస్లింలను ఆధునిక విద్యతో తీర్చిదిద్దేందుకు అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ప్రారంభంలో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆలోచనలు ప్రయత్నాలు ఫలించాయి మరియు అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం అనేక మంది పండితులను, శాస్త్రవేత్తలను, రాజకీయవేత్తలను మరియు బ్యూరోక్రాట్‌లను ఉత్పత్తి చేసింది.

 

సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ భారతదేశపు గొప్ప ముస్లిం విద్యా సంస్కర్తగా పరిగణించబడ్డాడు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 21వ శతాబ్దంలో కూడా భారతదేశంలోని ముస్లింలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాడు.

 



సయ్యద్ అమీర్ అలీ (1849 –1928

Syed Ameer Ali (1849 –1928

 

సయ్యద్ అమీర్ అలీ భారతదేశ సామాజిక మరియు విద్యా సంస్కర్త. సయ్యద్ అమీర్ అలీ 1849లో భారతదేశంలోని ఒడిశాలోని కటక్‌లో జన్మించాడు మరియు 1928లో లండన్‌లోని సస్సెక్స్‌లో మరణించాడు. ముస్లింలు విద్యలో పురోగతి ద్వారానే తాము  కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందగలరని అభిప్రాయపడ్డారు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ వలె, సయ్యద్ అమీర్ అలీ ముస్లింలు బ్రిటిష్ వారి మద్దతుతో మాత్రమే లాభపడతారని అభిప్రాయపడ్డారు.

1857 తిరుగుబాటు విఫలమైన తరువాత, ఆంగ్లేయులు ముస్లింలను  మాత్రమే కాకుండా ఇస్లాము పట్ల   కూడా చెడు దృష్టి ప్రదర్శించారు. ముస్లింలు ఆత్మవిశ్వాసం కోల్పోయారు. ఈ పరిస్థితిలో, సయ్యద్ అమీర్ అలీ, ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం యొక్క కుమార్తె హద్రత్ ఫాతిమా (ర) వరకు ప్రవక్త(స) తన వంశాన్ని గుర్తించి, ప్రపంచ సమాజం దృష్టిలో ఇస్లాం యొక్క ప్రతిష్టను కాపాడటానికి ఆంగ్లంలో అనేక పుస్తకాలను రచించారు. ఇస్లాం హేతుబద్ధమైన మతమని నిరూపించే ప్రయత్నం చేశాడు.

1873లో, సయ్యద్ అమీర్ అలీ ‘ఎ క్రిటికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ మొహమ్మద్’ అనే పుస్తకాన్ని రాశాడు.

1877లో, సయ్యద్ అమీర్ అలీ ముస్లింలలో రాజకీయ జాగృతిని తీసుకురావడానికి జాతీయ మహమ్మదీయ సంఘాన్ని National Mohammedan Association స్థాపించాడు. ఈ విషయంలో, ముస్లింలను రాజకీయాల నుండి దూరం చేయాలనే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆలోచనను సయ్యద్ అమీర్ అలీ వ్యతిరేకించాడు.

1891లో, సయ్యద్ అమీర్ అలీ పాశ్చాత్య దేశాలలో ఇస్లాం గురించి సరైన అవగాహన కల్పించేందుకు ‘ది స్పిరిట్ ఆఫ్ ఇస్లాం’ అనే పుస్తకాన్ని రాశాడు.

ముస్లిం పర్సనల్ లా ఆఫ్ ఇండియా సంకలనంలో సయ్యద్ అమీర్ అలీ కీలకపాత్ర పోషించారు. సయ్యద్ అమీర్ అలీ న్యాయనిపుణుడు మరియు కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి అయ్యాడు.

సయ్యద్ అమీర్ అలీ భారతదేశంలో మహిళలకు సంబంధించిన లీగల్ పొజిషన్ అనే పుస్తకాన్ని కూడా రాశారు. సయ్యద్ అమీర్ అలీ ముస్లిం స్త్రీల స్థానంలో సామాజిక మార్పులను సమర్ధించాడు మరియు ముస్లిం స్త్రీల పట్ల ముస్లిం పురుషుల దృక్పథంలో మార్పు తీసుకురావాలని కోరుకున్నాడు. బహుభార్యత్వాన్ని వ్యతిరేకించాడు.



వక్కం మహ్మద్ అబ్దుల్ ఖాదిర్ మౌల్వీ (1873 – 1932),

Vakkom Mohammad Abdul Qadir Maulvi 1873 1932),

 

19వ శతాబ్దపు చివరి భాగంలో ఉత్తర భారతదేశంలోని ముస్లింలలో సంస్కరణలు తీసుకురావడానికి అనేక మంది సంఘ సంస్కర్తలు మరియు కార్యకర్తలు కృషి చేస్తున్నప్పుడు, వక్కం మహమ్మద్ అబ్దుల్ ఖాదిర్ మౌల్వీ అనే పండితుడు మరియు సంస్కర్త ముస్లింలలో ఆధునిక విద్యను ప్రోత్సహించడానికి మరియు వారిలో రాజకీయ అవగాహన గురించి నిశ్శబ్దంగా కృషి చేస్తున్నాడు. వక్కం మహమ్మద్ అబ్దుల్ ఖాదిర్ మౌల్వీ ను మలయాళం, అరబిక్, ఉర్దూ, పర్షియన్ మరియు ఆంగ్ల భాషలలో పండితుడు. వక్కం మహమ్మద్ అబ్దుల్ ఖాదిర్ మౌల్వీ ‘స్వదేశాభిమాని’ అనే మలయాళ వార్తాపత్రికను ప్రచురించాడు, ముస్లిం మరియు దీపిక అనే పత్రికలను ప్రచురించాడు. అంతే కాకుండా అల్ ఇస్లాం అనే మలయాళ అరబిక్ పత్రికను కూడా వక్కం మహమ్మద్ అబ్దుల్ ఖాదిర్ మౌల్వీ ప్రచురించాడు.

వక్కం మహమ్మద్ అబ్దుల్ ఖాదిర్ మౌల్వీ ఉర్దూ, అరబిక్, పర్షియన్ మరియు ఇంగ్లీషు నుండి అనేక పుస్తకాలను అనువదించడం ద్వారా మలయాళంలో ఇస్లామిక్ సాహిత్యానికి సహకరించాడు. ముఖ్యంగా, వక్కం మహమ్మద్ అబ్దుల్ ఖాదిర్ మౌల్వీ అల్ గజాలీ యొక్క ‘కీమ్యా-ఎ-సాదత్‌ Keemya-e-Saadat ’ను మలయాళంలో అనువదించాడు. వక్కమ్ మౌల్వీని కేరళలో సామాజిక-మత సంస్కరణల పితామహుడిగా పిలుస్తారు.

 

 


బేగం రోకేయా 1880-1932 

Begum Rokeya 1880-1932 

 

భారతదేశంలోని తూర్పు ప్రాంతం బెంగాల్ లో, మహిళల విద్య వ్యాప్తికి మరియు మహిళా  సాధికారతకు బేగం రోకేయా చేసిన కృషి గమనించదగినది. బేగం రోకేయా భారతదేశంలో స్త్రీ విద్యకు మార్గదర్శకురాలు. మహిళలకు స్వేచ్ఛ లేకపోవడం మరియు మొత్తం ముస్లిం సమాజ అభివృద్ధిలో మహిళల పరిమిత పాత్ర గురించి బేగం రోకేయా ఆందోళన చెందింది. విద్య ద్వారానే ముస్లిం మహిళలు అజ్ఞానం మరియు ఆర్థిక వెనుకబాటుతనాన్ని జయించగలరని బేగం రోకేయా విశ్వసించారు. బేగం రోకేయా 1911లో కలకత్తాలో సఖావత్ మెమోరియల్ గర్ల్స్ స్కూల్ పేరుతో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించింది. బాలికలను తన పాఠశాలకు తీసుకురావడానికి, ఆమె తమ కుమార్తెలను పాఠశాలకు పంపమని తల్లిదండ్రులను ఒప్పిస్తూ బేగం రోకేయా ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులను ఒప్పించింది.

బేగం రోకేయా ఆమె పాఠశాలను నిర్వహించడమే కాకుండా స్త్రీవాద కార్యకలాపాల్లో కూడా చురుకుగా పాల్గొంది. బేగం రోకేయా ముస్లిం మహిళా సంఘాన్ని స్థాపించి 1926లో బెంగాల్ మహిళా విద్యా సదస్సుకు అధ్యక్షత వహించింది.

బేగం రోకేయా స్త్రీ పురుషుల సమానత్వం కోసం వాదించింది. ముస్లిం మహిళల సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధికి పర్దా (ముసుగు) అతిపెద్ద అడ్డంకి అని బేగం రోకేయా నమ్మింది. చదువులో వెనుకబడిన కారణంగా ముస్లిం మహిళలు ఉద్యోగాలకు దూరమవుతున్నారని బేగం రోకేయా భావించినది..

బేగం రోకేయా తన సందేశాన్ని మరియు ఆలోచనలను తన రచనల  ద్వారా వ్యాప్తి చేసింది. బేగం రోకేయా కథా రచయిత్రి మరియు నవలా రచయిత్రి. తన కథలు మరియు నవలలలో, బేగం రోకేయా ముస్లిం స్త్రీలను అస్పష్టత మరియు పురుష ఆధిపత్యం నుండి బయటకు రావాలని కోరారు.

బేగం రోకేయా నవల అబరోధ్‌బాసిని (నిర్బంధిత స్త్రీ) పర్దాకు వ్యతిరేకంగా ఉంది. బేగం రోకేయా మరొక నవల ‘సుల్తానాస్ డ్రీమ్’ స్త్రీలు ఆధిపత్య పాత్ర పోషిస్తున్న ఆదర్శవంతమైన ప్రపంచాన్ని ప్రదర్శిస్తుంది. బేగం రోకేయా చేసిన పోరాటాలు ఫలించాయి మరియు బెంగాల్ ముస్లిం మహిళలు విద్యా రంగంలో పురోగతి సాధించారు. ఫజిలతున్నీసా అనే బాలిక 1926లో ఢాకా విశ్వవిద్యాలయం నుండి మొదటి ముస్లిం గ్రాడ్యుయేట్ అయిన అమ్మాయి. ముల్లాల వ్యతిరేకతకు వ్యతిరేకత వలన  ఫజిలతున్నీసా తదుపరి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళింది.

 

 


సయ్యద్ ముంతాజ్ అలీ ( 1860 – 1935)

Syed Mumtaz Ali (1860 – 1935)

 

19వ శతాబ్దపు చివరిలో జీవించిన మరొక సామాజిక మరియు మత సంస్కర్త సయ్యద్ ముంతాజ్ అలీ. మహిళా సాధికారత మరియు ఇస్లాం స్త్రీలను పురుషుల కంటే తక్కువగా పరిగణించదని సయ్యద్ ముంతాజ్ అలీ నమ్మాడు. దివ్య ఖురాన్ దృష్టిలో స్త్రీ పురుషులు సమానమని సయ్యద్ ముంతాజ్ అలీ అన్నారు. సయ్యద్ ముంతాజ్ అలీ దారుల్ ఉలూమ్ దేవబంద్ నుండి పట్టభద్రుడయ్యాడు మరియు మౌలానా ఖాసిం నానౌతావి ఆధ్వర్యంలో ఖురాన్ మరియు ఫిఖ్ నేర్చుకున్నాడు. అయినప్పటికీ, సయ్యద్ ముంతాజ్ అలీ స్త్రీల గురించి ఆధునిక, విప్లవాత్మక అభిప్రాయాలను కలిగి ఉన్నాడు, అది అతని కాలంలోని మతాధికారులకు బాగా నచ్చలేదు. సయ్యద్ ముంతాజ్ అలీ ఆలోచనలు మరియు అభిప్రాయాలు చాలా ప్రగతిశీలమైనవి. సయ్యద్ ముంతాజ్ అలీ తన పుస్తకం "హుక్-అన్-నిస్వాన్" ను ప్రచురించాడు. ఈ పుస్తకాన్ని మతపెద్దలు పట్టించుకోలేదు.

స్త్రీ సమానత్వానికి అనుకూలంగా సయ్యద్ ముంతాజ్ అలీ సమర్పించిన కొన్ని ఆసక్తికరమైన వాదనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

 

దివ్య ఖురాన్ ఒక పురుషునికి బదులు ఇద్దరు స్త్రీలను సాక్షులుగా సూచించినందున స్త్రీలు పురుషుల కంటే తక్కువ అన్న ఉలేమా వాదనకు సమాధానంగా, సయ్యద్ ముంతాజ్ అలీ వాదించారు. ఖురాన్ స్త్రీలను పురుషుల కంటే తక్కువగా పరిగణించడం లేదు.  కానీ స్త్రీలకు కొన్ని శారీరక ఆరోగ్య  సమస్యలు ఉన్నాయి ఋతుస్రావం, గర్భం మొదలైనవి అవి పురుషులకు లేవు. కాబట్టి, ఒక స్త్రీ అందుబాటులో లేకుంటే, మరొకరు సాక్ష్యమివ్వడానికి ఇద్దరు మహిళా సాక్షులు అవసరం అని  సలహా ఇవ్వబడింది.

ఏ ప్రవక్త కూడా స్త్రీ కానందున ఇస్లాం స్త్రీలను హీనంగా పరిగణిస్తుందనే ఉలేమాల మరో వాదనకు సమాధానంగా, సయ్యద్ ముంతాజ్ అలీ వాదిస్తూ, దేవుడు ప్రపంచంలో ఒక లక్షా 24 వేల మంది ప్రవక్తలను పంపాడని, అయితే మనకు అందరి ప్రవక్తల పేర్లు తెలియవు. . ప్రవక్తలందరి పేర్లు మనకు తెలియనప్పుడు ఏ స్త్రీ ప్రవక్త కాదని ఎలా చెప్పగలం?.

ఈ విధంగా, సయ్యద్ ముంతాజ్ అలీ ఖురాన్‌లోని ఆయతుల సహాయంతో స్త్రీల హీనత గురించి అప్పటి ఉలేమా యొక్క అన్ని వాదనలను ఖండించారు.

సయ్యద్ ముంతాజ్ అలీ ‘తఫ్సిల్ అల్ బయాన్ ఫి మకాసిద్ అల్ ఖురాన్’ పేరుతో ఖురాన్ యొక్క 6 సంపుటాల వ్యాఖ్యానాన్ని కూడా వ్రాసారు. ఇది అన్వర్ షా కాశ్మీరీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ మరియు సయ్యద్ సులేమాన్ నద్వీ వంటి గొప్ప ఇస్లామిక్ పండితులచే ప్రశంసించబడింది.

‘తహజీబ్-ఎ-నిస్వాన్’ అనే మహిళా పత్రికను కూడా తీసుకొచ్చాడు. సయ్యద్ ముంతాజ్ అలీ భార్య మహమ్మదీ బేగం దీనికి సంపాదకురాలు.



మహమ్మద్ నసీరుద్దీన్1888-1994

Mohammad Nasiruddin1888-1994

 

మొహమ్మద్ నసీరుద్దీన్ (20 నవంబర్ 1888 - 21 మే 1994) బంగ్లాదేశ్ జర్నలిస్ట్ మరియు ప్రగతిశీల ఆలోచనాపరుడు.20వ శతాబ్దం ప్రారంభంలో ముస్లిం బెంగాల్ యొక్క ముఖ్యమైన సంస్కర్తగా మారారు

మహమ్మద్ నసీరుద్దీన్ 20వ శతాబ్దం ప్రారంభంలో ముస్లిం సమాజంలో అత్యుత్తమ సంస్కరణవాద మేధావి అయ్యాడు. మహమ్మద్ నసీరుద్దీన్ బెంగాల్ చంద్‌పూర్ జిల్లాలోని పైకార్డి గ్రామంలో 20 నవంబర్ 1888న జన్మించాడు

నసీరుద్దీన్ 1918 డిసెంబర్ 2న కలకత్తా నుండి బెంగాలీలో ‘సౌగత్’ అనే ఇలస్ట్రేటెడ్ సాహిత్య పత్రికను ప్రచురించి బెంగాల్ మహిళల్లో సామాజిక అవగాహనకు మహమ్మద్ నసీరుద్దీన్ చేసిన కృషి మరవరానిది.. ముస్లిం సమాజాన్ని పునరుజ్జీవింపజేయడంలో మరియు సంస్కరించడంలో సోగాత్ గణనీయమైన పాత్ర పోషించింది

‘మహమ్మద్ నసీరుద్దీన్ తన సౌగత్ ’పత్రికలో ముస్లిం మహిళలు వారి సమస్యలు మరియు ఆకాంక్షలపై కథనాలు మరియు కల్పనలు రాయమని ప్రోత్సహించారు. ఆ రోజుల్లో ముస్లిం స్త్రీలు సాహిత్యం పట్ల ఆసక్తిని పెంచుకునేవారు కాదు. వ్రాసిన స్త్రీలు తమ కుటుంబానికి చెందిన వారి గుర్తింపును దాచిపెట్టారు మరియు వారి రచనలు మారుపేర్లతో లేదా వారి భర్త పేరుతో ప్రచురించబడ్డాయి. ఉదాహరణకు, బేగం రోకేయా రచనలు R.S. పేరుతో ప్రచురించబడతాయి. హొస్సేన్ (రోకేయా సఖావత్ హుస్సేన్). అంతేకాకుండా, మహిళా రచయిత్రుల ఛాయాచిత్రాలను ప్రచురించడం నిషేధించబడింది. కానీ సౌగత్ ఎడిటర్ ఈ సంప్రదాయాన్ని ఉల్లంఘించారు. సౌగత్ ఎడిటర్ మహమ్మద్ నసీరుద్దీన్ వారి అసలు పేరుతో మహిళల రచనలను వారి ఫోటోలతో ప్రచురించాడు. కార్టూన్ల ద్వారా సమాజంలో ఉన్న అసమానతలను ఆయన తీవ్రంగా ఎత్తి చూపారు. ఆనాటి సామాజిక విశ్వాస దృక్పథంలో ముస్లిం మహిళలను పత్రికలలో చిత్రీకరించడం అసాధారణమైన పని దీంతో ముల్లాలలో  గుబులు మొదలైంది. మహ్మద్ నసీరుద్దీన్ మహిళల్లో అసభ్యతను ప్రోత్సహిస్తున్నారని, పర్దా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని వారు విమర్శించారు. తర్వాత చాలా మంది మహిళా రచయితలు బయటకు వచ్చి తమ పేర్లతో రాశారు.

.సౌగత్’’ సాహిత్య పత్రిక ఆర్థిక పరిమితుల కారణంగా, దాని ప్రచురణ 1922లో నిలిపివేయబడింది. దీని ప్రచురణ 1926లో తిరిగి ప్రారంభించబడింది మరియు అప్పటి నుండి ఇది 1947 వరకు నిరంతరాయంగా కొనసాగింది

తిరుగుబాటు కవి కాజీ నజ్రుల్ ఇస్లాం, రోకియా సఖావత్ హుస్సేన్, షంసున్నాహర్ మహమూద్, బేగం సుఫియా కమల్ మరియు అనేక మంది ఇతర రచయితలు తమ ప్రగతిశీల మరియు అసమ్మతి అభిప్రాయాలను ప్రచారం చేయడానికి సోగాత్‌ను వేదికగా ఉపయోగించుకున్నారు

మహ్మద్ నసీరుద్దీన్ ఫాజిలతున్నీసాను ప్రోత్సహించాడు. ఫాజిలతున్నీసా ఢాకా విశ్వవిద్యాలయం నుండి తదుపరి విద్య కోసం విదేశాలకు వెళ్ళిన మొదటి ముస్లిం గ్రాడ్యుయేట్ అమ్మాయి. ఇది ముల్లాలకు కోపం తెప్పించింది మరియు వారి రెచ్చగొట్టడంతో, కొంతమంది ముస్లింలు ఒక రోజు మహ్మద్ నసీరుద్దీన్‌ను వీధిలో కొట్టారు

మొహమ్మద్ నసీరుద్దీన్  1926లో, సోగాత్ సాహిత్య మజ్లిస్‌ను నిర్వహించాడు మరియు దాని ద్వారా యువ రచయితలను ప్రోత్సహించాడు 1933లో మహ్మద్ నసీరుద్దీన్ కలకత్తాలో 'సోగాత్ కలర్ ప్రింటింగ్ ప్రెస్'ను స్థాపించారు

మహిళా విముక్తికి అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని సృష్టించే౦దుకు, మొహమ్మద్ నసీరుద్దీన్  1946లో బేగం అనే మరో ఇలస్ట్రేటెడ్ వారపత్రికను ప్రచురించాడు.

1947లో భారత విభజన తర్వాత, మొహమ్మద్ నసీరుద్దీన్  తూర్పు బెంగాల్‌లోని ఢాకాకు వలస వెళ్ళాడు, అక్కడ నుండి 1954 నుండి సోగాత్ మళ్లీ క్రమం తప్పకుండా ప్రచురి౦పబడటం ప్రారంభించింది

నసీరుద్దీన్ ప్రముఖ మహిళా హక్కుల నాయకురాలు నూర్జహాన్ బేగం తండ్రి.

నసీరుద్దీన్ మే 21, 1994 (వయస్సు 105)న మరణించారు.

మొహమ్మద్ నసీరుద్దీన్ బంగ్లా అకాడమీలో సభ్యుడు, బంగ్లాదేశ్ నేషనల్ మ్యూజియం యొక్క ట్రస్టీల బోర్డు సభ్యుడు మరియు 1985లో నజ్రుల్ ఇన్స్టిట్యూట్ యొక్క ట్రస్టీల బోర్డు ఛైర్మన్


మొహమ్మద్ నసీరుద్దీన్ పొందిన అవార్డులు మరియు గౌరవాలు

ఫెలో ఆఫ్ బంగ్లా అకాడమీ అవార్డు (1975) (సమ్మానన పురస్కార్),

ఎకుషే పడక్ (1977)

స్వాతంత్ర్య దినోత్సవ అవార్డు

1976లో మొహమ్మద్ నసీరుద్దీన్ తన పేరు మీద నసీరుద్దీన్ బంగారు పతకాన్ని రచయితలు మరియు జర్నలిస్టులకు ప్రదానం చేయడానికి ప్రవేశపెట్టారు.

.

 

 



 

మౌలానా అబుల్ కలాం ఆజాద్1888- 1958

 Maulana Abul Kalam Azad 1888- 1958 (age 69 years)

మౌలానా అబుల్ కలాం ఆజాద్ తన పత్రికలు మరియు పుస్తకాల ద్వారా భారతదేశ ముస్లింల మేధో వికాసానికి కూడా దోహదపడ్డారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ మతపరమైన మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉన్నాడు మరియు భారతదేశంలోని ముస్లింలలో ఉదారవాద ప్రపంచ దృక్పథాన్ని ప్రోత్సహించాడు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క జాతీయవాద మరియు లౌకిక భావజాల ప్రభావం వల్ల భారతదేశంలోని ముస్లింలు తీవ్రవాద మరియు రాడికల్ ఆలోచనలకు దూరంగా ఉదారవాద మరియు లౌకిక మనస్తత్వం కలిగిన ముస్లిం సమాజం యొక్క ఇమేజ్‌ను కొనసాగించగలిగారు.

ఈ సంస్కర్తలే కాకుండా, భారతీయ ముస్లిం సమాజ సంస్కరణలో తమ వంతు సహకారం అందించిన మరికొందరు కార్యకర్తలు మరియు పండితులు ఉండవచ్చు. భారతీయ ముస్లిం సమాజం యొక్క సంస్కరణకు ఆచరణాత్మక మరియు సైద్ధాంతిక ప్రయత్నాలు చేసినందున వారి సహకారాన్ని విస్మరించలేము. వాటిలో ప్రతి ఒక్కరి సేవలు మరియు సహకారం యొక్క ప్రశంసలకు ఒక పుస్తకం అవసరం.

 

No comments:

Post a Comment