14 April 2019

అంబేద్కర్ మరియు ఓటు హక్కు(Ambedkar and the right to vote)




 
బి.ఆర్. అంబేద్కర్

రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్గా పనిచేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, భారతీయులు సార్వజనీన వయోజన ఓటుహక్కును పొందటం లో కీలక పాత్ర పోషించినారు.
భారతదేశము లోని చారిత్రాత్మకంగా వెనుకబడిన వర్గాలు రాజకీయoగా అభివృద్ధి చెందటానికి మరియు పౌరసత్వo పొందటానికి   ఓటు హక్కు అతి ముఖ్యమైన మార్గంగా అంబేద్కర్ అభిప్రాయ పడినారు.

ప్రజాస్వామ్య పౌరసత్వానికి సంబంధించిన రెండు  ప్రాధమిక అంశాల్లో ఒకటి ఓటు హక్కు అతి ప్రదానమైనది మరియు సార్వత్రికమైనది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిణామ క్రమంలో, తరచుగా రాజకీయ పండితులు   పెద్ద ఎత్తున సామాజిక పునర్నిర్మాణాన్ని తీసుకురావడానికి ఉపయోగించే ఆయుధంగా ఓటు హక్కు ను భావించారు.  చరిత్రలో   అనాదిగా మహిళలు, మైనారిటీలు, పేద ప్రజలకు  తరచూ ఓటు హక్కు నిరాకరించబడినది.  చరిత్రకారుడు అలెగ్జాండర్ కీసార్ తన పుస్తకం “ది రైట్ టు వోట్: యునైటెడ్ స్టేట్స్ లో ప్రజాస్వామ్యం యొక్క సమస్యాత్మక చరిత్ర The Right To Vote: The Contested History Of Democracy In The United States, లో వివరించినట్లు అమెరికా లో  సార్వజనీన వయోజన ఓటు, దీర్ఘకాలిక (తరచుగా హింసాత్మక) రాజకీయ పోరాటం తర్వాత లబించినది.  ఇతర పాశ్చాత్య ప్రజాస్వామ్యాలలో కూడా ఇదే విధంగా లబించినది. 

అయితే భారతదేశం పాశ్చాత్య దేశాలకు  చాలా భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. భారత రాజ్యాంగం సార్వత్రిక వయోజన ఓటు హక్కు ను గుర్తించినది. వలసరాజ్య పాలనలో కేవలం  15% మంది భారతీయులు (పరిమితంగా) ఓటు హక్కును కలిగి ఉన్న పరిస్థితి నుండి, భారత పౌరులు ప్రతి ఒక్కరికి  సార్వత్రిక వయోజన ఓటు హక్కును మంజూరు చేసింది. పేదరికం మరియు నిరక్షరాస్యత, కులం, వర్గం మరియు లింగ బేధం తో బాధపడుతున్న భారత దేశం లో ఇది నిజంగా విప్లవాత్మకమైన మార్పు.  స్వ-పరిపాలన నిర్వహించటానికి తగినంత పరిపక్వత చెందలేదని బ్రిటీష్ వారిచే ఎగతాళి చేయబడిన భారతీయులకు ఓటుహక్కు అనేది రాజ్యాంగo ప్రసాదించిన ఒక వరం అని చెప్పవచ్చు. స్వాత్రంతం పొందినప్పటి నుంచే  భారతదేశం పూర్తి ప్రజాస్వామ్యంగా అవతరించింది.

స్వాతంత్ర్య ఉద్యమ నాయకులు మరియు ఇండియన్ జాతీయ  కాంగ్రెస్ నేతలు, సార్వజనీన వయోజన వోటు హక్కు సూత్రాలపై స్వతంత్ర భారతదేశం స్థాపించబడుతుందని  మొదటి నుంచి స్పష్టపరిచారు. ఉదాహరణకి, భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించిన 1931 కరాచీ తీర్మానం లో  ఇది స్పష్టపరచబడినది. కానీ సార్వత్రిక వయోజన ఓటు హక్కు తీర్మానంకు  రాజ్యాంగ రూపం కల్పించవలసిన బాధ్యత రాజ్యంగముసాయిదా కమిటి చైర్మన్ గా బి.ఆర్.అంబేద్కర్  పై పడినది. అంబేద్కర్, ఈ బాద్యతను నెరవేర్చడం లో కీలక పాత్ర పోషించినాడు. 

తన రాజకీయ జీవితం ప్రారంభంలోనే  ఓటు హక్కు ప్రాధాన్యతను అంబేద్కర్ గుర్తించారు. 1919 లో భారతదేశ డొమినియన్కు చెందిన ప్రతినిధి సంస్థల (representative institutions) రూపకల్పన చేయడానికి ఏర్పడిన  సౌత్బారో కమిటీ (Southborough committee) ముందు తన లిఖిత సమర్పణల లో, "పౌరసత్వం కల్పించటానికి  రెండు అతి ముఖ్యమైన హక్కులు- ప్రాతినిధ్యపు  హక్కు మరియు అధికారo చేపట్టే హక్కు " ఉండాలని  అంబేద్కర్ అన్నారు.

అంబేద్కర్ వాదనలు ప్రధానంగా రెండు సూత్రాలపై ఆధారపడ్డాయి: మొదటిది పౌరసత్వ సాధనకు  మరియు పాలన వ్యవస్థలో సమానత్వ నైతిక సభ్యత్వంకు (equal moral membership of the polity) ఓటుహక్కు  తప్పనిసరి మరియు రెండోవది రాజకీయ మరియు సాంఘిక జీవితంలో ఓటుహక్కు  నిరాకరించబడిన వారికి రాజకీయ విద్యా సాధనంగా వోటు హక్కు ఉపయోగపడుతుంది మరియు ఉనికిలో ఉన్న వ్యవస్థలో  "చెడు పరిస్థితులను తొలగించడానికి" దానిని ఒక సాధనంగా చెప్పవచ్చు.

పై రెండు సూత్రాలే  సార్వజనిక వయోజన  వోటుహక్కు ను  రాజ్యాంగంలో భాగంగా మార్చినవి. రాజ్యంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్గా అంబేద్కర్, ఆర్టికల్ 326 ను రాజ్యాంగంలోకి చేర్చినాడు దాని ఆధారంగా సార్వత్రిక వయోజన వోట్ ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. ఎన్నికలలో  నిలబడటానికి కావలసిన కనీస వయస్సు వంటి అర్హతలు, అనర్హతలను రూపొందించబడినవి.  ఈ నిబంధనలను చర్చించినప్పుడు, వ్యక్తులు  ఓటు వేయడానికి  ఎటువంటి ఆస్తి పరమైన  అర్హతలు లేదా నిలకడలేని వివక్షతలను గురించి ఆలోచించలేదని అంబేద్కర్ స్పష్టం చేసాడు.

విశ్వజనీన వయోజన వోటుహక్కు ను రాజ్యాంగంలోకి పొందుపరచాలనే నిర్ణయం వివాదాలకు అతీతంగా  లేదు. రాజ్యాంగ నిర్మాణ సంఘ సభ్యుడైన H.V. కామత్ ఉన్నత స్థాయి నిరక్షరాస్యత ఉన్న దేశాలలో సార్వత్రిక వయోజన ఓటు హక్కు అనెది ప్రమాదకరమైన విషయం అని  మరియు దానిని నియంత్రించాలని అభిప్రాయపడ్డారు. రాజ్యంగ సభ లోని ఇతర సభ్యులు కూడా  ఆయనకు మద్దతు ఇచ్చారు. అయితే, కామత్ వాదనను దాని యొక్క చారిత్రక అవసరాన్ని  గుర్తించిన రాజ్యాంగ సభ తిరస్కారించినది.

రాజ్యాంగ అసెంబ్లీ సభ్యుడు అల్లారి కృష్ణస్వామి అయ్యర్ ఇలా పేర్కొన్నారు: " భారతీయ ప్రజలు  పెద్ద సంఖ్యలో అజ్ఞానం మరియు నిరక్షరాస్యతతో  ఉన్నప్పటికీ, రాజ్యంగా సభ సామాన్యుడి పట్ల  అపారరమైన విశ్వాసం తో వయోజన ఓటు హక్కు సిద్ధాంతాన్ని అనుసరించింది. వయోజన ఓటు హక్కు ఆధారంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పరిచినది.  వయోజన ఓటు హక్కు సామాన్య ప్రజల జీవన ప్రమాణం, సౌలభ్యం మరియు మంచి జీవన ప్రవృత్తిని ప్రోత్సహిస్తుందని పూర్తి నమ్మకం ఉంచినది. దీనికి  రాజ్యంగ సభ  అభినందించబడాలని మరియు ప్రపంచం చరిత్రలో ముందు ఎన్నడూ ఇటువంటి ప్రయోగం ధైర్యంగా చేపట్టబడలేదని  చెప్పవచ్చు. "

కొన్ని దశాబ్దాల క్రితం సౌత్ బరో (Southborough) కమిటీ ముందు అంబేద్కర్ లిఖిత పూర్వకంగా ఇచ్చిన సూత్రాలు: అంతిమంగా, ప్రజాస్వామ్య ప్రభుత్వం - ఓటు హక్కు విడదీయరానివి మరియు  ఓటు వేయడం రాజకీయ విద్య యొక్క విజయానికి మారు పేరు.  

No comments:

Post a Comment