24 December 2018

ఇస్లాం ఆవిర్భావం తరువాత భారత- అరబ్ సంభంధాలు (INDO-ARAB RELATIONS AFTER THE ADVENT OF ISLAM)





సాధారణంగా, భారతదేశంలో ముస్లింల ఆగమనం సింధ్ యొక్క ఆక్రమణ, తరువాత జరిగినదని భావించబడుతుంది కాని అప్పటికే అరబ్బులు భారత దేశ నైరుతి (south-western coast) సముద్ర తీర ప్రాంతంలో స్థావరాలను కలిగి ఉన్నారు.
 
భారతదేశం లో ఇస్లాం ప్రారంభం పై బిన్న వాదాలు కలవు. ఒక వాదన ప్రకారం అరబ్బులు సింద్ ప్రాంతంను జయిoచక మునుపే అక్కడ అరబ్బులు కలరు. వారు సింధ్ ప్రాంతంలో తక్కువ సంఖ్యలో ఉండేవారు  కానీ వారి ఉనికి ముఖ్యమైనది. అరబ్ సైన్యం మొహమ్మద్ బిన్ ఖాసిమ్ నేతృత్వంలో సింధ్ ప్రాంతంను  710 A.D లో ఆక్రమించారు. సింధ్ మరియు దక్షిణ పంజాబ్ ప్రాంతం అరబ్బుల  శాశ్వత ఆక్రమణకు దారి తీసింది, పదవ  శతాబ్దం లో  మహ్మద్ గజ్నావి చే భారత దేశo పై దండయాత్ర జరగనంత వరకు భారతదేశ మిగతా ప్రాంతం అరబ్బుల  ప్రభావానికి లోను కాలేదు.

భారత దేశం లో ఇస్లాం విస్తరణ అరబ్ వ్యాపారుల ద్వారా జరిగినది మరియు భారతదేశ తీర పట్టణాల సముద్ర వాణిజ్యం పై వారి ఆధిపత్యం కొనసాగింది.   ఏడవ మరియు ఎనిమిదో శతాబ్దం లో  ఇస్లాం యొక్క రాకతో వారి వాణిజ్యం అద్భుతమైన అభివృద్ధి, సాధించినది. అరబ్ ముస్లిం వర్తకులు భారతదేశ తీరప్రాంత వర్తకంలో చాలా ముఖ్యమైన వారుగా పరిగణింపబడి సముద్ర వర్తకం లో దక్షిణ ఆసియా వ్యాపారుల ఆధిక్యతను సవాలు చేయడo ప్రారంభించారు.


ఈ కాలంలో అరబ్ ప్రపంచంను  సందర్శించిన భారతీయులు చాలామంది ఉన్నారు. బాగ్దాద్ నగరం పండితులు, శాస్త్రవేత్తలు, వైద్యులు మరియు మేధో మరియు సాంస్కృతిక కార్యకలాపాల యొక్క గొప్ప కేంద్రంగా ఉంది. బహుళ ప్రచారంలో ఉన్న ఒక కథ ప్రకారం కేరళ రాజవంశం కు చెందిన చేరాన్ పెరుమాళ్ అనే చిర వంశం యొక్క చివరి రాజు ప్రవక్త ముహమ్మద్ను(PBUH)  కలుసుకునే లక్ష్యంతో మక్కా వెళ్ళాడు. దక్షిణ భారతదేశంలో చిర రాజ వంశం చాలా ప్రజాదరణ పొందింది. మక్కా, నుండి తిరిగి వెళ్ళినప్పుడు చేరామన్ పెరుమాళ్ ఒమన్ లో మరణించారు మరియు అతని శరీరం సాలల అనే ప్రదేశంలో ఖననం కాబడింది.ఉత్తర భారతదేశంలో ముస్లింల పాలన సంస్కృతి మరియు అభ్యాసం రంగంలో బలమైన ప్రభావాలకు దారితీసింది.


కొంతమంది సింధీ ముస్లిం పండితులు ఇస్లామిక్ వేదాంతం నేర్చుకోవడం కోసం మక్కాకు పంపబడ్డారు. కొందరు అరబ్ ముస్లిం పండితులు గణితశాస్త్రం, విజ్ఞానశాస్త్రం, ఖగోళశాస్త్రం మరియు  తత్వశాస్త్రం నేర్చుకోవటానికి భారతదేశంకి వచ్చారు. అరబ్బులు కొన్ని సాంకేతిక ఆవిష్కరణలు తమ వెంట తీసుకువచ్చారు సింధ్లో కొన్ని నూతన పరిశ్రమలను ప్రవేశపెట్టారు. వ్యవసాయ రంగంలో నూతన పద్ధతులు ప్రవేశపెట్టారు. అరబ్బులు. క్రమంగా, సింధ్ వ్యవహారాల్లో సైనిక, పాలనా రంగాలలో ప్రాముఖ్యత సాధించారు అరబ్లు వ్యాపారులు, ప్రయాణికులు, మిషనరీలు మరియు విజ్ఞానం నేర్చుకునే పురుషులు క్రమంగా సింద్  లో శాశ్వత నివాసాన్ని ఏర్పరచుకొన్నారు. అరబ్ ప్రపంచంలో సౌత్ ఇండియా సాంస్కృతిక సంబంధాల మూలం ప్రాచినమైనది మరియు ఇస్లాం ధర్మం ఈ ప్రాంతంలో గణనీయంగా  వ్యాప్తి చెందినది.
 

భారతదేశం ప్రపంచ వాణిజ్యం మరియు పశ్చిమ మరియు తూర్పు వాణిజ్య మార్గాల మధ్య  వారధిగా ఉంది మరియు ప్రజలు మద్య బిన్న ఆలోచనలు,సాంస్కృతిక సంబంధాలు  మనకు కనిపిస్తాయి. సాంస్కృతిక వికాసం తో ఈ ప్రాంతంలో వాణిజ్య, ఉదార ​​వాతావరణం ఏర్పడినది. దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఉదా. కొంకణ్ (మహారాష్ట్ర), మలబార్ (కేరళ) మరియు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు మైసూర్ తీర పట్టణాల ప్రాంతాలలో అరబ్ వర్తకులు స్థిర పడ్డారు. సముద్ర తీర దూర వాణిజ్యం విబిన్న సంస్కృతులను   ప్రోత్సహించింది శతాబ్దాలుగా, భారతదేశం అనేక సంస్కృతుల మేళవిoపుగా ఉంది.

 
రోమ్, చైనా, అరేబియా మొదలైన దేశాల నుంచి వారు భారతదేశం యొక్క దక్షిణాన మరియు పశ్చిమ తీర ప్రాంతాల్లో సుగంధం కోసం అన్వేషించారు. భారతదేశం ఈ ప్రభావాలన్నింటినీ తనలో ఉత్తమంగా విలీనం చేసుకోoది మరియు అనేక శతాబ్దాల వరకు అది విభిన్న సంస్కృతుల సంగమం గా మిగిలిపోయింది. భారతీయ సముద్ర ప్రాంతాలు జాతి, మతం మరియు సంస్కృతి పరంగా బహుళ సమాజాలు.  అవి వాణిజ్య, సంస్కృతి మరియు రాజకీయాల్లో విస్తృత స్థాయికి అనుసంధానించ బడ్డాయి. ఇచ్చిపుచ్చుకొనే సంస్కృతుల స్వభావం మరియు బిన్న మతపరమైన సాంప్రదాయాలు ఇక్కడ విస్తృతంగా ఉన్నాయి. బహుళ సమాజాలు నూతన మరియు ఆధునిక ఆలోచనలకు భారతదేశం నేలవైనది. .

రేఫెరేన్సేస్:

1.
హిట్టి, P. K. హిస్టరీ ఆఫ్ ది అరబ్స్, పాల్గ్రేవ్ మక్మిలాన్, న్యూయార్క్, 2002, pp. 210-212
2.
అహ్మద్, మక్బుల్. ఇండో అరబ్ రిలేషన్స్, ICCR, పాపులర్ ప్రకాషన్, బాంబే, 1969, పే.6
3.
ఐబిడ్, పే. 7

No comments:

Post a Comment